వివిధ శివ లింగాభిషేకాలు - వాటి ఫలితాలు Various Shiva Linga Abhishekams - Their Results




🌹 వివిధ శివ లింగాభిషేకాలు - వాటి ఫలితాలు 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Various Shiva Linga Abhishekams - Their Results 🌹
Prasad Bharadwaja


శివ తాండవం Short 2 - 4 to 6 Slokas - SHIVA THANDAVA STOTRAM మహాశివరాత్రి MAHA SHIVARATERI


https://youtube.com/shorts/cNgwVkj9QXI


🌹 శివ తాండవం Short 2 - 4 to 6 Slokas - SHIVA THANDAVA STOTRAM మహాశివరాత్రి MAHA SHIVARATERI 🌹

🍀 అపారమైన శక్తిని, ధైర్యాన్ని మరియు భక్తిని ప్రసాదించే మహా స్తోత్రం. 🍀


స్వరకర్త, గానం : ప్రసాద్‌ భరధ్వాజ.

🌻 ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించినచో, శంభుడు స్థిరమైన ఐశ్వర్యం, ప్రసాదిస్తాడు. 🌻

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

శివ తాండవం Short 1 - 3 Slokas - SHIVA THANDAVA STOTRAM మహాశివరాత్రి ప్రత్యేకం MAHA SHIVARATERI SPECIAL


https://youtube.com/shorts/dO4ifu4hxYY

🌹 శివ తాండవం Short 1 - 3 Slokas - SHIVA THANDAVA STOTRAM
మహాశివరాత్రి ప్రత్యేకం MAHA SHIVARATERI SPECIAL 🌹

🍀 అపారమైన శక్తిని, ధైర్యాన్ని మరియు భక్తిని ప్రసాదించే మహా స్తోత్రం. 🍀


స్వరకర్త, గానం : ప్రసాద్‌ భరధ్వాజ.

🌻 శివపూజ అనంతరం ఈ స్తోత్రాన్ని పఠించిన, శివుడు స్థిరమైన ఐశ్వర్యం, ప్రసాదిస్తాడు. 🌻

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


శివ తాండవ స్తోత్రం - తాత్పర్య సహితం SHIVA THANDAVA STOTRAM with Meaning మహాశివరాత్రి ప్రత్యేకం MAHA SHIVARATERI SPECIAL


https://youtu.be/MFps92L8n9c

🌹 శివ తాండవ స్తోత్రం - తాత్పర్య సహితం SHIVA THANDAVA STOTRAM with Meaning
మహాశివరాత్రి ప్రత్యేకం MAHA SHIVARATERI SPECIAL 🌹


🍀 అపారమైన శక్తిని, ధైర్యాన్ని మరియు భక్తిని ప్రసాదించే మహా స్తోత్రం. 🍀

స్వరకర్త, గానం, ప్రచురణ : ప్రసాద్‌ భరధ్వాజ.

🌻 ప్రదోష కాలంలో ఈ స్తోత్రాన్ని శివపూజ అనంతరం పఠించినవారికి శంభుడు స్థిరమైన ఐశ్వర్యం, సంపదను ప్రసాదిస్తాడు. 🌻

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికి Greetings on Maha Shiva Ratri to All


🌹 మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికి Happy Maha Shiva Ratri to All 🌹

🔥 🔱 ఓం నమశ్శివాయ జపంతో మీ జీవితంలో శాంతి కలగాలని కోరుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు 🔱🔥

ప్రసాద్ భరధ్వాజ

🌹 🌹 🌹 🌹 🌹


మహాశివరాత్రి శుభాకాంక్షలు Greetings on Maha Shiva Ratri


🌹 మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికి Happy Maha Shiva Ratri to All 🌹

🔥 🔱 లింగోద్భవం కధ - తత్త్వార్థం - మహాశివరాత్రి మహిమ 🔱🔥

✍️ ప్రసాద్ భరధ్వాజ




శివరాత్రి మహోరాత్రం నిరాహారో జితేంద్రియః ।

అర్చయేద్ద్వాయథాన్యాయం యథాబలమవంచకః ।

యత్ఫలం మమ పూజాయాం వర్షమేక నిరంతరం ।

తత్ఫలం లభతే సద్యః శివరాత్రే మదర్చనాత్ ॥

(శ్రీ శివమహాపురాణం)


మహాశివరాత్రి అనేది సాధారణ పర్వదినం కాదు; అది ఆధ్యాత్మిక జాగరణకు, ఆత్మశుద్ధికి, దైవానుభూతికి అత్యంత పవిత్రమైన రాత్రి. మాఘమాసంలోని బహుళ చతుర్దశి నాడు వచ్చు ఈ మహారాత్రి, శివతత్త్వం అత్యంత ప్రభావవంతంగా అనుభూతి చెందే సమయం. ప్రతి మాసము బహుళ చతుర్దశి ‘మాసశివరాత్రి’గా భావింపబడినప్పటికీ, మాఘమాసమునది ‘మహాశివరాత్రి’గా విశేషమైనది. ఈ రాత్రి ఉపవాసముతో, ఇంద్రియనిగ్రహముతో, త్రికరణశుద్ధితో శివుని ఆరాధించిన వానికి ఒక సంవత్సరమంతా నిరంతర శివపూజ చేసిన ఫలితం తక్షణమే లభించునని శివమహాపురాణం ప్రకటిస్తుంది.

కైలాసపర్వతమునందు పరమేశ్వరుడు జగదంబిక సమేతుడై సుఖాసీనుడై యుండగా, బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణువు తమలో తాము శ్రేష్ఠులమని వాదించుకొనిరి. ఆ వాదము యుద్ధరూపమునకు దారితీసెను. విష్ణుమూర్తి మహేశ్వరాస్త్రమును, బ్రహ్మదేవుడు పాశుపతాస్త్రమును ప్రయోగించిరి. ఆ అస్త్రాల ప్రభావముతో ముల్లోకములు అల్లకల్లోలమైపోయెను. జగత్తు స్థిరత్వం కోల్పోయిన ఆ సమయంలో, నిష్కలస్వరూపుడైన శంకరుడు అనంత జ్యోతి రూపముగా అగ్నిస్తంభమై ఆవిర్భవించెను. ఆ జ్వాలాస్తంభము ఆద్యంతరహితమై ఆకాశమును చీల్చి పాతాళమును తాకుచుండెను.

ఆ దివ్య జ్యోతిస్వరూపాన్ని చూసి విభ్రాంతులైన బ్రహ్మ, విష్ణువులు దాని ఆది అంతములను ఎవరు కనుగొనగలరో వారే శ్రేష్ఠులని నిర్ణయించిరి. బ్రహ్మదేవుడు హంసరూపమున పై భాగమునకు వెడలెను; విష్ణుమూర్తి వరాహరూపమున క్రింది అంతమును వెదకుటకు పాతాళమునకు ప్రవేశించెను. విష్ణుమూర్తి ఎంతో కాలము వెదికినను అంతము కనుగొనలేక వినయముతో తిరిగి వచ్చెను. అయితే బ్రహ్మదేవుడు అగ్రభాగము చేరకపోయినను మార్గమధ్యమున కేతకీ పుష్పమును (మొగలిపువ్వు), కామధేనువును చూచి తాను అగ్రభాగము దర్శించితినని అబద్ధ సాక్ష్యమిచ్చునట్లు వారిని ఒప్పించి తిరిగి వచ్చెను.

అసత్యము సహించని పరమేశ్వరుడు అగ్నిస్తంభమునుండి ఆవిర్భవించి బ్రహ్మదేవుని అబద్ధమును బయటపెట్టెను. బ్రహ్మదేవునికి భూమిపై ఆలయారాధనలో ప్రాధాన్యం లేకుండునట్లు శాపము విధించెను. కేతకీ పుష్పమును శివార్చనలో నిషేధించెను. కామధేనువునకు కూడ తగు శాపము నొసగెను. ఈ ఘటన ద్వారా సత్యమే పరమతత్త్వమునకు మార్గమని లోకానికి బోధించెను.

“అశక్యమన్యైర్యదనుగ్రహేణ తృణక్షయోప్యత్ర యదృచ్ఛయా కృతః” అని శివమహాపురాణం తెలిపినట్లుగా, శివానుగ్రహము లేకుండా ఈ విశ్వమందు గడ్డి పరక కూడా కదలదు. ఈ సత్యాన్ని గ్రహించిన బ్రహ్మ, విష్ణువులు తమ అహంకారమును విడిచి సదాశివుని శరణు చేరి భక్తితో ఆరాధించిరి. సంతోషించిన మహాదేవుడు వారు పూజించిన ఆ దినమును లోకములందు ‘మహాశివరాత్రి’గా ప్రసిద్ధిచేయగా, ఆ రాత్రి ఉపవాసము, జాగరణము, భక్తితో పూజించిన వారందరూ తన కృపకు పాత్రులగుదురని అనుగ్రహించెను. తాను అగ్నిస్తంభముగా ఆవిర్భవించిన స్థలము ‘ఆరుణాచలము’గా మహాక్షేత్రమై ప్రసిద్ధించునని వరమిచ్చెను.


🔥 లింగోద్భవము – తత్త్వార్థం 🔥

లింగోద్భవము కేవలం ఒక పురాణ సంఘటన మాత్రమే కాదు; అది లోతైన ఆధ్యాత్మిక బోధ. లింగము అనగా లయమగు స్థానం — జగత్తు ఎక్కడి నుండి ఉద్భవించెనో, అదే తత్త్వములో లయమగును. అగ్నిస్తంభము అనంతత్వానికి ప్రతీక; ఆద్యంతరహిత జ్యోతి పరబ్రహ్మ స్వరూపము. బ్రహ్మ, విష్ణువుల శోధన జ్ఞాన పరిమితిని సూచించగా, శివుని ఆవిర్భావము అహంకార నిర్మూలనను సూచించును. మహాశివరాత్రి ఆచరణలో ఉపవాసము, జాగరణము, రుద్రాభిషేకము, పంచాక్షరీ జపము “ఓం నమః శివాయ” వంటివి మన అంతఃకరణ శుద్ధికి మార్గములు. ఈ రాత్రి మన హృదయంలోని అజ్ఞానాంధకారము తొలగి జ్ఞానజ్యోతి వెలిగే పవిత్ర క్షణము. మహా శివరాత్రి నాడు ఇంట్లో దీపం పెట్టాక జ్వాలాయ నమ: జ్వలలింగాయ నమ: ఆత్మాయ నమ: ఆత్మలింగాయ నమ: పరమాయ నమ: పరమలింగాయ నమ: అను మంత్రాలు తప్పకుండా చదువుకోవాలి. ఇవి చదువుకుంటే శివానుగ్రహం వల్ల ఆత్మ సాక్షాత్కారంవైపు అడుగులు వేయవచ్చు. శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. శివకృపతో మన జీవితమంతా జ్యోతిర్మయమగుగాక.

ఓం నమః శివాయ।

✍️ ప్రసాద్ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹

పక్కకు పడుకునే వారు – శ్రద్ధ వహించండి! Attention to those who sleep on their side!


🌹 పక్కకు పడుకునే వారు – శ్రద్ధ వహించండి! 🌹

మనము ఎడమ వైపు లేదా కుడి వైపు పడుకునే అలవాటు మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. శాస్త్రీయంగా చూస్తే, పడుకునే వైపు శరీరంలోని జీర్ణక్రియ, హృదయంపై ఒత్తిడి, రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది.



🔶 కుడి వైపు పడుకుంటే

సాధారణంగా కనిపించే ప్రభావాలు:

తక్కువ ఆమ్ల రిఫ్లక్స్ (కొంతమందిలో తగ్గొచ్చు)

కానీ జీర్ణక్రియ మందగించే అవకాశం

గుండెపై స్వల్ప ఒత్తిడి పెరగవచ్చు

రాత్రిపూట అసౌకర్యం లేదా మెలకువలు రావచ్చు


🟢 ఎడమ వైపు పడుకుంటే

ఆరోగ్యానికి మేలు చేసే అంశాలు:

మెరుగైన జీర్ణక్రియ

ఆమ్ల రిఫ్లక్స్ తగ్గడం

గుండెకు తక్కువ ఒత్తిడి

రక్త ప్రసరణ మెరుగుపడటం

గర్భిణీ స్త్రీలకు సిఫారసు చేయబడిన స్థితి



📌 వైద్యుల అభిప్రాయం

ఎడమ వైపు పడుకోవడం సాధారణంగా “స్మార్ట్ స్లీప్ పొజిషన్” గా పరిగణించబడుతుంది. ముఖ్యంగా గ్యాస్, ఆమ్ల రిఫ్లక్స్, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఎడమ వైపు పడుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు.


🔔 గుర్తుంచుకోండి:

ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం, ఆరోగ్య పరిస్థితి వేరు. కాబట్టి దీర్ఘకాలిక సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

ఎడమ వైపు నిద్ర = మంచి ఆరోగ్యానికి ఒక చిన్న అడుగు

🌹 🌹 🌹 🌹 🌹




"నిగమ నిగమాంత వర్ణితం మనోహర రూప నటరాజ ధరుడా శ్రీమన్నారాయణ" Balaji Song Venkateswara swamy Song (YT short)



https://youtube.com/shorts/0YYz3lKOBhQ

🌹 నిగమ నిగమాంత వర్ణితం మనోహర రూప నటరాజ ధరుడా శ్రీమన్నారాయణ
Balaji Song Venkateswara swamy Song 🌹


ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹

Facebook: https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2069792690473868/


"కళ్యాణ నిధయే నిధయే శ్రీ వెంకటేశ నివాసాయ శ్రీనివాసాయ" Balaji song (a devotional YT Short)



https://youtube.com/shorts/cLzB1wnyDnc


🌹 కళ్యాణ నిధయే నిధయే శ్రీ వెంకటేశ నివాసాయ శ్రీనివాసాయ Balaji song 🌹

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹


Facebook: https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2069792380473899/


మనిషి తప్పించుకోలేని మూడు కర్మలు శ్రేణులు Three Categories of Karmas


🌹 మనిషి తప్పించుకోలేని మూడు కర్మలు - సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు - కానీ జ్ఞానం, భక్తి, ధ్యానం మరియు ఆత్మ సాక్షాత్కారం ద్వారా సంచిత కర్మలను క్రమంగా దహించుకోవచ్చు. 🌹
✍️ ప్రసాద్ భరద్వాజ

🌹 There are three karmas that a person cannot escape - accumulated, prarabdha, and agami karmas - but accumulated karmas can be gradually burned away through knowledge, devotion, meditation, and self-realization. 🌹
✍️ Prasad Bharadwaja



భగవద్గీత ప్రకారం హిందూ తత్వశాస్త్రంలో “కర్మ” అనే భావనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. కర్మ అంటే కేవలం శారీరక కార్యమే కాదు; మనం ఆలోచించడం, మాట్లాడటం, చేయడం - ఈ మూడు కూడా కర్మలే. ప్రతి కర్మకు తప్పనిసరిగా ఒక ఫలితం ఉంటుంది. ఈ విశ్వనియమాన్నే “కర్మ సిద్ధాంతం” అని అంటారు. మనిషి చేసిన ప్రతి మంచి లేదా చెడు కార్యం విశ్వధర్మ నియమాల ప్రకారం నమోదు అవుతుంది. అది వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోయినా, తగిన కాలంలో తప్పకుండా ఫలిస్తుంది. విత్తిన విత్తనం కాలానుగుణంగా మొలకెత్తినట్లే, చేసిన కర్మ కూడా సమయానుకూలంగా ఫలితాన్ని ఇస్తుంది.

గీతా శాస్త్రం మనకు కర్మను ధర్మబద్ధంగా చేయాలని, ఫలంపై ఆసక్తి లేకుండా నిష్కామ భావంతో చేయాలని, ఫలితాన్ని సమత్వంతో స్వీకరించాలని ఉపదేశిస్తుంది.

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మనిషి తన కర్మఫలాల నుంచి పూర్తిగా తప్పించుకోలేడు. ఈ కర్మలు మూడు ప్రధాన రకాలుగా విభజించబడ్డాయి—సంచిత, ప్రారబ్ధ, ఆగామి. ఇవి కేవలం పనులుగా కాకుండా, మన జీవిత ప్రయాణంలో సేకరించబడే సంస్కారాల సమాహారంగా కూడా భావించవచ్చు.

సంచిత కర్మ అనేది మన గత జన్మలలో చేసిన అన్ని మంచి-చెడు కర్మల సమాహారం. “సంచిత” అంటే సేకరించబడినది. గిడ్డంగిలో నిల్వ ఉంచిన ధాన్యం లాగానే, అనేక జన్మలుగా చేసిన కర్మలు మనలో నిల్వగా ఉంటాయి. ఈ సంచిత కర్మలన్నింటినీ ఒకేసారి అనుభవించము; వాటిలో కొంత భాగమే ఈ జన్మలో అనుభవించడానికి సిద్ధమవుతుంది. జ్ఞానం, భక్తి, ధ్యానం మరియు ఆత్మసాక్షాత్కారం ద్వారా ఈ సంచిత కర్మలను క్రమంగా దహించుకోవచ్చని శాస్త్రాలు పేర్కొంటాయి.

ప్రారబ్ధ కర్మ అనేది ఇప్పటికే ప్రారంభమైన కర్మఫలం. సంచిత కర్మల గిడ్డంగి నుండి ఈ జన్మలో అనుభవించాల్సిన భాగమే ప్రారబ్ధంగా రూపాంతరం చెందుతుంది. మనం ఏ దేశంలో జన్మిస్తామో, ఏ కుటుంబంలో పుడతామో, మన ఆరోగ్యం, ఆయుష్షు, రూపం, సంపద, సుఖ-దుఃఖాలు - ఇవన్నీ ప్రారబ్ధ కర్మ పరిధిలోకి వస్తాయి. ఇది ఇప్పటికే ప్రారంభమైనందున దాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాదు. అయితే సమత్వ భావంతో, ఓర్పుతో, “ఇది నా కర్మ ఫలం” అని గ్రహించి స్వీకరించడం ద్వారా మనసుకు శాంతి లభిస్తుంది.

ఆగామి కర్మ అనేది రాబోయే కర్మ. ప్రస్తుతం మనం చేసే ప్రతి ఆలోచన, మాట, పని భవిష్యత్తులో ఫలితాన్ని ఇస్తుంది. ఈ జన్మలో చేస్తున్న కర్మలు భవిష్యత్తులో సంచిత కర్మలో చేరతాయి. ఈ విధంగా మనమే మన భవిష్యత్తును నిర్మించు కుంటున్నాము. ధర్మమార్గంలో నడుచుకుంటూ, పుణ్యకర్మలు చేస్తూ, ఫలాపేక్ష లేకుండా నిష్కామ కర్మాచరణ చేయడం ద్వారా ఆగామి కర్మను శుద్ధి చేసుకోవచ్చు.

ఈ మూడు కర్మలు మన జీవన ప్రయాణాన్ని నిర్దేశిస్తాయి. సంచిత కర్మ మన గతానికి ప్రతిబింబం, ప్రారబ్ధ కర్మ మన వర్తమానానికి కారణం, ఆగామి కర్మ మన భవిష్యత్తుకు విత్తనం. కర్మసిద్ధాంతాన్ని అర్థం చేసుకొని, ధర్మబద్ధంగా జీవించడం ద్వారా మనిషి తన ఆత్మసాక్షాత్కార దిశగా పయనించగలడు.

✍️ ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹

"విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి మము పాలించవమ్మా" Sri Maha Lakshmi Prayer (devotional YT Short)


https://youtube.com/shorts/T9aXj29zXpk

🌹 విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి మము పాలించవమ్మా
Sri Maha Lakshmi Prayer 🌹


ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹

Facebook: https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2068885593897911/


"నారాయణ నారాయణ జయ గోవింద హరే జయ గోపాల హరే" Narayana Narayana (a devotional YT Short)


https://youtube.com/shorts/QalDuQbuVhg


🌹 నారాయణ నారాయణ జయ గోవింద హరే జయ గోపాల హరే
Narayana Narayana 🌹

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹


Facebook: https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2068883683898102/



విజయా ఏకాదశి శుభాకాంక్షలు Greetings on Vijaya Ekadashi


Facebook: https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2068879317231872/


🌹 విజయా ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 🌹

🍀 శ్రీరాముడికి లంకా విజయాన్ని అందించిన వ్రతం - విజయ ఏకాదశి వ్రతం. అప్పులు ఉన్నోళ్లు.. ఉద్యోగ సమస్యలకు చేయవలసిన వ్రతం ఇది 🍀

ప్రసాద్ భరద్వాజ


🌹 Vijaya Ekadashi greetings to everyone 🌹

🍀 The fast that gave Sri Ram the victory over Lanka - Vijaya Ekadashi fast. Those who have debts.. this is the fast to do for job problems 🍀

Prasad Bharadwaja




జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, శత్రువుల భయం వేధిస్తున్నా వాటన్నింటినీ అధిగమించి విజయం సాధించడానికి మార్గం చూపే రోజే 'విజయా ఏకాదశి'.

ఫాల్గుణ మాస కృష్ణ పక్షంలో వచ్చే ఈ ఏకాదశికి పద్మ, స్కంద పురాణాల్లో విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13, శుక్రవారం నాడు ఈ శుభ తిథి వస్తోంది.

సాక్షాత్ శ్రీరామచంద్రుడే ఆచరించిన వ్రతం:

పురాణ గాథల ప్రకారం, సీతమ్మ వారిని వెతుకుతూ సముద్ర తీరానికి చేరుకున్న శ్రీరాముడు, లంకా దండయాత్రకు ముందు విజయం కోసం ఏ వ్రతాన్ని ఆచరించాలని అగస్త్య మహర్షిని కోరతాడు. అప్పుడు మహర్షి సూచన మేరకు రాముడు ఈ విజయా ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించాడు. ఈ వ్రత ప్రభావంతోనే ఆయన వానరసేనతో సముద్రాన్ని దాటి, రావణుడిని సంహరించి విజయ కేతనం ఎగురవేశాడని నమ్ముతారు.

ఉదయాతిథి ప్రకారం ఈసారి విజయా ఏకాదశి వ్రతాన్ని ఫిబ్రవరి 13న ఆచరించాలి.

🌿 వ్రత విధానం మరియు పూజా ఫలాలు. 🌿

స్నానం & సంకల్పం: ఉదయాన్నే తలస్నానం చేసి, విష్ణుమూర్తిని స్మరిస్తూ వ్రత సంకల్పం చేసుకోవాలి.

కలశ స్థాపన: విష్ణుమూర్తి పటం ముందు కలశాన్ని ఉంచి గంగాజలం, పూలతో అర్చించాలి.

నైవేద్యం: పసుపు రంగు పూలు, తులసి దళాలు, శనగపప్పు మరియు తీపి పదార్థాలను స్వామికి సమర్పించాలి.

మంత్ర పఠనం: రోజంతా 'ఓం నమో భగవతే వాసుదేవాయ' లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సకల పాపాలు నశించి పుణ్యం లభిస్తుంది.

సర్వ కార్య సిద్ధి: ఈ వ్రతాన్ని నిష్టగా ఆచరించేవారికి సంపద వృద్ధి చెందుతుంది, దీర్ఘకాలిక భయాలు తొలగిపోతాయి. ముఖ్యంగా కోర్టు కేసులు, శత్రువుల ఇబ్బందులు ఉన్నవారికి ఈ ఏకాదశి వ్రతం ఒక గొప్ప వరమని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

🌻 విజయ ఏకాదశి వ్రతం - అప్పులు ఉన్నోళ్లు.. ఉద్యోగ సమస్యలకు ఈ వ్రతం చేయండి..! 🌻

విజయ ఏకాదశి వ్రతం శ్రద్ధతో ఆచరిస్తే అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యం అవుతాయని భక్తుల నమ్మకం. ఇంకా ఉద్యోగ సమస్యలతో పాటు అప్పుల బాధలకు విముక్తి కలుగుతుందని చెబుతున్నారు.

సీతారాముల పూజ: విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడిని, సీతాదేవిని కలిపి పూజించాలి. దీనివల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తొలగి, సామాజిక గౌరవం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి విజయ ఏకాదశి రోజున స్వామివారికి 11 అరటిపండ్లు, 11 లడ్డూలు లతో పాటు ఎర్రటి పుష్పాలను సమర్పించండి.

సూర్య భగవానుడికి అర్ఘ్యం: రాగి పాత్రలో శుద్ధమైన నీరు లేదా గంగాజలంలో 11 ఎర్ర మిరప గింజలు వేసి సూర్యదేవుడికి అర్ఘ్యం వదలండి. అర్ఘ్యం అంటే సూర్యభగవానుడి ఎదురుగా నిలబడి దోసెలతో నీటిని తీసుకొని ఆదిత్య హృదయం.. లేదా సూర్యాష్టకం చదువుతూ.. సూర్యునికి చూపించి.. రాగి పళ్లెంలో వదలాలి. ఇలా ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని, తేజస్సును పెంచుతుంది. ఇలా చేయడం వలన అనుకున్న పనులు నెరవేరడంతో పాటు.. అప్పుల సమస్యలకు పరిష్కారం కలుగుతుందని పండితులు అంటున్నారు.

ఉద్యోగంలో విజయం కోసం: ఒక కలశంపై మామిడి ఆకులు ఉంచి, దానిని బార్లీతో నింపండి. దానిపై దీపం వెలిగించి, లక్ష్మీనారాయణులకు 11 రకాల పండ్లు, పూలు సమర్పించి మీ లక్ష్యం నెరవేరాలని ప్రార్థించండి. పూలు, పండ్లలో పసుపు రంగువి ఉండేలా చూసుకోండి.

అప్పుల విముక్తి కోసం: అప్పుల బాధలతో సతమతమవుతున్న వారు విజయ ఏకాదశి రోజున రావి చెట్టుకు పూజ చేసి, దాని వేర్ల దగ్గర నీటిని సమర్పించాలి.

తులసి కోట వద్ద దీపారాధన: సాయంత్రం వేళ తులసి మొక్క వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించి, ప్రదక్షిణ చేయడం ద్వారా మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.

రాత్రి జాగరణ: పురాణాల ప్రకారం, ఏకాదశి రాత్రి నిద్రపోకూడదు. భజన కీర్తనలతో జాగరణ చేయడం వల్ల శత్రువుల ప్రభావం తగ్గి, ప్రతికూల శక్తులు నశిస్తాయి.

🌹🌹🌹🌹🌹



ఆత్మ ప్రయాణ రహస్యాలు 1వ భాగం - శాశ్వతం వైపు ప్రయాణమే - 5. ఆత్మ యొక్క చైతన్యము Secrets of Soul Journey Part 1 - Journey towards Eternity - 5. Consciousness of the Soul


https://youtube.com/shorts/HdUlJPYKhl0

🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు 1వ భాగం - శాశ్వతం వైపు ప్రయాణమే నిజమైన ఆత్మ సాధన. - 5. ఆత్మ యొక్క చైతన్యము 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Secrets of Soul Journey Part 1 - The journey towards eternity is the true practice of the soul. - 5. The consciousness of the soul 🌹

Prasad Bharadwaja



Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹

ఆత్మ ప్రయాణ రహస్యాలు - 1వ భాగం - దృష్టిని బాహ్య, తాత్కాలిక విషయాల నుండి అంతర్గత, శాశ్వతమైన Secrets of Soul Journey - Part 1 - shifting the focus from external to internal things


https://youtu.be/oyG4btC2wYY

🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 1వ భాగం - దృష్టిని బాహ్య, తాత్కాలిక విషయాల నుండి అంతర్గత, శాశ్వతమైన వాటికి మార్చడమే నిజమైన ఆత్మ సాధన. 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 Secrets of Soul Journey - Part 1 - The true practice of the soul is to shift the focus from external, temporary things to internal, eternal things. 🌹

Prasad Bharadwaja



ఈ పాఠం చైతన్యం యొక్క స్వభావాన్ని మరియు బాహ్య అనుభవాల తాత్కాలికతను విశ్లేషిస్తుంది. బాహ్య ప్రపంచంలోని విషయాలు తాత్కాలికమని, కాని "నేను ఉన్నాను" అనే నిజం శాశ్వతమని అవగాహన చెందడం ముఖ్యమని ప్రాముఖ్యతను సూచిస్తుంది. ప్రపంచం తాత్కాలికమని తెలుసుకుని, శాశ్వతమైన సత్యాన్ని అన్వేషించేందుకు అంతరంగంలోకి వెళ్ళమని ప్రోత్సహిస్తుంది.

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹

ఎవరేమీ అనుకున్నా నవ్వుండే రాజ్యాన రాజు నువ్వే Motivational Song (a YT Short)



https://youtube.com/shorts/lO0gM-0mW_4

🌹 ఎవరేమీ అనుకున్నా నవ్వుండే రాజ్యాన రాజు నువ్వే Motivational Song 🌹

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹


"తారంగాలు ఆడేవాడు పిల్లనగ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా కృష్ణుడు" Krishna Song (a devotional YT Short)


https://youtube.com/shorts/9rVnCz1u_pA

🌹 తారంగాలు ఆడేవాడు పిల్లనగ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా కృష్ణుడు
Krishna Song 🌹

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹

ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి Ganapathi Prayer (a devotional YT Short)


https://youtube.com/shorts/Cchfyi0uBg8


🌹 ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి
Ganapathi Prayer 🌹


ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹


Facebook: https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2067222124064258/


గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి Ganesha Prayer (a devotional YT Short)


https://youtube.com/shorts/8vZXqplG0wQ

🌹 గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి Ganesha Prayer 🌹

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹

Facebook: https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2067221207397683/


బృందావన పుణ్యక్షేత్రం Vrindavan Shrine


Facebook:  https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2067219720731165/


🌹 బృందావన పుణ్యక్షేత్రం. దర్శించుకోవాల్సిన ముఖ్యమైన 5 ఆలయాలు 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Vrindavan Shrine. 5 Important Temples to Visit 🌹
Prasad Bharadwaja



బృందావనం అంటే తులసివనం. ఇది ఉత్తరప్రదేశ్ మధుర జిల్లాలో యుమునా నది ఒడ్డున ఉన్న పట్టణం. శ్రీ కృష్ణుడు తన బాల్యాన్ని ఇక్కడే గడిపాడని, గోపికలతో రాసలీలలు ఆడిన ప్రదేశం ఇదేనని భాగవతపురాణం చెబుతోంది. బృందావనంలో దర్శించుకోవాల్సిన ముఖ్యమైన 5 ఆలయాలు వున్నాయి. బృందావన నగరం కృష్ణ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా చాలా ముఖ్యమైనది.

పవిత్ర ఘాట్‌లు , పురాతన దేవాలయాలతో నిండిన బృందావనానికి ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు వస్తారు. బృందావనం కృష్ణుడి లీలలతో ముడిపడి ఉంది, ఇది హిందువులకు ఇది ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ ఐదు దేవాలయాలు వాటి చరిత్ర, వాస్తుశిల్పం , ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందాయి.


బంకే బిహారీ మందిరం

బృందావనంలో ప్రముఖమైన దేవాలయాలలో ఒకటి, ఇది శ్రీకృష్ణునికి అంకితం చేసిన మందిరం. ఇక్కడ ఆయనను బాల రూపంలో పూజిస్తారు. ఈ ఆలయంలో రాధా కృష్ణుల నల్లని విగ్రహాలు ఒక ప్రత్యేకమైన భంగిమలో కొలువై ఉన్నాయి, ఇందులో వారు కొద్దిగా ఒక వైపు వంగి ఉన్నారు, ఆయన పిల్లనగ్రోవి వాయించేటప్పుడు ఎలా ఉండేవారో అలాగే ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన దృశ్యం . ఆలయానికి వెళ్ళేవారు భగవంతుని దర్శనం చేసుకోవడంతో పాటు ఆధ్యాత్మిక స్థితిలో లీనమవుతారు.


నిధివన్.

బృందావనంలో అత్యంత ప్రత్యేకమైన, రహస్య ప్రదేశాలలో ఒకటి నిధివన్, ఇది శ్రీకృష్ణుని లీలలతో ముడిపడి ఉంది. ఇక్కడే బాల్యంలో శ్రీకృష్ణుడు ... రాధ సహా వేల మంది గోపికలతో రాసలీలలు చేసేవాడని నమ్ముతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దాని చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం, ఇది ఒక మాయా శక్తికి తక్కువ కాదు అని చెబుతారు. స్థానికుల అభిప్రాయం ప్రకారం, నిధివన్ లోని వృక్షాలు గోపికల రూపాలు, వారు శ్రీకృష్ణుని దివ్య నృత్యాన్ని చూడటానికి చెట్లుగా మారారని చెబుతారు. ఇక్కడ నిత్యం సాయంత్రం అవగానే ఆలయాన్ని మూసివేస్తారు. రాత్రి సమయంలో ఆ ఆలయంలో ఎవ్వరూ ఉండరు. రోజూ రాత్రివేళ రాధాకృష్ణులు గోపికలతో కలసి నృత్యం చేస్తారని స్థానిక కథనం.


బృందావన్ ప్రేమ మందిరం

దీనిని దివ్య ప్రేమ మందిరం అని కూడా పిలుస్తారు, ఇది జగద్గురు కృపాలుజీ మహారాజ్ 2001 సంవత్సరంలో నూతనంగా నిర్మించిన ఆలయం, ఇది అందమైన పాలరాయితో చూడముచ్చటగా ఉంటుంది. ఈ ఆలయం వాస్తుశిల్పానికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. రాత్రి సమయంలో ఆలయం యొక్క కాంతి ధ్వని ప్రదర్శన చూడదగినదిగా ఉంటుంది.


ఇస్కాన్ దేవాలయం

దీనిని శ్రీ కృష్ణ-బలరామ దేవాలయం అని కూడా పిలుస్తారు. బృందావనంలో ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. యమునా నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షస్నెస్ (ISKCON) ఉద్యమంలో భాగం, దీనిని AC భక్తివేదాంత స్వామి ప్రభుపాద ప్రారంభించారు. ఈ దేవాలయంలో కృష్ణుడు సోదరుడి బలరాముడి విగ్రహాలు ఉన్నాయి.


రాధా రమణ మందిరం

రాధా రమణ మందిరాన్ని 16వ శతాబ్దంలో గోపాల్ భట్ గోస్వామి నిర్మించారు ఇది బందావనంలో ఉన్న పురాతన దేవాలయాలలో ఒకటి. నమ్మకాల ప్రకారం రాధా రమణ విగ్రహాన్ని గోపాల్ భట్ గోస్వామి స్వయంగా పూజించారు.

🌹🌹🌹🌹🌹


చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. Lord Shiva Song (a devotional YT Short)


https://youtube.com/shorts/M5n4LvVaY6c

🌹 చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా.
Lord Shiva Song 🌹


ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹


Facebook: https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2066716047448199/



"గంభీర సింహంద్రావ క్షేత్ర జయ నరసింహా దైత్యాంత విద్యుధ్గాత నరసింహా" Narasimha Song (a devotional YT Short)


https://youtube.com/shorts/Ffbl_hYKAAI

🌹 గంభీర సింహంద్రావ క్షేత్ర జయ నరసింహా దైత్యాంత విద్యుధ్గాత నరసింహా
Narasimha Song 🌹

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹


Facebook: https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2066365170816620/


జై జై మహాకాయ జైజై అమితశౌర్య జైజై ఆంజనేయ జై అద్వితీయ Hanuman Anjaneya song (a devotional YT Short)


https://youtube.com/shorts/oIM9WS-K5e8

🌹 జై జై మహాకాయ జైజై అమితశౌర్య జైజై ఆంజనేయ జై అద్వితీయ
Hanuman Anjaneya song 🌹


ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹

సనాతన ధర్మంలో గోత్ర భావన The concept of Gotra in Sanatana Dharma


Facebook: https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2066363540816783/

🌹 సనాతన ధర్మంలో గోత్ర భావన – మూలం మరియు విశిష్టత 🌹
✍️ ప్రసాద్ భరద్వాజ

🌹 The concept of Gotra in Sanatana Dharma – Origin and Speciality 🌹
✍️ Prasad Bharadwaja



సనాతన ధర్మంలో గోత్రం అనేది వ్యక్తిని అతని మూల వంశంతో అనుసంధానించే ఒక ముఖ్యమైన గుర్తింపు. ఇది ఒక ప్రాచీన పూర్వికుడి నుండి కొనసాగిన వంశ పరంపరను సూచిస్తుంది. భారతీయ సమాజం ఆది కాలం నుంచే కుటుంబ వ్యవస్థను, సంప్రదాయాలను, ఆచారాలను క్రమబద్ధంగా కొనసాగించేందుకు గోత్ర వ్యవస్థను ఒక ఆధారంగా స్వీకరించింది.

‘గో’ అనే సంస్కృత పదానికి విస్తృతమైన అర్థవ్యాప్తి ఉంది. అది జ్ఞానం, వేదాలు, భూమి, ఆవు వంటి భావాలను సూచిస్తుంది. ఈ నేపథ్యంలో గోత్రం అనేది కేవలం రక్త సంబంధానికి మాత్రమే పరిమితం కాకుండా, తరతరాలుగా ప్రవహించిన జ్ఞాన వారసత్వాన్ని ప్రతిబింబించే భావనగా చూడబడుతుంది. అందువల్ల గోత్రాన్ని ఒక ఆధ్యాత్మిక పరంపరగా కూడా పరిగణిస్తారు.

వేదకాలంలో మహర్షులైన వశిష్ట, భరద్వాజ, అత్రి, విశ్వామిత్ర, గౌతమ, కశ్యప, జమదగ్ని వంటి సప్తర్షుల పేర్లతో ప్రధాన గోత్రాలు ఏర్పడ్డాయి. వీరే అనేక వంశాలకు ఆది గురువులుగా భావించబడ్డారు. ప్రతి గోత్రం ఒక నిర్దిష్ట ఋషి ద్వారా ప్రసరించిన పరంపరను సూచించడంతో, వ్యక్తి ఏ ఋషి సంప్రదాయానికి చెందినవాడో గోత్రం ద్వారా తెలుసుకోవచ్చు.

సమయం గడిచే కొద్దీ సమాజం విస్తరించడంతో పాటు, కొత్త వంశాలు ఏర్పడ్డాయి. ప్రముఖ పూర్వీకులు, రాజవంశాధిపతులు, సమాజానికి దారి చూపిన నాయకుల పేర్లతో ఉపగోత్రాలు ఏర్పడటం ద్వారా గోత్ర వ్యవస్థ మరింత విస్తృత రూపాన్ని సంతరించుకుంది. ఈ విధంగా గోత్రం మతపరమైన భావనకే పరిమితం కాకుండా, సామాజిక మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా మారింది.


🌻 ఆచారాలలో గోత్రం యొక్క ప్రాధాన్యం 🌻

హిందూ సంప్రదాయ జీవన విధానంలో గోత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. వివాహాలలో ఒకే గోత్రానికి చెందిన వ్యక్తుల మధ్య సంబంధాన్ని నివారించాలనే ఆచారం సనాతన ధర్మంలో నాటివుంది. ఇది వంశ పరంపరను సంరక్షించడానికీ, సహజ సమతౌల్యాన్ని కాపాడడానికీ రూపొందిన జ్ఞానపూరిత నియమంగా భావించబడుతుంది. అలాగే పూజా విధానాలలో, శ్రాద్ధ కర్మలలో, ఉపనయనాది సంస్కారాలలో గోత్ర ఉచ్ఛారణ చేయడం ద్వారా పూర్వీకుల స్మరణను కొనసాగిస్తారు.

గోత్రం అనేది మన గతాన్ని గుర్తు చేసే బంధం. అది మన పూర్వీకుల పట్ల గౌరవభావాన్ని పెంపొందించి, వంశ పరంపర పట్ల అవగాహనను కలిగిస్తుంది. ఆధునిక జీవన శైలిలోనూ, తమ గోత్రాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతూ ఉండటం మన మూలాల పట్ల ఉన్న అంతర్గత అనుబంధాన్ని సూచిస్తుంది.

🌹🌹🌹🌹🌹


మాఘమాసం స్నాన మహత్వం - సువ్రతుడి వృత్తాంతం / The Significance of Bathing in the month of Magha - The Story of Suvrata


🌹 మాఘమాసం స్నాన మహత్వం - సువ్రతుడి వృత్తాంతం 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 The Significance of Bathing in the month of Magha - The Story of Suvrata 🌹
Prasad Bhardwaj



శుక మహర్షి ఒకప్పుడు పరీక్షిత్తు మహారాజుకు మాఘ మహాత్మ్యాన్ని గురించి చెప్పిన కథను సూత మునీంద్రుడు శౌనకాదులకు చెప్పాడు. మాఘ మాసంలో చేసే స్నాన, దాన, వ్రతాదులు అత్యంత పుణ్యఫలాలను ఇస్తాయని చెబుతూ, అందుకు ఉదాహరణగా సువ్రతుడు అనే బ్రాహ్మణుడి వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు: పూర్వం నర్మదాతీరంలోని సోమనాథం అనే అగ్రహారం ఉండేది.

ఆ అగ్రహారంలో సజ్జనులైన బ్రాహ్మణులు నిత్య వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు. నిత్యాగ్నిహోత్రాలు చేస్తూ, యజ్ఞ యాగాదులు జరిపేవారు. నిత్యం వేదఘోషతో అలరారే ఆ అగ్రహారం సర్వసుభిక్షంగా తులతూగుతూ ఉండేది.

ఆ అగ్రహారంలో సువ్రతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేద వేదాంగాలను; జ్యోతిష తర్క మీమాంసాది శాస్త్రాలను; సంగీతం, శిల్ప, నృత్యాది చతుష్షష్టి కళలను సాంగోపాంగంగా నేర్చుకున్నవాడై, మంత్రశాస్త్రంలో నేర్పరి అయి ఉండేవాడు. ఇవే కాకుండా, తత్త్వ, యోగ శాస్త్రాలను అభ్యసించి, పద్నాలుగు దేశ భాషలలో మాట్లాడటం, చదవడం, రాయడంలో నైపుణ్యం కలిగి ఉండేవాడు.ఇన్ని విద్యలు నేర్చిన సువ్రతుడికి అంతులేని ధనాశ ఉండేది. నేర్చిన విద్యలన్నింటినీ ధనార్జన కోసమే వినియోగించేవాడు. యజ్ఞ యాగాది క్రతువులతో పాటు శుభాశుభ సందర్భాలలో కర్తలు ఇచ్చే గోదాన, హిరణ్య దానాదులు సహా తిలదాన, లవణదానాల వంటి అన్ని రకాల దానాలనూ స్వీకరించేవాడు. అలా విశేషంగా ధనం కూడబెట్టాడు. విశేషంగా వస్తు వాహనాలను సమకూర్చుకున్నాడు.

అంతటితో సంతృప్తి చెందక దానంగా స్వీకరించిన గోవులను అంగడిలో విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. మిగులు ధనాన్ని అవసరంలో ఉన్నవారికి అప్పులుగా ఇచ్చి, అక్రమంగా వడ్డీలు గుంజేవాడు. ఎంత సంపాదించినా, భార్యా పిల్లల కోసమైనా సక్రమంగా ఖర్చు పెట్టేవాడు కాదు. తాను అనుభవించేవాడు కాదు. మితిమీరిన లోభంతో ఇలా లక్షలాది వరహాల ధనాన్ని పోగు చేశాడు.కాలక్రమేణా సువ్రతుడు వృద్ధుడయ్యాడు. కాళ్లు చేతులు పట్లు సడలి; కళ్లు కనిపించక, చెవులు వినిపించక శరీర యాతనతో రోజులు వెళ్లదీస్తూ ఉండేవాడు. అలాంటి దశలో కూడా తాను తినక, ఒకరికి పెట్టక కాలం గడప సాగాడు. సంపాదించి పోగు చేసిన ధనాన్ని ఎక్కడ దాచిపెట్టాడో కనీసం భార్యా కుమారులకైనా చెప్పేవాడు కాదు.

అగ్రహారంలో యజ్ఞయాగాదులు జరుగుతున్నట్లు తెలుసుకున్నప్పుడల్లా, శక్తిలేక మూలపడటం వల్ల అక్కడ తనకు దక్కాల్సిన దానాలు దక్కకుండా పోతున్నాయని బాధపడుతూ ఉండేవాడు.సువ్రతుడు మూలపడటం వల్ల కుటుంబ ఆదాయానికి గండిపడింది. ఇల్లు గడవడం కష్టమైంది. చివరకు అన్న వస్త్రాదులకు కూడా లోటు ఏర్పడే పరిస్థితులు దాపురించాయి. డబ్బు ఎక్కడ దాచిపెట్టాడో చెప్పకుండా ఉన్నందుకు భార్య, కొడుకులు, కోడళ్లు సువ్రతుడిని నానా రకాలుగా నిందించేవారు. కనీసం ఇంటి ఖర్చుల మేరకైనా డబ్బు తీసి ఇమ్మంటే ఇచ్చేవాడు కాదు. పైగా, 'మీరంతా దయ్యాల్లా దాపురించారు. నా ఇంటి నుంచి వెళ్లిపోండి' అంటూ కుటుంబ సభ్యులందరినీ తిట్టిపోసేవాడు.

రోజులు గడిచే కొద్ది పరిస్థితులు గడ్డుగా మారుతుండటంతో సువ్రతుడు ధనం దాచిన చోటు కనిపెట్టాలని ఇంటిల్లిపాది కలసి ఇల్లంతా వెదికారు. చివరకు ఒక బోషాణంలో దాచిన డబ్బు కనిపించింది. ఇక ఆనాటి నుంచి సువ్రతుడి కుటుంబ సభ్యులు ఆ డబ్బును స్వేచ్ఛగా ఖర్చుపెడుతూ, ముప్పూటలా సుష్టుగా భోజనాలు చేస్తుండేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉంటే, ఒకనాటి రాత్రివేళ సువ్రతుడి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్నవాళ్లను తాళ్లతో కట్టేసి, ఇంట్లో ఉన్న డబ్బును, చేతికందిన విలువైన వస్తువులను దోచుకున్నారు. దొంగలు ఇల్లంతా దోచుకుంటూ ఉండటం చూసి సువ్రతుడు బిగ్గరగా రోదిస్తూ, సొమ్మసిల్లిపోయాడు.

తెల్లవారుతూ ఉండగా సువ్రతుడికి స్పృహ వచ్చింది. మళ్లీ ఏడుపు మొదలుపెట్టాడు. 'ఎన్నో తుచ్ఛమైన దానాలు పట్టి ఎంతో ధనం సంపాదించాను. నేనూ తినలేదు, ఎవరికీ పెట్టలేదు. దానంగా స్వీకరించిన గోవును విక్రయించడం మహాపాపం. అయినా, దానంగా లభించిన ఎన్నో గోవులను అంగడిలో డబ్బుకు అమ్ముకున్నాను. దాన ధర్మాలకు ఖర్చు చేయని ధనం దొంగలపాలవుతుంది. నా కర్మ ఇలా కాలింది. ఎన్ని వేదాలు, ఎన్ని శాస్త్రాలు చదివినా ఫలమేమి? ధనాన్ని పోగు చేయాలనే లక్ష్యంతో దేవర్షి పితృతర్పణాలను కూడా ఏనాడూ సమర్పించలేదు. గురువులకు దక్షిణలివ్వలేదు.

నా లోభత్వమే నన్నింతకు దిగజార్చింది. ఇప్పుడు ఏ పుణ్యకార్యం చేద్దామన్నా, ఉన్న డబ్బంతా దొంగలపాలైంది. ముదిమితో ఒంట్లోని జవసత్త్వాలు ఉడిగిపోయాయి. కశ్మీర దేశంలో నేను చదువుకుంటున్నప్పుడు అక్కడ పండితుల వద్ద మాఘపురాణం విన్నాను. మాఘస్నానం వల్ల పాపాలు తొలగిపోతాయి. ఈ స్థితిలో నేను చేయదగ్గ పని మాఘస్నానం మాత్రమే' అనుకున్నాడు.కొడుకులను చేరబిలిచి, తాను చేసిన పాపాలన్నీ ఏకరువు పెట్టి, పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తనను మాఘస్నానం కోసం నర్మదా తీరానికి తీసుకుపోవలసిందిగా కోరాడు. 'మాఘే నిమగ్నాస్సలిలే సుశీతే విధూత పాపా స్త్రి దివం ప్రయాంతి' అని మాఘపురాణం చెబుతోంది.

మాఘమాసంలో చన్నీటి స్నానం చేసినవారికి పాపాలు నశించి, స్వర్గప్రాప్తి కలుగుతుంది.

అందువల్ల నన్ను నర్మదా తీరానికి తీసుకువెళ్లండి' అని కొడుకులకు చెప్పాడు.కొడుకుల సాయంతో నర్మదా తీరానికి చేరుకున్న సువ్రతుడు మాఘమాసంలో పదిరోజులు పవిత్ర స్నానం ఆచరించాడు. ఒకనాడు యథావిధిగా నర్మదానదిలో స్నానం ముగించుకుని, గట్టు మీదకు వచ్చి, దక్షిణముఖంగా పడుకుని గోవిందనామ స్మరణ చేస్తూ, ప్రాణాలు విడిచాడు. అతడి కుమారులు చూస్తుండగానే, దివ్యవిమానంలో దేవదూతలు అక్కడకు వచ్చారు. సువ్రతుడిని తీసుకుని వారు స్వర్గానికి బయలుదేరారు. మాఘస్నానం ఫలితంగా సువ్రతుడు స్వర్గప్రాప్తి పొందాడు.

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹

Facebookhttps://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2065481047571699