Showing posts with label Naraka Chaturdasi. Show all posts
Showing posts with label Naraka Chaturdasi. Show all posts

నరకుడికి మోక్షపురి.. నరకాసురుడి వధ జరిగింది ఇక్కడే..! The demon Narakasura was killed right here..!


🌹నరకుడికి మోక్షపురి.. నరకాసురుడి వధ జరిగింది ఇక్కడే..!🌹

🌹 the demon Narakasura was killed right here..!🌹



చల్లపల్లి(కృష్ణా జిల్లా): పవిత్ర కృష్ణానదీ తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రాల్లో చల్లపల్లి మండలం నడకుదురు గ్రామం ఒకటి. నరకాసుర సంహార క్షేత్రంగా, మోక్షపురిగా చరిత్ర ప్రసిద్ధి గాంచి కాలక్రమేణా నరకొత్తూరు, నరకదూరుగా మారి నడకుదురుగా స్థిరపడింది. గ్రామంలో కృష్ణానది గర్భంలో ఉన్న శ్రీ ఫృద్వీశ్వరస్వామి ఆలయం, చెంతనే ఉన్న పాటలీవనం సందర్శనీయ స్థలాలు. నడకుదురు నరకునికి మోక్షం ప్రసాదించిన క్షేత్రంగా, మోక్షపురిగా గుర్తింపు ఉంది.


నరకాసురుడు పూజించిన స్థలం..

నారద మహాముని నరకాసురుడితో నీవు భూదేవి పుత్రుడవని తెలియజేసి, ద్విముఖుడనే రాక్షసుడిని సంహరించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకునేందుకు పుష్కరకాలం స్వయంభువైన శ్రీ ఫృద్వీశ్వరుని పూజించమని సూచిస్తాడు. నరకాసురుడు ఫృద్వీశ్వరాలయానికి చేరుకుని కృష్ణానదిలో నిత్య స్నానమాచరిస్తూ 4,320 రోజుల పాటు స్వామిని పూజిస్తాడు. అదే నడకుదురు గ్రామంలోని ఫృద్వీశ్వరాలయం.


వధ జరిగింది ఇక్కడే..

నరకాసురుడి ఆగడాలతో అల్లాడిపోతున్న ముల్లోకాల వాసులను కాపాడేందుకు నరకాసురుని సంహరించ దలచిన శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై ఈ ప్రాంతంలో ఉన్న నరకాసురుడితో యుద్ధానికి దిగుతాడు. యుద్ధంలో శ్రీకృష్ణుడు మూర్చబోగా, సత్యభామ ఫృద్వీశ్వర క్షేత్రం సమీపంలో నరకాసురుని సంహరించినట్లు చారిత్రక కథనం. భూదేవికి ప్రతిరూపం, నరకాసురుని తల్లిలాంటి సత్యభామ నరకాసురునికి ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించి, నదీతీరాన పిండ తర్పణాలు వదిలినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.



కృష్ణ–భామల విహార స్థలం..

నరకాసుర సంహారం అనంతరం ఆలయం చెంతనున్న పాటలీవనంలో విశ్రాంతి తీసుకున్న శ్రీకృష్ణుడు, సత్యభామలు లక్ష్మీనారాయణుని విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు పూజలు చేసినట్లు కథనం. నడకుదురు ఆలయం వద్ద పాటలీవృక్షంకింద లక్ష్మీనారాయణుని విగ్ర హం నేటికీ భక్తుల పూజలందుకుంటోంది.


మహిమాన్వితం పాటలీవృక్షం ..

గ్రామ చారిత్రక, ఆథ్యాత్మిక వైభవానికి నిదర్శనం నడకుదురు ఫృద్వీశ్వరాలయం చెంతనున్న దేవతావనం. దేవలోక వనమాత పాటలీ వృక్షాలు దేశంలో కేవలం కాశీ తర్వాత నడకుదురులో మాత్రమే ఉన్నాయి. కరకట్ట దిగువనే నదిలో కొబ్బరిచెట్లు, పాటలీవృక్షాలు, ఉసిరిచెట్ల మధ్య ఆలయం ఉంటుంది. చుట్టూ పసుపుతోటలు, వాణిజ్య పంటలతో చల్లని వాతావరణం భక్తులకు ఆలయం స్వాగతం పలుకుతుంది. దీపావళి ప్రత్యేకత సంతరించుకుంటుంది.


నరక చతుర్దశి పురాణం కధ Naraka Chaturdashi Purana story (a YT Short)


https://youtube.com/shorts/9c7fkmBvz7Q


నరక చతుర్దశి పురాణం కధ

Naraka Chaturdashi Purana story

(a YT Short)

🏹 నరకాసుర వధ నరక చతుర్దశి కధ 🏹 Narakasura's killing story 🏹 (a YT Short)



https://youtube.com/shorts/ZGVaQ2h0kWU


🌹 🏹 నరకాసుర వధ నరక చతుర్దశి కధ 🏹🌹

🌹 🏹 Narakasura's killing story 🏹🌹


(a YT Short)


మీకు మీ కుటుంబ సభ్యులకు నరకచతుర్దశి శుభాకాంక్షలు 🏹 Happy Naraka Chaturdashi to you and your family members 🏹


🌹🏹 మీకు మీ కుటుంబ సభ్యులకు నరకచతుర్దశి శుభాకాంక్షలు 🏹🌹

ప్రసాద్ భరద్వాజ


🌹🏹 Happy Naraka Chaturdashi to you and your family members 🏹🌹

Prasad Bharadwaj


నరకచతుర్దశి, దీపావళి శుభాకాంక్షలు, Good Wishes & Blessings on Narak Chaturdashi, Deepavali

🌹🍀. నరకచతుర్దశి, దీపావళి శుభాకాంక్షలు, Narak Chaturdashi, Deepavali Good Wishes and Blessings. 🍀🌹

🌷. ప్రసాద్‌ భరధ్వాజ.


🌻. దీపావళి విశిష్టత - మహా లక్ష్మీదేవి పూజ 🌻


దీపావళి అంటే దీపాల వరుస. నరక చతుర్దశి రోజున నరక సంహారం జరిగింది. మర్నాడు అమావాస్య కనుక, చీకటిని పారద్రోలడానికి అందరూ దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు. వామనుడు బలి చక్రవర్తిని 3వ పాదంతో పాతాళానికి పంపించిన రోజు. విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడైన రోజు. అమావాస్య రోజు చీకటిని పోగొట్టి ఈ జగత్తుకు వెలుగును ప్రసాదించేదే దీపావళి. చీకటి వెలుగుల సమాహారమే దీపావళి. (కష్ట సుఖాల కలయికే ఈ జీవితం అని అంతరార్థం..)

దీపావళి 5 రోజుల పర్వదినం. ధన త్రయోదశి-- నరక చతుర్దశి-- దీపావళి-- బలి పాడ్యమి-- భగినీ హస్త భోజనం (యమ ద్వితీయం). భగినీహస్త భోజనం రోజు అక్క-తమ్ముడు, అన్నా-చెల్లెలు ఉన్నవారు తప్పనిసరిగా సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేయాలని శాస్త్రం. ఎవరైతే సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేస్తారో! వారి సోదరులకి అపమృత్యు దోషం ఉండదు, రోగాలు దరిచేరవు. భోజనం పెట్టిన సోదరికి సంపూర్ణ ఐదోతనం ప్రాప్తిస్తుంది. హిందూ సాంప్రదాయంలో బంధువుల తోటి కుటుంబమంతా కలవడమే పండగంటే. పాడ్యమి రోజు కేదార గౌరీ నోము నోచుకుంటారు. కొండ ప్రాంతంలో గౌరమ్మ నోములు అంటారు.

ఈ రోజు సాయంత్రం ఇంటి ముందు, దేవుని దగ్గర దీపాలు వెలిగిస్తారు. కొంతమంది మైనపు కొవ్వొత్తులు వెలిగిస్తారు. అది మన సాంప్రదాయం కాదు. దీపం అంటే మట్టి ప్రమిదలో నూనెతో దీపారాధన చేయాలి. (మానవ శరీరమే మట్టి ప్రమిద. మట్టి ప్రమిదలో వెలిగే జ్యోతి స్వరూపమే మన ప్రాణం. దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు..) దీపపు వెలుగులో లక్ష్మీ ఉన్నట్లుగా భావించాలి. దీపాలు వెలిగించి అలాగే భూమి మీద పెట్టకూడదు. మనందరినీ భరించే భూమాత వేడిని భరించలేదు. అందుకే ప్రమిదలలో దీపారాధన చేస్తారు. దీపాలు వెలిగించేటప్పుడు కొత్త ప్రమిదలు వాడాలి. ముందు సంవత్సరం ప్రమిదలు వాడరాదు.

దీపావళి అనగానే ఈ రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి పూజ చేస్తారు. దీపావళి రోజున ఇంటిముందు శుభ్రంగా కడిగి ముగ్గు పెట్టాలి. లక్ష్మీదేవి వస్తుంది కనుక ఇల్లు శుభ్రంగా ఉంచి, ఆ తల్లికి ఆహ్వానం పలకాలి. ఈరోజు సూర్యోదయానికి 4 ఘడియల ముందే లేచి, ఒక టపాసులు కాల్చి, జ్యేష్ఠా లక్ష్మీదేవిని దూరం చేయడం కోసం నువ్వుల నూనెతో తలస్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత తీపి తినాలి. దీపావళి రోజు లక్ష్మీదేవి విగ్రహానికి పసుపు- కుంకుమ- గంధం- అక్షింతలతో అర్చించి, పంచామృతాలతో అభిషేకం చేసి, లక్ష్మీ శతనామ స్తోత్రం, లక్ష్మీ సహస్ర నామాలతో పూజిస్తారు. శ్రీ సూక్తంతో షోడోపచార పూజ చేస్తారు. ఈరోజు 108 రూపాయి నాణేలు (రూ.1/- రూ2/- రూ5/- నాణాలు) శుభ్రంగా పాలతో కడిగి, సాయంత్రం 6 గంటలకి ఒక్కొక్క నాణెంతో లక్ష్మీ అష్టోత్తర పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత పూజకు ఉపయోగించిన నాణాలు ఎర్రటి వస్త్రంలో భద్రపరచి, వాటిని బీరువాలో దాటిపెడితే! సంవత్సరమంతా వారి ఇంట ధనానికి లోటు ఉండదు. ఈ రోజు లక్ష్మి పూజ చేసేవారికి లక్ష్మీ అనుగ్రహం తప్పకుండ కలుగుతుంది.

పూజ పూర్తవగానే టపాసులు కాలుస్తారు. దీపావళి రోజున కాల్చే టపాసులు, మతాబులు అన్ని వెలుగులు చిమ్ముతూ ఉంటాయి. ఈ వెలుగులకి, శబ్దాలకి మనకున్న దారిద్ర్య, దుఃఖాలను పోవాలని పండగ చేసుకుంటారు. దీపావళి పండగ వర్షాలు తగ్గి, చలికాలం వచ్చే సమయం కనుక జ్వరాలు, అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి టపాసులు కాల్చడం ద్వారా, క్రిమికీటకాలు నశిస్తాయి. పూర్వం దీపావళికి మట్టి ప్రమిదలు వెలిగించి, కాగడాలు (దివిటీలు) పట్టుకొని గ్రామమంతా తిరిగేవారు. ఆటపాటలతో గడిపేవారు. ఈ విధంగా పండగ చేసుకోవడం వల్ల శబ్ద, ధ్వని కాలుష్యం, మందుల యొక్క కాలుష్యం ఉండేది కాదు. టపాసులు కాల్చినాక పెద్దలు తీపి తినిపిస్తారు.

🌹 🌹 🌹 🌹 🌹




నరక చతుర్థశి శుభాకాంక్షలు, Good Wishes on Naraka Chaturdhashi


🌹🍀. నరక చతుర్థశి శుభాకాంక్షలు అందరికి, Naraka Chaturdhashi Good Wishes to All 🍀🌹

🌻. ప్రసాద్ భరద్వాజ

🌴. నరక చతుర్ధశి విశిష్టత - తత్వ విచారణ 🌴


శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన రోజు నరక చతుర్ధశి. నరకాసురుడు ప్రాగ్-జ్యోతిషపురం అనే రాజ్యానికి రాజు. ప్రస్థుతం అది అస్సాంలోని గౌహతి ప్రాంతం. ఆ రాజ్యంలో పదహారు వేలమంది స్త్రీలు నరకాసురుని వద్ద బంధీలుగా ఉండేవారు. అంతటితోనే కాక ఋషులను హింసించేవాడు. శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించాలని అనుకున్నాడు, వాడు భూదేవి సంతనం కావడంచే అమె అంగీకారం కోసం వేచి చూసాడు. భూదేవి అవతారమైన సత్యభామ తనతో నరకాసురుడిని వధించడానికి ఒప్పుకొని శ్రీకృష్ణునికి యుద్దంలో సహాయం చేసింది, అట్లా నరకాసురుడి వధ జరిగింది. పదహారు వేల మంది స్త్రీలు తిరిగి వారిని తమవాళ్ళు అంగీకరించరు అని శ్రీకృష్ణుడినే అంగీకరించమని కోరారు. అట్లా కృష్ణుడు వారిని అంగీకరించాడు. నరకాసురుడి వధ అనంతరం ఆ రాజ్యంలోని వారందరికి అందకారం నుండి బయటకు వచ్చారు, కనుక సంతోషానికి గుర్తుగా దీపాలతో అలంకరించుకొని పండగ జరుపుకున్నారు. అదే దీపావళి పండగ. అయితే మనం కథ వెనక ఉన్న సారాంశం గమనించాలి.


🍀. నరకాసుర వధ తత్వ విచారణ 🍀

ప్రపంచం మొత్తాన్ని మన శరీరంలో చూసుకోవచ్చు. శాస్త్రాలు విశ్వంలో ఉన్న వివిద అంశాలని చెప్పడానికి మానవ శరీరంతో పోల్చి చూపిస్తాయి. ఇందులో ఉండే క్రమాన్ని సవరించుకోగలిగితే ప్రపంచం అంతా అట్లానే సవరించ బడుతుంది. రక రకాలైన ప్రవృత్తులు ఎట్లా పైకి వస్తూ ఉంటాయి ఆయా ఆయా సమయాల్లో ఆయా మనుషుల ప్రవృత్తులని గమనించి చరిత్రలో జరిగిన సందర్భాలను మన ఋషులు మనకు అందించారు. ఇలాంటి ప్రవృత్తిని మంచిది కాదు, కనుక దాన్ని అణిచివేయాలి అని చూపిస్తారు. అందులో మనకు ఆ కాలంలో ఏమి జరిగింది తెలుస్తుంది అంతే కాక మన ప్రవృత్తిని ఎట్లా మార్చుకోవాలో తెలుస్తుంది.

మనకు సమన్వయం చేసుకోనేప్పుడు అది కేవలం భావన కోసం మాత్రమే అని పిస్తుంది. అయితే చరిత్రలో మనకు కనిపించే ఇతిహాస పురాణాలలో కనిపించనివి ఎన్నో జరిగి ఉన్నాయి, కానీ అందులో మనం తెలుసు కోవాల్సిన సారాంశం అంత లేనందున వాటిని మనదాకా అందించలేదు తప్ప మనకు తెలియని ఎంతో చరిత్ర ఉంటుంది. అయితే మన ఇతిహాస పురాణాల్లో మనకు కథ మాత్రమే కాక మనల్ని సవరించుకొనే ఎన్నో రహస్యాలు ఉంటాయి.నరకాసురుడు చరబట్టిన పదహారువేల మంది చివరికి కృష్ణుడినే కోరుకున్నారు. పదహారు అని చెప్పినప్పుడు మనకు సమన్వయం చేసుకోవచ్చు. మనలో పదహారు అంశాలు ఉంటాయి.

శరీరం తయారు కావడానికి కావల్సిన పంచ భూతాలు, ఆ పంచ భూతములకు ఐదు గుణములు ఉన్నాయి. నీరుకు రుచిని తెలిపే గుణం, అగ్నికి రంగుని చూపే, మట్టికి వాసన గుర్తించే గుణం, గాలికి స్పర్శ తెలిపే గుణం, ఆకాశానికి శబ్దాన్ని వినిపించే గుణం ఉంది. ఈ ఐదింటిని గుర్తించడానికి ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఇన్నింటిని క్రమ బద్దం చేసే శక్తి మనస్సుకు ఉంది. మొత్తం పదహారు అంశాలు. అయితే వీటన్నింటిని వాడుకొనే యోగ్యత ఉంది. ఇవన్నీ వాడుకోవాల్సింది ఎవరి కోసం. అయితే వీటన్నింటిని మనం భగవంతుని కోసం వాడాలి. కానీ ఈ ప్రకృతిలో పడ్డాక అన్నింటిని మనకోసమే వాడుకుంటాం. ఏది చూసినా నాకే అని అనుకుంటాం.

చెడిన మనస్సు ఉంటే జీవితం నరకం అవుతుంది, అట్లాంటి ప్రవృత్తి కలవాడే నరకుడు. నరకాసురుడు ఉండే నగరం పేరు ప్రాగ్ జ్యోతిష పురం, జ్యోతిష అంటే 'కాంతి కల', ప్రాగ్ అంటే 'పోయిన', అంటే ఒకప్పుడు ఉన్న కాంతిని కోల్పోయిన నగరం అని అర్థం వస్తుంది. మనకూ ఒకనాడు మంచి శరీరాలు ఉండేవి, కానీ ఈనాడు మనకు ఉన్న శరీరాలు మురికి స్రవించేవి. మనం ఏది కోరుకుంటే అది జరగాల్సిన స్థితి ఉండేదట. మనం ఈ ప్రకృతిని అంటించు కుంటున్నాం కనుక మనకు ఈ స్థితి. శరీరాని కంటే వేరే నేను ఒకడిని ఉన్నాను అనికూడా తెలియక పడి ఉన్నాం. ఏదో ఒక పరిస్థితిలో ఎవరో చెబితే కనీసం ఆలోచించేంత శక్తి మానవునికి ఉంది. కనీసం చివరి క్షణాల్లో అయినా గుర్తించే అవకాశం ఉంది.

మానవ జన్మలో మనం ఎన్నో సార్లు పతనం అయినా ప్రయత్నం చేస్తే బాగుపడే అవకాశం ఉంది. ఆసురీ ప్రవృత్తులని దూరం చేసుకొనే ప్రయత్నం చేయాలి. శరీరం, అనుభవించే గుణాలు, జ్ఞానేంద్రియాలు మరియూ మన మనస్సుని అన్నింటిని శ్రీకృష్ణ మయం చేస్తే ఈ ప్రాగ్ జ్యోతిష పురం అనే మన శరీరం ఆనందమయం అవుతుంది. కొత్త కాంతి కలది అవుతుంది, నరక చతుర్థశి - దీపావళి మనకు అదే విషయాన్ని తెలుపుతుంది.

🌹 🌹 🌹 🌹 🌹