Christ Consciousness

 


10వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 10th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita


https://youtube.com/shorts/5r6v9HLDZKU


🌹 10వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 10th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita 🌹

🍀 10వ పాశురం – యోగనిద్రపై మధుర చమత్కార గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 ఈ 10వ పాశురంలో గోదాదేవి, కృష్ణుడిని పొందాలనే తన కోరికను, తోటి గోపికల ఆలస్యంతో విసుగు చెంది, తనను నిందించిన ఒక గోపికను మేల్కొన లేదేమని ప్రశ్నిస్తూ, అనుమానం వ్యక్తం చేస్తూ, పూజ పూర్తయి, యోగనిద్రను పొందావా అంటూ చతురతతో ఉత్తేజ పరిచే ప్రయత్నంగా కొనసాగుతుంది. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹


భగవద్గీత మత గ్రంథం కాదు.. యోగ గ్రంథం - వేదాంత గ్రంథం / The Bhagavad Gita is not a religious text; it is a text on yoga and Vedanta philosophy.



🌹 భగవద్గీత మత గ్రంథం కాదు.. యోగ గ్రంథం - వేదాంత గ్రంథం - మద్రాస్ హైకోర్టు 🌹

📚 ప్రసాద్ భరద్వాజ

భగవద్గీత , వేదాంతం, యోగాలను కేవలం ఒక మతానికి మాత్రమే పరిమితం చేయలేమని మద్రాస్ హైకోర్టు ఆసక్తికరమైన వార్తలు చేసింది.


భగవద్గీత, వేదాంతం, యోగా వంటి అంశాలను బోధించడం వల్ల ఒక సంస్థను.. మతపరమైన సంస్థగా ముద్ర వేయలేమని స్పష్టం చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) కింద ఒక ట్రస్ట్ దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో.. జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఈ కీలక తీర్పును వెలువరించారు. భగవద్గీత మతాలకు అతీతమైనదని.. భారతీయ సంస్కృతికి చిహ్నమని ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు పేర్కొంది.

కోయంబత్తూరుకు చెందిన అర్ష విద్యా పరంపర ట్రస్ట్.. వేదాంతం, సంస్కృతం, హఠయోగం వంటి అంశాలను బోధిస్తూ ప్రాచీన గ్రంథాల డిజిటలైజేషన్ పనులను నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ విదేశీ నిధులను పొందేందుకు 2021లో ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ దరఖాస్తును తిరస్కరిస్తూ.. ట్రస్ట్ కార్యకలాపాలు మతపరమైనవిగా కనిపిస్తున్నాయని.. ముందస్తు అనుమతి లేకుండా రూ. 9 లక్షల విదేశీ విరాళాలను పొందిందనే.. రెండు ప్రధాన కారణాలను చూపింది.

ఈ కేసును విచారించిన జస్టిస్ స్వామినాథన్.. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలను తప్పుపట్టింది. భగవద్గీత కేవలం ఒక మతానికి పరిమితమైనది కాదని.. అది ఒక మోరల్ సైన్స్ అని. భారతీయ నాగరికతలో ఒక భాగమని పేర్కొంది. అంతేకాకుండా యోగాను మతపరమైన కోణంలో చూడటం అమానుషమని వ్యాఖ్యానించింది. యోగా అనేది విశ్వవ్యాప్తమైనదని.. అలాగే వేదాంతం మన పూర్వీకులు అందించిన స్వచ్ఛమైన తత్వశాస్త్రమని తెలిపింది.

ఎఫ్‌సీఆర్ఏ చట్టం ప్రకారం ఒక సంస్థ మతపరమైనదా కాదా అని నిర్ణయించేటప్పుడు అధికారుల వద్ద కచ్చితమైన ఆధారాలు ఉండాలని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. కేవలం అలా కనిపిస్తోంది అనే అనుమానంతో దరఖాస్తును తిరస్కరించడం సరికాదని పేర్కొంది. 2021లో చేసుకున్న దరఖాస్తుపై 2024 అక్టోబర్‌లో చర్యలు తీసుకోవడం భావ్యం కాదని.. త్వరితగతిన, పారదర్శకంగా వ్యవహరించడం సుపరిపాలనలో ప్రాథమిక సూత్రమని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తుచేసింది.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తిరస్కరణ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. గతంలో జరిగిన నిబంధనల ఉల్లంఘనకు (రూ. 9 లక్షల విరాళం) సంబంధించి ట్రస్ట్ ఇప్పటికే జరిమానా కట్టి రాజీ పడినందున.. దాన్ని మళ్లీ కారణంగా చూపలేమని హైకోర్టు పేర్కొంది. ఈ దరఖాస్తును మళ్లీ కొత్తగా పరిశీలించి.. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆధ్యాత్మికత, మతం ఒకటి కాదని.. భారతీయ మూలాలను మతపరమైన కోణంలో మాత్రమే చూడటం సరికాదని ఈ తీర్పు ద్వారా కోర్టు స్పష్టం చేసింది. ఇది సాంప్రదాయ విద్య, యోగాను ప్రచారం చేసే అనేక సంస్థలకు ఊరటనిచ్చే అంశం.

🌹🌹🌹🌹🌹

నరనారాయణ అవతారాలు - బదరీనాథుని ఆవిర్భావం - బదరీనాథ్ క్షేత్రం. Nara-Narayana Incarnations - The Manifestation of Badrinath - The Badrinath Shrine.


🌹 నరనారాయణ అవతారాలు - బదరీనాథుని ఆవిర్భావం - బదరీనాథ్ క్షేత్రం పురాణగాధ. ఊర్వశి జననం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


బ్రహ్మ మానస పుత్రుడైన ధర్ముడికి దక్ష ప్రజాపతి తన పది మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేశాడు. ధర్మానికి అధిష్టాన దేవత అయిన ధర్ముడు తపస్సు చేసి విష్ణుమూర్తి అనుగ్రహం సంపాదించాడు. మహావిష్ణువు వరం కోరుకోమనగా శ్రీహరిని పుత్రుడిగా కావాలని కోరుకున్నాడు.తగిన సమయంలో జన్మిస్తాను అని వరమిచ్చి విష్ణువు అంతర్ధానమయ్యాడు.

కొంతకాలానికి ధర్ముడికి విష్ణువు "నరుడు నారాయణుడు" అనే నామాలతో ఇద్దరు కుమారులుగా జన్మించాడు. ధర్మదేవత ధర్ముడి పుత్రులైన నరనారాయణులు వేద విద్యలతో పాటు అధర్వణ వేదంలోని యుద్ద విద్యలు అభ్యసించారు. బ్రహ్మదేవుడు నరుడికి 'అజగవము' అనే ధనుస్సు, నారాయణుడికి 'శార్ఞగము"అనే ధనుస్సు అక్షయ తూణీరాలతో ప్రసాదించాడు.

నరనారాయణులు తపోదీక్ష స్వీకరించి హిమాలయాలలోని బదరికావనానికి వెళ్లి తపస్సు చేయసాగారు. బదరికా వృక్షములతో నిండి ఉండటం చేత ఆ వనానికి బదరికావనం అని పేరు వచ్చింది. బదరికాశ్రమం ఏర్పరచుకుని నరనారాయణులు లోకంలో ధర్మ సంస్థాపనకై చేస్తున్న తపస్సుకి వేయి సంవత్సరాలు గడిచాయి.

హిరణ్యకశిప సంహారం తరువాత రాజైన ప్రహ్లాదునికి చ్యవన మహర్షి ద్వారా సంవత్సరాల తరబడి ధర్మ సంస్థాపనకై తపస్సు చేస్తున్న మహర్షులు ఉండే ప్రదేశాలైన నైమిశారణ్యం, బదరికా వనం గురించి విన్నాడు. యజ్ఞ యాగాదులతో, నిరంతర తపస్సులతో తపోభూములుగా ప్రసిద్ధి కెక్కిన రెండు పుణ్యస్థలాలను దర్శించాలని బయలుదేరాడు.

మొదట నైమిశారణ్యం చేరిన ప్రహ్లాదుడు అక్కడి మహర్షులను దర్శించి ఆశీస్సులు పొందాడు. వారి ద్వారా నరనారాయణుల గురించి విని బదరికావనం బయలుదేరి వెళ్లాడు. బదరికాశ్రమంలో నిశ్చల ధ్యానంలో ఉన్న నరనారాయణులను దర్శించాడు. నారవస్త్రాలు ధరించి కృష్ణాజినాలపై తపస్సులో ఉన్న నర నారాయణుల ముందు ధనుస్సులు, అక్షయ తూణీరాలు (బాణాలు) ఉండటం గమనించి విస్మయం చెందాడు.

తపస్సు చేసేవారి వద్ద ఆయుధాలు ఉండటం ధర్మవిరుద్ధం అని భావించి ప్రహ్లాదుడు వారితో మీరు బ్రహ్మ వంశస్థులు, బ్రాహ్మణులైన మీరు మీ వర్ణాచారం ప్రకారం తపస్సు చేయాలి. మరి ఈ ధనుస్సులు బాణాలు ఎందుకు చేపట్టారు? ధర్మదేవత ధర్ముడి పుత్రులైన మీరు అధర్మంగా ఆయుధాలు చేపట్టడం తప్పు. ధర్మదేవత పుత్రులే అధర్ములైతే నేను సహించను. మీరు ఆయుధాలను తక్షణం వదిలేయండి" అని హెచ్చరించాడు.

నరుడు నవ్వి "ప్రహ్లాద మహారాజా! ధర్మ పరిరక్షణ కూడా బ్రాహ్మణుల విధ్యుక్త ధర్మంలో భాగము అని మీకు తెలియదా! వేదశాస్త్రాలతో పాటు యుద్దవిద్యలు మీవంటి వారికి నేర్పించేది మేమే అని మరచి పోయారు. సమస్త విద్యలకు ఆచార్యులమైన మేము తపస్సు చేయడానికి, ధనుస్సు ధరించడానికి అర్హులం, సమర్ధులం. అనవసర ప్రసంగం మాని మీరు మీ దారిన వెళ్ళండి" అని అన్నాడు.

మహావిష్ణువు ప్రియ భక్తుడైన ప్రహ్లాదునికి నరుడు చులకనకి ఆగ్రహం వచ్చింది. "మీరు మా తోటి యుద్దం చేయగల సమర్థులా? రండి!తేల్చుకుందాం" అని వారితో యుద్దానికి దిగాడు. సరేనని నరనారాయణులు ధనుస్సులు ధరించి యుద్దానికి దిగారు.

ప్రహ్లాదుడు, నరనారాయణుల మధ్య భీకర ధనుర్యుద్ధం మొదలైంది. బాణాలు శరపరంపరలుగా కురిశాయి. ఆకాశం బాణాలతో కమ్ముకుపోయింది. నారాయ ణుని ప్రియభక్తునికి, నారాయణుని అంశావతారాలైన నరనారాయణులకు నూరు సంవత్సరాలు యుద్దం జరిగింది. ప్రశాంత వాతావరణం కలిగిన బదరికావనం ధనుష్టంకార ధ్వనులతో, బాణాల శబ్దాలతో దద్దరిల్లి పోయింది.

తాపసులందరు యుద్దం ఆపేలా చేయమని వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుని ప్రార్ధించారు. మొరలాలకించిన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, ప్రహ్లాదుని చూసి "ప్రహ్లాదా! నరనారాయణులు నా అంశావతారులుగా జన్మించారు. జితేంద్రియులైన వీరు భవిష్యత్తులో ధర్మ సంస్థాపన కోసం జన్మించబోయే అవతార మూర్తులుగా ఉండటానికి ఈ జన్మలో ధనుర్విద్యలు అభ్యసించి ధనుర్భాణాలు ధరించారు. ఈ జన్మ లో తపస్సుతో, వచ్చే జన్మలో శస్త్రాస్త్రాలతో ధర్మ ప్రతిష్టాపన చేస్తారు కనుక నా అవతార మూర్తులతో యుద్దం తక్షణం విరమించి నీ రాజ్యానికి వెళ్లుము" అని ప్రబోధించాడు.

ప్రహ్లాదుడు నారాయణునితో పాటు నరనారాయణులకు నమ స్కరించి తన రాజ్యానికి వెళ్లి పోయాడు. నరనారాయణులు శ్రీమహావిష్ణువుకి నమస్కరించి "శ్రీమన్నారాయణా! నీవు "బదరీనాథుడు" గా ఇక్కడ స్వయంభువు మూర్తిరూపంలో వెలసి భక్తులకు నీ సుందర విగ్రహ దర్శనం కలిగించుము" అని ప్రార్ధించారు.

శ్రీహరి వారి ప్రార్థనకి సంతోషించి "నేను బదరీనాథుడిగా స్వయంభువునై ఇక్కడ అవతరిస్తాను. మీరు మీ జన్మాంతమున నాకు ఇరు వైపులా నర-నారాయణ పర్వతములుగా వెలసి నన్ను దర్శించే భక్తులను రక్షిస్తుంటారు. కలియుగాంతం వరకు ఈ ప్రదేశం బదరీనాథ్ క్షేత్రంగా ప్రసిద్ధి చెంది ఉంటుంది" అని వరమిచ్చి వెలిసాడు.

కొంతకాలానికి నరనారాయణులు దేహం వదలి నారాయణునిలో లీనమై పోయారు. వారి దేహాలు పర్వతాలుగా మారి బదరీనాథునికి ఇరువైపులా నర-నారాయణ గిరులుగా ప్రసిద్ధి చెందాయి. బదరీనాథుడు రెండు పర్వతాల మధ్య ఉన్నత ప్రదేశంలో ఉండి భక్తులకు దర్శన భాగ్యం ఇస్తున్నాడు.

🌹🌹🌹🌹🌹