శ్రీ విష్ణు అష్టకము భావార్ధ సహితం Sri Vishnu Ashtakam with Meaning (a devotional YT Video)


https://youtu.be/TETEdMyLRqo

🌹 శ్రీ విష్ణు అష్టకము భావార్ధ సహితం
Sri Vishnu Ashtakam with Meaning 🌹


🙏 ఓ ప్రభూ! వరాలను ప్రసాదించేవాడా! నీకు నమస్కారం. ఓ కేశవా! నేను నీ సేవకుడను. నీకు నమస్కారం. నారదునిచే పూజించబడిన పాదాలు కలవాడా! నీకు నమస్కారం. నీ పాదాలను నేను శరణు పొందుతున్నాను, నీకు నమస్కారం. 🙏

ప్రసాద్‌ భరధ్వాజ.

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹




బీష్మాష్టమి శుభాకాంక్షలు Greetings on Bhishma Ashtami

🌹 బీష్మాష్టమి శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 Happy Bhishma Ashtami to everyone 🌹
Prasad Bharadwaj



భీష్మాష్టమి - భీష్మ అష్టమి వ్రత కథ. Bhishma Ashtami - Vratam Katha.


🌹 భీష్మాష్టమి..విష్ణు నామం స్మరిస్తే పుణ్యఫలాలు మీ సొంతం - భీష్మ అష్టమి వ్రత కథ.. 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Bhishma Ashtami.. If you remember Lord Vishnu's name, the sacred benefits are yours - Bhishma Ashtami Vrat Katha.. 🌹
Prasad Bharadwaj


ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం 'భీష్టాష్టమి' జరుపుంటారు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మాఘ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ రోజునే కురుక్షేత్రంలో భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండి ఉత్తరాయన పుణ్యకాలం వరకు వేచి చూసి మాఘ మాసం శుద్ధ అష్టమి నాడు తన శరీరాన్ని విడిచి పెట్టాడు.

అందుకే భీష్మ పితామహుని నిర్యాణం పొందిన ఈ దినం భీష్మాష్టమిగా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజున దానధర్మాలతో పాటు తర్పణాలు విడిచి పెడతారు.

తర్పణం ఎవరు చేయాలి?

ఈ మాసంలో వచ్చే శుక్ల పక్ష అష్టమిని 'భీష్మాష్టమి'గా జరుపుకుంటారు. . సాధారణంగా పితృ తర్పణాలు తండ్రి లేని వారు మాత్రమే ఇస్తుంటారు, కానీ భీష్మాష్టమి రోజున తండ్రి బతికున్న వారు కూడా తర్పణాలు వదలొచ్చు. ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి ఇవ్వవలసి వుంటుంది. భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా జీవించి కడపట మహావిష్ణు సన్నిధిలో అతనిని కన్నుల పండువుగా కాంక్షించుచు ముక్తిని పొందిన గొప్ప జీవి. ఈ ప్రక్రియను అందరు భీష్మ తర్పణం అని అంటారు. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మ పితామహుడు అంపశయ్యపై నుంచి దేహత్యాగం చేసిన రోజుగా దీనిని భావిస్తారు.

ఈ పవిత్ర దినాన భీష్మునికి తర్పణాలు వదలడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. మాఘ శుద్ధ అష్టమి(భీష్మాష్టమి) రోజునే భీష్ముడు మోక్షం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన ఆయనకి తర్పణం సమర్పిస్తే ఉత్తమ సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 'తండ్రి బతికున్న వారు కూడా ఈ తర్పణం సమర్పించవచ్చు. తెలుపు దుస్తులతో విష్ణుమూర్తిని ఆరాధిస్తే పుణ్యఫలాలు లభిస్తాయి' అని సూచిస్తున్నారు.


🍀 భీష్మ అష్టమి వ్రత కథ.. 🍀

పురాణాల ప్రకారం.. భీష్మ పితామహుడు హస్తినాపూర్ మహారాజు శంతనుడు, గంగా మాత దంపతుల ఎనిమిదవ కుమారుడు. అతని పేరు అసలు పేరు దేవవ్రతుడు. దేవవ్రతుడు గంగా మాత ద్వారా పెరిగాడు. తరువాత అతను మహర్షి పరశురాముడి నుంచి శాస్త్రాలను, గురు బృహస్పతి నుంచి రాజనీతి శాస్త్రాన్ని నేర్చుకున్నాడు. విద్య పూర్తి చేసిన తర్వాత, గంగా మాత దేవవ్రతను అతని తండ్రి మహారాజు శంతనుడికి అప్పగించింది. ఆ తర్వాత అతన్ని హస్తినాపుర యువరాజుగా ప్రకటించారు.

ఈ సమయంలో, శంతనుడు రాజు సత్యవతి అనే స్త్రీ ప్రేమలో పడ్డాడు. కానీ, సత్యవతి తండ్రి తన కుమార్తె కొడుకు మాత్రమే హస్తినాపుర సింహాసనాన్ని వారసత్వంగా పొందుతాడని షరతు పెట్టాడు. పరిస్థితిని గమనించిన దేవవ్రతుడు తన తండ్రి కోసం తన రాజ్యాన్ని వదులుకున్నాడు. తన తండ్రి ఆనందం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ కఠినమైన ప్రతిజ్ఞ అతనికి భీష్ముడు అనే పేరును సంపాదించి పెట్టింది.

దేవవ్రతుడు చేసిన ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీనిని చూసిన శంతనుడు రాజు భీష్ముని పట్ల చాలా సంతోషించి, అతనికి ఇష్టానుసారంగా మరణం అనే వరం ఇచ్చాడు. దీని అర్థం భీష్ముడు కోరుకోకపోతే మరణం రాదని. మహాభారత యుద్ధంలో కౌరవులకు ఆయన మొదటి సైన్యాధిపతి. ఆయన నాయకత్వంలో కౌరవ సైన్యం 10 రోజులు పోరాడింది.

అర్జునుడు శిఖండి రూపాన్ని కవచంగా చేసుకుని.. భీష్ము పితామహుడిపై బాణాల వర్షం కురిపించాడు. శిఖండిగా అర్జునుడిని చూసిన భీష్ముడు ఆమె స్త్రీ అని తెలుసుకుని తన ఆయుధాలను అతని ముందు ఉంచాడు. తరువాత, భీష్ముడు అర్జునుడి బాణాలకు గాయపడి మంచం మీద పడిపోయాడు. అయితే, ఆ సమయంలో సూర్యుడు దక్షిణ దిశలో ఉన్నాడు. కాబట్టి భీష్ముడు తన ప్రాణాలను వదులుకోలేదు.

ఉత్తరాయణంలో సూర్యభగవానుడి రాక కోసం ఎదురుచూస్తూ భీష్ముడు 58 రోజులు బాణాల మంచంపై పడుకున్నాడు. మాఘ మాసంలోని ప్రకాశవంతమైన పక్షం ఎనిమిదవ రోజున ఆయన తుది శ్వాస విడిచాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యాకాలంలో ప్రాణాలు వదిలి తన కోరికను తీర్చుకున్నాడు.

🌹🌹🌹🌹🌹

"రఘునందన రఘువర రఘుపతి ఛాయన సేవన హరిభాజన" Rama Anjaneya song (a devotional YT Short)


https://youtube.com/shorts/uDveob5NzmA


🌹 శ్రీ ఆంజనేయం - రఘునందన రఘువర రఘుపతి ఛాయన సేవన హరిభాజన
Rama Anjaneya song 🌹


ప్రసాద్‌ భరధ్వాజ.

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


"జై జై మహాకాయ జైజై అమితశౌర్య జైజై ఆంజనేయ" Jai Anjaneya swamy (a devotional YT Short)


https://youtube.com/shorts/PcZ3MmymSbg


🌹 జై జై మహాకాయ జైజై అమితశౌర్య జైజై ఆంజనేయ Jai Anjaneya swamy 🌹

ప్రసాద్‌ భరధ్వాజ.

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹



వన దేవతల ఊరేగింపు - మేడారం.. Procession of the forest goddesses - Medaram..


🌹వన దేవతల ఊరేగింపు రహస్యాలు - మేడారం.. 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

🌹The secrets of the procession of the forest goddesses - Medaram.. 🌹
Prasad Bharadwaj


మేడారం జాతరలో అత్యంత ఉత్కంఠభరితమైన భక్తి పారవశ్యం కలిగించే ఘట్టం వన దేవతల ఊరేగింపు. ఈ సమయంలో గిరిజన పూజారులు (వడ్డెలు) పాటించే ఆచారాలు అత్యంత రహస్యంగా, నిగూఢంగా ఉంటాయి.

వీటిని కేవలం గిరిజన పూజారుల వంశీయులు మాత్రమే నిర్వహిస్తారు.


🦜 చిలుకలగుట్టపై రహస్య పూజలు 🦜

సమ్మక్క తల్లిని తీసుకువచ్చే రెండో రోజున, పూజారులు మేడారం సమీపంలోని చిలుకలగుట్టకు వెళ్తారు. సమ్మక్క తల్లి రూపంగా భావించే 'కుంకుమ భరిణె'ను వెదకడం ఒక రహస్య ప్రక్రియ. ఆ గుట్టపై ఒక నిర్ణీత ప్రదేశంలో దేవత ఆనవాళ్లు కనిపిస్తాయని పూజారుల నమ్మకం. పూజారులు గుట్టపైకి వెళ్ళినప్పుడు సామాన్య భక్తులకు అటువైపు వెళ్లే అనుమతి ఉండదు. అక్కడ పూజారులు ప్రకృతి దేవతలకు బలులు సమర్పించి, ప్రత్యేకమైన 'కోయ' మంత్రాలతో తల్లిని ఆహ్వానిస్తారు.


🎋 'వెదురు' రూపంలో దేవత 🎋

జాతరలో మనం చూసేది విగ్రహాలను కాదు. సమ్మక్క, సారలమ్మలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా అడవి నుంచి తెచ్చిన వెదురు కర్రలకు పసుపు, కుంకుమలు అద్ది, కొత్త వస్త్రాలతో అలంకరిస్తారు. దేవతల ప్రతిరూపాలకు జంపన్న వాగులో పుణ్యస్నానం చేయించేటప్పుడు కూడా పూజారులు చుట్టూ ముసుగులాంటి వస్త్రాన్ని పట్టుకుంటారు. ఇది దేవతల గోప్యతను కాపాడటానికే అని చెబుతారు.


🌻 ప్రభుత్వం ఇచ్చే గౌరవం 🌻

సమ్మక్క తల్లి గద్దెపైకి వచ్చే సమయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా వచ్చి పూజారులకు ఎదురేగుతారు. సమ్మక్క తల్లిని తీసుకువస్తున్నప్పుడు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి అధికారికంగా వందనం సమర్పిస్తారు. భారతదేశంలో ఏ జాతరలోనూ లేని విధంగా ఒక గిరిజన దేవతకు 'స్టేట్ గార్డ్ ఆఫ్ హానర్' లభించడం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది.


🌴 వనప్రవేశం - మౌన వీడ్కోలు 🌴

జాతర చివరి రోజున దేవతలు తిరిగి అడవికి వెళ్లేటప్పుడు ఎలాంటి హంగామా ఉండదు. భక్తులందరూ వెళ్ళిపోయాక లేదా సాయంత్రం వేళ నిశ్శబ్దంగా దేవతలను తిరిగి వనంలోకి పంపిస్తారు. ఎక్కడ దేవతలను ఉంచుతారు అనేది ఇప్పటికీ ఆ పూజారి కుటుంబాలకు మాత్రమే తెలిసిన రహస్యం.


🍀 శివసత్తుల పూనకాలు 🍀

ఈ ఊరేగింపు సమయంలో వేలాది మంది మహిళలు (శివసత్తులు) పూనకంతో ఊగిపోతూ, పసుపు నీళ్లు చల్లుతూ దేవతలకు స్వాగతం పలుకుతారు. వీరు దేవతలకు 'రక్షకులు'గా వ్యవహరిస్తారని గిరిజన ఆచారం చెబుతోంది. సమ్మక్క తల్లిని గద్దెపైకి తెచ్చే సమయంలో పూజారికి కళ్లు కనిపిస్తాయా? లేదా? అనేది ఒక మిస్టరీ. ఆయన అత్యంత వేగంగా అడవి నుంచి గద్దె వైపు పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ సమయంలో ఆయనను ఆపడం ఎవరి తరమూ కాదు.

🌹🌹🌹🌹🌹