నారద భక్తి సూత్రాలు - 62

🌹. నారద భక్తి సూత్రాలు - 62 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రథమాధ్యాయం - సూత్రము - 36

🌻. 36. అవ్యావృత భజనాత్‌ ॥ - 2 🌻

చైతన్యప్రభు మతం ప్రకారం శ్రీకృష్ణ సంకీర్తనం వలన సర్వోత్కృష్టమైన ఆత్మానందం కలుగుతుంది. ఒక్కసారి ఆత్మానందానుభూతి కలిగితే

(1) అద్దం పై ధూళి తుడిచినట్లు చిత్త మాలిన్యం తుడిచి వేయబడుతుంది.

(2) ప్రాపంచిక విషయ భోగవాంఛలు చల్లారిపోతాయి.

(3) శుభప్రదమైన భక్తిపుష్ప వికసన జరిగి భగవదనుగ్రహం పొందుతాడు.

(4) భగవంతుడిని తెలుసుకొని భాగవతుడవుతాడు.

(5) ఆనంద సాగరంలో తేలియాడుతాడు.

(6) భక్తుడు పలికె ప్రతి పదం అమృతాన్ని పంచి పెడుతుంది.

(7) సకల జీవాత్మల శుద్ధి జరుగుతుంది.

(8) అది అద్వితీయ, నిరతిశయ ఆనందమే.

(9) సాధనయందు విజయాన్ని

చెకూరుస్తుంది. ఫలితంగా భక్తి ప్రతిష్టతమవుతుంది..

హృదయపూర్వక సంకిర్తనలో మైమరచిన వాడికి అలసట ఉండదు.

మానసికాన్ని దాటే వరకే ఆవృత భజన అవసరమవుతుంది. భక్తి సాధన ఏ ఒక్కటైనా సరె దానికది ఉత్తమ ఫలితాన్నిస్తుంది. అయితే చిత్త శుద్ధితో ప్రయత్నం చేస్తేనే అది ఫలిస్తుంది.

ఆ వృత్తిః అసకృ దుపదెశాత్‌
- బ్రహ్మ సూత్రం

అనగా సాధనను పదే పదే చేయమని బోధిస్తుంది. దీనినె భగవద్దీత అభ్యాస యోగం అంటుంది. పదె పదే చెసి అలవాటు చేసుకొని, సహజం చెసుకొంటే అదే అభ్యాస యోగమవుతుంది. అనగా భక్తిని శీలించడం అని కూడా అంటారు.

శ్రీమత్‌ భాగవతాన్ని పరీక్షిన్మహారాజు శ్రీశుకుని వద్ద నిరంతర శ్రవణం చేయడం వలన ముక్తుడయ్యాడు. నిరంతర భగవన్నామ సంకిర్తన వలన తుంబురుడు, తెంపులిని నారాయణ నామ స్మరణ వలన నారదుడు ముక్తులయ్యారు.. విడువకుండా విష్ణుపాద సేవనం వలన లక్ష్మిదేవి ఆయనతో సాయుజ్యం పొందింది..

పృథు చక్రవర్తి అర్చన చెస్తూ చేస్తూ శివైక్కత పొందాడు. నిరంతర వందనం వలన ఆక్రూరుడు, దాస్య భక్తివలన హనుమంతుడు, సఖ్యంచేత అర్జునుడు, ఉద్ధవుడు మోక్షమందిరి. వీరందరూ ఏదో ఒక సాధన నిర్విరామంగా జరపడం వలన సహజ భక్తులైరి. తుదకు ముక్తి పొందారు.

మనమైతే ఏదో ఒక సాధన చెసి తరించడం కష్టం గనుక అన్ని మార్తాలను ప్రయత్నం చెస్తూ కొన్నింటిని ఆవృతం చేసుకుంటే మంచిది. కించిత్‌ విరామం ఇస్తే అథోగతేనని ఈ సూత్రం హెచ్చరిస్తున్నది.

న్వాధ్యాయా ద్యోగమాసీత యోగా త్స్వాధ్యాయమావ సేత్‌
స్వాధ్యాయ యోగ సంపత్వా పరమాత్మ ప్రకాశతే |
-విష్టు పురాణం

తాః స్వాధ్యాయం, పవిత్ర గ్రంథాలను పఠించడం, యోగం, సమాధానం, ధ్యానం, మయొదలగునవి నిరంతరం చెస్తూ రాగా, పరమాత్మ దర్శనమౌతుంది..

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 123

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 123 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 శరీ కృష్ణుని లీలలు మనకు పాఠాలు - 2 🌻

శ్రీకృష్ణుడు విద్యాభ్యాసమైన వెనుక గురువు (సాందీపని) కోరిన ప్రకారము పంచజనుని గర్భమున నున్న బాలకుని బ్రదికించి అతి భక్తితో గురుదక్షిణగా సమర్పించెను.

గురువునకలవిగాని పని తాను భగవంతుడై చేసి పెట్టినను, భక్తితో సమర్పించి గర్వము పొందరాదని లోకమునకు నేర్పెను. తాను గురువును మించిన వాడని గురువు, లోకులు మెచ్చవలయును గాని తాను భావింపరాదని నేర్పెను.

పంచేంద్రియములకు గోచరించు నట్టి వస్తువులను బట్టి సుఖేచ్ఛ పుట్టును. సుఖ దుఃఖములు పుట్టక తప్పవు. ఇంద్రియముల రూపమునను , ఇంద్రియార్థముల రూపమునను అస్తిత్వము చెందునది నారాయణుడే అని జ్ఞప్తియున్న వారికి సుఖ దుఃఖములుండవు. సుఖములు అప్రయత్నముగా సిద్ధించును.

✍🏼. మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹




శ్రీ మదగ్ని మహాపురాణము - 66

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 66 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

ప్రథమ సంపుటము, అధ్యాయము - 27

🌻. దీక్షా విధి - 7 🌻

హోమేన శోధయేత్పశ్చాత్సంహార క్రమయోగతః | యాని సూత్రాణి బద్దాని ముక్త్వా కర్మాణి దేశికః. 63

శిష్యదేహాత్సమాహృత్య క్రమాత్తత్త్వాని శోధయేత్‌ | అగ్నౌ ప్రాకృతికే విష్ణౌ లయం నీత్వాధిదైవికే. 64

శుద్దం తత్త్వమశుద్ధేన పూర్ణాహుత్యా తు సాధయేత్‌ |

పిమ్మట సంహారక్రమమున హోమముచే శోధనము చేయవలెను. శిష్యుని దేమముపై కట్టిన కర్మరూప సూత్రములను విడిపించి, వాటిని ఒకచోట పోగుచేసి, తత్త్వ శోధనము చేయవలెను. ప్రాకృతికాగ్నియందును, ఆధిదైవిక విష్ణువునందును లయముచేసి, అశుద్ధులతో కూడిన తత్త్వమును పూర్ణాహుతిచే శుద్ధము చేయవలెను.

శిష్యే ప్రకృతిమాపన్నే దగ్ధ్వా ప్రాకృతికాన్‌ గుణాన్‌. 65

మోచయే దధికారే వా నియుంజ్యాద్ధేశికః విశూన్‌ |

ప్రాకృతిక గుణములను దహించి శిష్యుడు ప్రకృతిస్థుడైన పిమ్మట గురువు ఆతనిని విముక్తుని చేయవలెను; లేదా శిశువులను (శిష్యులను) అధికారమునందు నియుక్తులను చేయవలెను.

అథాన్యాం శక్తి దీక్షాం వా కుర్యాద్భావే స్థితో గురుః. 66

భక్త్యా సంప్రతిపన్నానాం యతీనాం నిర్ధనస్య పచ | సంపూజ్య స్థణ్డిలే విష్ణుం పార్శ్వస్థం స్థాప్య పుత్రకమ్‌. 67

దేవతాభిముఖః శిష్యస్తిర్యగాస్యః స్వయం స్థితః | అధ్వానం నిఖిలం ధ్యాత్వా పర్వభిః స్త్వెర్వికల్ఫతమ్‌. 68

శిష్యదేహే తథా దేవమాదిదైవిక యాజనమ్‌ | ధ్యానయోగేన సంచిన్త్య పూర్వవత్తాడనాదినా. 69

క్రమాత్తత్త్వాని సర్వాణి శోధయేత్థ్సణ్డిలే హరౌ |

లేదా గురువు భావస్థితుడై మరియొక శక్తిదీక్ష యైన చేయవలెను. యతులు గాని, నిర్ధనులు గిన భక్తి పూర్వకముగ తన నాశ్రయించి నపుడు స్థండిలముపై విష్ణువును పూజించి, పార్శ్వమునందే కూర్చుండబెట్టవలెను.

శిష్యుడు దేవతాభిముఖుడుగా ఉండగా గురువు ముఖమును అడ్డముగా త్రిప్పి కూర్చుండవలెను. స్వీయపర్వములతో వికల్పిత మైన సకలాధ్వమును శిష్యునిదేహముపై ధ్యానించి పిమ్మట ఆధిదైవికపూజ చేయవలెను. ధ్యానమోగముచే చింతించి, వెనుక చెప్పిన విధమున తాడనాదికముచే క్రమముగ స్థండిలముపై నున్న హరియందు సకలతత్త్వసంశోధనము చేయవలెను.

తాడనేన వియోజ్యాథ గృహీత్వాత్మని తత్పరః. 70

దేవే సంయోజ్య సంశోధ్య గృహీత్వా తత్స్వభావతః | ఆనీయ శుద్దభావేన సన్ధయిత్వా క్రమేణ తు. 71

శోధయేద్ధ్యానయోగేన సర్వతో జ్ఞానముద్రయా |

పిమ్మట తాడనముచేత విడిపించి, తత్పరత్వముతో తనలో గ్రహించి, దేవునితో సంబంధింప చేసి, పరిశోధనము చేసి, దేవస్వరూపమున గ్రహించి, శుద్ధభావముతో తీసికొని వచ్చి, క్రమముగ సంధింపచేసి, ధ్యానమోగము నవలంబించి జ్ఞానముద్రతో శోధింపవలెను.

శుద్ధేషు సర్వతత్త్వేషు ప్రధానే చేశ్వరే స్థితే. 72

దగ్ఠ్వా నిర్వాపయేచ్ఛిష్యాన్‌ పదే చైశే నియోజయేత్‌ | నినయేత్సిద్దిమార్సే వా సాధకం దేశికోత్తమః. 73

సర్వతత్త్వములను శుద్ధము లైన పిమ్మట ప్రధాను డగు ఈశ్వరుడు మాత్రము ఉండగా, శిష్యులను(పాశములను) దహించి నిర్వాపితులను చేయవలెను. ఈశ్వరస్థానమున వారిని నియుక్తులను చేయవలెను. లేదా దేశికోత్తముడు సాధికుని సిద్ధిమార్గమును పొందింపచేయవలెను.

ఏవమేవాధికారస్థో గృహే కర్మణ్యతన్ద్రితః | ఆత్మానం శోధయంస్తిష్ఠే ద్యావద్రాగక్షయో భవేత్‌. 74

అధికారము గల గృహస్థుడు ఈ విధముగ కర్మాచరణవిషయమున అలసత్వము లేనివాడై, రాగము క్షీణించు వరకును ఆత్మశోధనము చేసికొనుచు ఉండవలెను.

క్షీణరాగమథాత్మానం జ్ఞాత్వా సంశుద్ధకిల్బిషః | ఆరోప్య పుత్రే శిష్యే వాహ్యధికారం తు సంయమీ. 75

దగ్ధ్వా మాయామయం పాశం ప్రవ్రజ్య స్వాత్మని స్థితః | శరీరపాతమాకాజ్‌క్షన్నా సీతావ్యక్త లిఙ్గవాన్‌. 76

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సర్వదీక్షాకథనం నామ సప్తవింశోధ్యాయః.

తన కున్నరాగము క్షీణించిన దను విషయము గుర్తించి, పాపము లన్నియు తొలగిన ఆతడు పుత్రునకు గాని శిష్యునకు గాని అధికారము అప్పగించి, సంయమియై, మాయామయ మగు పాశమును దహింపచేసకిని, సన్యాసము స్వీకరించి, ఆత్మచింతాపరాయణుడై, తన స్థితిని ఇతరులకు వ్యక్తముచేయక శరీరపాతమునకై (మరణమునకై) వేచి యుండవలెను.

అగ్ని మహాపురాణములో సర్వదీక్షాకథన మను ఇరువదిఏడవ అధ్యాయము సమాప్తము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 195

🌹 . శ్రీ శివ మహా పురాణము - 195 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
43. అధ్యాయము - 18

🌻. గుణనిధి సద్గతిని పొందుట - 2 🌻

పక్వాన్న గంధమాఘ్రామ యజ్ఞదత్తాత్మజో ద్విజః | పితృత్యక్తో మాతృహీనః క్షిధితస్స తమన్వ గాత్‌ || 12

ఇదమన్నం మయా గ్రాహ్యం శివాయోపకృతం నిశి | సుప్తే శైవజనే దైవాత్సర్వస్మిన్‌ వివిధం మహత్‌ || 13

ఇత్యాశామవలంబ్యాథ ద్వారి శంభోరుపావిశత్‌ |దదర్శ చ మహాపూజాం తేన భక్తేన నిర్మితామ్‌ || 14

విధాయ నృత్యగీతాది భక్తాస్సుప్తాః క్షణ యదా | నైవేద్యం సతదాదాతుం భర్గాగారం వివేశ హ || 15

తండ్రిచే విడువబడి, తల్లి లేక ఆకలి గొనియున్న ఆ యజ్ఞదత్తపుత్రుడగు బ్రాహ్మణుడు ఆహారపదార్ధముల గంధము నాఘ్రాణించి అతని వెనుకనే వెళ్లెను (12).

శివభక్తులు ఈ అన్నమును శివునకు నివేదన చేసి రాత్రి యందు నిద్రించగనే, నేను ఈ వివిధములగు దివ్యమైన వంటకములను పరిగ్రహించెదను (13). అతడీ తీరున ఆ శించిన శివసన్నిధిలో ద్వారము నందు కూర్చుండి, ఆ భక్తుడు చేసిన మహాపూజను దర్శించెను (14).

ఆ భక్తులు నాట్యములను చేసి, పాటలను పాడి నిద్రించగనే; ఆ నైవేద్యమును గ్రహించుటకు ఆతడు శివసన్నిధిలోనికి ప్రవేశించెను (15).

దీపం మందప్రభం దృష్ట్వా పక్వాన్న వీక్షణాయ సః | నిజచైలాంచలాద్వర్తిం కృత్వా దీపం ప్రకాశ్య చ || 16

యజ్ఞదత్తత్మా జస్సోsథ శివనైవేద్యమాదరాత్‌ | జగ్రాహ సహసా ప్రీత్యా పక్వాన్నం బహుశస్తతః || 17

తతః పక్వాన్న మాదాయ త్వరితం గచ్ఛతో బహిః | తస్య పాదతలాఘాతాత్ర్పసుప్తః కోsప్యబుధ్యత|| 18

కోsయం కోsయం త్వరాపన్నో గృహ్యతాం గృహ్యతా మసౌ | ఇతి చుక్రోశ స జనో గిరా భయమహోచ్చయా || 19

యావద్భయాత్సమాగత్య తావత్స పురరక్షకైః | పలాయమానో నిహతః క్షణా దంధత్వ మాగతః || 20

ఆతడు ఆ వివిధ ఆహారపదార్థములను చూడబోగా దీపకాంతి తగినంత లేకుండెను. ఆతడు తన ఉత్తరీయము నుండి వస్త్ర శకలమును చింపి వత్తిని చేసి దీపమును ప్రకాశింపజేసెను (16).

ఆపుడా యజ్ఞదత్తుని పుత్రుడు వివిధములైన వంటకములుగల శివనైవేద్యమును ప్రీతితో ఆదరముతో స్వీకరించెను (17).

ఆతడు ఆహారమును తీసుకొని త్వరితముగా బయటకు వెళ్లుచుండగా కాలు తగిలి నిద్రపోవుచున్న వ్యక్తి యొకడు తెలివిని పొందెను (18).

ఎవరు వారు? ఎవరు వారు? వానిని తొందరగా పట్టుకొనుడు, పట్టుకొనుడు అని ఆతడు భయముతో పెద్ద స్వరముతో అరచెను (19).

గుణనిధి భయపడి పరుగెత్తుచుండగా రక్షక భటులు కొట్టిరి. అతడు పడిపోయెను. మరియు చూపును కోల్పోయెను (20).

అభక్షయచ్చ నైవేద్యం యజ్ఞదత్తాత్మజో మునే | శివానుగ్రహతో నూనం భావిపుణ్యబలాచ్చ సః || 21

అథ బద్ధ స్సమాగత్య పాశముద్గరపాణి భిః | నినీషు భి స్సంయమనీం యామ్యైస్స వికటెర్భటైః || 22

తావత్పారిషదాః ప్రాప్తాః కింకిణీ జలమాలినః | దివ్యం విమాన మాదాయ తం నేతుం శూల పాణయః || 23

ఓమహర్షీ! ఆ యజ్ఞదత్త కుమారుడు శివుని అనుగ్రహము వలన, మరియు లభించబోవు పుణ్యము యొక్క ప్రభావము వలన నైవేద్యమును భక్షించి మరణించెను (21).

అపుడు భయంకరాకారులు, పాశము ముద్గరము అను ఆయుధములను ధరించిన వారునగు యమభటులు అచటకు వచ్చి ఆతనిని బంధించి యమపురికి తీసుకొని పొవనుద్యమించిరి (22).

ఇంతలో చిరుగంటల మాలలను ధరించిన, చేతియందు శూలనముగల శివగణములు ఆతనిని తీసుకొని వెళ్లుటకై దివ్యవిమానమును తీసుకొనివచ్చిరి (23).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 82

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 82 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరాశర మహర్షి - 1 🌻

వంశము: వసిష్ఠమహర్షి(తాత), శక్తి(తండ్రి)
భార్య(లు): సత్యవతి
కుమారులు/కుమార్తెలు: వ్యాసమహర్షి
కాలము: భౌగోళిక ప్రాంతములు: బదరికాశ్రమం
నదులు: యమున
బోధనలు/గ్రంధాలు: పరాశరస్మృతి, పరాశరగీత, వృద్ధపరాశరహోర


🌻. జ్ఞానం:

1. కలియుగంలో మనం అవలంబించిన స్మృతి ‘పరాశరస్మృతి’ అని నిర్ణయం జరిగింది. ఈ స్మృతికారకుడు పరాశరమహర్షి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క స్మృతి ఎందుకుండాలి అంటే, మనుష్యులయొక్క శక్తిసామర్థ్యాలు అన్ని యుగాలలోను ఒకేవిధంగా ఉండవు.

2. మనకు నేడు 80 ఏళ్ళు పూఋనాయుర్దాయం అనుకుంటే, 20 ఏళ్ళు యౌవనం ఉంటుంది. అప్పుడే మనిషికి సంసారతాపత్రయం మొదలు. సంసారం, పిల్లలను కనటం, ఇల్లు వాకిలి ఏర్పాటు మొదలైనవి. 60 ఏళ్ళకు వార్ధక్యం మొదలు.ఈ ధర్మాచరణ అనేది ఆయువునుబట్టి, ఆయుర్దాయకాలంలో ఉండే మనోబలం, శరీర దారుఢ్యం, జీర్ణశక్తి, ఆకలిని తట్టుకునేశక్తి వాటినిబట్టి నిర్నయించబడుతుంది. ధర్మాలు జీవనవిధానంలో భాగం కాబట్టి.

3. కాబట్టి ఈ శరీరమెంత శక్తిసామర్థ్యాలతో ఉండినా, మనకు మానసిక బలంకూడా అవసరం. ధ్యానశక్తిగాని, యోగశక్తిగాని, ఏకాగ్రతయొక్క శక్తి సామర్థ్యాలుగాని, మనస్సును ఒక వస్తువునందు లగ్నంచేయాలి అంటే – ఇవి అన్ని యుగాలలోనూ, అందరు మనుష్యులలోనూ ఒకేలా ఉండవు.

4. కాబట్టి ఆ యుగములనుబట్టి, వ్యక్తులనుబట్టి ఆచారాలు, వ్యవహారాలు, ధర్మాలు, నిర్దేశించబడ్డాయి. మళ్ళీ అన్ని ధర్మాలకూ గమ్యస్థానంమాత్రం ఒక్కటే! ఏ మార్గంలో జీవిస్తే చిట్టచివరకు ఈ ప్రపంచ జీవనం మీద కొంత వైముఖ్యము, జ్ఞానలో అభివృద్ధి, వైరాగ్యము, జ్ఞానేఛ్ఛ – ఈట్లాంటివన్నీ ఎలా జీవిస్తే కలుగుతాయో, అట్లా జీవించడంకోసమే ధర్మం. అధర్మంలో ఉండేవాడికి ఎప్పుడూ ఆశలే! ఎప్పుడూ బాధలే!

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 31

🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 31 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం - 1 🌻

ఒకరోజు సిద్ధయ్య వీర బ్రహ్మేంద్రస్వామితో చర్చను ప్రారంభించాడు.

“స్వామీ ఈ సమస్త సృష్టికి కారణభూతుడెవరు? ఆయనను మనం ఎలా కనుగొంటాం?” అని సిద్ధయ్య ప్రశ్నించాడు.

అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి సిద్ధయ్యకు ఇలా వివరించారు.

“ఈ ప్రపంచంలో మన అనుభూతికి, జ్ఞానానికి అందని ఒక అద్భుత శక్తి వుంది. దానినే సర్వేశ్వరుడు అని మనం పిలుస్తాం. దీనిని వేర్వేరు మతాలకు చెందినవారు వేర్వేరుగా గుర్తిస్తారు. కానీ,ఆ శక్తిమంతుడు ఒక్కడే! అతడే భగవంతుడని ఆస్తికులంటారు.అది మన జ్ఞానానికి అతీతమైన సర్వోన్నత శక్తి అని, పుట్టుక, మరణము లేని శక్తి అనీ నాస్తికులంటారు.దానిని మనం అన్వేషణ ద్వారా కనుగొనవచ్చు”

“మన కళ్ళకు కనిపించే ఈ ప్రపంచము మొత్తము పూర్తిగా కల్పితమైనదే! అంటే ఇది అశాశ్వతమైనది. ఇది నశించక తప్పదు. అయితే, మరి మనకి కనబడుతున్న ఈ జీవులు, జీవం లేని వస్తువులు శాశ్వతం కాదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉద్భవించవచ్చు. ఈ శరీరమే అశాశ్వతం. అలాంటప్పుడు మనకి గోచరమయ్యే ఈ చరాచర వస్తువులన్నీ కూడా నాశనమవుతాయి.

జీవుల జ్ఞానానికి, దృష్టికి అందని ఒకే అంశం, తత్త్వం ఈ సృష్టికి ముందు నుంచీ వుంది. ఇప్పుడు కూడా వుంది. తర్వాత కూడా వుంటుంది. దానినే మూల తత్త్వమనీ, భగవంతుడనీ రకరకాల పేర్లతో పిలుస్తాం. కొలుస్తాం. దాని స్వభావాన్ని గ్రహించటం అనేది దాదాపు అసాధ్యం. అది సాధారణ భావనకు అందనిది.

సమస్త సృష్టికీ కారణభూతమే ఈ అంశం. ఇది పరిపూర్ణమైనది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నీ ఇందులోంచే ఉద్భవించాయి. తిరిగి ఇందులోనే లయమైపోతాయి.శ్రీ కృష్ణుడు తన విశ్వరూపం గురించి చెప్పిన సందర్భంలో కూడా దీని గురించే చెప్పాడు.

ఈ ప్రపంచంలో జీవులు అనుభవించే అనుభూతులకు అతీతమైనది అది. తన కర్మకు తాను నిర్వరిస్తూ పోతుంది. తప్ప ఎవ్వరి అనుజ్ఞ కోసం, ప్రార్థనల కోసమూ ఆగదు. దానిని మనం భగవంతుడని పిలుస్తూ, అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తూ వుంటాం.

భగవంతుడికి లేదా ఈ అనంతత్వానికి ఒక రూపం లేదు. గుణం లేదు. చావు లేదు. పుట్టుక లేదు.అతడు ఆది లేనివాడు.అనంతమైన వాడు. అన్నింటిలోనూ వుంటాడు. అన్నీ తానై వుంటాడు. కానీ ఇందులో ఏ ఒక్కటీ భగవంతుని గురించి లేదా ఈ ఏకత్వం గురించి చెప్పలేదు.

కేవలం మొక్కుబడిగా చేసే పూజలు, చదివే మంత్రాలతో ఎవరూ భగవంతుడిని ప్రసన్నం చేసుకోలేదు. అలాగే స్వార్థం కోసం చేసే యజ్ఞాలతోనూ మనం భగవంతుని చూడలేం. నిర్మలమైన మనస్సుతో చేసే పనుల వల్ల మాత్రమే, ఎలాంటి యజ్ఞాలు చేయకపోయినా మంత్రాలు చదవకపోయినా భక్తులు సర్వేశ్వరుడిని చూడగలరు.

భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు దైవం తెలీదు. ఈ చర్మ చక్షువులతో భగవంతుని ఎవ్వరూ దర్శించలేరు, గుర్తించలేరు. ఎంతమంది భక్తులున్నప్పటికీ అతి కొద్దిమంది మాత్రమే భగవంతుని చేరుకోగలరు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

అద్భుత సృష్టి - 3

🌹. అద్భుత సృష్టి - 3 🌹
✍️. DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. విశ్వం/సృష్టి ఆవిర్భావం - 3 🌻

🌟 మనం ఉన్న సోలార్ సిస్టమ్ (సౌర కుటుంబం) లోని సూర్యుడు తన యొక్క ప్లానెటరీ సెంట్రల్ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇది జరగడానికి సుమారు 26,000 సంవత్సరాలు పడుతుంది.

ఇదంతా ఒకానొక *"ప్రకంపనా రంగం"* అని చెప్పవచ్చు. ప్లానెటరీ కేంద్ర సూర్యుడు గెలాక్టిక్ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ గెలాక్టిక్ కేంద్ర సూర్యుడు యూనివర్సల్ కేంద్ర సూర్యుని (సెంట్రల్ సన్) చుట్టూ తిరుగుతూ ఉంటాడు.

🌟ఈ ప్రకంపన ద్వారా సృష్టి యావత్తు కి పోషణ లభిస్తూ ఉంటుంది.
మూల చైతన్యం నుండి(శూన్యం) - ఆదిఆత్మ (ఆదిశక్తి) ఉద్భవించింది.
ఆదిఆత్మ నుండి - బ్రహ్మాత్మల సృష్టి జరిగింది.
బ్రహ్మాత్మల నుండి - విశ్వాత్మల సృష్టి జరిగింది.
విశ్వాత్మల నుండి - మహా ఆత్మల సృష్టి జరిగింది.
మహా ఆత్మల నుండి - పూర్ణాత్మల సృష్టి జరిగింది.
పూర్ణొత్మల నుండి - జీవాత్మలు సృష్టించబడ్డాయి.

ఈ ఆత్మ లన్నింటినీ యూనివర్సలు(విశ్వాలు), గేలక్సీలు, నక్షత్రాలు, ప్లానెట్స్ లోకి పంపడం జరిగింది. ఈ ఆత్మ స్వరూపాలు అన్నీ సూపర్ సోల్ (భగవంతుడు)నుండి ఒకేసారి సృష్టించబడ్డాయి. అందుకే వీటన్నింటి వయస్సు ఒక్కటే!

🌟 పూర్తి విశ్వంలో ఇప్పటికి ఏడుసార్లు సృష్టి జరిగింది. సృష్టియావత్తు సృష్టించబడుతూ, లయం పొందుతూ, మళ్ళీ సృష్టించబడుతూ ఉంటుంది. ఇదే సృష్టి ప్రణాళిక!

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

గీతోపనిషత్తు - సాంఖ్య యోగము : 2. మేలుకొలుపు - కర్తవ్యము నందు నిలబడు

🌹2. మేలుకొలుపు - కర్తవ్యము నందు నిలబడు 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 2 📚

ఎట్టి పరిస్థితుల యందును క్లైబ్యమును పొందవలదని, హృదయ దౌర్బల్యము వలదని, అది క్షుద్రమైనదని, కర్తవ్యము నందు నిలబడుమని, పారిపోవలదని, భగవానుడు మరియొక శాసనము చేయుచున్నాడు.

క్లైబ్యం మాస్మగమó పార్థ నైతత్త్వ య్యుపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిషస పరంతప || 3

నరుడు సహజముగ తేజోవంతుడు. కావున క్రీనీడలు లేక చీకట్లు క్రమ్ముటకు అవకాశములేదు. ఎంత నల్లమబ్బు అయినను తాత్కాలికమే కాని సూర్యునివలె శాశ్వతము కాదు.

తాత్కాలికమగు సంఘటనల యందు తన సహజత్వమును కోల్పోవుట అజ్ఞానము.

అర్జునుడు సహజముగ తేజోవంతుడు. పరాక్రమవంతుడు. పరంతపుడు అనగా శత్రువులను తపింప చేయువాడు మరియు పరమును గూర్చి తపించువాడు. అనగా దైవమును గూర్చి తపించువాడు. అట్టి తపము కారణముగ లోపల, బయట శత్రువులు జయింపబడుదురు. దైవము అనగా విశ్వ వ్యాప్తమైన తేజము.

దానిని గూర్చి తపించువానికి ధైర్యమెట్లు కలుగగలదు. దాని నుండి విడివడుట, తాత్కాలిక సన్నివేశమునకు ముడిబడుట కారణముగ అధైర్యము, మనో దుర్బలత్వము కలుగును. దైవమును ఆశ్రయించుటయే అట్టి సమయమున పరిష్కారము.

''పరంతపుడవైన ఓ నరుడ! కర్తవ్యమున మేల్కొనుము. క్షుద్రమైన హృదయ దౌర్బల్యమును వీడుము. అధైర్యమును పొందకుము. ఇది నీకు తగదు'' అని భగవానుడు శాసించు చున్నాడు.

గమనిక : ఈ శ్లోకమున భగవానుడు నరుని 'పరంతపుడని' సంబోధించుటలో గంభీరార్థము కలదు.
🌹 🌹 🌹 🌹 🌹

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 10

. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 10
. శ్రీ బాలగోపాల్
. ప్రసాద్ భరద్వాజ

. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 10

27. వేర్వేరు మతములు పరమాత్ముని ఇట్లు పిలుతురు.
సూఫీలు. --అల్లాహ్
జొరాస్ట్రియనులు. --అహూరామజ్దా
వేదాంతులు. --పరమాత్మా
క్రైస్తవులు. --పరమపిత,పరలోకతండ్రి
దార్శనికులు. --అధ్యాత్మా
28. పరమాత్మ స్థితి: కేవలము, అపరిమితము అనంతము అయిన అద్వైత స్థితి.
29. పరాత్పర స్థితికిని పరమాత్మ స్థితికిని మూలస్థితి లో భేదము లేదు.
30. అవ్యక్తమైన పరాత్పర స్థితిలో అంతర్నిహితమైయున్న ఆదిప్రేరణము భంగము కాగా, పరాత్పరుడు--పరమాత్మ--యను
మరియొక అనంతస్థితిని పొందెను.

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 26

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 26 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 14 🌻

చీకటి వెలుతురు ఎట్లా ఒకదానికొకటి పరస్పర భిన్నమో - భిన్నము అంటే అర్ధం ఏమిటంటే ఒకటుంటే ఒకటుండదు. వెలుతురున్నప్పుడేమో చీకటుండదు. చీకటున్నప్పుడు వెలుతురు అనుభూతం కాదు. అట్లాగే వివేకం ఉన్నప్పుడు అవివేకం కలిగే అవకాశం లేదు.

అట్లాగే అవివేకం వున్నప్పుడు వివేకం కలిగే అవకాశం లేదు. కారణమేమిటంటే ఆ అవివేకానికి ఒక ఉద్వేగం వుంటుంది. ఒక వడి వుంటుంది. అదొకసారి కలిగితే నిన్ను స్థిరంగా వుండనివ్వదు. ఉదాహరణ చెప్తాను.

మీఅందరిలో మీ అందరి జీవితాలలో తాజ్ మహల్ చూసినవాళ్ళు ఎవరు అంటే కొంతమంది చూశామని కొంతమంది చూడలేదని చెప్తారు. చూడకపోతే ఏమిటయ్యింది అన్న ప్రశ్న వేసుకున్నామనుకో తాజ్ మహల్ చూడకపోతే జీవితం వ్యర్ధం. అట్లాగే నేను కాలేజిలో చదివే కాలంలో మరోచరిత్ర సినిమా చూశావా అన్నారు.

నాకు సినిమాలు చూసే అలవాటు లేదు. నేను చూడలేదు. అయితే నీ జీవితం సగం వృధా అనేవాళ్ళు. అంటే అర్ధం ఏమిటీ అంటే, ఈ ప్రేయోమార్గములో వున్నప్పుడు ఆ సుఖాన్ని పొందకపోతే నీ జీవితం వృధా అనేటటువంటి ఉద్వేగాన్ని పొందుతాడు.

ఆ ఉద్వేగాన్ని పొందేటప్పటికీ ఆ సుఖంవైపు మిడత వలే ఆకర్షించబడతాడు. ఆకర్షించబడి శలభం ఎట్లా అయితే ప్రాణాలని కోల్పోతుందో దీపశిఖ మీద పడి, అట్లాగే దీపపు పురుగువలే అయిపోతాడనమాట. అర్ధమైందా? ఈ రకమైనటువంటి బంధకారణము ఈ ప్రేయోమార్గములో వుంది.

అందువలననే ఈ ప్రేయోమార్గమును అవిద్య అన్నారు. ఎందుకనిట అంటే ఈ అవిద్యకు మూలం లేదు. ఇది అనాది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

శివగీత - 28 / The Siva-Gita - 28

🌹. శివగీత - 28 / The Siva-Gita - 28 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

చతుర్దా ధ్యాయము
🌻. శివ ప్రాదుర్భావము - 4 🌻

ఘంటికా ఘర్ఘ రీశబ్డై: - పూర యంతం దిశో దశ,

తత్రా సీనం మహాదేవం - శుద్ధ స్పటిక విగ్రహమ్ 27

కోటి సూర్య ప్రతీకాశం - కోటి శీతాం శుశీ తలమ్,

వ్యాఘ్రచర్మాం బరధరం - నాగ యజ్ఞో పవీతినమ్ 28

సర్వాలంకార సంయుక్తం - విద్యుత్సింగ జటాధరమ్,

నీల కంటం వ్యాఘ్ర చర్మో -త్తరీయం చంద్ర శేఖరమ్ 29

నాన విదాయు దోద్భాసి - దశ బాహుం త్రిలోచనమ్,

యువానం పురుష శ్రేష్టం - సచిత్ చదానంద విగ్రహమ్ 30

మరియు నా నందీశ్వరు నదిరోహించిన స్వచ్ఛమగు స్పటిక మణిని బోలు శుబ్రమగు వర్ణము కలిగి కోటి సూర్య ప్రకాశము కలవాడు కోటి చంద్రుల బోలు శీతలత్వము కలవాడు, పులి చర్మమును ధరించిన వాడు నాగ యజ్ఞోపవీతము దాల్చిన వాడు, సమస్తాలంకార యుతుండును, విద్యుద్వల్లిం బోలు ప్రకాశ యుతుడు, గరళ కంటుడు, ఉడు రాజశేఖరుడు ను దశ హస్తములతో సమస్త యుధంబులను ధరించిన వాడును, ముక్కంటియు యౌవ్వన వంతుడు, సచ్చిదానంద స్వరూపుడు, పురుష శ్రేష్టుడు నగు పరమ శివుని సందర్శించెను.


తత్రైవ చ సుఖాసీనాం - పూర్ణ చంద్ర నిభాననామ్,

నీలేందీ వరదా మాభా - ముద్యమ్న రకత ప్రభామ్ 31

ముక్ ఆత భరణ సంయుక్తం - రాత్రిం తారాచిత మివ,

వింధ్యక్షి తిధరో త్తుంగా - కుఛ భార భరాలసామ్ 32

సద సత్సంశ యావిష్ట - మధ్యదే శాంత రాం వరామ్,

దివ్యాభరణ సంయుక్తాం - దివ్య గందానులే పనామ్ 33

దివ్య మాల్యాం బరధరాం - నీలేంది వర లోచనామ్,

అల కోద్భా సివ దనాం - తాంబూల గ్రాసవో భితామ్ 34

శివా లింగన సంజాత - సులకోద్భా సివిగ్రహా మ్,

సచ చిదానంద రూపాడ్యాం- జగన్మాత రమంబికామ్ 35

సౌందర్య సార సందోహాం- దదర్శ రఘు నందనః,

స్వస్వవాహన సంబద్దా - న్నానా యుధ లసత్కరాన్ 36

బృహద్రధం తరా దీని - సామాని పరి గాయతః ,

మరియు నక్కడే ఆనందముతో సుఖాసీనురాలై పూర్ణ చంద్రుని వలె ముఖ బింబము గల నీలెంది పరమాలిక పగది గల , మరకత మణి కాంతిని విరజిమ్మునది, ఆణి ముత్యాల సరసములను దాల్చినది యగుటచే కాంతియుత నక్షత్ర యుక్త మై విరాజిల్లు రేయివలె నొప్పుచున్నది.

శుంభ స్తనములుకలది , సన్నని నడుము గలది యు, అమూల్య రత్నాలంకారముతో నొప్పునదియు , సుగంధ పూమాలికను దివ్య వస్త్రములను దాల్చినదియు నల్లవ పువ్వులవలె నున్న గన్నులు కలది, విడెముతో కూడినదియు, పతిదేవుని యాలింగనముతో పులకాంకిత దేహము గలదియు సచ్చిదానంద శరీరము గలదియు నిఖిల జగన్మాత యగు పార్వతిని గాంచెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 28 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 04 :
🌻 Shiva Praadurbhaavam - 4 🌻

Seated on the divine bull Nandi, was seen a lord as pure as crystal in complexion, who was blazing with a divine aura equal to billions of suns, whose brilliance was as soothing as light from billions of moons,

who had tiger skin on his body as garments, who had a snake wrapped around his body as the sacred thread, who was decorated with many divine ornaments,

who was blazing like lightening, who had moon on his crown, who had ten hands wielding various weapons, who looked very youthful. Rama beheld that blue necked, supreme Purusha the one and only Lord Paramashiva.

Also Rama beheld a goddess seated blissfully in Sukhasana posture having a beautiful face as like as full moon,

who was shining with a hue of bluish colored diamonds, who was decorated with pearls, and variety of gems, who had firm uprised breasts comparable to Vindhya mountains, who had a slender waist,

who wore divine garments and nicely smelling flower garlands, who had eyes resembling flowers, who was blushing due to the embrace of her consort.

Rama sighted the mother of all the goddess Parvati.
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 20 / Sri Gajanan Maharaj Life History - 20

 

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 20 / Sri Gajanan Maharaj Life History - 20 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 5వ అధ్యాయము - 1 🌻

శ్రీగణేశాయనమః ! ఓభగవంతుడా నీశతృవులకు నీవు అజేయుడవు. ఓ అద్వైతా, సచ్చిదానందా, కారుణ్యాలయా ఈ దాస్గణుని అన్ని భయాలనుండి విముక్తుడిని చేయండి. నేను పతనమయినవాడిని, బీదవాడిని, పాపిని మరియు ఏవిధమయిన అధికారం లేనివాడిని. అందుచేత పూర్తిగా దిక్కులేని వాడను. కానీ మహానుభావులు తరచు పేదలకు సహాయంచేస్తారు. శివుడు తన శరీరానికి బూడిద రాసుకున్నాడు. 

మహానుభావునులను చిన్నవారి చిన్నతనం కించపరచదు. కనుక ఈ గణుదాసును ఈవిధమయిన అవగాహనతో మీపాదాల దగ్గర ఉండనీయండి. తల్లి తనపిల్లల కోరికలన్నీ పూర్తిచేస్తుంది. నేను మీకృప కోసం వేచిఉన్నాను. మీఇష్టప్రకారం చెయ్యండి, కానీ నాతో ఉదారతతోఉండండి. నాఆశలు మీమీదే ఆధారపడి ఉన్నాయి. శ్రీమహారాజు దర్శనానికి అనేక వందలమంది షేగాం రావడం ప్రారంభం అయింది. 

ఆయన ప్రతిభ దూరదూరాలకు వ్యాపించింది, కానీ శ్రీగజానన్ వీటినుంచి దూరంగా ఉండదలచారు. అందువల్ల ఎవరికి ఏవిధమయిన జ్ఞానంలేకుండా నెలలతరబడి అడవులలో తిరిగేవారు. అలాతిరుగుతూ ఒకసారి పింపళాగాంకి వెళ్ళారు. పింపళాగాం దగ్గర అడవిలో భగవాన్ శివుని ఆలయంఉంది. 

శ్రీగజానన్ అక్కడికి వెళ్ళి పద్మాసనముద్రలో కూర్చున్నారు. ఆ ఆలయందగ్గర ఒకచిన్న నీటి ప్రవాహం ఉంది. అక్కడికి కొంతమంది గొల్లపిల్లలు తమ పశువులను తీసుకువచ్చారు. ఆవులు ఆప్రవాహంలో నీళ్ళు త్రాగుతూఉండగా పిల్ల వాళ్ళు భగవాన్ శివుని దర్శనానికి ఆలయానికి వెళ్ళారు. 

అక్కడ కళ్ళు మూసుకుని కూర్చున్న తీగజానన్ ను వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. వీళ్ళు ఆ ఆలయానికి వస్తూ ఉండేవారు కానీ ఎప్పుడూ ఎవరూ శ్రీగజానన్ లా అక్కడ కూర్చుని ఉండగా చూడలేదు. ఆయన ముందు కొంతమంది కూర్చున్నారు, కానీ ఆ యోగి కళ్ళు తెరవలేదు, ఏమీమాట్లాడలేదు. ఆ విధంగా ఆయన కూర్చుని ఉండడానికి కారణం వారికి అవగాహనకలేదు. 

బహుశా ఆయన అలసి పోయి ఉంటారు అందికే కళ్ళు, నోరు తెరవలేక పోవచ్చు అనివాళ్ళు ఆలోచించారు. కొంతమంది ఆయనకు ఆకలిగా ఉన్నదని ఆలోచించి కొంచెం రొట్టె ఆయన ముందుపెట్టి ఆయన్ని కదపడం మొదలు పెట్టారు. అయినా ఆయోగి దగ్గర నుండి ఏవిధమయిన ప్రత్యుత్తరంలేదు. 

ఇదంతా వాళ్ళకి ఆశ్ఛర్యంగా ఉంది. ఈయన కూర్చుని ఉన్నారు కనుక మరణించలేదు, ఈయన శరీరం కూడా వెచ్చగా ఉంది అని ఆ పిల్లలు అన్నారు. మరొక గత్యంతం వాళ్ళకి తోచింది ఏమిటంటే ఈయన దెయ్యం అయి ఉండవచ్చు అని. 

భగవాన్ శివుని దగ్గరకు దెయ్యం రాలేదు అని కొంతమంది వాదించారు. ఈయన స్వర్గంనుండి వచ్చిన భగవంతుడే అని తరువాత అనుకున్నారు. ఈ విచారంరాగానే, భగవంతుని దర్శనం కలగడం అదృష్టంగా తలచారు. అందువల్ల ఆయన్ని పూజించాలని నిశ్చయించి నీళ్ళు, పువ్వులు తెచ్చి ఆయన కాళ్ళు కడిగి తలపై పువ్వులు పెట్టి, మరియు కొంచెం రొట్టి, ఉల్లిపాయలు నైవేద్యంగా ఆయన ముందు ఉంచారు. 

అక్కడ కూర్చుని కొంతసేపు భజన చేసారు. వీళ్ళు ఆలస్యంగా ఇంటికి వెళ్ళడంవల్ల పెద్దలకు బహుశ ఆదుర్ధ కలిగించ వచ్చు, తమతల్లి తండ్రులు తమని వెతుకుతూ రావచ్చు అని భజన చేస్తున్న ఆనందంలో ఒక్కసారిగా వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది. 

పైగా దూడలుకూడా తల్లి ఆవుకోసం ఎదురు చుస్తూఉంటాయి. అందువల్ల వెంటనే వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చి, పెద్దలకు ఆయోగిగూర్చి అన్ని విషయాలు వర్ణిస్తారు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 20 🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 5 - part 1 🌻

Shri Ganeshayanmah! O God! You are unconquerable to the foes. O Adwait, Sachhidananda, Karunalaya, relieve this Dasganu of all his fears. I am a fallen and poor sinful person and possess no authority. Thus I am entirely helpless. But great people often help the poor. 

Look, Lord Shankar has applied ash to His body. The smallness of the small does not degrade the Great Ones. So with this understanding, let this Dasganu be at Your feet. A mother fulfils all desires of her child. I am at Your mercy. 

Do whatever you like, but be kind to me as all my aspirations depend on You. While Maharaj stayed at Shegaon, hundreds of people started coming there to receive His Darshan. His reputation spread far and wide; Shri Gajanan, however, wanted to keep away from all people. 

So he used to wander in forests for months without giving anybody any knowledge of His movements. In His wanderings, once, He went to Pimpalgaon. There was a temple of Lord Shiva in the forest near Pimpalgaon; Shri Gajanan went there and sat in Padmasan Mudra. 

There was a small stream near the temple where the cowherd boys came with their cattle. As the cows were drinking water at the stream, the boys went to the temple for the Darshan of Lord Shiva. 

They saw Shri Gajanan sitting there with closed eyes and were surprised. They used to visit that temple often, but had never seen anybody sitting there like Shri Gajanan Maharaj. Some of them sat before Him, but the saint did not open His eyes nor spoke anything. 

The boys could not understand the reason why He sat like that at the temple. They thought that He must be very tired and so must be unable to open His mouth or eyes. 

Some of them thought that He must be very hungry and so they put some bread before Him and started shaking Him. Even then there was no response from the saint. It was all very surprising for them. 

The boys said that He couldn't possibly be dead since He was sitting in an upright position and had a warm body. One of them suggested that He might be a ghost. Some, however, argued to that saying that a ghost couldn't dare come in the proximity of Lord Shiva. 

Then they thought to themselves that He must, therefore, be a God from heaven, and with this idea occurring to them, considered themselves to be fortunate to get the Darshan of God. So they decided to offer Him puja, and brought water and flowers to wash His feet. They put flowers on His head and some bread and onions before Him as Naivedyam. 

They performed Bhajan sitting there for some time. Being engrossed in performing the Bhajan, they forgot about returning home. Soon they remembered that they were late and that it might create anxiety amongst elders and their parents might even come out in search of the cowherds. Moreover the calves also might be lowing for the mother cows. So they returned home immediately and narrated everything about the Saint to the elders.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

𝑻𝒘𝒆𝒍𝒗𝒆 𝑺𝒕𝒂𝒏𝒛𝒂𝒔 𝒇𝒓𝒐𝒎 𝒕𝒉𝒆 𝑩𝒐𝒐𝒌 𝒐𝒇 𝑫𝒛𝒚𝒂𝒏 - 13

 

🌹 𝑻𝒘𝒆𝒍𝒗𝒆 𝑺𝒕𝒂𝒏𝒛𝒂𝒔 𝒇𝒓𝒐𝒎 𝒕𝒉𝒆 𝑩𝒐𝒐𝒌 𝒐𝒇 𝑫𝒛𝒚𝒂𝒏 - 13 🌹
🌴 𝑻𝒉𝒆 𝑷𝒓𝒐𝒑𝒉𝒆𝒕𝒊𝒄 𝑹𝒆𝒄𝒐𝒓𝒅 𝒐𝒇 𝑯𝒖𝒎𝒂𝒏 𝑫𝒆𝒔𝒕𝒊𝒏𝒚 𝒂𝒏𝒅 𝑬𝒗𝒐𝒍𝒖𝒕𝒊𝒐𝒏 🌴

𝑺𝑻𝑨𝑵𝒁𝑨 𝑰𝑽

🌻 𝑻𝒉𝒆 𝑮𝒊𝒇𝒕 𝒐𝒇 𝑴𝒊𝒏𝒅 - 1 🌻
25. 𝑻𝒉𝒆 𝑺𝒐𝒏𝒔 𝒐𝒇 𝑮𝒐𝒅 𝒄𝒂𝒎𝒆. 𝑻𝒉𝒆𝒚 𝒅𝒆𝒔𝒄𝒆𝒏𝒅𝒆𝒅 𝒕𝒐 𝒆𝒙𝒂𝒎𝒊𝒏𝒆 𝒕𝒉𝒆 𝑭𝒊𝒆𝒍𝒅, 𝒘𝒉𝒆𝒓𝒆𝒊𝒏 𝒕𝒉𝒆 𝑮𝒐𝒍𝒅𝒆𝒏 𝑺𝒆𝒆𝒅 𝒘𝒂𝒔 𝒆𝒎𝒆𝒓𝒈𝒊𝒏𝒈. 𝑩𝒖𝒕 𝒕𝒉𝒆 𝑬𝒂𝒓𝒕𝒉 𝒉𝒂𝒅 𝒂𝒍𝒓𝒆𝒂𝒅𝒚 𝒃𝒆𝒆𝒏 𝒑𝒂𝒓𝒕𝒊𝒂𝒍𝒍𝒚 𝒑𝒐𝒊𝒔𝒐𝒏𝒆𝒅 𝒘𝒊𝒕𝒉 𝒕𝒉𝒆 𝒇𝒐𝒓𝒆𝒃𝒐𝒅𝒊𝒏𝒈 𝒇𝒖𝒎𝒆𝒔 𝒐𝒇 𝒆𝒗𝒊𝒍.

𝑷𝒐𝒊𝒔𝒐𝒏 𝒔𝒆𝒆𝒑𝒆𝒅 𝒊𝒏𝒕𝒐 𝒔𝒐𝒊𝒍, 𝒕𝒉𝒓𝒆𝒂𝒕𝒆𝒏𝒊𝒏𝒈 𝒕𝒐 𝒆𝒏𝒗𝒆𝒏𝒐𝒎 𝒕𝒉𝒆 𝒏𝒆𝒘 𝒔𝒉𝒐𝒐𝒕𝒔. 𝑻𝒉𝒆 𝒑𝒍𝒂𝒏𝒕𝒔 𝒓𝒆𝒔𝒊𝒔𝒕𝒆𝒅 𝒂𝒔 𝒕𝒉𝒆𝒚 𝒔𝒕𝒓𝒐𝒗𝒆 𝒕𝒐 𝒅𝒆𝒗𝒆𝒍𝒐𝒑 𝒂𝒄𝒄𝒐𝒓𝒅𝒊𝒏𝒈 𝒕𝒐 𝒕𝒉𝒆 𝑷𝒓𝒐𝒈𝒓𝒂𝒎𝒎𝒆 𝒍𝒂𝒊𝒅 𝒐𝒖𝒕 𝒊𝒏 𝒕𝒉𝒆 𝑪𝒐𝒓𝒆 𝒐𝒇 𝒕𝒉𝒆 𝑺𝒆𝒆𝒅.

𝑻𝒉𝒆 𝑭𝒊𝒆𝒓𝒚 𝒆𝒔𝒔𝒆𝒏𝒄𝒆 𝒐𝒇 𝒕𝒉𝒆 𝑺𝒆𝒆𝒅 𝒘𝒂𝒔 𝒊𝒎𝒑𝒆𝒓𝒗𝒊𝒐𝒖𝒔 𝒕𝒐 𝒕𝒉𝒆 𝒅𝒂𝒓𝒌𝒏𝒆𝒔𝒔. 𝑬𝒗𝒊𝒍 𝒉𝒊𝒅 𝒉𝒊𝒎𝒔𝒆𝒍𝒇, 𝒍𝒚𝒊𝒏𝒈 𝒊𝒏 𝒘𝒂𝒊𝒕 𝒇𝒐𝒓 𝒂𝒏 𝒐𝒑𝒑𝒐𝒓𝒕𝒖𝒏𝒆 𝒎𝒐𝒎𝒆𝒏𝒕 𝒕𝒐 𝒂𝒕𝒕𝒂𝒄𝒌 𝒕𝒉𝒆 𝒔𝒉𝒐𝒐𝒕𝒔 𝒋𝒖𝒔𝒕 𝒂𝒔 𝒕𝒉𝒆𝒚 𝒘𝒆𝒓𝒆 𝒐𝒏 𝒕𝒉𝒆 𝒑𝒐𝒊𝒏𝒕 𝒐𝒇 𝒃𝒓𝒆𝒂𝒌𝒊𝒏𝒈 𝒕𝒉𝒓𝒐𝒖𝒈𝒉... 𝑻𝒉𝒆 𝑺𝒐𝒏𝒔 𝒐𝒇 𝑮𝒐𝒅 𝒅𝒊𝒔𝒄𝒆𝒓𝒏𝒆𝒅 𝒕𝒉𝒆 𝒍𝒖𝒓𝒌𝒊𝒏𝒈 𝒅𝒂𝒏𝒈𝒆𝒓 — 𝒉𝒆𝒏𝒄𝒆𝒇𝒐𝒓𝒕𝒉 𝒆𝒗𝒊𝒍 𝒘𝒐𝒖𝒍𝒅 𝒇𝒂𝒍𝒍 𝒖𝒏𝒅𝒆𝒓 𝒕𝒉𝒆𝒊𝒓 𝒆𝒂𝒈𝒍𝒆-𝒆𝒚𝒆𝒅 𝒄𝒐𝒏𝒕𝒓𝒐𝒍.

26. 𝑻𝒉𝒆 𝑮𝒐𝒅𝒔 𝒂𝒘𝒂𝒊𝒕𝒆𝒅 𝒕𝒉𝒆 𝒂𝒓𝒓𝒊𝒗𝒂𝒍 𝒐𝒇 𝒕𝒉𝒆 𝑺𝒐𝒏𝒔 𝒘𝒉𝒐 𝒉𝒂𝒅 𝒃𝒆𝒆𝒏 𝒔𝒆𝒏𝒕 𝒕𝒐 𝒕𝒉𝒆 𝑬𝒂𝒓𝒕𝒉. 𝑻𝒉𝒆 𝑺𝒐𝒏𝒔 𝒘𝒆𝒓𝒆 𝒅𝒆𝒍𝒂𝒚𝒆𝒅, 𝒉𝒐𝒘𝒆𝒗𝒆𝒓, 𝒂𝒔 𝒕𝒉𝒆𝒚 𝒂𝒕𝒕𝒆𝒎𝒑𝒕𝒆𝒅 𝒕𝒐 𝒆𝒙𝒑𝒐𝒔𝒆 𝒂𝒍𝒍 𝒕𝒉𝒆 𝒔𝒑𝒉𝒆𝒓𝒆𝒔 𝒕𝒉𝒂𝒕 𝒉𝒂𝒅 𝒃𝒆𝒆𝒏 𝒔𝒆𝒊𝒛𝒆𝒅 𝒃𝒚 𝒆𝒗𝒊𝒍.

𝑻𝒉𝒆𝒚 𝒘𝒆𝒓𝒆 𝒕𝒓𝒚𝒊𝒏𝒈 𝒕𝒐 𝒆𝒙𝒑𝒍𝒂𝒊𝒏 𝒄𝒆𝒓𝒕𝒂𝒊𝒏 𝑻𝒓𝒖𝒕𝒉𝒔 𝒕𝒐 𝒕𝒉𝒆 𝒑𝒆𝒐𝒑𝒍𝒆, 𝒃𝒖𝒕 𝒕𝒉𝒆𝒔𝒆 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒅𝒊𝒅 𝒏𝒐𝒕 𝒉𝒂𝒗𝒆 𝒔𝒖𝒇𝒇𝒊𝒄𝒊𝒆𝒏𝒕 𝒊𝒏𝒕𝒆𝒍𝒍𝒊𝒈𝒆𝒏𝒄𝒆 𝒕𝒐 𝒑𝒓𝒐𝒑𝒆𝒓𝒍𝒚 𝒖𝒏𝒅𝒆𝒓𝒔𝒕𝒂𝒏𝒅 𝒕𝒉𝒆 𝑺𝒐𝒏𝒔 𝒐𝒇 𝑮𝒐𝒅.
🌹 🌹 🌹 🌹 🌹

#𝑪𝒉𝒂𝒊𝒕𝒂𝒏𝒚𝒂𝑽𝒊𝒋𝒏𝒂𝒏𝒂𝒎 #𝑷𝒓𝒂𝒔𝒂𝒅𝑩𝒉𝒂𝒓𝒅𝒘𝒂𝒋 #చైతన్యవిజ్ఞానం #𝑩𝒐𝒐𝒌𝒐𝒇𝑫𝒛𝒚𝒂𝒏 #𝑻𝒉𝒆𝒐𝒔𝒐𝒑𝒉𝒚

శ్రీ లలితా సహస్ర నామములు - 59 / Sri Lalita Sahasranamavali - Meaning - 59

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 59 / Sri Lalita Sahasranamavali - Meaning - 59 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 111

542. పుణ్యకీర్తి -
మంచి లేదా పవిత్రమైన యశస్సు కలది.

543. పుణ్యలభ్యా -
సదుద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందబడునది.

544. పుణ్య శ్రవణ కీర్తనా -
పుణ్యప్రథమైన వాక్కులను వినుటకు, కీర్తనము చేయుటకు అవకాశము కలుగజేయునది.

545. పులోమజార్చితా -
పులోముని కూతురైన శచీదేవిచే ఆరాధింపబడింది.

546. బంధమోచనీ -
అన్ని రకాల బంధనాల నుండి విముక్తి కలుగజేయునది.

547. బంధురాలకా -
అందమైన చిక్కనైన ముంగురులు కలది.


🌻. శ్లోకం 112

548. విమర్శరూపిణీ -
జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందుస్వరూపము కలది.

549. విద్యా -
జ్ఞాన రూపిణి.

550. వియదాది జగత్ప్రసూ -
ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును సృజించునది.

551. సర్వవ్యాధి ప్రశమనీ -
అన్ని విధములైన వ్యాధులకు ఉపశమనము కలుగజేయునది.

552. సర్వమృత్యు నివారిణీ -
సకల మృత్యుభయాలను పోగొట్టునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 59 🌹
📚. Prasad Bharadwaj
🌻 Sahasra Namavali - 59 🌻

542 ) Punya keerthi -
She who is famous for good deeds

543 ) Punya labhya -
She who can be attained by good deeds

544 ) Punya sravana keerthana -
She who gives good for those who listen and those who sing about her

545 ) Pulomajarchidha -
She who is worshipped by wife of Indra

546 ) Bandha mochini -
She who releases us from bondage

547 ) Barbharalaka -
She who has forelocks which resembles waves

548 ) Vimarsa roopini -
She who is hidden from view

549 ) Vidhya -
She who is “learning”

550 ) Viyadhadhi jagat prasu -
She who created the earth and the sky

551 ) Sarva vyadhi prasamani -
She who cures all diseases

552 ) Sarva mrutyu nivarini -
She who avoids all types of death

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

11-August-2020. Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 455 / Bhagavad-Gita - 455🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 243 / Sripada Srivallabha Charithamrutham - 243 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 123🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 145 🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 59 / Sri Lalita Sahasranamavali - Meaning - 59 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 62 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 30🌹
8) 🌹. శివగీత - 28 / The Shiva-Gita - 28 🌹
9) 🌹. సౌందర్య లహరి - 70 / Soundarya Lahari - 70 🌹
10) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 2📚
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 369 / Bhagavad-Gita - 369🌹

12) 🌹. శివ మహా పురాణము - 195 🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 71 🌹
14) 🌹.శ్రీ మదగ్ని మహాపురాణము - 66 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 82 🌹
16) 🌹 Twelve Stanzas From The Book Of Dzyan - 13 🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 31🌹
18) 🌹. అద్భుత సృష్టి - 3 🌹
19) 🌹 Seeds Of Consciousness - 143 🌹 
20) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 25🌹
21) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 10 🌹
22)


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 455 / Bhagavad-Gita - 455 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -12 🌴*

12. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్జ్ఞానద్ధ్యానం విశిష్యతే |
ధ్యానాత్కర్మఫల త్యాగాస్త్యాగాచ్చా న్తిరనన్తరమ్ ||

🌷. తాత్పర్యం : 
ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞానసముపార్జనమునందు నియుక్తుడవగుము. అయినప్పటికిని జ్ఞానముకన్నను ధ్యానము మేలైనది. కాని త్యాగము వలన మనుజుడు మనశ్శాంతిని పొందగలుగుటచే సర్వకర్మఫల త్యాగము ఆ ధ్యానము కన్నను మేలితరమైనది.

🌷. భాష్యము :
కడచిన శ్లోకములందు తెలుపబడినట్లు భక్తియుతసేవ రెండువిధములు. 

విధిపూర్వక నియమములు కలిగిన మార్గము ఒకటి కాగా, దేవదేవుని యెడ పూర్ణానురాగము కలిగిన మార్గము వేరొకటి. కృష్ణభక్తిభావన యందలి విధినియమములను వాస్తవముగా పాటింపజాలనివారు జ్ఞానసముపార్జన చేయుట ఉత్తమము. 

ఏలయన అట్టి జ్ఞానసముపార్జన ద్వారా మనుజుడు తన నిజస్థితిని అవగాహన చేసికొనగలడు. అట్టి జ్ఞానమును క్రమముగా ధ్యానముగా వృద్ధినొందగలదు. ధ్యానము ద్వారా మనుజుడు క్రమానుగతిని భగవానుని అవగతము చేసికొనగలుగును. 

ఆత్మయే బ్రహ్మమును ఎరుకను కలిగించు కొన్ని విధానములు కలవు. భక్తియుక్తసేవలో నియుక్తుడగుటకు సమర్థుడు కానివానికి అటువంటి ధ్యానము ఉత్తమమైనది. 

ఒకవేళ మనుజుడు ఆ విధముగా ధ్యానము చేయలేనిచో వేదములందు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకు విధింపబడిన విధ్యుక్తధర్మములను పాటింపవచ్చును. అట్టి వివిధవర్ణముల ధర్మములు భగవద్గీత యందలి అష్టాదశాధ్యాయమున వివరింపబడినవి. 

కాని ఈ అన్నిమార్గములందును మనుజుడు తన కర్మఫలమును త్యాగము చేయవలసియున్నది. అనగా కర్మఫలమును ఏదియోనొక మంచి ప్రయోజనముకై వినియోగింపవలసియుండును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 455 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 12 - Devotional Service - 12 🌴*

12. śreyo hi jñānam abhyāsāj
jñānād dhyānaṁ viśiṣyate
dhyānāt karma-phala-tyāgas
tyāgāc chāntir anantaram

🌷 Translation : 
If you cannot take to this practice, then engage yourself in the cultivation of knowledge. Better than knowledge, however, is meditation, and better than meditation is renunciation of the fruits of action, for by such renunciation one can attain peace of mind.

🌹 Purport :
If you cannot take to this practice, then engage yourself in the cultivation of knowledge. Better than knowledge, however, is meditation, and better than meditation is renunciation of the fruits of action, for by such renunciation one can attain peace of mind.

As mentioned in the previous verses, there are two kinds of devotional service: the way of regulative principles and the way of full attachment in love to the Supreme Personality of Godhead. 

For those who are actually not able to follow the principles of Kṛṣṇa consciousness it is better to cultivate knowledge, because by knowledge one can be able to understand his real position. 

Gradually knowledge will develop to the point of meditation. By meditation one can be able to understand the Supreme Personality of Godhead by a gradual process. 

In the cultivation of knowledge there are processes which make one understand that one himself is the Supreme, and that sort of meditation is preferred if one is unable to engage in devotional service. 

If one is not able to meditate in such a way, then there are prescribed duties, as enjoined in the Vedic literature, for the brāhmaṇas, kṣatriyas, vaiśyas and śūdras, which we shall find in the last chapter of Bhagavad-gītā. 

But in all cases, one should give up the result or fruits of labor; this means to employ the result of karma for some good cause.

In summary, to reach the Supreme Personality of Godhead, the highest goal, there are two processes: one process is by gradual development, and the other process is direct. 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 243 / Sripada Srivallabha Charithamrutham - 243 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

 అధ్యాయం 52, 53 
*🌻. శంకరభట్టు యోగానుభవం 🌻*

నేను మూడు సంవత్సరాలపాటు ప్రతిరోజు అర్ధరాత్రి సమ యంలో శ్రీపాదుల తేజోమయ రూపాన్ని దర్శించాను.

 నేను నా యోగానుభవాలను అన్నింటిని ప్రత్యేకంగా ఒక పుస్తకంలో వ్రాసాను. దాన్ని శ్రీపాదుల ఆఙ్ఞ మేరకు హిమాలయాలలోని యోగులలో ఒకరు తీసుకొని వెళ్ళారు.
🌹 🌹 

అధ్యాయం 53
*🌻. బాపనార్యుల 33వ తరం-చరితామృత గ్రంథం 🌻*

నేను సంస్కృతంలో రచించిన ఈ చరితామృతాన్ని శ్రీపాదుల దివ్య పాదుకల వద్ద చదివి వినిపించాను. శ్రోతలు అయిదుగురూ చాలా సంతోషించారు.

నేను రచించిన ఈ చరితామృతం శ్రీపాదుల మేనమామ వంశం వద్ద కొంతకాలం ఉండి ఆ తరువాత తెలుగులో అనువదింపబడుతుంది. తెలుగు అనువాదం పూర్తి కాగానే సంస్కృతప్రతి అదృశ్యం అవుతుంది. అది శ్రీపాదుల జన్మ స్థలం కింద కొన్ని నిలువు లోతులలో ఉంటుంది. దాన్ని సిద్ధపురుషులు చదువుతారు. 

బాపనార్యుల 33వ తరంలో ఈ తెలుగు ప్రతి వెలుగులోకి వస్తుంది. అలా దీన్ని వెలుగులోకి తెచ్చే వ్యక్తి తెలుగు మూలప్రతిని విజయ వాటికలోని కృష్ణా నదిలో నిమజ్జనం చేయాలి. 

శ్రీపాదులు ఎవరిని ఈ పనికై నియమిస్తారో ఆ అదృష్టవంతుడు శ్రీపాదుల జన్మస్థానంలో మహాసంస్థానం ఏర్పడిన చోట తెలుగు చరితామృతాన్ని పారాయణ చేసి శ్రీచరణాలకు దీనిని సమర్పిం చాలి. 

పారాయణ మధ్యలో ఆ వ్యక్తికి గాణ్గాపురం నుండి అయా చితంగా ప్రసాదం లభిస్తే ఆ వ్యక్తి తప్పక బాపనార్యుల 33వ తరానికి చెందిన వాడే అని రూఢి అవుతుంది. ఇది తేజోమయరూపంలో శ్రీపాదులు చెప్పిన దివ్యవచనం.

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 

శ్రీపాదశ్రీవల్లభులకు జయము జయము శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము

సమాప్తం 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 243 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 27
*🌻 Sripada’s incomprehensible leelas - 2 🌻*

 We were given food in the evening also. We were ordered to rest there only and keep a watch on the cattle present there. Later he went away with his servants. On that night we remembered Sripada’s name and His leelas.  

When we got up, we found that there were no cows. The farmers around that area asked us, ‘For how much price did you buy this land?’ We told them what all happened in the evening on the day before.  

They did not believe us and considered us mad people. It was very difficult to comprehend which was correct and which was not. Meanwhile, a new person came there. He asked us, ‘When was Sri Vasavee Kanyaka born, on Vysakha Suddha Dasami or Saptami?  

Sri Dharma Gupta said that Sri Vasavee Kanyaka was born on Dasami only, Dasami was a ‘Poorna Thithi’ and it was Friday. After hearing this answer, he questioned ‘Are you going to that mad fellow sitting in Kurungadda without any work?’ His behavior was objectionable to us. 

Sri Dharma Gupta said, ‘Though that unknown person talked in an objectionable manner, he reminded us our duty. We should immediately go to Kurungadda.’ We immediately started for Kurungadda in a boat. There was no money with me or with Sri Dharma Gupta to give to the boat person.  

He said, ‘For now, I am pardoning you. It was your responsibility to tell me before boarding the boat whether  you had money or not.’ The boat man’s looks fell on Sri Dharma Gupta’s hand. He took away the ring on his hand. He did not keep the ring but threw it into Krishna.  

We reached Kurungadda. Sripada was in ‘Yoga Nishta’ after taking bath  in Krishna. After sometime, He opened eyes. Seeing us, He smiled. He asked us whether we built a shed required for doing darbar there.  

We narrated all the things that happened on the day before. He said,  ‘My Dear! No one can come to me without My will. Nobody will have devotion in Me without My will. I can make any rich man into a pauper and  a pauper into a rich man in a moment. 

 I can make a mad fellow into a healthy one and a healthy one into a mad fellow. All powers and Siddhis are in my hand. The farmer you saw yesterday was Virupaksha, the brother of Sri Vasavi Kanyaka.  

The cow wealth you saw was the same Sri Kusuma Shresti had at that time. The Mylars and Veera Mushtis you saw were of those days only. The  one, who asked you in an objectionable language whether you were going to Kurungadda, was Myself.  

The one who came as boat man was Myself. The one who took the ring from Dharma Gupta and threw it into Krishna was Myself. My darbar was built by Mylars, Veera Mushtis, Veerabhadra and his associates.

It was merely your good fortune that you also took part in that great good work. For Me, all the ‘times’ (past, present and future) are the same. All places are the same. I can recreate any incident of any times in any place; I can also create new incidents  with some changes.  

My form of Sripada Srivallabha will change into Sri Padmavathi Venkateswara at the end of Kaliyugam. People who know that everything is in My hands, are blessed.’  

End of Chapter 27
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 123 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻 శ్రీ కృష్ణుని లీలలు మనకు పాఠాలు - 2 🌻*

శ్రీకృష్ణుడు విద్యాభ్యాసమైన వెనుక గురువు (సాందీపని) కోరిన ప్రకారము పంచజనుని గర్భమున నున్న బాలకుని బ్రదికించి అతి భక్తితో గురుదక్షిణగా సమర్పించెను.  

గురువునకలవిగాని పని తాను భగవంతుడై చేసి పెట్టినను, భక్తితో సమర్పించి గర్వము పొందరాదని లోకమునకు నేర్పెను. తాను గురువును మించిన వాడని గురువు, లోకులు మెచ్చవలయును గాని తాను భావింపరాదని నేర్పెను.  

 పంచేంద్రియములకు గోచరించు నట్టి వస్తువులను బట్టి సుఖేచ్ఛ పుట్టును. సుఖ దుఃఖములు పుట్టక తప్పవు. ఇంద్రియముల రూపమునను , ఇంద్రియార్థముల రూపమునను అస్తిత్వము చెందునది నారాయణుడే అని జ్ఞప్తియున్న వారికి సుఖ దుఃఖములుండవు. సుఖములు అప్రయత్నముగా సిద్ధించును.
*✍🏼. మాస్టర్ ఇ.కె.*🌻 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 144 🌹*
*🌴 Rejecting and Accepting - 1 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 Breaking through Walls 🌻*

Each one of us is inseparably connected with the universal consciousness. Through self-created illusions, however, we build separating walls. We have separated ourselves by our own definitions and demarcations. 

We circumscribe ourselves from other people in order to protect ourselves and be different from them. The barriers become particularly solid when we feel superior to others by way of power, money or intellect. 

Thus we erect more and more walls, conditioning ourselves and cutting us off from the stream of life, and we suffer from feelings of suffocation. The walls arise out of ignorance, and it is virtually impossible to penetrate them. 

They also form a kind of protection, like the shell offers protection to the chick until it has grown enough and doesn’t need it any longer. Our walls have to be broken by ourselves, it cannot be done by anyone else.

Through our understanding we might have a longing for unity and synthesis, but when we try to express unity in our life, we realize clear blockages in ourselves: 

We prefer cooperating with people whom we like and who have similar views like we have. With others whose viewpoints we don’t share we have problems. We quickly assume that they are not so well-disposed towards us and might work against us. 

We develop an image of them nourished by fears, and from this conflicts develop. Krishna says: “Don’t judge the person by deciding he is bad. There are no bad persons, there are only persons with a bad behaviour.” 

The other is just a human like we are. We therefore should accept him and see how we get along with his nature. This wisdom arises in us, when we see the brother in the other and don’t reject him.

The more we include other opinions into our view the more we move towards the vision of unity. When the mental barriers fall, our soul gets the feeling of expanse and fresh air.

🌻 🌻 🌻 🌻 🌻 
Sources: Master K.P. Kumar: Sarasvathi. The Word / notes from seminars.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 59 / Sri Lalita Sahasranamavali - Meaning - 59 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 111

542. పుణ్యకీర్తి - 
మంచి లేదా పవిత్రమైన యశస్సు కలది.

543. పుణ్యలభ్యా - 
సదుద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందబడునది.

544. పుణ్య శ్రవణ కీర్తనా - 
పుణ్యప్రథమైన వాక్కులను వినుటకు, కీర్తనము చేయుటకు అవకాశము కలుగజేయునది.

545. పులోమజార్చితా - 
పులోముని కూతురైన శచీదేవిచే ఆరాధింపబడింది.

546. బంధమోచనీ - 
అన్ని రకాల బంధనాల నుండి విముక్తి కలుగజేయునది.

547. బంధురాలకా -
 అందమైన చిక్కనైన ముంగురులు కలది.

🌻. శ్లోకం 112

548. విమర్శరూపిణీ - 
జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందుస్వరూపము కలది.

549. విద్యా - 
జ్ఞాన రూపిణి.

550. వియదాది జగత్ప్రసూ - 
ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును సృజించునది.

551. సర్వవ్యాధి ప్రశమనీ - 
అన్ని విధములైన వ్యాధులకు ఉపశమనము కలుగజేయునది.

552. సర్వమృత్యు నివారిణీ - 
సకల మృత్యుభయాలను పోగొట్టునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 59 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 59 🌻*

542 ) Punya keerthi -   
She who is famous for good deeds

543 ) Punya labhya -  
 She who can be attained by good deeds

544 ) Punya sravana keerthana -   
She who gives good for those who listen and those who sing about her

545 ) Pulomajarchidha -   
She who is worshipped by wife of Indra

546 ) Bandha mochini -   
She who releases us from bondage

547 ) Barbharalaka -   
She who has forelocks which resembles waves

548 ) Vimarsa roopini -  
 She who is hidden from view

549 ) Vidhya -   
She who is “learning”

550 ) Viyadhadhi jagat prasu -   
She who created the earth and the sky

551 ) Sarva vyadhi prasamani -   
She who cures all diseases

552 ) Sarva mrutyu nivarini -   
She who avoids all types of death

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 62 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 36

*🌻. 36. అవ్యావృత భజనాత్‌ ॥ - 2 🌻*

చైతన్యప్రభు మతం ప్రకారం శ్రీకృష్ణ సంకీర్తనం వలన సర్వోత్కృష్టమైన ఆత్మానందం కలుగుతుంది. ఒక్కసారి ఆత్మానందానుభూతి కలిగితే 

(1) అద్దం పై ధూళి తుడిచినట్లు చిత్త మాలిన్యం తుడిచి వేయబడుతుంది. 

(2) ప్రాపంచిక విషయ భోగవాంఛలు చల్లారిపోతాయి. 

(3) శుభప్రదమైన భక్తిపుష్ప వికసన జరిగి భగవదనుగ్రహం పొందుతాడు. 

(4) భగవంతుడిని తెలుసుకొని భాగవతుడవుతాడు. 

(5) ఆనంద సాగరంలో తేలియాడుతాడు. 

(6) భక్తుడు పలికె ప్రతి పదం అమృతాన్ని పంచి పెడుతుంది. 

(7) సకల జీవాత్మల శుద్ధి జరుగుతుంది. 

(8) అది అద్వితీయ, నిరతిశయ ఆనందమే. 

(9) సాధనయందు విజయాన్ని 
చెకూరుస్తుంది. ఫలితంగా భక్తి ప్రతిష్టతమవుతుంది..  
హృదయపూర్వక సంకిర్తనలో మైమరచిన వాడికి అలసట ఉండదు.  
 
మానసికాన్ని దాటే వరకే ఆవృత భజన అవసరమవుతుంది. భక్తి సాధన ఏ ఒక్కటైనా సరె దానికది ఉత్తమ ఫలితాన్నిస్తుంది. అయితే చిత్త శుద్ధితో ప్రయత్నం చేస్తేనే అది ఫలిస్తుంది. 
 
ఆ వృత్తిః అసకృ దుపదెశాత్‌ 
- బ్రహ్మ సూత్రం 
 
అనగా సాధనను పదే పదే చేయమని బోధిస్తుంది. దీనినె భగవద్దీత అభ్యాస యోగం అంటుంది. పదె పదే చెసి అలవాటు చేసుకొని, సహజం చెసుకొంటే అదే అభ్యాస యోగమవుతుంది. అనగా భక్తిని శీలించడం అని కూడా అంటారు. 
 
శ్రీమత్‌ భాగవతాన్ని పరీక్షిన్మహారాజు శ్రీశుకుని వద్ద నిరంతర శ్రవణం చేయడం వలన ముక్తుడయ్యాడు. నిరంతర భగవన్నామ సంకిర్తన వలన తుంబురుడు, తెంపులిని నారాయణ నామ స్మరణ వలన నారదుడు ముక్తులయ్యారు.. విడువకుండా విష్ణుపాద సేవనం వలన లక్ష్మిదేవి ఆయనతో సాయుజ్యం పొందింది..  
 
పృథు చక్రవర్తి అర్చన చెస్తూ చేస్తూ శివైక్కత పొందాడు. నిరంతర వందనం వలన ఆక్రూరుడు, దాస్య భక్తివలన హనుమంతుడు, సఖ్యంచేత అర్జునుడు, ఉద్ధవుడు మోక్షమందిరి. వీరందరూ ఏదో ఒక సాధన నిర్విరామంగా జరపడం వలన సహజ భక్తులైరి. తుదకు ముక్తి పొందారు. 
 
మనమైతే ఏదో ఒక సాధన చెసి తరించడం కష్టం గనుక అన్ని మార్తాలను ప్రయత్నం చెస్తూ కొన్నింటిని ఆవృతం చేసుకుంటే మంచిది. కించిత్‌ విరామం ఇస్తే అథోగతేనని ఈ సూత్రం హెచ్చరిస్తున్నది. 
 
న్వాధ్యాయా ద్యోగమాసీత యోగా త్స్వాధ్యాయమావ సేత్‌ 
స్వాధ్యాయ యోగ సంపత్వా పరమాత్మ ప్రకాశతే | 
-విష్టు పురాణం 
 
తాః స్వాధ్యాయం, పవిత్ర గ్రంథాలను పఠించడం, యోగం, సమాధానం, ధ్యానం, మయొదలగునవి నిరంతరం చెస్తూ రాగా, పరమాత్మ దర్శనమౌతుంది.. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 31 🌹* 
✍️ Sri GS Swami ji 
📚. Prasad Bharadwaj

Every morning upon waking up, a white lotus with a thousand petals should be visualized upon the head. Sadguru should be visualized as being seated inside the lotus. 

While doing this, the name of Guru should be chanted. In the mind’s eye, Guru’s feet, eyes, and hands showing the gestures of protection and beneficence, and his peaceful countenance should be visualized. 

It should be believed that Guru encompasses everything, as if he manifests as the entire Universe. When you see a cow, all the deities should manifest in it.

Similarly in Guru all divinities should be visible. Every single moment this thought should be preserved. 

Guru’s feet should be washed with pure water and it should be felt as if that water is flowing down all over you, cleansing you from top to bottom, inside and out, of all impurities. Visualize it as a flow of nectar that is clearing away all the dirt. This is a yoga procedure. 

When this is done, in that very instant along with all the impurities, the Rajo Guna and Tamo Guna will also get washed away from the spiritual seeker. Both the gross body and the subtle body get purified of all sins.

Like clear crystal, the spiritual aspirant will feel absolutely clean. Every morning this exercise should be performed. This is an excellent process. We have already said that the Guru’s feet, eyes, and hands should be visualized.

The reason for doing that is given in the following verse:
 
Verse: Teerthaani … 
In the right foot of Guru all sacred pilgrimage centers and holy rivers are contained. 

His face is itself the Veda. When his face is visualized, the fruit of having chanted all the Vedas is obtained. His feet and hands are permeated with the nectar of immortality.

By the mere glance of Guru and the touch of his hands, that nectar of Yoga flows into and is absorbed by the devotee. This should be remembered again and again.
 
Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 28 / The Siva-Gita - 28 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

చతుర్దా ధ్యాయము
*🌻. శివ ప్రాదుర్భావము - 4 🌻*

ఘంటికా ఘర్ఘ రీశబ్డై: - పూర యంతం దిశో దశ,
తత్రా సీనం మహాదేవం - శుద్ధ స్పటిక విగ్రహమ్ 27
కోటి సూర్య ప్రతీకాశం - కోటి శీతాం శుశీ తలమ్,
వ్యాఘ్రచర్మాం బరధరం - నాగ యజ్ఞో పవీతినమ్ 28
సర్వాలంకార సంయుక్తం - విద్యుత్సింగ జటాధరమ్,
నీల కంటం వ్యాఘ్ర చర్మో -త్తరీయం చంద్ర శేఖరమ్ 29
నాన విదాయు దోద్భాసి - దశ బాహుం త్రిలోచనమ్,
యువానం పురుష శ్రేష్టం - సచిత్ చదానంద విగ్రహమ్ 30

మరియు నా నందీశ్వరు నదిరోహించిన స్వచ్ఛమగు స్పటిక మణిని బోలు శుబ్రమగు వర్ణము కలిగి కోటి సూర్య ప్రకాశము కలవాడు కోటి చంద్రుల బోలు శీతలత్వము కలవాడు, పులి చర్మమును ధరించిన వాడు నాగ యజ్ఞోపవీతము దాల్చిన వాడు, సమస్తాలంకార యుతుండును, విద్యుద్వల్లిం బోలు ప్రకాశ యుతుడు, గరళ కంటుడు, ఉడు రాజశేఖరుడు ను దశ హస్తములతో సమస్త యుధంబులను ధరించిన వాడును, ముక్కంటియు యౌవ్వన వంతుడు, సచ్చిదానంద స్వరూపుడు, పురుష శ్రేష్టుడు నగు పరమ శివుని సందర్శించెను.

తత్రైవ చ సుఖాసీనాం - పూర్ణ చంద్ర నిభాననామ్,
నీలేందీ వరదా మాభా - ముద్యమ్న రకత ప్రభామ్ 31
ముక్ ఆత భరణ సంయుక్తం - రాత్రిం తారాచిత మివ,
వింధ్యక్షి తిధరో త్తుంగా - కుఛ భార భరాలసామ్ 32
సద సత్సంశ యావిష్ట - మధ్యదే శాంత రాం వరామ్,
దివ్యాభరణ సంయుక్తాం - దివ్య గందానులే పనామ్ 33
దివ్య మాల్యాం బరధరాం - నీలేంది వర లోచనామ్,
అల కోద్భా సివ దనాం - తాంబూల గ్రాసవో భితామ్ 34

శివా లింగన సంజాత - సులకోద్భా సివిగ్రహా మ్,
సచ చిదానంద రూపాడ్యాం- జగన్మాత రమంబికామ్ 35
సౌందర్య సార సందోహాం- దదర్శ రఘు నందనః,
స్వస్వవాహన సంబద్దా - న్నానా యుధ లసత్కరాన్ 36
బృహద్రధం తరా దీని - సామాని పరి గాయతః , 

మరియు నక్కడే ఆనందముతో సుఖాసీనురాలై పూర్ణ చంద్రుని వలె ముఖ బింబము గల నీలెంది పరమాలిక పగది గల , మరకత మణి కాంతిని విరజిమ్మునది, ఆణి ముత్యాల సరసములను దాల్చినది యగుటచే కాంతియుత నక్షత్ర యుక్త మై విరాజిల్లు రేయివలె నొప్పుచున్నది. 

 శుంభ స్తనములుకలది , సన్నని నడుము గలది యు, అమూల్య రత్నాలంకారముతో నొప్పునదియు , సుగంధ పూమాలికను దివ్య వస్త్రములను దాల్చినదియు నల్లవ పువ్వులవలె నున్న గన్నులు కలది, విడెముతో కూడినదియు, పతిదేవుని యాలింగనముతో పులకాంకిత దేహము గలదియు సచ్చిదానంద శరీరము గలదియు నిఖిల జగన్మాత యగు పార్వతిని గాంచెను.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 28 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 04 : 
*🌻 Shiva Praadurbhaavam - 4 🌻*

Seated on the divine bull Nandi, was seen a lord as pure as crystal in complexion, who was blazing with a divine aura equal to billions of suns, whose brilliance was as soothing as light from billions of moons, 

who had tiger skin on his body as garments, who had a snake wrapped around his body as the sacred thread, who was decorated with many divine ornaments, 

who was blazing like lightening, who had moon on his crown, who had ten hands wielding various weapons, who looked very youthful. Rama beheld that blue necked, supreme Purusha the one and only Lord Paramashiva.

Also Rama beheld a goddess seated blissfully in Sukhasana posture having a beautiful face as like as full moon, 

who was shining with a hue of bluish colored diamonds, who was decorated with pearls, and variety of gems, who had firm uprised breasts comparable to Vindhya mountains, who had a slender waist, 

who wore divine garments and nicely smelling flower garlands, who had eyes resembling flowers, who was blushing due to the embrace of her consort. 

Rama sighted the mother of all the goddess Parvati.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 20 / Sri Gajanan Maharaj Life History - 20 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. 5వ అధ్యాయము - 1 🌻*

శ్రీగణేశాయనమః ! ఓభగవంతుడా నీశతృవులకు నీవు అజేయుడవు. ఓ అద్వైతా, సచ్చిదానందా, కారుణ్యాలయా ఈ దాస్గణుని అన్ని భయాలనుండి విముక్తుడిని చేయండి. నేను పతనమయినవాడిని, బీదవాడిని, పాపిని మరియు ఏవిధమయిన అధికారం లేనివాడిని. అందుచేత పూర్తిగా దిక్కులేని వాడను. కానీ మహానుభావులు తరచు పేదలకు సహాయంచేస్తారు. శివుడు తన శరీరానికి బూడిద రాసుకున్నాడు. 

మహానుభావునులను చిన్నవారి చిన్నతనం కించపరచదు. కనుక ఈ గణుదాసును ఈవిధమయిన అవగాహనతో మీపాదాల దగ్గర ఉండనీయండి. తల్లి తనపిల్లల కోరికలన్నీ పూర్తిచేస్తుంది. నేను మీకృప కోసం వేచిఉన్నాను. మీఇష్టప్రకారం చెయ్యండి, కానీ నాతో ఉదారతతోఉండండి. నాఆశలు మీమీదే ఆధారపడి ఉన్నాయి. శ్రీమహారాజు దర్శనానికి అనేక వందలమంది షేగాం రావడం ప్రారంభం అయింది. 

ఆయన ప్రతిభ దూరదూరాలకు వ్యాపించింది, కానీ శ్రీగజానన్ వీటినుంచి దూరంగా ఉండదలచారు. అందువల్ల ఎవరికి ఏవిధమయిన జ్ఞానంలేకుండా నెలలతరబడి అడవులలో తిరిగేవారు. అలాతిరుగుతూ ఒకసారి పింపళాగాంకి వెళ్ళారు. పింపళాగాం దగ్గర అడవిలో భగవాన్ శివుని ఆలయంఉంది. 

శ్రీగజానన్ అక్కడికి వెళ్ళి పద్మాసనముద్రలో కూర్చున్నారు. ఆ ఆలయందగ్గర ఒకచిన్న నీటి ప్రవాహం ఉంది. అక్కడికి కొంతమంది గొల్లపిల్లలు తమ పశువులను తీసుకువచ్చారు. ఆవులు ఆప్రవాహంలో నీళ్ళు త్రాగుతూఉండగా పిల్ల వాళ్ళు భగవాన్ శివుని దర్శనానికి ఆలయానికి వెళ్ళారు. 

అక్కడ కళ్ళు మూసుకుని కూర్చున్న తీగజానన్ ను వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. వీళ్ళు ఆ ఆలయానికి వస్తూ ఉండేవారు కానీ ఎప్పుడూ ఎవరూ శ్రీగజానన్ లా అక్కడ కూర్చుని ఉండగా చూడలేదు. ఆయన ముందు కొంతమంది కూర్చున్నారు, కానీ ఆ యోగి కళ్ళు తెరవలేదు, ఏమీమాట్లాడలేదు. ఆ విధంగా ఆయన కూర్చుని ఉండడానికి కారణం వారికి అవగాహనకలేదు. 

బహుశా ఆయన అలసి పోయి ఉంటారు అందికే కళ్ళు, నోరు తెరవలేక పోవచ్చు అనివాళ్ళు ఆలోచించారు. కొంతమంది ఆయనకు ఆకలిగా ఉన్నదని ఆలోచించి కొంచెం రొట్టె ఆయన ముందుపెట్టి ఆయన్ని కదపడం మొదలు పెట్టారు. అయినా ఆయోగి దగ్గర నుండి ఏవిధమయిన ప్రత్యుత్తరంలేదు. 

ఇదంతా వాళ్ళకి ఆశ్ఛర్యంగా ఉంది. ఈయన కూర్చుని ఉన్నారు కనుక మరణించలేదు, ఈయన శరీరం కూడా వెచ్చగా ఉంది అని ఆ పిల్లలు అన్నారు. మరొక గత్యంతం వాళ్ళకి తోచింది ఏమిటంటే ఈయన దెయ్యం అయి ఉండవచ్చు అని. 

భగవాన్ శివుని దగ్గరకు దెయ్యం రాలేదు అని కొంతమంది వాదించారు. ఈయన స్వర్గంనుండి వచ్చిన భగవంతుడే అని తరువాత అనుకున్నారు. ఈ విచారంరాగానే, భగవంతుని దర్శనం కలగడం అదృష్టంగా తలచారు. అందువల్ల ఆయన్ని పూజించాలని నిశ్చయించి నీళ్ళు, పువ్వులు తెచ్చి ఆయన కాళ్ళు కడిగి తలపై పువ్వులు పెట్టి, మరియు కొంచెం రొట్టి, ఉల్లిపాయలు నైవేద్యంగా ఆయన ముందు ఉంచారు. 

అక్కడ కూర్చుని కొంతసేపు భజన చేసారు. వీళ్ళు ఆలస్యంగా ఇంటికి వెళ్ళడంవల్ల పెద్దలకు బహుశ ఆదుర్ధ కలిగించ వచ్చు, తమతల్లి తండ్రులు తమని వెతుకుతూ రావచ్చు అని భజన చేస్తున్న ఆనందంలో ఒక్కసారిగా వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది. 

పైగా దూడలుకూడా తల్లి ఆవుకోసం ఎదురు చుస్తూఉంటాయి. అందువల్ల వెంటనే వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చి, పెద్దలకు ఆయోగిగూర్చి అన్ని విషయాలు వర్ణిస్తారు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 20 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 5 - part 1 🌻*

Shri Ganeshayanmah! O God! You are unconquerable to the foes. O Adwait, Sachhidananda, Karunalaya, relieve this Dasganu of all his fears. I am a fallen and poor sinful person and possess no authority. Thus I am entirely helpless. But great people often help the poor. 

Look, Lord Shankar has applied ash to His body. The smallness of the small does not degrade the Great Ones. So with this understanding, let this Dasganu be at Your feet. A mother fulfils all desires of her child. I am at Your mercy. 

Do whatever you like, but be kind to me as all my aspirations depend on You. While Maharaj stayed at Shegaon, hundreds of people started coming there to receive His Darshan. His reputation spread far and wide; Shri Gajanan, however, wanted to keep away from all people. 

So he used to wander in forests for months without giving anybody any knowledge of His movements. In His wanderings, once, He went to Pimpalgaon. There was a temple of Lord Shiva in the forest near Pimpalgaon; Shri Gajanan went there and sat in Padmasan Mudra. 

There was a small stream near the temple where the cowherd boys came with their cattle. As the cows were drinking water at the stream, the boys went to the temple for the Darshan of Lord Shiva. 

They saw Shri Gajanan sitting there with closed eyes and were surprised. They used to visit that temple often, but had never seen anybody sitting there like Shri Gajanan Maharaj. Some of them sat before Him, but the saint did not open His eyes nor spoke anything. 

The boys could not understand the reason why He sat like that at the temple. They thought that He must be very tired and so must be unable to open His mouth or eyes. 

Some of them thought that He must be very hungry and so they put some bread before Him and started shaking Him. Even then there was no response from the saint. It was all very surprising for them. 

The boys said that He couldn't possibly be dead since He was sitting in an upright position and had a warm body. One of them suggested that He might be a ghost. Some, however, argued to that saying that a ghost couldn't dare come in the proximity of Lord Shiva. 

Then they thought to themselves that He must, therefore, be a God from heaven, and with this idea occurring to them, considered themselves to be fortunate to get the Darshan of God. So they decided to offer Him puja, and brought water and flowers to wash His feet. They put flowers on His head and some bread and onions before Him as Naivedyam. 

They performed Bhajan sitting there for some time. Being engrossed in performing the Bhajan, they forgot about returning home. Soon they remembered that they were late and that it might create anxiety amongst elders and their parents might even come out in search of the cowherds. Moreover the calves also might be lowing for the mother cows. So they returned home immediately and narrated everything about the Saint to the elders.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹2. మేలుకొలుపు - కర్తవ్యము నందు నిలబడు 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 2 📚*

ఎట్టి పరిస్థితుల యందును క్లైబ్యమును పొందవలదని, హృదయ దౌర్బల్యము వలదని, అది క్షుద్రమైనదని, కర్తవ్యము
నందు నిలబడుమని, పారిపోవలదని, భగవానుడు మరియొక శాసనము చేయుచున్నాడు.

 *క్లైబ్యం మాస్మగమó పార్థ నైతత్త్వ య్యుపపద్యతే |* 
 *క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిషస పరంతప || 3* 

నరుడు సహజముగ తేజోవంతుడు. కావున క్రీనీడలు లేక చీకట్లు క్రమ్ముటకు అవకాశములేదు. ఎంత నల్లమబ్బు
అయినను తాత్కాలికమే కాని సూర్యునివలె శాశ్వతము కాదు.
తాత్కాలికమగు సంఘటనల యందు తన సహజత్వమును కోల్పోవుట అజ్ఞానము. 

అర్జునుడు సహజముగ తేజోవంతుడు. పరాక్రమవంతుడు. పరంతపుడు అనగా శత్రువులను తపింప చేయువాడు మరియు పరమును గూర్చి తపించువాడు. అనగా దైవమును గూర్చి తపించువాడు. అట్టి తపము కారణముగ లోపల, బయట శత్రువులు జయింపబడుదురు. దైవము అనగా విశ్వ వ్యాప్తమైన తేజము.

 దానిని గూర్చి తపించువానికి ధైర్యమెట్లు కలుగగలదు. దాని నుండి విడివడుట, తాత్కాలిక సన్నివేశమునకు ముడిబడుట కారణముగ అధైర్యము, మనో దుర్బలత్వము కలుగును. దైవమును ఆశ్రయించుటయే అట్టి సమయమున పరిష్కారము.

''పరంతపుడవైన ఓ నరుడ! కర్తవ్యమున మేల్కొనుము. క్షుద్రమైన హృదయ దౌర్బల్యమును వీడుము. అధైర్యమును పొందకుము. ఇది నీకు తగదు'' అని భగవానుడు శాసించు చున్నాడు.

గమనిక : ఈ శ్లోకమున భగవానుడు నరుని 'పరంతపుడని' సంబోధించుటలో గంభీరార్థము కలదు.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 70 / Soundarya Lahari - 70 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

70 వ శ్లోకము

*🌴. తలపెట్టిన కార్యములలో జయం పొందుటకు, దైవము పట్ల చేసిన దోషముల నివారణ 🌴*

శ్లో: 70. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం 
చతుర్భి స్సౌన్దర్యం సరసిజభావః స్సౌతి వదనైఃl 
నఖేభ్యస్సన్త్రస్యన్ ప్రథమమథనా దంధకరిపో 
శ్చతుర్ణాం శీర్షాణాం సమమభయ హస్తార్పణధియా l 
 
🌷. తాత్పర్యం : 
అమ్మా! బ్రహ్మ అంధకాసురినికి విరోధి అయి వానిని వధించిన పరమ శివుడు, తన అయిదవ తలను తన గోళ్ళతో పెరికి వేయుట వలన మిక్కిలి భయపడిన వాడయి తన నాలుగు తలలతో తనకు అభయ హస్తమును ఇమ్మని తామర తూడుల వలె మృదువయిన నీ నాలుగు చేతులనూ ప్రార్ధించు చున్నాడు కదా! 

🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పులిహోర, తాంబూలము నివేదించినచో కోరిన కార్యములలో విజయం, దైవము పట్ల చేసిన దోషముల నివారణ జరుగును అని చెప్పబడింది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Soundarya Lahari - 70 🌹*
📚 Prasad Bharadwaj 

SLOKA - 70

*🌴 Compensation for Mistakes done to God Shiva, victory in life 🌴*

70. Mrinali-mridhvinam thava bhuja-lathanam chatasrinam Chaturbhih saundaryam Sarasija-bhavah stauthi vadanaih; Nakhebhyah samtrasyan prathama-madhanadandhaka-ripo Chaturnam sirshanam samam abhaya-hasth'arapana-dhiya. 
 
🌻 Translation : 
Brahma, the god born out of lotus, afraid of the nails of Shiva ,who killed the asura called andhaka, which has clipped of one of his heads, praises with his four faces, your four pretty, tender hands, resembling the lotus flower stalk, so that he can ask for protection for his remaining four heads, by use of your four merciful hands at the same time.

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : 
If one chants this verse 1000 times a day for 45 days, offering thambulam and yellow rice (Haridhraannam) as prasadam, it is believed that they will be achieve success in all efforts and victory in all walks of life and Compensation for Mistakes done to God Shiva.

🌻 BENEFICIAL RESULTS: 
Success in particular endeavour for which meditation is intended, freedom from Shiva-apachaaraa, relief from fear. 
 
🌻 Literal Results:  
Great beauty, clarity and wisdom, ideal for instrumentalists, sculptors and dancers.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 369 / Bhagavad-Gita - 369 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 18 🌴

18. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్ధన |
భూయ: కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేమృతమ్ ||

🌷. తాత్పర్యం :
ఓ జనార్ధనా! నీ యోగవిభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపుము. ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా నీ వచనామృతమును నేను ఆస్వాదించగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినను తనివితీరుట లేదు.

🌷. భాష్యము :
శౌనకుని అధ్యక్షతనగల నైమిశారణ్యఋషులు సైతము సూతగోస్వామితో ఈ విధముగనే పలికియుండిరి.

వయం తు న వితృప్యామ ఉత్తమశ్లోకవిక్రమే |
యచ్చృణ్వాతామ్ రసజ్ఞానామ్ స్వాదు స్వాదు పదేపదే ||

“ఉత్తమశ్లోకుడైన శ్రీకృష్ణుని దివ్యలీలలను నిరంతరము శ్రవణము చేసినను ఎవ్వరును తనివినొందలేరు. 

శ్రీకృష్ణునితో దివ్యసంబంధమును కలిగినవారు అతని లీలావర్ణనములను అడుగడున అస్వాదింతురు” (శ్రీమద్భాగవతము 1.1.19). అనగా అర్జునుడు శ్రీకృష్ణుని గూర్చియు, ముఖ్యముగా అతడు ఏ విధముగా సర్వవ్యాపియై యున్నాడన్న విషయమును గూర్చియు శ్రవణము చేయుటలో అనురక్తుడై యున్నాడు.

కృష్ణునకు సంబంధించిన ఏ వర్ణనమైనను లేదా విషయమైనను వాస్తవమునకు అమృతముతో సమానము. అటువంటి అమృతమును ఎవ్వరైనను అనుభవపూర్వకముగా ఆస్వాదింపవచ్చును. 

ఆధునిక కథలు, నవలలు, చరిత్రల వంటి గ్రామ్యకథలు శ్రీకృష్ణుని దివ్యలీలకు భిన్నములై యుండును. మనుజుడు వారి యెడ కొంతకాలమునకు విసుగు చెందవచ్చునేమో గాని కృష్ణుని గూర్చి వినుట యందు విసుగు చెందడు. కనుకనే విశ్వచరిత్ర దేవదేవుని వివిధావతారములతో నిండియున్నది. 

భగవానుని అట్టి వివిధ అవతారముల యందలి లీలలను వర్ణించు చరిత్రలే పురాణములు. ఈ కారణముననే ఎన్నిమార్లు పఠించినను వాని యందలి పఠనాంశములు నిత్యనూతనముగా నుండును. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 369 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 18 🌴

18. vistareṇātmano yogaṁ
vibhūtiṁ ca janārdana
bhūyaḥ kathaya tṛptir hi
śṛṇvato nāsti me ’mṛtam

🌷 Translation : 
O Janārdana, again please describe in detail the mystic power of Your opulences. I am never satiated in hearing about You, for the more I hear the more I want to taste the nectar of Your words.

🌹 Purport :
A similar statement was made to Sūta Gosvāmī by the ṛṣis of Naimiṣāraṇya, headed by Śaunaka. That statement is:

vayaṁ tu na vitṛpyāma
uttama-śloka-vikrame
yac chṛṇvatāṁ rasa-jñānāṁ
svādu svādu pade pade

“One can never be satiated even though one continuously hears the transcendental pastimes of Kṛṣṇa, who is glorified by excellent prayers. 

Those who have entered into a transcendental relationship with Kṛṣṇa relish at every step the descriptions of the pastimes of the Lord.” (Śrīmad-Bhāgavatam 1.1.19) 

Thus Arjuna is interested in hearing about Kṛṣṇa, and specifically how He remains as the all-pervading Supreme Lord.

Now as far as amṛtam, nectar, is concerned, any narration or statement concerning Kṛṣṇa is just like nectar. 

And this nectar can be perceived by practical experience. Modern stories, fiction and histories are different from the transcendental pastimes of the Lord in that one will tire of hearing mundane stories but one never tires of hearing about Kṛṣṇa. 

It is for this reason only that the history of the whole universe is replete with references to the pastimes of the incarnations of Godhead. 

The Purāṇas are histories of bygone ages that relate the pastimes of the various incarnations of the Lord. In this way the reading matter remains forever fresh, despite repeated readings.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 195 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
43. అధ్యాయము - 18

*🌻. గుణనిధి సద్గతిని పొందుట - 2 🌻*

పక్వాన్న గంధమాఘ్రామ యజ్ఞదత్తాత్మజో ద్విజః | పితృత్యక్తో మాతృహీనః క్షిధితస్స తమన్వ గాత్‌ || 12

ఇదమన్నం మయా గ్రాహ్యం శివాయోపకృతం నిశి | సుప్తే శైవజనే దైవాత్సర్వస్మిన్‌ వివిధం మహత్‌ || 13

ఇత్యాశామవలంబ్యాథ ద్వారి శంభోరుపావిశత్‌ |దదర్శ చ మహాపూజాం తేన భక్తేన నిర్మితామ్‌ || 14

విధాయ నృత్యగీతాది భక్తాస్సుప్తాః క్షణ యదా | నైవేద్యం సతదాదాతుం భర్గాగారం వివేశ హ || 15

తండ్రిచే విడువబడి, తల్లి లేక ఆకలి గొనియున్న ఆ యజ్ఞదత్తపుత్రుడగు బ్రాహ్మణుడు ఆహారపదార్ధముల గంధము నాఘ్రాణించి అతని వెనుకనే వెళ్లెను (12). 

శివభక్తులు ఈ అన్నమును శివునకు నివేదన చేసి రాత్రి యందు నిద్రించగనే, నేను ఈ వివిధములగు దివ్యమైన వంటకములను పరిగ్రహించెదను (13). అతడీ తీరున ఆ శించిన శివసన్నిధిలో ద్వారము నందు కూర్చుండి, ఆ భక్తుడు చేసిన మహాపూజను దర్శించెను (14). 

ఆ భక్తులు నాట్యములను చేసి, పాటలను పాడి నిద్రించగనే; ఆ నైవేద్యమును గ్రహించుటకు ఆతడు శివసన్నిధిలోనికి ప్రవేశించెను (15).

దీపం మందప్రభం దృష్ట్వా పక్వాన్న వీక్షణాయ సః | నిజచైలాంచలాద్వర్తిం కృత్వా దీపం ప్రకాశ్య చ || 16

యజ్ఞదత్తత్మా జస్సోsథ శివనైవేద్యమాదరాత్‌ | జగ్రాహ సహసా ప్రీత్యా పక్వాన్నం బహుశస్తతః || 17

తతః పక్వాన్న మాదాయ త్వరితం గచ్ఛతో బహిః | తస్య పాదతలాఘాతాత్ర్పసుప్తః కోsప్యబుధ్యత|| 18

కోsయం కోsయం త్వరాపన్నో గృహ్యతాం గృహ్యతా మసౌ | ఇతి చుక్రోశ స జనో గిరా భయమహోచ్చయా || 19

యావద్భయాత్సమాగత్య తావత్స పురరక్షకైః | పలాయమానో నిహతః క్షణా దంధత్వ మాగతః || 20

ఆతడు ఆ వివిధ ఆహారపదార్థములను చూడబోగా దీపకాంతి తగినంత లేకుండెను. ఆతడు తన ఉత్తరీయము నుండి వస్త్ర శకలమును చింపి వత్తిని చేసి దీపమును ప్రకాశింపజేసెను (16). 

ఆపుడా యజ్ఞదత్తుని పుత్రుడు వివిధములైన వంటకములుగల శివనైవేద్యమును ప్రీతితో ఆదరముతో స్వీకరించెను (17). 

ఆతడు ఆహారమును తీసుకొని త్వరితముగా బయటకు వెళ్లుచుండగా కాలు తగిలి నిద్రపోవుచున్న వ్యక్తి యొకడు తెలివిని పొందెను (18). 

ఎవరు వారు? ఎవరు వారు? వానిని తొందరగా పట్టుకొనుడు, పట్టుకొనుడు అని ఆతడు భయముతో పెద్ద స్వరముతో అరచెను (19). 

గుణనిధి భయపడి పరుగెత్తుచుండగా రక్షక భటులు కొట్టిరి. అతడు పడిపోయెను. మరియు చూపును కోల్పోయెను (20).

అభక్షయచ్చ నైవేద్యం యజ్ఞదత్తాత్మజో మునే | శివానుగ్రహతో నూనం భావిపుణ్యబలాచ్చ సః || 21

అథ బద్ధ స్సమాగత్య పాశముద్గరపాణి భిః | నినీషు భి స్సంయమనీం యామ్యైస్స వికటెర్భటైః || 22

తావత్పారిషదాః ప్రాప్తాః కింకిణీ జలమాలినః | దివ్యం విమాన మాదాయ తం నేతుం శూల పాణయః || 23

ఓమహర్షీ! ఆ యజ్ఞదత్త కుమారుడు శివుని అనుగ్రహము వలన, మరియు లభించబోవు పుణ్యము యొక్క ప్రభావము వలన నైవేద్యమును భక్షించి మరణించెను (21). 

అపుడు భయంకరాకారులు, పాశము ముద్గరము అను ఆయుధములను ధరించిన వారునగు యమభటులు అచటకు వచ్చి ఆతనిని బంధించి యమపురికి తీసుకొని పొవనుద్యమించిరి (22). 

ఇంతలో చిరుగంటల మాలలను ధరించిన, చేతియందు శూలనముగల శివగణములు ఆతనిని తీసుకొని వెళ్లుటకై దివ్యవిమానమును తీసుకొనివచ్చిరి (23).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


*🌹 𝑨𝑽𝑨𝑻𝑨𝑹 𝑶𝑭 𝑻𝑯𝑬 𝑨𝑮𝑬 𝑴𝑬𝑯𝑬𝑹 𝑩𝑨𝑩𝑨 𝑴𝑨𝑵𝑰𝑭𝑬𝑺𝑻𝑰𝑵𝑮 - 71 🌹*
𝑪𝒉𝒂𝒑𝒕𝒆𝒓 20
✍️ 𝑩𝒉𝒂𝒖 𝑲𝒂𝒍𝒄𝒉𝒖𝒓𝒊
📚 . 𝑷𝒓𝒂𝒔𝒂𝒅 𝑩𝒉𝒂𝒓𝒂𝒅𝒘𝒂𝒋

🌻 𝑻𝒉𝒆 𝑻𝒆𝒂𝒓𝒔 𝒐𝒇 𝑹𝒆𝒑𝒆𝒏𝒕𝒂𝒏𝒄𝒆 🌻

𝑮𝒐𝒅 𝒊𝒔 𝒐𝒖𝒓 𝑭𝒂𝒕𝒉𝒆𝒓, 𝒃𝒖𝒕 𝒘𝒆 𝒉𝒂𝒗𝒆 𝒇𝒐𝒓𝒈𝒐𝒕𝒕𝒆𝒏 𝒕𝒉𝒊𝒔. 𝑾𝒉𝒆𝒏 𝒐𝒏𝒆 𝒂𝒘𝒂𝒌𝒆𝒏𝒔 𝒇𝒓𝒐𝒎 𝒕𝒉𝒆 𝒔𝒍𝒆𝒆𝒑 𝒐𝒇 𝒊𝒈𝒏𝒐𝒓𝒂𝒏𝒄𝒆, 𝒕𝒉𝒆𝒏 𝒉𝒆 𝒘𝒊𝒍𝒍 𝒂𝒄𝒄𝒆𝒑𝒕 𝑮𝒐𝒅 𝒂𝒔 𝒉𝒊𝒔 𝑬𝒕𝒆𝒓𝒏𝒂𝒍 𝑭𝒂𝒕𝒉𝒆𝒓. 𝑮𝒐𝒅 𝒅𝒆𝒔𝒄𝒆𝒏𝒅𝒆𝒅 𝒕𝒐 𝒆𝒂𝒓𝒕𝒉 𝒂𝒔 𝒎𝒂𝒏, 𝒂𝒏𝒅 𝒕𝒐𝒐𝒌 𝒕𝒉𝒆 𝒏𝒂𝒎𝒆 𝑪𝒐𝒎𝒑𝒂𝒔𝒔𝒊𝒐𝒏𝒂𝒕𝒆 𝑭𝒂𝒕𝒉𝒆𝒓. 

𝑫𝒖𝒓𝒊𝒏𝒈 𝑴𝒆𝒉𝒆𝒓 𝑩𝒂𝒃𝒂'𝒔 𝒎𝒂𝒏𝒊𝒇𝒆𝒔𝒕𝒂𝒕𝒊𝒐𝒏 𝒎𝒂𝒏𝒌𝒊𝒏𝒅 𝒘𝒊𝒍𝒍 𝒓𝒆𝒂𝒍𝒊𝒛𝒆 𝒉𝒐𝒘 𝒎𝒖𝒄𝒉 𝒕𝒉𝒆 𝑨𝒗𝒂𝒕𝒂𝒓 𝒔𝒖𝒇𝒇𝒆𝒓𝒔 𝒕𝒐 𝒂𝒘𝒂𝒌𝒆𝒏 𝒉𝒖𝒎𝒂𝒏𝒊𝒕𝒚 𝒕𝒐 𝒂𝒄𝒄𝒆𝒑𝒕 𝑮𝒐𝒅 𝒂𝒔 𝒕𝒉𝒆𝒊𝒓 𝒇𝒂𝒕𝒉𝒆𝒓. 𝑫𝒖𝒓𝒊𝒏𝒈 𝒕𝒉𝒊𝒔 𝒕𝒊𝒎𝒆 𝒎𝒂𝒏𝒌𝒊𝒏𝒅 𝒘𝒊𝒍𝒍 𝒆𝒏𝒕𝒆𝒓 𝒂 𝒔𝒕𝒂𝒕𝒆 𝒐𝒇 𝒓𝒆𝒑𝒆𝒏𝒕𝒂𝒏𝒄𝒆 𝒇𝒐𝒓 𝒕𝒉𝒆𝒊𝒓 𝒊𝒈𝒏𝒐𝒓𝒂𝒏𝒄𝒆. 
 
𝑻𝒉𝒆 𝒕𝒆𝒂𝒓𝒔 𝒐𝒇 𝒓𝒆𝒑𝒆𝒏𝒕𝒂𝒏𝒄𝒆 𝒂𝒓𝒆 𝒆𝒙𝒕𝒓𝒆𝒎𝒆𝒍𝒚 𝒗𝒂𝒍𝒖𝒂𝒃𝒍𝒆, 𝒃𝒆𝒄𝒂𝒖𝒔𝒆 𝒕𝒉𝒆𝒚 𝒃𝒓𝒊𝒏𝒈 𝒃𝒂𝒄𝒌 𝒕𝒉𝒆 𝒎𝒆𝒎𝒐𝒓𝒚 𝒐𝒇 𝒕𝒉𝒆 𝑭𝒂𝒕𝒉𝒆𝒓, 𝒂𝒏𝒅 𝒕𝒉𝒆 𝑭𝒂𝒕𝒉𝒆𝒓 𝒃𝒆𝒄𝒐𝒎𝒆𝒔 𝒗𝒊𝒔𝒊𝒃𝒍𝒆 𝒕𝒐 𝒕𝒉𝒆 𝒕𝒆𝒂𝒓𝒔. 

𝑯𝒊𝒔 𝒎𝒂𝒏𝒊𝒇𝒆𝒔𝒕𝒂𝒕𝒊𝒐𝒏 𝒘𝒊𝒍𝒍 𝒃𝒆 𝒘𝒉𝒆𝒏  
𝒎𝒂𝒏𝒌𝒊𝒏𝒅'𝒔 𝒕𝒆𝒂𝒓𝒔 𝒑𝒓𝒐𝒄𝒍𝒂𝒊𝒎 𝒕𝒉𝒆 𝑭𝒂𝒕𝒉𝒆𝒓'𝒔 𝒑𝒓𝒆𝒔𝒆𝒏𝒄𝒆, 𝒂𝒏𝒅 𝒕𝒉𝒆𝒊𝒓 𝒉𝒆𝒂𝒓𝒕𝒔 𝒂𝒘𝒂𝒌𝒆𝒏 𝒕𝒐 𝒆𝒎𝒃𝒓𝒂𝒄𝒆 𝒉𝒊𝒎. 
 
𝑻𝒉𝒊𝒔 𝒆𝒎𝒃𝒓𝒂𝒄𝒆 𝒘𝒊𝒍𝒍 𝒑𝒓𝒐𝒄𝒍𝒂𝒊𝒎 𝒕𝒉𝒆 𝑨𝒗𝒂𝒕𝒂𝒓'𝒔 𝒅𝒊𝒗𝒊𝒏𝒊𝒕𝒚 𝒊𝒏 𝒖𝒔.

𝑪𝒐𝒏𝒕𝒊𝒏𝒖𝒆𝒔...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 66 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 27
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. దీక్షా విధి - 7 🌻*

హోమేన శోధయేత్పశ్చాత్సంహార క్రమయోగతః | యాని సూత్రాణి బద్దాని ముక్త్వా కర్మాణి దేశికః. 63

శిష్యదేహాత్సమాహృత్య క్రమాత్తత్త్వాని శోధయేత్‌ | అగ్నౌ ప్రాకృతికే విష్ణౌ లయం నీత్వాధిదైవికే. 64

శుద్దం తత్త్వమశుద్ధేన పూర్ణాహుత్యా తు సాధయేత్‌ |

పిమ్మట సంహారక్రమమున హోమముచే శోధనము చేయవలెను. శిష్యుని దేమముపై కట్టిన కర్మరూప సూత్రములను విడిపించి, వాటిని ఒకచోట పోగుచేసి, తత్త్వ శోధనము చేయవలెను. ప్రాకృతికాగ్నియందును, ఆధిదైవిక విష్ణువునందును లయముచేసి, అశుద్ధులతో కూడిన తత్త్వమును పూర్ణాహుతిచే శుద్ధము చేయవలెను.

శిష్యే ప్రకృతిమాపన్నే దగ్ధ్వా ప్రాకృతికాన్‌ గుణాన్‌. 65

మోచయే దధికారే వా నియుంజ్యాద్ధేశికః విశూన్‌ |

ప్రాకృతిక గుణములను దహించి శిష్యుడు ప్రకృతిస్థుడైన పిమ్మట గురువు ఆతనిని విముక్తుని చేయవలెను; లేదా శిశువులను (శిష్యులను) అధికారమునందు నియుక్తులను చేయవలెను.

అథాన్యాం శక్తి దీక్షాం వా కుర్యాద్భావే స్థితో గురుః. 66

భక్త్యా సంప్రతిపన్నానాం యతీనాం నిర్ధనస్య పచ | సంపూజ్య స్థణ్డిలే విష్ణుం పార్శ్వస్థం స్థాప్య పుత్రకమ్‌. 67

దేవతాభిముఖః శిష్యస్తిర్యగాస్యః స్వయం స్థితః | అధ్వానం నిఖిలం ధ్యాత్వా పర్వభిః స్త్వెర్వికల్ఫతమ్‌. 68

శిష్యదేహే తథా దేవమాదిదైవిక యాజనమ్‌ | ధ్యానయోగేన సంచిన్త్య పూర్వవత్తాడనాదినా. 69

క్రమాత్తత్త్వాని సర్వాణి శోధయేత్థ్సణ్డిలే హరౌ |

లేదా గురువు భావస్థితుడై మరియొక శక్తిదీక్ష యైన చేయవలెను. యతులు గాని, నిర్ధనులు గిన భక్తి పూర్వకముగ తన నాశ్రయించి నపుడు స్థండిలముపై విష్ణువును పూజించి, పార్శ్వమునందే కూర్చుండబెట్టవలెను. 

శిష్యుడు దేవతాభిముఖుడుగా ఉండగా గురువు ముఖమును అడ్డముగా త్రిప్పి కూర్చుండవలెను. స్వీయపర్వములతో వికల్పిత మైన సకలాధ్వమును శిష్యునిదేహముపై ధ్యానించి పిమ్మట ఆధిదైవికపూజ చేయవలెను. ధ్యానమోగముచే చింతించి, వెనుక చెప్పిన విధమున తాడనాదికముచే క్రమముగ స్థండిలముపై నున్న హరియందు సకలతత్త్వసంశోధనము చేయవలెను.

తాడనేన వియోజ్యాథ గృహీత్వాత్మని తత్పరః. 70

దేవే సంయోజ్య సంశోధ్య గృహీత్వా తత్స్వభావతః | ఆనీయ శుద్దభావేన సన్ధయిత్వా క్రమేణ తు. 71

శోధయేద్ధ్యానయోగేన సర్వతో జ్ఞానముద్రయా |

పిమ్మట తాడనముచేత విడిపించి, తత్పరత్వముతో తనలో గ్రహించి, దేవునితో సంబంధింప చేసి, పరిశోధనము చేసి, దేవస్వరూపమున గ్రహించి, శుద్ధభావముతో తీసికొని వచ్చి, క్రమముగ సంధింపచేసి, ధ్యానమోగము నవలంబించి జ్ఞానముద్రతో శోధింపవలెను.

శుద్ధేషు సర్వతత్త్వేషు ప్రధానే చేశ్వరే స్థితే. 72

దగ్ఠ్వా నిర్వాపయేచ్ఛిష్యాన్‌ పదే చైశే నియోజయేత్‌ | నినయేత్సిద్దిమార్సే వా సాధకం దేశికోత్తమః. 73

సర్వతత్త్వములను శుద్ధము లైన పిమ్మట ప్రధాను డగు ఈశ్వరుడు మాత్రము ఉండగా, శిష్యులను(పాశములను) దహించి నిర్వాపితులను చేయవలెను. ఈశ్వరస్థానమున వారిని నియుక్తులను చేయవలెను. లేదా దేశికోత్తముడు సాధికుని సిద్ధిమార్గమును పొందింపచేయవలెను.

ఏవమేవాధికారస్థో గృహే కర్మణ్యతన్ద్రితః | ఆత్మానం శోధయంస్తిష్ఠే ద్యావద్రాగక్షయో భవేత్‌. 74

అధికారము గల గృహస్థుడు ఈ విధముగ కర్మాచరణవిషయమున అలసత్వము లేనివాడై, రాగము క్షీణించు వరకును ఆత్మశోధనము చేసికొనుచు ఉండవలెను.

క్షీణరాగమథాత్మానం జ్ఞాత్వా సంశుద్ధకిల్బిషః | ఆరోప్య పుత్రే శిష్యే వాహ్యధికారం తు సంయమీ. 75

దగ్ధ్వా మాయామయం పాశం ప్రవ్రజ్య స్వాత్మని స్థితః | శరీరపాతమాకాజ్‌క్షన్నా సీతావ్యక్త లిఙ్గవాన్‌. 76

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సర్వదీక్షాకథనం నామ సప్తవింశోధ్యాయః.

తన కున్నరాగము క్షీణించిన దను విషయము గుర్తించి, పాపము లన్నియు తొలగిన ఆతడు పుత్రునకు గాని శిష్యునకు గాని అధికారము అప్పగించి, సంయమియై, మాయామయ మగు పాశమును దహింపచేసకిని, సన్యాసము స్వీకరించి, ఆత్మచింతాపరాయణుడై, తన స్థితిని ఇతరులకు వ్యక్తముచేయక శరీరపాతమునకై (మరణమునకై) వేచి యుండవలెను.

అగ్ని మహాపురాణములో సర్వదీక్షాకథన మను ఇరువదిఏడవ అధ్యాయము సమాప్తము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 82 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. పరాశర మహర్షి - 1 🌻*

వంశము: వసిష్ఠమహర్షి(తాత), శక్తి(తండ్రి)
భార్య(లు): సత్యవతి
కుమారులు/కుమార్తెలు: వ్యాసమహర్షి
కాలము:
భౌగోళిక ప్రాంతములు: బదరికాశ్రమం 
నదులు: యమున
బోధనలు/గ్రంధాలు: పరాశరస్మృతి, పరాశరగీత, వృద్ధపరాశరహోర

*🌻. జ్ఞానం:*

1. కలియుగంలో మనం అవలంబించిన స్మృతి ‘పరాశరస్మృతి’ అని నిర్ణయం జరిగింది. ఈ స్మృతికారకుడు పరాశరమహర్షి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క స్మృతి ఎందుకుండాలి అంటే, మనుష్యులయొక్క శక్తిసామర్థ్యాలు అన్ని యుగాలలోను ఒకేవిధంగా ఉండవు.

2. మనకు నేడు 80 ఏళ్ళు పూఋనాయుర్దాయం అనుకుంటే, 20 ఏళ్ళు యౌవనం ఉంటుంది. అప్పుడే మనిషికి సంసారతాపత్రయం మొదలు. సంసారం, పిల్లలను కనటం, ఇల్లు వాకిలి ఏర్పాటు మొదలైనవి. 60 ఏళ్ళకు వార్ధక్యం మొదలు.ఈ ధర్మాచరణ అనేది ఆయువునుబట్టి, ఆయుర్దాయకాలంలో ఉండే మనోబలం, శరీర దారుఢ్యం, జీర్ణశక్తి, ఆకలిని తట్టుకునేశక్తి వాటినిబట్టి నిర్నయించబడుతుంది. ధర్మాలు జీవనవిధానంలో భాగం కాబట్టి.

3. కాబట్టి ఈ శరీరమెంత శక్తిసామర్థ్యాలతో ఉండినా, మనకు మానసిక బలంకూడా అవసరం. ధ్యానశక్తిగాని, యోగశక్తిగాని, ఏకాగ్రతయొక్క శక్తి సామర్థ్యాలుగాని, మనస్సును ఒక వస్తువునందు లగ్నంచేయాలి అంటే – ఇవి అన్ని యుగాలలోనూ, అందరు మనుష్యులలోనూ ఒకేలా ఉండవు. 

4. కాబట్టి ఆ యుగములనుబట్టి, వ్యక్తులనుబట్టి ఆచారాలు, వ్యవహారాలు, ధర్మాలు, నిర్దేశించబడ్డాయి. మళ్ళీ అన్ని ధర్మాలకూ గమ్యస్థానంమాత్రం ఒక్కటే! ఏ మార్గంలో జీవిస్తే చిట్టచివరకు ఈ ప్రపంచ జీవనం మీద కొంత వైముఖ్యము, జ్ఞానలో అభివృద్ధి, వైరాగ్యము, జ్ఞానేఛ్ఛ – ఈట్లాంటివన్నీ ఎలా జీవిస్తే కలుగుతాయో, అట్లా జీవించడంకోసమే ధర్మం. అధర్మంలో ఉండేవాడికి ఎప్పుడూ ఆశలే! ఎప్పుడూ బాధలే!

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 13 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴* 

STANZA IV
*🌻 The Gift of Mind - 1 🌻*

25. The Sons of God came. They descended to examine the Field, wherein the Golden Seed was emerging. But the Earth had already been partially poisoned with the foreboding fumes of evil. 

Poison seeped into soil, threatening to envenom the new shoots. The plants resisted as they strove to develop according to the Programme laid out in the Core of the Seed. 

The Fiery essence of the Seed was impervious to the darkness. Evil hid himself, lying in wait for an opportune moment to attack the shoots just as they were on the point of breaking through... The Sons of God discerned the lurking danger — henceforth evil would fall under their eagle-eyed control. 

26. The Gods awaited the arrival of the Sons who had been sent to the Earth. The Sons were delayed, however, as they attempted to expose all the spheres that had been seized by evil. 

They were trying to explain certain Truths to the people, but these people did not have sufficient intelligence to properly understand the Sons 
of God.
 🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 31 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం - 1 🌻*

ఒకరోజు సిద్ధయ్య వీర బ్రహ్మేంద్రస్వామితో చర్చను ప్రారంభించాడు.

“స్వామీ ఈ సమస్త సృష్టికి కారణభూతుడెవరు? ఆయనను మనం ఎలా కనుగొంటాం?” అని సిద్ధయ్య ప్రశ్నించాడు.

అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి సిద్ధయ్యకు ఇలా వివరించారు.

“ఈ ప్రపంచంలో మన అనుభూతికి, జ్ఞానానికి అందని ఒక అద్భుత శక్తి వుంది. దానినే సర్వేశ్వరుడు అని మనం పిలుస్తాం. దీనిని వేర్వేరు మతాలకు చెందినవారు వేర్వేరుగా గుర్తిస్తారు. కానీ,ఆ శక్తిమంతుడు ఒక్కడే! అతడే భగవంతుడని ఆస్తికులంటారు.అది మన జ్ఞానానికి అతీతమైన సర్వోన్నత శక్తి అని, పుట్టుక, మరణము లేని శక్తి అనీ నాస్తికులంటారు.దానిని మనం అన్వేషణ ద్వారా కనుగొనవచ్చు”

“మన కళ్ళకు కనిపించే ఈ ప్రపంచము మొత్తము పూర్తిగా కల్పితమైనదే! అంటే ఇది అశాశ్వతమైనది. ఇది నశించక తప్పదు. అయితే, మరి మనకి కనబడుతున్న ఈ జీవులు, జీవం లేని వస్తువులు శాశ్వతం కాదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉద్భవించవచ్చు. ఈ శరీరమే అశాశ్వతం. అలాంటప్పుడు మనకి గోచరమయ్యే ఈ చరాచర వస్తువులన్నీ కూడా నాశనమవుతాయి.

జీవుల జ్ఞానానికి, దృష్టికి అందని ఒకే అంశం, తత్త్వం ఈ సృష్టికి ముందు నుంచీ వుంది. ఇప్పుడు కూడా వుంది. తర్వాత కూడా వుంటుంది. దానినే మూల తత్త్వమనీ, భగవంతుడనీ రకరకాల పేర్లతో పిలుస్తాం. కొలుస్తాం. దాని స్వభావాన్ని గ్రహించటం అనేది దాదాపు అసాధ్యం. అది సాధారణ భావనకు అందనిది.

సమస్త సృష్టికీ కారణభూతమే ఈ అంశం. ఇది పరిపూర్ణమైనది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నీ ఇందులోంచే ఉద్భవించాయి. తిరిగి ఇందులోనే లయమైపోతాయి.శ్రీ కృష్ణుడు తన విశ్వరూపం గురించి చెప్పిన సందర్భంలో కూడా దీని గురించే చెప్పాడు.

ఈ ప్రపంచంలో జీవులు అనుభవించే అనుభూతులకు అతీతమైనది అది. తన కర్మకు తాను నిర్వరిస్తూ పోతుంది. తప్ప ఎవ్వరి అనుజ్ఞ కోసం, ప్రార్థనల కోసమూ ఆగదు. దానిని మనం భగవంతుడని పిలుస్తూ, అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తూ వుంటాం.

భగవంతుడికి లేదా ఈ అనంతత్వానికి ఒక రూపం లేదు. గుణం లేదు. చావు లేదు. పుట్టుక లేదు.అతడు ఆది లేనివాడు.అనంతమైన వాడు. అన్నింటిలోనూ వుంటాడు. అన్నీ తానై వుంటాడు. కానీ ఇందులో ఏ ఒక్కటీ భగవంతుని గురించి లేదా ఈ ఏకత్వం గురించి చెప్పలేదు.

కేవలం మొక్కుబడిగా చేసే పూజలు, చదివే మంత్రాలతో ఎవరూ భగవంతుడిని ప్రసన్నం చేసుకోలేదు. అలాగే స్వార్థం కోసం చేసే యజ్ఞాలతోనూ మనం భగవంతుని చూడలేం. నిర్మలమైన మనస్సుతో చేసే పనుల వల్ల మాత్రమే, ఎలాంటి యజ్ఞాలు చేయకపోయినా మంత్రాలు చదవకపోయినా భక్తులు సర్వేశ్వరుడిని చూడగలరు.

భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు దైవం తెలీదు. ఈ చర్మ చక్షువులతో భగవంతుని ఎవ్వరూ దర్శించలేరు, గుర్తించలేరు. ఎంతమంది భక్తులున్నప్పటికీ అతి కొద్దిమంది మాత్రమే భగవంతుని చేరుకోగలరు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


*🌹. అద్భుత సృష్టి - 3 🌹*
 ✍. DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. విశ్వం/సృష్టి ఆవిర్భావం - 3 🌻*
          
🌟 మనం ఉన్న సోలార్ సిస్టమ్ (సౌర కుటుంబం) లోని సూర్యుడు తన యొక్క ప్లానెటరీ సెంట్రల్ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇది జరగడానికి సుమారు 26,000 సంవత్సరాలు పడుతుంది. 

ఇదంతా ఒకానొక *"ప్రకంపనా రంగం"* అని చెప్పవచ్చు. ప్లానెటరీ కేంద్ర సూర్యుడు గెలాక్టిక్ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ గెలాక్టిక్ కేంద్ర సూర్యుడు యూనివర్సల్ కేంద్ర సూర్యుని (సెంట్రల్ సన్) చుట్టూ తిరుగుతూ ఉంటాడు.

🌟ఈ ప్రకంపన ద్వారా సృష్టి యావత్తు కి పోషణ లభిస్తూ ఉంటుంది.
మూల చైతన్యం నుండి(శూన్యం) - ఆదిఆత్మ (ఆదిశక్తి) ఉద్భవించింది.
ఆదిఆత్మ నుండి - బ్రహ్మాత్మల సృష్టి జరిగింది.

బ్రహ్మాత్మల నుండి - విశ్వాత్మల సృష్టి జరిగింది.
విశ్వాత్మల నుండి - మహా ఆత్మల సృష్టి జరిగింది.
 మహా ఆత్మల నుండి - పూర్ణాత్మల సృష్టి జరిగింది.
 పూర్ణొత్మల నుండి - జీవాత్మలు సృష్టించబడ్డాయి.

ఈ ఆత్మ లన్నింటినీ యూనివర్సలు(విశ్వాలు), గేలక్సీలు, నక్షత్రాలు, ప్లానెట్స్ లోకి పంపడం జరిగింది. ఈ ఆత్మ స్వరూపాలు అన్నీ సూపర్ సోల్ (భగవంతుడు)నుండి ఒకేసారి సృష్టించబడ్డాయి. అందుకే వీటన్నింటి వయస్సు ఒక్కటే!

 🌟 పూర్తి విశ్వంలో ఇప్పటికి ఏడుసార్లు సృష్టి జరిగింది. సృష్టియావత్తు సృష్టించబడుతూ, లయం పొందుతూ, మళ్ళీ సృష్టించబడుతూ ఉంటుంది. ఇదే సృష్టి ప్రణాళిక!

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


*🌹 Seeds Of Consciousness - 147 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

If you are examining deeply the real nature of your being behind the idea of "I am", your spiritual progress is central and inevitable. 

On this path of realization of the absolute state of being, it is ignorant to become emotionally disturbed about your rate of progress or whether the great realization will happen quickly or slowly, in the present body or some future body.

The seed of spiritual life grows in secret silence and darkness until its appointed hour of activation on the divine plane of existence beyond consciousness, mind and body. It is enough for consciousness to be ever looking into its own center of "I am" with increasing detachment and right order of external life without adding to the troubles and problems that come with useless desires and fears.

To be ever fretfully exercising mental imagination and physical exertions toward the ultimate state of being is a misunderstanding in consciousness of going away from central awareness of being to try to get the result of it from outside in the mind and body. 

You are not your mind or body, so why do you look so hard to your mind or body to give you the self-realization you need? Conscious attention must look within the very core of itself and go through the ultimate gateway of "I am"...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 26 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 14 🌻*

చీకటి వెలుతురు ఎట్లా ఒకదానికొకటి పరస్పర భిన్నమో - భిన్నము అంటే అర్ధం ఏమిటంటే ఒకటుంటే ఒకటుండదు. వెలుతురున్నప్పుడేమో చీకటుండదు. చీకటున్నప్పుడు వెలుతురు అనుభూతం కాదు. అట్లాగే వివేకం ఉన్నప్పుడు అవివేకం కలిగే అవకాశం లేదు. 

అట్లాగే అవివేకం వున్నప్పుడు వివేకం కలిగే అవకాశం లేదు. కారణమేమిటంటే ఆ అవివేకానికి ఒక ఉద్వేగం వుంటుంది. ఒక వడి వుంటుంది. అదొకసారి కలిగితే నిన్ను స్థిరంగా వుండనివ్వదు. ఉదాహరణ చెప్తాను. 
           
   మీఅందరిలో మీ అందరి జీవితాలలో తాజ్ మహల్ చూసినవాళ్ళు ఎవరు అంటే కొంతమంది చూశామని కొంతమంది చూడలేదని చెప్తారు. చూడకపోతే ఏమిటయ్యింది అన్న ప్రశ్న వేసుకున్నామనుకో తాజ్ మహల్ చూడకపోతే జీవితం వ్యర్ధం. అట్లాగే నేను కాలేజిలో చదివే కాలంలో మరోచరిత్ర సినిమా చూశావా అన్నారు. 

నాకు సినిమాలు చూసే అలవాటు లేదు. నేను చూడలేదు. అయితే నీ జీవితం సగం వృధా అనేవాళ్ళు. అంటే అర్ధం ఏమిటీ అంటే, ఈ ప్రేయోమార్గములో వున్నప్పుడు ఆ సుఖాన్ని పొందకపోతే నీ జీవితం వృధా అనేటటువంటి ఉద్వేగాన్ని పొందుతాడు. 

ఆ ఉద్వేగాన్ని పొందేటప్పటికీ ఆ సుఖంవైపు మిడత వలే ఆకర్షించబడతాడు. ఆకర్షించబడి శలభం ఎట్లా అయితే ప్రాణాలని కోల్పోతుందో దీపశిఖ మీద పడి, అట్లాగే దీపపు పురుగువలే అయిపోతాడనమాట. అర్ధమైందా? ఈ రకమైనటువంటి బంధకారణము ఈ ప్రేయోమార్గములో వుంది.

 అందువలననే ఈ ప్రేయోమార్గమును అవిద్య అన్నారు. ఎందుకనిట అంటే ఈ అవిద్యకు మూలం లేదు. ఇది అనాది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 10 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 10 🌻*


27. వేర్వేరు మతములు పరమాత్ముని ఇట్లు పిలుతురు.
సూఫీలు. --అల్లాహ్
జొరాస్ట్రియనులు. --అహూరామజ్దా
వేదాంతులు. --పరమాత్మా
క్రైస్తవులు. --పరమపిత,పరలోకతండ్రి
దార్శనికులు. --అధ్యాత్మా

28. పరమాత్మ స్థితి: కేవలము, అపరిమితము అనంతము అయిన అద్వైత స్థితి.

29. పరాత్పర స్థితికిని పరమాత్మ స్థితికిని మూలస్థితి లో భేదము లేదు.

30. అవ్యక్తమైన పరాత్పర స్థితిలో అంతర్నిహితమైయున్న ఆదిప్రేరణము భంగము కాగా, పరాత్పరుడు--పరమాత్మ--యను
మరియొక అనంతస్థితిని పొందెను.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹