నవగ్రహ దోషములు- పరిహారాలు - నవగ్రహ మంత్రములు

*నవగ్రహ దోషములు- పరిహారాలు - నవగ్రహ  మంత్రములు*

మానవుని యొక్క దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉం టాయి. జ్యోతిష్యం పై నమ్మకం ఉన్నవారు సమస్యకు కారణం తెలిసిన వెంటనే సంబం ధిత గ్రహానికి పూజించి ఆ గ్రహానుగ్రహం పొంది తత్‌సంబంధమైన భాదల నుండి విము క్తి పొందుతుంటారు. జ్యోతిష్య జ్ఞానం లేనివా రు కూడా వారికి కలుగుచున్న కష్టాలకు కారణం అగు గ్రహం తెలుసుకొని ఆ గ్రహాని కి శాంతి మార్గములు చేసుకొనిన గ్రహ భాదల నుండి విముక్తి పొందుతారు.

సూర్యుడు: ఎవరి జాతకంలో అయితే రవి బల హీనంగా ఉంటా డో వారికి అనారోగ్య ము, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర, గుండె సంబంధిత వ్యాధు లు, తండ్రి తరుపు బంధు వులతో పడకపోవు ట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మ విశ్వాసం లేకపో వుట వంటి సమస్యలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొ నేవారు సూర్య గ్రహ అనుగ్రహం కొరకు ప్రతిరోజు సూర్య నమ స్కారం చేసుకొనుట, ఆదిత్య హృదయం పా రాయణం, గోధుమ లేదా గోధుమలతో తయా రుచేసిన ఆహారప దార్థ ములు దానం చేయు ట. తండ్రి గారిని లేదా తండ్రితో సమా నమైన వారిని గౌరవించుట వలన రవి గ్రహదోషము తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది.

చంద్రుడు: చంద్రుడు జాతక చక్రంలో బల హీనంగా ఉన్నప్పుడు మనస్సు నిలకడగా లే పోవుట, భయం, అనుమానం, విద్యలో అభి వృద్ధి లేకపోవుట, తల్లిగారి యొక్క ఆరో గ్యం సరిగా లేకపోవుట, స్ర్తీలతో విరోధము, మాన సిక వ్యాధులు, రాత్రులు సరిగా నిద్రపట్టకపో వుట, అధికమైన కోరికలు, శరీరం యొక్క ఎదుగుదల సరిగా లేకపోవుట, బరువు తక్కు వగా ఉండుట, స్ర్తీలకు గర్భాశయ వ్యాధులు మొదలగు సమస్యలు కలుతున్నప్పుడు చంద్ర గ్రహ దోషంగా గుర్తించి, చంద్ర గ్రహ అను గ్రహం కొరకు మాతృ సమానమైన స్ర్తీలను గౌరవించుట, బియ్యం దానం చేయుట, పా లు, మజ్జిగ వంటివి భక్తులకు చిన్న పిల్లలకు పంపిణీ చేయడం, శివునికి ఆవుపాలతో అభిషే కం జరిపించుకొనుట, పార్వతీదేవి అష్టోత్తరం పారాయణం చేయుట మొదలగు వాటి ద్వారా చంద్ర గ్రహ అనుగ్రహానికి పాత్రులు అయి అభివృద్ధి చెందుతారు.

కుజుడు: జాతకచక్రంలో కుజు డు బలహీనంగా ఉం డడం వల్ల ధైర్యం లేక పోవుట, అన్న దమ్ము లతో సఖ్యత నశించుట, భూమికి సంబంధిం చిన వ్యవహారాల్లో నష్టాలు, కోర్టు కేసులు, రౌడీల వలన ఇబ్బందులు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు, పోలీసుల వల్ల వేధిం పులు అప్పులు తీరకపోవుట, ఋణదా తల నుండి ఒత్తిడి, రక్త సంబంధించిన వ్యాధులు, శృంగారంనందు ఆసక్తి లేకపోవడం, కండరా ల బలహీనత, రక్తహీనత సమస్యలను ఎదు ర్కొనే ధైర్యం లేకపోవుట మొదలగునవి కలు గుచున్నప్పుడు కుజ గ్రహ దోషముగా గుర్తిం చి కుజ గ్రహాను గ్రహం కొరకు సుబ్రహ్మ ణ్యస్వామి, ఆంజనే య స్వామి వారిని పూజిం చాలి. అలాగే హను మాన్‌ చాలీసా పారాయ ణం, కందులు దానం చేయడం, పగడం ఉంగరం ధరించడం, మంగళవారం రోజున నియమంగా ఉండడం, అన్న దమ్ములకు సహాయం చేయడం, వారి మాట లకు విలువ ఇవ్వడం, స్ర్తీలు ఎర్రని కుంకుమ, ఎరుపు రంగు గాజులు ధరించడం వలన కుజ గ్రహ పీడలు తొలిగిపోతాయి.

బుధుడు: జాతక చక్రంలో బుధుడు బలహీ నంతగా ఉన్నట్లయితే.. నరాల బలహీనత, జ్ఞా పకశక్తి లేకపోవటం, చదువులో అభివృద్ధి లేక పోవడం, నత్తిగా మాట్లాడడం, వ్యాపారాల్లో నష్టాలు, సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తెలివితేటలు లేకపోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, అనుమానం, తరుచూ ధననష్టం మొదలగునవి జరుగు చున్నప్పుడు బుధ గ్రహ దోషంగా గుర్తించి.. బుధ గ్రహానుగ్రహం కొరకు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, వేంక టేశ్వరస్వామి వారిని, విఘ్నేశ్వర స్వామి వారిని ప్రార్థించుట, వారికి సంబంధించిన క్షేత్రాలను దర్శించుట, ఆవుకు పచ్చగడ్డి, తోటకూర లాంటివి ఆహారంగా ఇచ్చుట, పెసలు దానం చేయుట, విద్యార్థు లకు పుస్తకాలను దానం చేయట వలన బుధుని యొక్క అనుగ్రహం కలుగుతుంది.

గురువు: జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో జీవితంలో సుఖము, సంతోషం లేక పోవుట, దైవం పై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకా లు, ని యంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బం దులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతా లు చేసి నా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేక పోవుట, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచు న్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పరా యణ చేయడం, గురువుల ను గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శిం చుట, శనగలు దా నం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.

శుక్రుడు: జాతకంలో శుక్రుడు బలహీనము గా ఉన్నప్పుడు స్ర్తీలకు అనారోగ్యము కలుగు ట. వాహన సౌఖ్యము లేకపోవుట. భార్యా భ ర్తల మధ్య అన్యోన్యత లేకపోవుట. వ్యసనము ల యందు ఆసక్తి, వివాహం ఆలస్యం అగుట, కిడ్నీ వ్యాధులు, వ్యభిచారం, మత్తుపానీయాలు సేవించుట, కుటుంబంలోని స్ర్తీలకు అనారో గ్యము సరిగా లేనప్పుడు శుక్ర గ్రహ దోషము గా గుర్తించి శుక్ర గ్రహ అనుగ్రహం కొరకు లక్ష్మీ అమ్మవారిని పూజించుట, లక్ష్మీ స్తోత్ర ము పారాయణం చేయుట, బొబ్బర్లు దానం చే యుట, వివాహం కాని స్ర్తీలకు వారి వివా హం కొరకు సహకరించుట, స్ర్తీలను గౌరవిం చుట. వజ్రం ఉంగరం ధరించుట, సప్తముఖి రుద్రా క్షను ధరించుట వలన శుక్ర గ్రహ అను గ్రహము పొందవచ్చును.

శని: ఆయుష్షు కారకులు అయిన శని జాతక చక్రము నందు బలహీనముగా ఉన్నచో బద్ధ కము, అతినిద్ర దీర్థకాలిక వ్యాధులు, సరయి న ఉద్యోగము లేకపోవుట, జన సహకారం లేకపోవుట, ఎముకలు, తల్లిదండ్రులలో విరో ధములు, ఇతరుల ఆధీనములో పని చేయు ట, సేవకా వృత్తి, నీచ వృత్తులు చేపట్టుట, గౌర వం లేకపోవుట, పాడుపడిన గృహముల యందు జీవించుట, ఇతరుల ఇంట్లో జీవన ము సాగించుట, భార్య పిల్లలు అవమానిం చుట, కుటుం బమును విడిచి అజ్ఞాతముగా జీవించుట, సరయిన భోజనం కూడా లేకపో వుట మొదల గు కష్టములు కలుగును. శని గ్రహ అనుగ్ర హమునకు శివునికి అభిషేకము చేయుట. విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయుట.

శనివారము నియమము గా ఉండుట, ఆంజనేయ స్వామి వారిని ఆరా ధించుట, హనుమాన్‌ చాలిసా పారాయణం చేయుట, హనుమాన్ కు తమలపాకు పూజ చేపిస్తే మంచిది.స్వామి అయ్యప్ప మాల ధారణ చే యుట, శని గ్రహానికి శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయుట. నల్ల నువ్వులు దానము చేయుట, దుప్పటి వస్తువులు దానం చేయుట, నీలము ఉంగరం గాని నాలుగు ముఖములు గల రుద్రాక్షను ధరించుట వలన శని గ్రహ అనుగ్రహం కలుగుతుంది.

రాహువు: రాహువు జాతక చక్రంలో బలహీ నముగా ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలా పాలు చేయుట, నీచ స్ర్తీలతో సహవాసము, కు ష్టు లాంటి వ్యాధులు, జైలు శిక్షలు అనుభవిం చుట, విద్యార్థులు విద్య మధ్యలో మానివేయు ట, పాడుపడిన గృహములలో నివసించుట, ఇంట్లో బొద్దింకలు, పందికొక్కు లు, పాములు వంటివి సంచరించుట, శుభకార్యములు వాయిదా పడుట, వాహన ప్రమాదములు జరుగుట, గృహంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులు పాడగుట, విలువైన వస్తువులు దొంగలు ఎత్తు కొనిపోవు ట, మొదలగున వి సంభ వించు చున్నప్పుడు రాహుగ్రహ దోషముగా గుర్తించి దోష నివార ణకు కనక దుర్గ అమ్మవారిని పూజించుట, దే వి భాగవతం పారాయణం చేయుట, గోమేధి కం గాని  ఎనిమిది  ముఖములు గల రుద్రాక్ష ను గాని ధరించ వలెను. భవాని మాల ధరిం చుట, స్ర్తీలను గౌరవించుట వలన రాహు గ్రహ అనుగ్రహం కలుగును.దుర్గా సప్తశ్లోకి పఠించటం మంచిది.

కేతువు: కేతువు జాతకంలో బలహీనంగా ఉన్నపుడు మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవితం మీద విరక్తి, ఎకాంతంగా ఉండాలనే కోరిక, లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, తన లో తానే ఊహించుకొనుట, తనని తాను దేవు డు గానే దేవతగానే ఊహించుకోవడం, దేనిని చూసినా భయపడడం, ఉద్యోగమును, భార్యా పిల్లలను వదలి వేసి దేశ సంచారం చేయుట. పిచ్చి వాని వలె ప్రవర్తించుట, విచిత్ర వేషధార ణ, సంతానం కలుగకపోవుట, గర్భం వచ్చి పో వుట, చిన్న పిల్లలకు తీవ్ర అనారోగ్యం, అంటు వ్యాధులు, వైద్యులు కూడా గుర్తించలేని విచి త్ర వ్యాధులకు కేతువు కారణం అగుచున్నా డు. కేతు గ్రహ అనుగ్రహం కొరకు నలుపు తెలుపు రంగులో ఉన్న కంబళి దానం చేయు ట. దేవాలయములు కట్టుటకు విరాళములు ఇచ్చుట. పిచ్చి ఆసుపత్రిలో రోగులకు సేవ చేయుట. అనాధ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయము కలిగించుట. వైఢూర్య ము గాని తొమ్మిది ముఖములు గల రుద్రాక్ష ధరించుట వలన కేతు గ్రహ అనుగ్రహం పొందుతారు.

ప్రతిరోజు సూర్య నమస్కారం చేసు కొని ఇష్టమైన దేవాలయమును సందర్శించినచో ఎటువంటి గ్రహ దోషములు ఉన్నను పరిహారం జరుగును.

"ఆకృష్ణేన'' అను మంత్రముతో సూర్యుని, "ఇమం దేవా' అను మంత్రముతో చంద్రుని, ""అగ్నిర్మూర్ధా'' అను మంత్రముతో కుజుని, ""ఉద్బుధ్యస్వ'' అను మంత్రముచే బుధుని, ""యదర్య'' అను మంత్రముచే గురువును, ""అన్నాత్పరిస్రుతః'' అను మంత్రముచే శుక్రుని, ""శం నో దేవీ'' అను మంత్రముచే శనిని, ""కాండాత్‌'' అను మంత్రముచే రాహువును, ""కేతుం కృణ్వన్న కేతవ'' అను మంత్రముచే కేతువును. ధ్యానించవలయును.

జల్లేడు. మోదుగు, జువ్వి ఉత్తరేణి, రాగి, మేడి, జమ్మి, గరక, దర్భలు, సమిధలు యథాక్రమముగా ఒక్కొక్క గ్రహమునకు 108, కాని 28 సార్తు కాని హోమమును చేయవలయును. అట్లే తేనెతో, నేయితో, పెరుగుతో, పాలతో కాని హోమము చేయవలయును.

ఋగ్వేద యజుర్వేదముల  యందలి  నవగ్రహ  మంత్రములు:

1. సూర్య మంత్రము: 
ఓం ఆ కృష్ణేన  రజసా  వర్తమానో  నివేశ  యన్న మృతం  మర్త్యంచ l
హిరణ్యేన  సవితా  రథేనాఽఽ దేవోయాతి  భువనాని  పశ్యన్ ll
(ఋగ్వేదము 1-35..2 యజుర్వేదము 33-43 )
ఓం భూర్భువః  స్వః  సూర్య  ఇహాగచ్ఛ  ఇహ సః  సూర్యాయ నమః
బీజ మంత్రము :-ఓం  హ్రాం  హ్రీం  హ్రౌం  సః  సూర్యాయ నమః
జపకాలము: ఉదయము

2. చంద్ర మంత్రము:
ఓం  హందేవా  అసపత్నం  సువధ్వం మహతే   క్షత్రాయ మహతే  జ్యేష్టాయ మహతే జ్ఞాన రాజ్యాయేంద్ర  స్యేంద్రియాయ l  ఇమమముశ్య పుత్రమముష్యే పుత్ర మస్యై విశాఽ ఎషవోఽ మీరాజా సోమోఽ స్మాకం  బ్రాహ్మణానాం రాజా ll
( యజుర్వేదము 9-40 )
ఓం భూర్భువః  స్వః  చంద్ర ఇహాగచ్ఛ ఇహ తిష్ఠ  సోమాయ నమః ll
బీజ మంత్రము :-ఓం  శ్రాం  శ్రీం  శ్రౌం  సః  చంద్రాయ నమః
జకాలము: సంధ్యా కాలము

3. మంగళ మంత్రము:
ఓం అగ్ని ర్మూర్దా  దివః  కకుత్పతి: పృథివ్యా  అయం l
అపాంరే తాంసి జిన్వతి ll
( యజుర్వేదము 8-44-16; యజుర్వేదము 13-14)
ఓం భూర్భువః  స్వః  భౌమా ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  భౌమాయ నమః
బీజమంత్రము :-ఓం  క్రాం  క్రీం  క్రౌం  సః  భౌమాయ నమః
జపకాలము: రెండు గంటల సమయము

4. బుధ మంత్రము:
ఓం ఉద్బుద్య స్వాగ్నే ప్రతిజాగృ హిత్వమిష్టా  పూర్తేం
సంసృజేదామయంచ  అస్మిస్సదస్థే అధ్యుత్తరస్మిన్
విశ్వేదేవా  యజమానశ్చ సీదత ll
( యజుర్వేదము 15-54 )
ఓం భూర్భువః  స్వః  బుధ ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  బుధాయ నమః
బీజ మంత్రము :-ఓం బ్రాం బ్రీం భ్రౌంసః  బుధాయ నమః
జపకాలము: ఐదు గంటల సమయము.

5. గురు మంత్రము:
ఓం బృహస్పతే  అతియదయోం ఘ్రుమద్ విభాతి క్రతుమజ్జనేషు l
యద్దీదయచ్చ వనఋతుప్రజాత  తదస్మాసు ద్రవిణం దేహిచిత్రం ll
( ఋగ్వేదము 2-23-25 ; యజుర్వేదము 26-3 )
ఓం భూర్భువఃస్వః   బృహస్పతే ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  బృహస్పతయే నమః
బీజ మంత్రము :-ఓం  గ్రా౦  గ్రీం  గ్రౌం సః  గురవే నమః
జపకాలము:  సంధ్యా కాలము

6. శుక్ర మంత్రం :
ఓం అన్నాత్పరిశృతోరసం బ్రహ్మణాన్యపిబత్ క్షం పయః సోమం ప్రజాపతిః l
ఋతేన సత్య మింద్రియం విపానాం శుక్ర మందస ఇంద్ర స్యేంద్రియ మిదం పయో మృతం మధు l l
(యజుర్వేదం 19-65)
బీజమంత్రం: ఓం ద్రాం ద్రీం ద్రౌంసః శుక్రాయనమః
కాలము : సూర్యోదయ సమయం

7.  శని మంత్రము :
ఓం శంనో  దేవీరభిష్టయ ఆపోవబంతు పీతయే l
శంయోరభిస్ర  వంతునః ll
( ఋగ్వేదము 10-9-4 ; యజుర్వేదము 36-12 )
ఓం భూర్భువఃస్వః   శనై  శ్చరః  ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  శనైశ్చరాయ నమః
బీజ మంత్రము :-ఓం ప్రాం  ప్రీం  ప్రౌంసః  శనైశ్చరాయ నమః
జపకాలము:  సంధ్యా కాలము

8. రాహు మంత్రం :
ఓం కయానాశ్చిత్ర ఆభువధూతీ  సదావృధాఃసఖా l కాయాశాశ్చిష్ఠయావృతా l l
(ఋగ్వేదం 4-31-1, యజుర్వేదం 26-39)
ఓం భూర్భువః స్వః రాహో ఇహాగచ్ఛ ఇహతిష్ఠ l రాహవేనమః
బీజమంత్రం:- ఓం భ్రాం భ్రీం బ్రౌంసః రాహవేనమః
జపకాలం :- రాత్రి సమయం

9. కేతు మంత్రం
ఓం కేతుం కృణ్వన్న కేతవేపేశే మర్యా అపేశసే l సముపద్భి రాజాయధాః l l
(ఋగ్వేదము 1-6-3; యజుర్వేదము 29-37)
బీజమంత్రం :- ఓం స్త్రాం స్త్రీం సౌం సః l కేతవేనమః
జపకాలం :- రాత్రి సమయం.

నవగ్రహాల శక్తులు- మన అపోహలు.

నవగ్రహాల శక్తులు- మన అపోహలు.

గ్రహాలు అనగానే మన మనసులో దుష్టత్వం తో కూడుకున్నవి ,లేక దుష్టగ్రహాలు ,శనిగ్రహం ....ఇలా భావనలు సాగుతుంటాయి.ఈ మాటలను మనం ధూషణలలో కూడా వాడుతుండటం జరుగుతుంది.. ఏదన్నా పూజ శాంతి జరిపినా భయముతో తప్ప భక్తి తో కాదన్నది అంగీకరించాల్సిన విషయము.ఇది చాలా పొరపాటు. జీవులన్నియు గ్రహ శక్తులతోనే జీవించుచున్నవి .సృష్టి కర్త జీవరాసి వికాసము కొరకు ఆయా శక్తులను ఆయాగ్రహదేవతలకు ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిచేయమని. ఒక్కోగ్రహానికి ఒక్కొక్క శక్తి వుంటుంది. ముఖ్యంగా తొమ్మిది గ్రహాల శక్తుల ప్రభావం వలన జీవరాసి పుట్టుక, అంతము జరుగుతున్నవి. ఇందులో రెండు ఛాయా గ్రహాలు.
జీవరాశిలో మానవుడు అతి ముఖ్యమైన జీవి. అందువలననే గ్రహ శక్తులు మానవుని చు ట్టు ఆవరించుకొని ,మనిషి కదలికలపైన,ఆలోచనలపైన ప్రభావం చూపుతూ జీవితాన్ని ఆయాప్రభావాలు అనుభవించునట్లు చేయును.గ్రహబలం సరిగా లేనిచో స్త్రీ,పురుషులెవరైనా పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ గ్రహదేవతలను భక్తితో ధ్యానిస్తుంటే వారు శుభదృష్టిని ప్రసరింపజేసి మనకు కలగబోయే చెడును దూరం చేస్తుంటారు. మోసము ,కౄరము,ప్రతీకారము ,అసూయ ..ఈవిధమైన దుష్ట స్వభావాలు మనలో కలిగినప్పుడు గ్రహముల యొక్క వక్ర దృష్టి దానికి తోడైతే మనిషి పతనానికి అవి బలం చేకూర్చును. మంచి మనస్తత్వం తో ప్రవర్తించేవారిని గ్రహదేవతలు శుభదృష్టితో చూస్తారు.అలాగే పంచభూతాలు,అష్టదిక్పాలకులు కూడా . ప్రతిదినమూ ఉదయాన్నే నిదురలేవగానే ఒక్కపరి నవగ్రహాలను ,అష్టదిక్పాలకులను,పంచభూతాలను స్మరించుకుని మంచి మార్గం లో నడిపి సుఖశాంతులను ప్రసాదించమని వేడుకోవాలి.
అలాగే గ్రహముల అనుగ్రహానికి చిన్న తంత్రమున్నది. రోజూ యాభైగ్రాముల బియ్యం బెల్లం పొడితో కలిపి పక్షులకు వేయండి. పక్షులు తిన్నచో గ్రహశాంతి జరిగి మీకు మేలు కలుగుతుంది. వీలైతే ఈక్రింది శ్లోకం చదివి తర్పణమియ్యండి.

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:


పంచభూతాలంటే : భూమి ,వాయువు ,అగ్ని ,నీరు ,ఆకాశము .

అష్ట దిక్పాలకులు: ఇంద్రుడు [తూర్పు] అగ్ని [ఆగ్నేయం] యముడు[దక్షిణం] నిరృతి [నైరుతి] వరుణుడు [పశ్చిమం]
వాయువు [వాయువ్యం] కుబేరుడు [ఉత్తరం] ఈశ్వరుడు [ఈశాన్యం]

నిద్రలేవగనే గణేశుని ,గురువును ,పైదేవతలను మహాత్ములను ,మహర్షులను తలచుకోవటం సర్వదా శుభకరమని శాస్త్రాదులు సూచిస్తున్నాయి.

భక్తి మార్గానికి భావోద్రేకాలు అడ్డంకులా?

భక్తి మార్గానికి భావోద్రేకాలు అడ్డంకులా?

పరుగులు తీసే ఆలోచనలు లేని వారిని మనుషులు అనలేం. ప్రతి ఒక్క మనిషికి ఎంతో కొంత భావోద్వేగం తప్పనిసరి. ఎవరైనా మీతో అలాంటి 'భావోద్రేకాలు అడ్డంకులు' అన్నట్లయితే, ఆ తరువాత వారు అనే పదం 'మీ బుద్ధి ఓ పెద్ద అడ్డంకి' అని. ఆ పైన, 'మీ శరీరమే ఒక పెద్ద అడ్డంకి' అంటారు. నిజమే ఒక విధంగా..! మీ శరీర సౌష్టవం, బుద్ధి వైవిధ్యం, ఆలోచనల తీవ్రత, మీలోని శక్తి మీ జీవిత గమనంలో తప్పించుకోలేని అడ్డంకులుగా నిలబడవచ్చు.

లేదా మీ పురోగతికి తోడ్పడే నిచ్చెనలుగా నిలబడవచ్చు. వాటిని మీరు ఎలా ఉపయోగించుకుంటారనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. అందువల్ల మీరు మీ శరీరాన్ని, బుద్ధిని, ఆలోచనల పరంపరను తల బరువుగా మార్చుకుంటున్నారా? లేక ఉన్నత స్థాయికి చేరుకునేందుకు సోపానాలుగా ఉపయోగించుకుంటున్నారా? అది ముఖ్యమైన ప్రశ్న. ఈ మూడు ప్రధానంగా అడ్డంకులు అనుకుంటే అడ్డంకులు. కాని సక్రమంగా ఉపయోగించుకోగలిగితే అవే అతి ముఖ్యమైన సాధనాలు.

ఆలోచనల ప్రతిరూపాలే...
మీలో రగిలే భావోద్రేకాలు మీ ఆలోచనలకు భిన్నమైనవి కావు. అవి వాటి ప్రతిరూపాలే. మీరు మీ ఆలోచనలను ఎలా నడిపిస్తే మీలో భావోద్రేకాలు అదే మార్గంలో నడుస్తాయి. మీరు ఎలా ఆలోచిస్తారో అందుకు తగినట్లే మనసులో భావిస్తారు కదా! ఆలోచన అన్నది ప్రాణం లేని రూపం అయితే భావన అన్నది దానికి ఒక అనుభవాన్ని జోడించే మానసిక స్పందన అని చెప్పాలి. ఆలోచన నిర్జీవం. భావన సజీవం. ఆలోచనల సారం. ఆలోచించకుండా మనోభావాలను వెల్లడించలేరు. ఉదాహరణకు ఒక వ్యక్తిని చూసి అతడో భయంకరుడు అని ఆలోచిస్తూ అతడో సుందరమైన వాడు అన్న భావాలను పెంపొందించగలమా? వెల్లడించగలమా? అది సాధ్యం కాదు. ఆలోచనలెలా ఉంటే భావాలు అలా ప్రబలమవుతాయి.

మేధస్సుదా లోపం?
అలాంటప్పుడు భావోద్రేకాలు అడ్డంకులు అన్నట్లయితే ఆలోచనలు కూడా అడ్డంకులు అనుకుని వాటిని తీసిపారేయాలి. మన బుద్ధిని, మెదడును ఇప్పుడు ఉన్న స్థితికి అభివృద్ధి చేయడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు దాన్ని ఒక సమస్య అనుకుంటున్నావు. అది సరికాదు. మెదడు వల్ల కాదు సమస్య ఎదురవుతున్నది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియడం లేదు. అదే అసలు సమస్య. చాలా వేగంగా ప్రయాణించగల కారును మీకు ఇచ్చాము. కాని దాన్ని నడపడమే మీకు చేతకావడం లేదు.

అదే అసలైన సమస్య..కాదా? మీ జీవితాలకు సంబంధించి కాని, ప్రతి ఒక్కరి జీవితాలకు సంబంధించి కాని లోపం యంత్రానికి కాదు. దాన్ని నడిపే నేర్పు మీలో లేకపోవడమే. అంటే సమస్య ఆ సాధనంలో లేదు. అదొక అద్భుతమైన సాధనం. నిజంగా మహాద్భుతమైన పరికరం. మానవ మే«ధస్సు అంతటి అపూర్వమైన సంపత్తి. అంతటి సంపదను సమస్యగా భావిస్తున్నారు.

అందుకు కారణం - దాన్ని అర్థం చేసుకోవడంలోను, దాన్ని సరైన పద్ధతిలో నడిపించడంలోను మనం సక్రమంగా వ్యవహరించకపోవడమే. మేధస్సును సక్రమంగా ఉపయోగించడం చేతకాని మూర్ఖులు మాత్రమే తమ బుద్ధే తమకు సమస్యగా మారిందని అనుకుంటూ ఉంటారు. కచ్ఛితంగా వారికి వారి బుద్ధే సమస్యగా తయారైంది. వారి విషయంలో నా అభిప్రాయం కూడా అదే. వారి బుద్ధిగత ఆలోచనలు ప్రతి ఒక్కరికి సమస్యే. అంతమాత్రాన మన మేధస్సే సమస్య అనలేం.

అదుపు చేసుకోవాలి
మేధస్సు, భావోద్రేకాలు సమస్య కానే కావు. మానవ జీవితంలో భావజాలం అన్నది ఒక అందమైన ప్రక్రియ. అది లేకుంటే మానవుడు వికృతంగా మారిపోయి ఉండేవాడు. అవునా? సక్రమంగా అదుపు చేయకపోతే ఏదైనా అలాగే తయారవుతుంది. పిచ్చి పిచ్చిగా మారుతుంది. అదుపులేని ఆలోచనలు పిచ్చికి దారితీస్తాయి. అలాగే భావోద్రేకాలను సక్రమంగా నియంత్రించకపోతే, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు తయారవుతుంది.

మీరు ఎలా కావాలనుకుంటే అలా మీలో భావోద్రేకాలను ప్రేరేపించుకోవచ్చు. అలాంటప్పుడు వాటిని అందంగా కాని వికారంగా కాని ఎలా వాటిని నిలబెట్టుకోగలుగుతారు? మీరు ఆశించిన విధంగానే అంటే ఆలోచించిన తీరులోనే భావ స్పందన ఉంటే మీరు కచ్ఛితంగా వాటిని తియ్యగా ఉండాలనే అనుకుంటారు. వాటిని తియ్యగానే మార్చుకుంటారు. అవునా? అలాంటప్పుడు అందుకు తోడ్పడే బుద్ధి ఎలా ప్రతిబంధకం అవుతుంది? అది ఏ విధంగా మీ ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం అవుతుంది.

భావోద్రేకాలను ఆధ్యాత్మిక వైపు..
మొత్తం ప్రపంచంలో, దాదాపు 90 శాతం, భక్తి భావనలనే ప్రోత్సహించారు. భావోద్రేకాలను తియ్యగా మార్చుకునేందుకు భక్తి లేదా ఆధ్యాత్మికత ఒక మార్గం. అలా ఆలోచనలను, వాటి ద్వారా మన భావోద్రేకాలను తియ్యగా మార్చుకోవడమే భక్తి లేదా ఆధ్యాత్మికత. అలాంటి దాన్ని అడ్డంకి అని ఎవ్వరు చెప్పినా సరే..అది అడ్డంకి కాదు. దాని అర్థం ఒక్కటే. మీ వ్యక్తిగత ఆకాంక్ష వ్యతిరేక ప్రభావం చూపించే భావోద్రేకాలు కావచ్చు. అలాగేతై, నిజమే. అది పెద్ద అడ్డంకి అని ఒప్పుకోవాలి.

ఎవ్వరేమనుకున్నా నేను పట్టించుకోను...ఏవి సానుకూల ఆలోచనలో, ఏవి ప్రతికూల ఆలోచనలో వర్గీకరించక తప్పదు. మీ జీవితాన్ని పరిశీలించేటప్పుడు ఏది పని చేస్తుంది. ఏది పనిచేయదు అన్న కోణంలో నేను పరిశీలిస్తాను. మీకు ఉపయోగపడుతోందా? మీ కుటుంబానికి, మీ వృత్తి ప్రయోజనాలకు, మీ వ్యాపార ప్రయోజనాలకు, చివరికి మీ ఆంతరంగిక పురోగతికి తోడ్పడుతోందా? లేక, మీలో ఆవేశకావేషాలను రెచ్చగొడుతోందా, నిరాశా నిస్పృహలకు దారి తీస్తోందా. వైషమ్యాలను పెంచుతోందా. మీరు నివసిస్తున్న వాతావరణంలో మీకు తోడ్పడేలా ఉందా లేదా అన్న అంశాన్ని తప్పక పరిశీలిస్తాను.

అవి మీకు తోడ్పడేలా లేవా? తోడ్పడుతున్నాయా? అంటే, మీ ఆలోచనలు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతున్నాయా? ప్రేమ భావాలను చిగురింపచేస్తున్నాయా? ఆదరాభిమానాలను ప్రతిఫలిస్తున్నాయా? మీకు ఉపయోగకరంగా ఉంటున్నాయా? అది చాలు. ఏది పని చేస్తున్నది అన్నదే నాకు ముఖ్యం. ఇప్పుడు ఇది సానుకూలం, ఇది ప్రతికూలం అని నేను చెప్పాలనుకోవడం లేదు. అది ఏదైనా, పని చేస్తున్నదా అన్నదే ప్రశ్న. పని చేయని దాన్ని పట్టుకు వేళ్లాడితే ఏం లాభం? దేవి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదో ఆ పని చేయడం ఎందుకు? ఈ భూమ్మీద ప్రతి ఒక్క ప్రాణి కూడా పని చేసే దాన్ని మాత్రమే ఆచరిస్తుంది. అవునా? అలాంటపుడు మనుషుల్లో ఎందుకు అది సమస్య కావాలి?
సద్గురు

మోక్షం పొందేందుకు పూజలు, జపాలు, స్తోత్ర పారాయణలు అవసరమా?

మోక్షం పొందేందుకు పూజలు, జపాలు, స్తోత్ర పారాయణలు అవసరమా?
అది పొరపాటు.  ఇవన్నీ భక్తీ యొక్క అంగాలు.  పాలను పోసే ముందు పాత్రను ఎలా శుద్ధి చేస్తామో అలానే పరమపవిత్రమైన జ్ఞానాన్ని పొందాలనుకునే సాధకుడి హృదయ క్షేత్రము కూడా శుద్ధి పొందాలి.   అందుకే 'మోక్షసాధన సామగ్ర్యాం భక్తి రేవగరీయసీ' మోక్షసాధనకు అంతఃకరణ శుద్ధి అవసరము.  అట్టి అంతఃకరణ శుద్ధికి భక్తి అనే మార్గాన్ని సూచించారు.  కాబట్టి భక్తుడు కానిదే జ్ఞాని కాలేడు.  జ్ఞానార్జనకు భక్తి మొదటి మెట్టు.  ఈ మెట్టునే ఎక్కలేని వాడు మోక్షపదానికి అర్హుడు కాలేడు.  కాబట్టి సాధకుడు పూజ, జపము, స్తొత్రపారాయణల వంటి సత్కర్మలను ఆచరించి భక్తి అనే సోపానంతో అంతఃకరణ శుద్ధిని పొందగలడు. 

భక్తి అంటే ఏమిటి?
నుదుట విభూతి రేఖలు, బొట్టు ధరించి ఉదయం, సాయంత్రం పూజలు చేయడం, ప్రతిరోజూ గుడికి వెళ్ళడం వంటివి భక్తికి బాహ్యాంగాలు మాత్రమే.  భక్తి అనే మహత్తరమైన భావాన్ని వీటి వరకే పరిమితం చేయకూడదు.  రౌడీలు, గూండాలు, ఖూనీ చేసే వారు కూడా బొట్టు పెట్టుకుంటారు.   పూజలు చేస్తారు.  గుళ్ళు, గోపురాల చుట్టూ తిరుగుతారు.  కనుక భక్తిని కేవలం ఈ బాహ్యకర్మలకే పరిమితం చేసి సంకుచితభావన తో చూడకూడదు.  భక్తునిలో చిత్తశుద్ధిని కలిగించి క్రమేపీ అతనిని పరిపక్వస్థితికి చేర్చేదే భక్తి. అట్టి చిత్తశుద్ధి కలిగిన సాధకుడు ధ్యానం ద్వారా అంతర్ముఖతను పొంది నిజస్వరూపమైన ఆత్మతత్త్వమందు నిశ్చల స్థితిని పొందగలడు. 

ధ్యానంలో మనసు నిలకడగా ఉండడం లేదు.  ఎందువల్ల?
మనసు అలజడి, ఉద్వేగాలకు లోనై రకరకాల విన్యాసాలు చేస్తుంది.  ఈ విన్యాసాలకు, వికారాలకు మన ఆహార విహారాలే కారణమౌతున్నాయి.  కనుక సాధకుడు తన ఆహార విహారాల్ని, చుట్టూ ఉండే పరిసరాలను తన సాధనకు సానుకూలమైనట్లుగా మార్చుకోవాలి.   అంతే కాని సాధనకు విరుద్ధమైన మార్గాలలో పయనిస్తూ మనసు నిలవడం లేదని ఫిర్యాదు చేయడం సముచితం కాదు. 

మరి ఈ వైఫల్యాన్ని అధిగమించేందుకు యోగాసనాలు, ప్రాణాయామం వంటివి సహకరిస్తాయా?
ప్రాణాయామం, యోగాసనాల వల్ల శరీరంలోని నాడులు శుద్ధమై చక్కటి దేహధారుఢ్యం లభిస్తుంది.   అయితే మనసు ఏకాగ్రతను పొందాలంటే అంతరంగిక సాధనను అలవాటు చేసుకోవాలి.  తిరిగే ఫ్యానుని ఆపడానికి స్విచ్ నొక్కినట్లుగా పరుగులు తీసే మనసుని నియంత్రించేందుకు కూడా మార్గముంది.
"సత్సంగత్వే నిస్సంగత్వం - నిస్సంగత్వే నిర్మోహత్వం 
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం - నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః" అన్నారు.
సత్సంగంలో మనసు పరివర్తన పొందుతుంది.  తద్వారా అంతర్ముఖమై క్రమేపీ ప్రశాంతతను పొంది స్వస్వరూపాన్ని గుర్తించ గలుగుతుంది. 

సత్సంగం అంటే ఏమిటి?
1) సత్పదార్థేన సంగః   (2) సత్ శాస్త్రేణ సంగః     (3) సజ్జన సంగః అని మూడు విధాలుగా వివరించారు.  సత్పదార్థమంటే ఈ సృష్టికి ఆధారభూతమైన తత్త్వం.  అట్టి తత్త్వ స్వరూపానికి ఆద్యంతాలు లేవు.  చావు పుట్టుకలు లేవు.  వినాశం వుండదు.  కనుక ఆ పరమాత్మ తత్త్వం నిత్య సత్యమై, శాశ్వతమై శోభిల్లుతుంది.  అట్టి ఈ తత్త్వాన్ని గ్రహించాలంటే మనకు ప్రమాణం వేదశాస్త్రాలే.  వాటిని మనంతట మనమే గ్రహించలేము కనుక వాటిని బొధ పరచే ఓ సజ్జనుడు కావాలి.  వారినే గురువు అంటాం.  అట్టి గురువునే సజ్జనుడని, వేదశాస్త్రములనే సచ్చాస్త్రమని, పరమాత్మ తత్త్వాన్ని సత్పదార్థమని, వీటితో సంగాన్ని పెంచుకోడాన్నే సత్సంగమని శాస్త్రాలు పేర్కొన్నాయి.  ఇంతటి సమగ్రమైన బోధనా విధానం ఒక్క హిందూ ధర్మంలో తప్ప మిగతా ఎందులోనూ ఇంత విశేషంగా కానరాదు.  కావున హిందువుగా జన్మించడం ఒక వరమైతే హిందూ ధర్మం బోధించే మార్గంలో పయనించి జన్మను చరితార్థం చేసుకునే ప్రతి ఒక్కరూ ధన్యులే.

గర్వాన్ని అధిగమించడం ఎలా?​

గర్వాన్ని అధిగమించడం ఎలా?


​​
విజయానికి మూలం విశ్లేషించుకోండి?
గర్వాన్ని దూరంగా ఉంచడానికి మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోవాలి.  అదేమిటంటే, మీ విజయానికి మూలం ఏమిటి? ఉదాహరణకు సామర్థ్యం అని అవతలి వారు కీర్తించారనుకుందాం.  అప్పుడు ఆ సామర్థ్యానికి మూలమేమిటని కూడా ప్రశ్నించుకోవాలి.  అవతలి వారు మనని రకరకాల పొగడ్తలతో ముంచెత్తి ఉండవచ్చు.  కానీ, అవన్నీ నిజమనే నమ్మకమేమిటి?  ఒకవేళ నిందించారనుకుందాం.  దానిని అంగీకరిస్తామా?  నిందలకు మూలం లేనిపోని కల్పనలైనప్పుడు, పొగడ్తలకు మాత్రం ఎందుకు కాకూడదు?  ఈ భ్రమ నుండి బయటపడాలంటే మనలో మనమే ప్రశ్న వేసుకోవాలి. ​
​ మనకు లభించిన అవకాశాలను మనం వినియోగించుకోగలమే కానీ, వాటిని సృష్టించుకోలేము.  ఎంతో ప్రతిభ ఉన్నా, మీ విజయానికి అదొక్కటే కారణం కాలేదు.  ఒక విజయం వెనుక ఎన్నో కారణాలున్నాయి.  అవేవీ మీరు సృష్టించ గలిగినవి కావు.  మీకు సమకూరిన కొన్ని అవకాశాల వల్ల విజయం సాధ్యమయింది.  ఈ రహస్యాన్ని గుర్తించినపుడు మీకున్న సామర్థ్యాన్ని గ్రహించి, ఆనందపడడంతో పాటు మీకు సహకరించిన అనేక ఇతర కారణాలకు మీరు కృతజ్ఞతతో ఒదిగిపోతారు.  ఎవరో మెచ్చుకోవాలన్న తపన కూడా క్రమేపీ మటుమాయమవుతుంది.

గర్వం వెర్రితనమే!
నాలో ఫలానా గొప్పదనం ఉందనీ, దానిని ఇతరులు మెచ్చుకోవాలని ఆరాటపడడం, అలా జరగనప్పుడు సంఘర్షణకు లోను కావడం ఇవన్నీ గర్వానికి మూలమని చెప్పుకున్నాం.  ఏదైనా గొప్పదనం ఉన్నా, దానికి గర్వించాల్సిన పనేమీ లేదు.  ఎందుకంటే, ఆ గొప్పదనానికి కారణం మీరు ఒక్కరే కాదు.  అసలైన కారణాలలోకి వెళ్ళే సరికి మనలో తలెత్తే కృతజ్ఞతా భావం సంఘర్షణలను పారదోలుతుంది.  ఈ భావన మనలోని గర్వాన్ని అధిగమించడానికి మనకు అన్ని విధాలా తోడ్పడుతుంది. ఇక్కడ ఇంకొక రహస్యం కూడా దాగుంది.  అదేమిటంటే, ఎదుటి వారి నుంచి గౌరవాన్ని పొందాలనుకోవడానికి కారణం అది మీకు తృప్తినివ్వడమే.  మీ సామర్థ్యం మీద మీకు పూర్తి నమ్మకం లేనప్పుడే, మీరు ఎదుటి వారి నుంచి పొగడ్తలను ఆశించి, దానివల్ల లభించే తృప్తిని కోరుకుంటారు.  మీ గురించి మీకు తృప్తి ఉన్నప్పుడు, ఇతరులు చేసే సన్మానాల అవసరమే ఉండదు.  ఆత్మ విశ్వాస లోపాన్ని గర్వంతో పెంచి పోషించుకుంటున్నామని పదే పదే గుర్తుచేసుకోవాలి.
సమర్థతకి స్వతః ప్రకాశం:
సామర్థ్యం కలిగి ఉండడం, దానిని వినియోగించుకోగలగడం మంచిదే.  కానీ, అది స్వతస్సిద్ధంగా ప్రకాశించాలి.  సువాసనలను వెదజల్లే అందమైన పువ్వులను విరగబూయించే చెట్టు, తానెక్కడున్నా, ఎవరు చూసినా, చూడకపోయినా,  తన పనిని తాను ఏ గుర్తింపు పొందాలనీ ఆశించకుండా నిర్వర్తిస్తుంది.  నేను విరగబూస్తున్నానొహో అని చాటింపు వేయించదు.  మీలోని ప్రజ్ఞాపాటవాలను, సామర్థ్యాలను మీరూ అలాగే వినియోగించాలి.  అవి మీకే ఎందుకు వచ్చాయి? దీనిపై ఎవ్వరూ సూటిగా సమాధానం చెప్పలేరు.  అందుకే దానిని భగవంతుని అనుగ్రహంగా భావించి, వినియోగించాలి. మీ విలువను గుర్తించిన వాళ్ళు మిమ్మల్ని గౌరవించవచ్చు, లేనివారు పట్టించుకోకపోవచ్చు.  దేనికీ చలించ కూడదు.
ఈ అవగాహనతోనే వ్యక్తి గర్వాన్ని సునాయాసంగా అధిగమించగలడు.  నిగర్వి లో సంఘర్షణలకు తావులేదు.  వెలితి అసలే కానరాదు.  నిర్మలంగా ప్రశాంత చిత్తుడై ఉంటాడు.  ఈ పరిణతి ఆత్మ జ్ఞానానికి ఊతమిస్తుంది. 
ఈ నిర్మలత లేని వ్యక్తిలో దంభం చెలరేగుతుంది.  అది వ్యక్తిని మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది.

  🙏 కె.బి. నారాయణ శర్మ

డాంభికం తో తలనొప్పులు

డాంభికం తో తలనొప్పులు


తనలో లేని లక్షణాలని చెప్పుకోవడం దంభం.  అదే డాంబికం.  భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన ఇరవై విలువలలో రెండోది అదంభిత్వం.  అంటే డాంబికం లేకపోవడం.

మొదట మనం చూసిన ‘మానిత్వం’ లో కూడా గొప్పలు చెప్పుకుంటారు.  కానీ, ఈ రెండింటి మధ్య చిన్న తేడా ఉంది.  మానిత్వమున్న వ్యక్తిలో ఏవో కొన్ని సామర్థ్యాలు ఉంటాయి.  వాటిని గోరంతలు కొండంతలు చేసి, చెప్పుకోడానికి తాపత్రయ పడుతూ ఉంటారు.  కానీ, దంభం అనే అవగుణం ఉన్న వాడికి నిజంగా చెప్పుకోవడానికి ఏ సామర్థ్యమూ  ఉండదు.  విచిత్రమేమిటంటే ఏ గొప్పదనమూ తన వద్ద లేదని తెలిసినా కూడా తన గురించి తాను ఎక్కువగా చెప్పుకుని, అందరి దృష్టిని ఆకర్షించాలని తెగ తపన చెందుతుంతాడు.  చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, ఆగర్భ శ్రీమంతుడిలా చెప్పుకుంటూ ఉంటారు.  అలాగే, నాకు పలు భాషలు తెలుసుననీ, పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు రాసేశానని గొప్పలు చెబుతారు ఇంకొందరు.  నిజానికి, వేరే వారు వ్రాసిన పుస్తకాలకు డబ్బులిచ్చి, తమ పేరు పెట్టించు  కుంటారు. లేదా, గ్రంథ చౌర్యం చేసి, తమ పేరుతొ ముద్రించు కుంటారు.  ఎవ్వరూ ఇవ్వకపోయినా, కొన్ని బిరుదులను వారే తగిలించుకుని మురిసిపోతుంటారు.  అందరూ తనను ఆ బిరుదులతోనే గుర్తించాలని తెగ ఉక్కిరి బిక్కిరై పోతుంటారు.
ఇంతకూ, ఈ దంభం ఉన్న వారి గురించి లోతుగా పరిశీలిస్తే, వారిలో ఏ గొప్పా లేదన్న విషయం వారికి బాగా తెలుసు.  వారిలో వారికే నచ్చని, ఎవరూ మెచ్చని గుణాలున్నాయని కూడా వారికి ఇంకా బాగా తెలుసు.  అయినా, వాటిని కప్పి పుచ్చుకుని బయటకు ప్రగల్భాలు పలుకుతూ, చలామణి అయిపోదామని చూస్తుంటారు.  సందు దొరికినప్పుడల్లా వారి గురించి వారు డప్పు కొట్టుకుంటారు.
నన్ను అందరూ గుర్తించాలి.  లేదా కొందరైనా నన్ను పోగుడుతుండాలి.  అలా ఎంతకాలం కోరుకుంటారు.  అయినా, ఎదుటి వాళ్ళు కూడా ఎంత కాలం ఈ భజన చేస్తారు? వాళ్లకు మాత్రం విసుగు పుట్టదా?  ఈ విషయంపై ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే, క్రమేపీ దంభిత్వం తరిగి పోతుంది.
ఈ దంభిత్వంలో ఇంకో ప్రమాదం కూడా పొంచి ఉంది.  ఎదుటి వారు తనని గొప్పగా గుర్తించాలని కోతలు కోస్తూ పోతారు.  ఉన్నవీ లేనివీ అన్నీ తన గొప్పలుగా చెప్పుకుంటూ ఉంటారు.  ముందేం చెప్పారో మరచిపోయి రెండో సారి దానికి భిన్నమైన అంశాలను చెప్పి, ఎదుటి వారికి అడ్డంగా దొరికిపోయే ప్రమాదముంది.  ఈ కోతలు కోయడానికి కూడా జ్ఞాపక శక్తి పుష్కలంగా ఉండాలి.  లేకుంటే, యిట్టే పట్టుబడి పోయే ప్రమాదముంది.  ప్రగల్భాలు పలికేవాడు సమయం, సందర్భం చూసుకోవాలి.  అదే, అందరూ తనను గుర్తించాలనీ, పొగడాలనే ఆలోచనను అధిగమిస్తే చాలు అతడు ఇన్ని జాగ్రత్తలపై దృష్టి సారించనవసరం లేదు.  నిజం చెప్పే వాడిని నిద్రలో లేపి అడిగినా, ఒక్క మాటే చెబుతాడు.
కొందరిలో మానిత్వం, దంభత్వాలు ఉండక పోవచ్చు.  కానీ, వారిలో ఆత్మన్యూనతా భావం ఉండే అవకాశముంది.  పదిమందితో కలవలేకపోవడం, ఎదుటి వారితో నిస్సంకోచంగా మాట్లాడలేక పోవడం, పక్క వారితో బిడియంతో వ్యవహరించడం ఇవన్నీ కూడా వ్యక్తిలో ఆత్మన్యూనతా భావాన్ని ఎత్తి చూపుతాయి.  మానిత్వం, దంభిత్వంతో భేషజాలు పొడచూపుతాయి.  ఆత్మన్యూనతతో బిడియం తలెత్తుతుంది.  ఈ రెండు ఆథ్యాత్మిక సాధకుడికే కాదు, లౌకిక ప్రపంచంలో వ్యక్తిత్వ నైపుణ్యానికి కూడా అవరోధాలే.  వీటిని సరిగ్గా అర్థం చేసుకుని ఎదుగుదలకు పెద్ద పీట  వేయాలి!

తీర్పు

తీర్పు

మనుషులు దేన్ని గురించయినా తీర్పు చేస్తూ వుంటారు. నిర్ణయాలు చేస్తూ ఉంటారు. ఫలానా వ్యక్తి మంచివాడు. ఫలానా వ్యక్తి చెడ్డవాడు. అన్న అభిప్రాయాలకు వస్తూ ఉంటారు. ఏది మంచో? ఏది చెడ్డో నిర్ణయాలకు రావడానికి మనమెవరు?
మనిషి తన పరిస్థితుల్ని బట్టి, పరిసరాల్ని బట్టి ప్రవర్తిస్తాడు. మనం మనుషుల్ని అంచనాలతో సమీపిస్తాం. ఫలానా వ్యక్తి ఇలాంటి వాడు అని కచ్చితంగా తీర్మానిస్తాం. అతను అలాంటి వాడయితే అతనెందుకలా అయ్యాడన్నది చూడం. రేపు అతను మంచిగా ప్రవర్తించినా దాన్ని గురించి పట్టించుకోం.
ఒక సూఫీ వేదాంతి వుండేవాడు. చాలా సౌమ్యుడు. నెమ్మదస్థుడు. ఎప్పుడూ ఎవరికీ ఎట్లాంటి అపకారమూ తలపెట్టనివాడు. వీలయినంత మేర యితరులకు సాయపడేవాడు. ఫలానా వ్యక్తి మంచివాడు. ఫలానా వ్యక్తి చెడ్డవాడు అని ఎప్పుడూ ఎవరి గురించీ చెప్పని వాడు. ఎట్లాంటి నిందారోపణలు చెయ్యనివాడు.
బతుకుతెరువు కోసం చిన్నిచిన్ని వస్తువుల్ని వూళ్ళో తిరుగుతూ అమ్ముకునేవాడు. వాటిల్లో తినుబండారాలు, బొమ్మలు ఎనె్నన్నో ఉండేవి. ఒక్కోసారి రుతువుని బట్టి అతను అమ్మే వస్తువులు మారేవి. పొద్దునే్న బయల్దేరి వూరంతా తిరిగి అమ్ముకునేవాడు. సాయంత్రానికి యిల్లు చేరేవాడు. ఒకోసారి సంచిలో వస్తువులు తీసుకెళ్ళేవాడు. యింకోసారి పళ్ళు లాంటివి వున్నప్పుడు తోపుడు బండి తోసుకెళ్ళేవాడు.
ఎన్నో ఏళ్ళుగా అతని వృత్తి అదే. తను అమ్మే వస్తువులకు తగిన ధరలు పెట్టేవాడు. వాటిలో వచ్చే ఆదాయం తన తిండికి సరిపోయేంతగా మాత్రమే వుండేలా చూసుకునేవాడు. లాభాల చింత ఉండేది కాదు. దాంతో బయటకన్నా అతని దగ్గ్గర వస్తువుల ఖరీదు చాలా తక్కువ.
కానీ అతను ఎప్పుడయినా ఎవరయినా కొద్దిగా తక్కువ డబ్బులు ఇచ్చినా ఏమీ అనుకునేవాడు కాడు. కొందరు తరువాత యిస్తామని ఎగ్గొట్టేవాళ్ళు. పట్టించుకునేవాడు కాడు. అతని నెమ్మదితనం చూసి, అమాయకత్వం చూసి కొందరు సరుకులు తీసుకుని చెల్లని నాణేల్ని యిచ్చేవాళ్ళు. ఏమీ అనకుండా వాటిని తీసుకునేవాడు. అందరికీ అతని గురించి తెలిసి పోయింది. కొందరు మోసం చేసేవాళ్ళు. అతని మంచితనాన్ని చూసి కొందరు ఆదుకునేవాళ్ళు.
ఆయన చెల్లని నాణేల్ని యిచ్చినా ‘ఇవి చెల్లవు కదా!’ అనేవాడు కాడు. అరువుగా సరుకులు తీసుకుని కూడా ‘‘నీ డబ్బు యిచ్చేశాం కదా!’ అంటే ‘మీరు యివ్వ లేదు’ అనేవాడు కాడు.
ఇట్లా తిరుగుతూ వ్యాపారం చేస్తే నష్టపోతాడని కొంతమంది సాయం చేసి ఇంటి దగ్గరే ఒక అంగడి పెట్టుకోవడానికి తోడ్పడ్డాడు. అంగట్లో కూచునేవాడు. కానీ వ్యవహారంలో మార్పు లేదు. చెల్లని నాణేల్ని యిచ్చేవాళ్ళు, చేతివాటం మనుషులు ఎప్పట్లా తమ పనులు కొనసాగిస్తూనే వున్నారు.
అదనంగా పక్కవూరి జనానికి కూడా ఈ అమాయకుడి వ్యవహారం తెలిసింది. అందులో రకరకాలజనం. నిజాయితీ పరులు, మోసగాళ్ళు, అట్లా అని అతను పూర్తిగా దివాలా తియ్యలేదు. బండి నడుస్తూనే వుంది.
కాలం ఎప్పుడూ ఎక్కడా ఆగదు కదా! అతను వృద్ధుడయ్యడు. మరణ సమయం ఆసన్నమైంది. మంచంపై వున్నాడు. చివరి ఘడియలు. అప్పటిదాకా తన జీవన విధానమంతా అతని మనసులో మెదిలింది. ఆకాశంలోకి చూసి
‘‘దేవుడా! యిన్నాళ్ళూ యినే్నళ్ళూ నినే్న నమ్ముకుని జీవనం సాగించాను. చెల్లని నాణేల్ని యిచ్చినా తీసుకున్నాను. చెల్లే నాణేల్ని స్వీకరించాను. దయగావున్నవాళ్ళ ప్రేమని పొందాను. అరువు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళనీ ఏమీ అనలేదు. నాకు సాయపడిన వాళ్ళని మంచి వాళ్ళని, నన్ను మోసగించిన వాళ్ళని చెడ్డవాళ్ళని ఎప్పడూ అనలేదు. నిర్ణయాలు, తీర్పులు చెయ్యలేదు. నువ్వు సృష్టించిన మనుషుల్ని ఫలానా అని నిర్ణయించడానికి పూనుకోలేదు. నేను కూడా నీ సృష్టిలో భాగానే్న. దయచేసి నా గురించి కూడా ఎట్లాంటి నిర్ణయమూ చేయకు’’ అన్నాడు

యోగ సాధనలో ఎదురయ్యే అడ్డంకులు

యోగ సాధనలో ఎదురయ్యే అడ్డంకులు

పతంజలి ఒక శాస్త్రవేత్త. అతి తక్కువ పదాలలో ఎన్నో అద్భుత విషయాలను చెప్పారు. యోగ సాధనలో ఎదురయ్యే తొమ్మిది అడ్డంకులు, వాటి వలన కలిగే పరిణామాలను వివరించారు. మరి వాటిని తొలగించుకోవడానికి ఏం చేయాలి..?
 
ఏకతత్వ అభ్యాసః తత్ప్రతిషేధార్థమ్‌ ఏకతత్వ అభ్యాసః పతంజలి యోగసూత్ర 32
 
ఒక పనిని ఎంచుకుని దానినే సాధన చేస్తూ పోవాలి. అదొక్కటే మార్గం. మన మనసు ద్వైతంపై ఆధారపడటం (ఒకటిగా ఉన్న సత్యాన్ని అనేకంగా చూడటం) వలన కష్టాలు పడుతుంది. ఎక్కడైతే అనేక అవకాశాలు ఉంటాయో.. అక్కడ గందరగోళం కూడా ఉంటుంది. అందుకే ఒకే సూత్రానికి కట్టుబడి సాధన చేయాలి. ఆ సూత్రం దైవం కావొచ్చు, ఏదైనా పదార్థం కావొచ్చు, గురువు కావొచ్చు లేదా నీకు నీవే కావొచ్చు. ఏదైనాసరే ఒకే విషయంపై సాధన చేసినపుడు తొమ్మిది అడ్డంకులూ తొలిగిపోతాయి. అయితే ఈ విధంగా సాధన చేయడం అనేది నీలో కొంత ప్రశాంతత, సూక్ష్మబుద్ధి ఉన్నప్పుడే సాధ్యమవుతుంది.

ఏకతత్వ అభ్యాసం చేస్తున్నప్పుడు బుద్ధిలో కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరిలోనూ ఏకత్వాన్ని గమనిస్తావు. నీవు లేదా నీ గురువు అంతటా (అందరిలోనూ) ఉన్నట్టు భావిస్తావు. నిజానికి అంతటా ఉన్నది నీవే. నీవు తప్ప వేరే ఎవరూ లేరు. ఏకతత్వ అభ్యాసం అంటే అదే. ఒకే విషయాన్ని స్థిరంగా పట్టుకోవడం, ఆ విషయాన్నే సమస్త విశ్వంలోనూ చూడటం. అయితే ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకటిగా కనబడరు. కాని మనం ఒకే స్థితిని అందరిలోనూ చూడటం ఎలా సాధ్యం..?
 
మైత్రి కరుణా ముదితో ఉపేక్షాణం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయానాం భావనాతః చిత్త ప్రసాదనమ్‌ పతంజలి యోగసూత్ర 33
 
ఈ ప్రపంచంలో నాలుగు రకాలైన వ్యక్తులు ఉంటారు. ఆనందంగా ఉండేవారు, దుఃఖంలో ఉండేవారు, మంచిపనులు చేసేవారు, చెడుపనులు చేసేవారు. అందరినీ ఒకేలా చూడటం ఎలా..? పతంజలి ఇలా వివరిస్తారు.
 
మైత్రి: ఆనందంగా ఉండేవారితో స్నేహం చేయండి. వారితో స్నేహం చేయనపుడు వారు నీకంటే ఆనందంగా ఉన్నారని అసూయ కలుగుతుంది. వారితో స్నేహం చేస్తే వారు నీవారే అన్న భావన కలిగి వారు ఆనందంగా ఉన్నా నీకు అసూయ కలగదు.
 
కరుణ: బాధపడుతున్న వారిపట్ల కరుణ చూపాలి. అయితే వారితో స్నేహం కూడదు. స్నేహం చేస్తే అది నిన్ను కూడా విషాదంలోకి లాగుతుంది. వారికి దయతో సాయం చేయాలి. అంతేకాని సానుభూతి ప్రదర్శించకూడదు. సానుభూతి వల్ల వారు తమ బాధ సరైనదే అన్న భావనలో పడిపోతారు. తమకేదో అన్యాయం జరిగి జరిగిందనుకుని, ఆత్మనూన్యతో బాధపడుతున్నవారికి సానుభూతి సహాయం చేయదు. అలాంటి వారికి చేతనైన సాయం చేయాలే తప్ప స్నేహ హస్తం అందించడం సరికాదు.
 
ఆనందం (ముదితః): ఎవరైతే మంచిపనులు చేస్తున్నారో, ఎవరైతే యోగ్యత కలవారో, ఎవరికి భగవదనుగ్రహం ఉంటుందో అటువంటి వారి స్థితిని చూసి ఆనందించండి. వారితో కలిసి ముందుకు సాగండి. వారి మంచిపనులలో మీరు భాగస్వాములైనందుకు సంతోషించండి. అప్పుడు పోటీతత్వం పోయి అసూయ తగ్గిపోతుంది. మంచిపనులు చేస్తున్నవారిని విమర్శించడం మాని వారితో కలిసి మంచి చేయండి. ముదిత అంటే అర్థం అది. ఆనందాన్ని పంచుకోండి, ఆనందంగా ఉండండి.
 
ఉపేక్ష: చెడ్డపనులు (పాపాలు) చేసేవారిపట్ల ఉదాసీనంగా ఉండండి. ఎవరైనా మీతో అసత్యం చెబితే దాన్ని మనసులోనే తుంచేయండి. దాని గురించి ఆలోచించడం వ్యర్థం. సాధారణంగా మనం దీనికి వ్యతిరేకంగా చేస్తుంటాం. చెడ్డపనులు తారసపడితే మీకు తోచిన నాలుగు మంచి మాటలు చెప్పి వదిలేయండి. అంతేకాని అదేపనిగా ఆ వ్యక్తుల గురించి, వారు చేస్తున్న పనుల గురించి ఆలోచిస్తే.. అవి మిమ్మల్ని చుట్టుకుని ఉండిపోతాయి. కొన్నాళ్లకు మీరూ వారిలాగానే లేదా ఇంకా ఘోరంగా తయారవుతారు.
మనుషుల మనసు కోతివంటిదని పతంజలి మహర్షికి బాగా తెలుసు. ఒకే విధమైన భావం ఎల్లవేళలా ఉండదని, మారిపోతూ ఉంటుందని గ్రహించి, మనకు స్నేహం, కరుణ, ఆనందం మొదలైన భావాలను కలిగి ఉండమని, చెడ్డవారిపట్ల ఉపేక్షాభావం వహించమని చెప్పారు. అలా ఉన్నప్పుడు మన బుద్ధి ప్రశాంతంగా మారుతుంది (చిత్త ప్రసాదనమ్‌). అప్పుడు ఏకతత్వ సాధన సులభంగా సాగుతుంది. ఇది కూడా కష్టమనిపించినపుడు పతంజలి మరో మార్గాన్ని సూచించారు.. అదేమిటో వచ్చేవారం తెలుసుకుందాం.
 
 
శ్రీశ్రీశ్రీ రవిశంకర్,

🌹 దివ్యత్వానికి నాంది 🌹

🌹 దివ్యత్వానికి నాంది 🌹

కొంత నిర్దిష్టమైన కాలాన్ని, శక్తినే మనం 'జీవం' అంటాం. శక్తి వేరే విషయమైనా కాలమనేది మాత్రం మన ప్రమేయం లేకనే గడిచిపోతుంది. భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి తిరిగితే ఒక నెల. సూర్యుని చుట్టూ భూమి ఒకసారి తిరిగితే ఒక సంవత్సరం. ఈ సూర్యునితో, చంద్రునితో ఈ భూమి ఉన్న స్థానాన్ని బట్టి అది మన వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. మన శరీరం, మనసులపై ఈ సూర్యచంద్రుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ భూమి ముఖ్యంగా సూర్యుని శక్తి వల్లే నడుస్తున్నది. మీ శరీరం కూడా ఈ భూమిలో ఒక అంశమే. సూర్యుని శక్తి ఎంత గ్రహించగలవన్న దానిని బట్టే నీకెంత శక్తి ఉన్నదో అనేది. అందువల్ల సూర్యుని చుట్టూ భూ పరిభ్రమణం కాలాన్నే కాక, మన శక్తిని కూడా నిర్దేశిస్తుంది. అంటే జీవానికి ప్రధాన అంశములైన కాలమూ, శక్తి అనేవి రెండూ సూర్యుని వల్ల నిర్దేశింపబడినవి. అందువల్ల భూమిపై సూర్యుని ప్రభావం అత్యంత మహత్వపూర్వమైనది.

కాని, సూర్యునిలాగా చంద్రుడు శక్తిని ప్రసరించకపోయినా, చంద్రుడు భూమికి అతి సమీపంలో ఉండడం వల్ల మనపై దాని ప్రభావం కూడా ఎక్కువే. మన పుట్టుకే చంద్రుని గతిపై ఆధారపడి ఉన్నది. ఎందుకంటే స్త్రీ శరీరంలోని ఋతుక్రమానికీ, చంద్రుని గతికీ పూర్తి సంబంధం ఉన్నది. చంద్రుని ప్రభావం కాంతి, శక్తి, ఉష్ణపరమైనది కాదు, అది అయస్కాంతపరమైనది. ఈరోజు విద్యుత్తు దేనినో తిప్పడం, తిరగడం మూలంగానే తయారవుతున్నది-వేరే మార్గంలేదు.

అదే విధంగా చంద్రుడు తన భ్రమణ, పరిభ్రమణల ద్వారా శక్తి క్షేత్రాన్ని ఏర్పరుస్తున్నది. అందువల్ల భౌతికంగా బయట నుంచి జరిగే దానిని అర్థం చేసుకోవాలంటే సూర్యునిపరంగా ఆలోచించాలి. అంతరంగంలో జరిగే దానిని అర్థం చేసుకోవాలంటే చంద్రునిపరంగా ఆలోచించాలి. మానవుని అంతరంగంలో జరిగే దానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే సంస్కృతులు సహజంగానే చాంద్రమానాన్ని లేక సౌర చాంద్రమానాన్ని అనుసరించాలి.

భారతీయ స్కృంతీపరంగా దీనిని పంచాంగం అంటారు. మనకు భౌతిక, అంతర్గత శ్రేయస్సులు రెండింటిపైనా ఆసక్తి ఉంది కాబట్టి మన పంచాంగం సౌరచాంద్రమాన పరమైనది. అది చంద్రుని చలనాన్ని, సూర్యుని చుట్టూ భూమి చలనాన్ని, స్థితిని పరిగణనలోకి తీసుకుంటుంది. ఆ విధంగా క్యాలెండర్ తయారు చేసుకోవడం ఉత్తమం. దురదృష్టవశాత్తు అటువంటిదొకటి ఉందని కూడా ఈకాలంలో చాలామందికి తెలియదు.

ప్రపంచంలో అతి పురాతనమైన క్యాలెండర్లలో ఇది ఒకటి. ఈ క్యాలెండర్ పరంగా ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్నాము. ఉగాది భారతీయ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం. ఇప్పుడు భూమి సూర్యునికి అతి సమీపంలో ఉన్నది. ఎదగటానికి వేసవి అత్యనుకూలమైనది. వృక్షజాతి అంతా వేసవిలోనే బాగా పెరుగుతాయి. ఎందుకంటే వాటి పెరుదలకే అవసరమైన కిరణజన్య సంయోగ క్రియ ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. కాని భూమిపై ఉండవలసిన వాటినన్నిటినీ నాశనం చేశాము కాబట్టి వేసవి అంటే అత్యంత అసౌకర్యమైన కాలమైంది. అసలు వేసవి అంటే ఎడారులలోనే అసౌకర్యంగా ఉండాలి. భూమి మీద జీవనం ఎంతో ఉన్నత స్థాయిలో ఉత్సాహంగా జరగవలసిన సమయమిది. ఎఱుకతో ఉంటే ఈ సమయమే మానవులకు కూడా ఎంతో మంచిది.

పాత, కొత్త ఏదీ లేదు

ఈ అనంత విశ్వంలో, పాత సంవత్సరం కొత్త సంవత్సరం అంటూ ఏమీ లేవు. ఈ ఎల్లలన్నీ మనం మన జీవితాన్ని లెక్కించుకోవానికి ఏర్పర్చుకున్నవి. అందువల్ల క్రితం సంవత్సరంతో పోల్చుకుంటే మానవునిగా పురోగమించామా లేదా గమనించాలి. మీ వ్యాపారం వృద్ధి చెంది ఉండవచ్చు. బాగా సంపాదించి ఉండవచ్చు. అది కాదు అసలు విషయం.

మానవునిగా క్రితం సంవత్సరం కన్నా కొద్దిగానన్నా మెరుగయ్యామా? వచ్చే సంవత్సరం ఇప్పటికన్నా మెరుగయ్యామా తెలుపడానికి ఒక చిహ్నం కావాలి. అన్నిటికన్నా మీరు మెరుగైన మానవులు కావాలి-ఇంకా సంతోషంగా, శాంతంగా, ప్రేమగా- అన్ని రకాలుగా ఉత్తమమైన మానవునిగా కావాలి. దానికి మీరేం చేయాలో మీరే నిర్ణయించుకోవాలి. మీరు ఆ విధంగా అడుగులు వేస్తే మీలో మానవత్వం పొంగి పొర్లి దివ్యత్వం సంభవిస్తుంది.
🌹🌹🌹🌹🌹
🙏 ప్రసాద్

సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 15

See the source image
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 15 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

🍃. తపస్సు 🍃

78. తపస్సు మనస్సుకు సంబంధించినది. మనస్సుతో చేయు సాధనయె తపస్సు దీని లక్షణములు:

1. మనస్సును ధ్యాన విషయమునందు లగ్నం చేయుట.
2. మనస్సు శుద్ధి కలిగి నిశ్చలంగా ఉండుట.
3. శారీరక, పరిసరముల పరిశుద్ధత.
4. కామ, క్రోధాదులు లేకుండుట.
5. సంకల్పరహితముగా ఉండుట.
6. మనోనిగ్రహము.

79. తపస్వులు ఆహారమును వర్జించి సాధన చేయగల శక్తి కల్గి ఉండవలెను. ఎపుడైతే సాధకుడు పైన తెల్పిన తపస్వి లక్షణములు కల్గి సాధన చేయునో, అప్పుడు అతనికి ఆహార ఆవశ్యకత లేక మానసిక శక్తితో తపస్సులో నిమగ్నమవగలడు. వారికి శ్వాస ద్వారానే విశ్వము నుండి శక్తి లభించును. శరీరము మనస్సు నిశ్చలమైనప్పుడు శక్తిని పొందే ఆవశ్యకత ఉండదు.

మామూలుగా శక్తి ఆహారం ద్వారా లభించును. కానీ తపస్సులకు అవసరమైన శక్తి కేవలం శ్వాస ద్వారానే లభించగలదు.

త్రివిధ తపస్సులు: 
1. ఆత్మానాత్మ వివేకముచే మనస్సును ప్రత్యగాత్మ యందు విలీనము చేయుట జ్ఞాన తపస్సు. ఇది ఉత్తమ తపస్సు.
2. ధ్యానధారణాదులచే మనస్సు నిలువరించి, సమాధిలోనుంచుట మధ్యమ తపస్సు.
3. కృచ్ఛంద్రాయణాదుల చేతను, ఉపవాసములచేతను, దేహేంద్రియములను కృశింపజేయుట కనిష్ఠ తపస్సు.
🌹 🌹 🌹 🌹 🌹

సాక్షిగా ఉండడం osho

సాక్షిగా ఉండడం  osho

Soubhagya

మనిషి సాక్షిగా వుండడం అభ్యసించాలి. తన విషయంలోనైనా, యితరుల విషయాల్లోనైనా అది సాధన చేసే జీవితం అపూర్వంగా వుంటుంది. ‘‘ఇది నేను చెయ్యడం లేదు. నేను సాక్షిని మాత్రమే. అక్కడ నా నిమిత్తం లేదు. ఆ చర్యతో నాకు సంబంధం లేదు. నేను దానికి బాహ్యంలో వున్నాను. కేవలం ప్రేక్షకుడిగా జరిగేది చూస్తున్నాను’’ అన్న విషయాన్ని మనిషి గుర్తు పెట్టుకోవాలి. తామరాకుపై నీటి బొట్టులా వుండడమంటే అదే.
మనిషి దాన్ని చిన్నచిన్న విషయాల నించే ప్రారంభించాలి. వుదాహరణకి మనం భోంచేస్తూ వుంటాం. భోజనం చేస్తున్నప్పుడు మననించే మనం వేరయి భోజనం చేస్తున్న వ్యక్తిని పరిశీలించాలి. అదొక అపూర్వ అనుభవం. అట్లాగే నడుస్తున్నప్పుడు నడుస్తున్న మన నుండి వేరయి మనల్ని పరిశీలించడం. ఈ క్రమంలో మెల్లమెల్లగా ఇతర విషయాల్లోనూ ప్రయోగాలు చేయవచ్చు. సాధారణంగా మనకు సంతోషం కలిగితే సంతోషంలో లీనమవుతాం. మనకు దుఃఖం కలగితే దుఃఖంలో మునిగిపోతాం. అంటే నువ్వు సంతోషమయిపోతావు. నువ్వు దుఃఖమయిపోతావు. ఇవి రెండు శాశ్వతం కావు. ప్రతి మనిషీ సంతోషం నించీ బయట పడతాడు. దుఃఖం నించీ బయట పడతాడు. అంటే అవి మనకు సంబంధించినవి కావు. ఇవి అంటని ఒక చైతన్య స్థితి ప్రతి మనిషిలో ఉంది. ఆ చైతన్య స్థితే మనమని గుర్తించినప్పుడు మనం వాటిని అంటే సంతోషాన్ని, దుఃఖాన్ని దాటి వాటిని పరిశీలిస్తాం. అప్పుడు సుఖాన్ని, దుఃఖాన్ని దాటి ఒక ఆనంద స్థితి అనుభవానికి వస్తుంది. నిజమైన మనిషితత్త్వం అదే. స్వామి రామతీర్థ పందొమ్మిదో శతాబ్దం ఆరంభంలో భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో ఒకడు. ఆయన వందేళ్ళ క్రితం అమెరికా వెళ్ళాడు. భారతీయ తత్వచింతనను పాశ్చాత్యులకు పరిచయం చేశాడు. రామతీర్థ చిత్రమయిన వ్యక్తి. మార్మికుడు. ఆయన ఎప్పుడూ ‘నేను’ అన్న మాటను వాడేవాడు కాడు. నేను వస్తున్నాను. నేను తింటున్నాను. నేను చెబుతున్నాను’’ అనేవాడు కాదు. నేను అన్న మాటలో ఎంతో అహం దాగి వుంటుంది. అధికారం వుంటుంది. ఆధిపత్యం వుంటుంది. అందుకని ఆయన ‘నేను’ అన్నమాటని పరిహరించేవాడు. కానీ ‘నేను’ స్థానంలో ఏదో వుండాలి కదా! అందుకని నేను ‘అన్న స్థానంలో’ ‘రాముడు’ అన్న మాటను వుపయోగించేవాడు. ఆ చెప్పడంలోనే రాముడు నేను కాదన్న అర్థముంది.
వుదాహరణకి ఆయనకు ఆకలి వేస్తోందనుకోండి ఆయన ‘‘నాకు ఆకలేస్తోంది అనేవాడు కాదు. రాముడికి ఆకలేస్తోంది’’ అనేవాడు. ఆయనకు తలనొప్పి వేసిందనుకోండి. రాముడికి తలనొప్పి వేస్తోంది అనేవాడు. రాముడు వేరు, తను వేరు అని ఆయన గుర్తించాడు. మనం ఇట్లాంటి సాధువుల్ని చూసే వుంటాం ఇట్లాంటి సన్యాసులు మనకు కేవలం భారతదేశంలోనే కనిపిస్తారు.
ఒకరోజు కొంతమంది ఆయన నటిస్తున్నాడని, పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని, జనాల్ని వంచిస్తున్నాడని ఆయన నిలదీసి అవమానించారు. దూషించారు. వాళ్ళు తిడుతున్న కొద్దీ ఆయన నవ్వుతున్నాడు. వాళ్ళందరూ ఆయన్ని అనరాని మాటలన్నా ఆయన చిరునవ్వు నవ్వుతూనే వున్నాడు. చివరికి యిక లాభం లేదనుకుని ఆ జనం వెళ్ళిపోయారు. ఆయన నవ్వడం మటకు ఆపలేదు. నవ్వుకుంటూనే తన శిష్యులున్న చోటికి వచ్చాడు. శిష్యుల్ని చూసి కూడా నవ్వాడు. గురువుగారి వింత ప్రవర్తన చూసి శిష్యులు విస్తుపోయారు. ‘‘గురువుగారూ! ఎందుకు నవ్వుతున్నారు! ఏమైంది’’ అన్నారు. రామతీర్థ శిష్యుల్ని చూసి ఈ రోజొక విషయం జరిగిందయ్యా! రాముడు దారంటే వెళుతూవుంటే ఎవరో నిలదీశారు. తిట్టారు. అవమానం పాలు చేశారు. ఆ చేసిన పనికి ఎంతో ఆనందించారు. కానీ పాపం రాముడు ఎంతో బాధ పడ్డాడు. రాముడికి ఎంతో యిబ్బంది కలిగింది. కానీ ఏం చెయ్యను. నేను రాముడికి బయట నిల్చున్నాను. అంతా చూస్తూనే వున్నాను’’ అన్నాడు.
మనిషి చైతన్యం మనిషి అహం నించీ బయటకు వచ్చి జరుగుతున్నదానికి సాక్షిగా వుండాలి. మనిషి సాధన చెయ్యాల్సింది అదే. సాధించాల్సింది అదే. సహజమైంది అదే.

ఓషో కథలు

ఓషో కథలు. *

మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఆ ప్రార్థన మన తీరని కోరికలతో నిండి వుంటుంది. ఎట్లాగయినా ఆ కోరికల్ని తీరుస్తాడని మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం. అంటే ప్రార్థన అన్నది బేరసారాలతో కూడి ఉంటుంది. దాన్ని మనం ప్రార్థన అంటాం.

ఒక వ్యక్తి నిరంతరం శివుణ్ణి పూజించేవాడు. ప్రార్థించేవాడు. ఉపవాసాలు చేసేవాడు. భజనలు చేసేవాడు. సంవత్సరాల తరబడి శివుణ్ణి ఆరాధిస్తూ ఎప్పటికయినా శివుడు ప్రత్యక్షమై తన కోరికలు తీరుస్తాడని తపించేవాడు. ఆ సమయం ఆసన్నమైంది.
ఒకరోజు హఠాత్తుగా శివుడు ఆ భక్తుడి ముందు ప్రత్యక్ష మయ్యాడు. కలలో కూడా ఊహించని ఆ పరిణామానికి అతను బిత్తరపోయాడు. సాక్షాత్తు శివుడే తనముందు నిల్చుంటే అతని ఆలోచనలు స్తంభించిపోయాయి. శివుడు ప్రసన్న వదనంతో భక్తుణ్ణి చూసి ‘‘నీకు మూడు వరాలు ప్రసాదిస్తున్నా. కోరుకో’’ అన్నాడు. ఒక్కసారిగా మూడు వరాలు అనే సరికి భక్తుడికి దిక్కుతోచలేదు. ‘‘స్వామీ! నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి’’ అన్నాడు. శివుడు చిరునవ్వు నవ్వి ‘‘అలాగే’’ అన్నాడు. ఆ వ్యక్తి తీవ్రంగా ఆలోచించాడు. పాతికేళ్ళ క్రితం అతనికి పెళ్ళయింది. అప్పటి నించీ అతను భార్య అజమాయిషీ కింద, అధికారం కింద నలిగిపోయాడు. ప్రతిదానికీ ఆమె అడ్డు చెప్పేది. తన మాటే నెగ్గేలా చూసుకునేది. అతని మనసులో భార్యపైన అంతులేని ఆగ్రహం వుంది. కానీ దాన్ని ఎప్పుడూ బయట పెట్టలేదు. నిగ్రహించుకున్నాడు. ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలి. ఇంతకుమించిన మంచి సమయం మళ్ళీ రాదు అనుకుని ‘‘స్వామీ! నా భార్యను చంపేయి’’ అన్నాడు. శివుడు ‘తథాస్తు’ అన్నాడు. దాంతో అతని భార్య చనిపోయింది. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలన్నవి అనివార్యం. కానీ ఎవరిపట్లా మరొకరికి పూర్తి ద్వేషం ఉండదు. ప్రేమ, ద్వేషం విడివిడిగా ఉండవు. మనం ప్రేమించే వాళ్ళనే ద్వేషిస్తాం. ద్వేషించేవాళ్ళనే ప్రేమిస్తాం. అతను తన కళ్ళముందే భార్య చనిపోతే దానికి తనే కారణమని తెలిసి విలవిల్లాడిపోయాడు. వాళ్ళ మధ్య అనురాగ క్షణాలు, కుటుంబంపట్ల ఆమె అంకిత భావం గుర్తుకొచ్చి అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వెంటనే శివుడి పాదాలపై పడి ‘‘స్వామీ! తప్పయిపోయింది. నా భార్యను దయచేసి బతికించండి’’ అన్నాడు. శివుడు నవ్వుతూ ‘‘అలాగే’ అన్నాడు. అతని భార్య తిరిగి ప్రాణాలతో లేచింది. ఆ రకంగా రెండు వరాలు పూర్తయ్యాయి. ఇంక ఒక్క వరమే మిగిలింది. తొందరపాటువల్ల వరాలు అట్లా వ్యర్థమయ్యాయని ఆ వ్యక్తి దిగులుపడి కనీసం మూడో వరం అర్థవంతంగా ఉండాలని అనుకుంటూ శివుడితో ‘‘స్వామీ! నాకు కొద్దిగా సమయమివ్వండి’’ అన్నాడు. శివుడు ‘‘సరే! నీ యిష్టం నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తలచుకో. ప్రత్యక్షమవుతాను’’ అని అదృశ్యమైపోయాడు. రోజూ ఆ వ్యక్తి ఏం కోరుకోవాలా? అని ఆలోచించేవాడు. అతని దగ్గర ఒక వరమే వుంది. దాన్ని జాగ్రత్తగా ఆలోచించి కోరుకోవటం మంచిది. లేకుంటే ఆ కోరిక నిష్ఫలమవుతుంది. అనుకుని ఎప్పుడూ దాన్ని గురించే ఆలోచించి ఎటూ నిర్ణయించలేకపోయేవాడు. సంవత్సరం గడిచిపోయింది. భక్తుడు ఒకరోజు శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్ష మయ్యాడు. భక్తుడు శివుడి పాదాలపై పడి ‘‘స్వామీ! నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏం కోరాలో నాకు అంతుబట్టడం లేదు. దయచేసి నేను ఏం కోరాలో మీరే చెప్పండి’’ అని భారాన్ని శివుడిపై వేశాడు. దానికి శివుడు ‘‘నాయనా! నువ్వు కోరుకోదగిన వరం ఒకటుంది. అది సాటి లేనిది. దానితో పోల్చదగింది మరొకటి లేదు. అది కోరుకుంటే నీకు అన్నీ నెరవేరినట్లే. అది వాంఛా రాహిత్యం. కోరికలు లేని తనం. ఆ కోరికలు లేనితనాన్ని నువ్వు కోరుకుంటే నీకు అన్నీ నెరవేరుతాయి. తక్కినవేమి కోరినా దాని ముందు అన్నీ నిష్ప్రయోజనమే’’ అన్నాడు. భక్తుడు ‘‘స్వామీ! దయతలచి నాకు వాంఛా రాహిత్యాన్ని ప్రసాదించు’’ అన్నాడు.