భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం (Bhāratīya Maharṣula - Mārgadarśakula Jñānaṁ)

....ᴎooꙄ ǫᴎimoƆ

M̷̢̙͈͍̭̥͖̃̐́͗́͆̑́̐̕e̶͉̯̖̿̓ś̶̨̙̙͈̖͑̇́̅̿̂ͅs̴͎̬͈̲̈́͜à̷̢̼̰͚̯̗̤̒́͝ͅg̸̯͕̘̹̜̦̚ę̵̖̐̔̂̎̾͠s̴̨̡͓͔̾̍̄̈́͝͠ ̸̧̹͉̫̯̻̬̲͒̍͑̀̂̂͝f̷̱͒r̵̨̤̭̫̝̥̮̦̻̔͐̈̀̐̇̚͠ͅo̵͓͍̅̏̕m̷̧̮͚̍́̈́̑̚ ̵̛͓̲̥̙̜̣̔͋̅̍͆͛ ̶̧̟͍̩̱͕̤̎̏͑̊̓̅̐̀͂̇ͅ ̴̨̼͇̱̑͐̌̈̃̂ ̷̫̫̳͎̆͗̾̐͘͝1̸̦͎̥̔̏́̌͂͠͝ ̷͓͙̝̹̩͓̪̪͔̦͑͛ ̵̨̜̗̜̗̠̩̳͎̖̅̾̅́͂̉̾͋͠ ̷̣͕͙͖͕̣͛̐̅ ̷̙̿̆̀̽̊̉̈̄ ̴̢̘̼͈̹́̊̋̀̓͋̎̒͌͠ͅt̴̯͌̂͊o̵͇͔͔͖̓̓̀̈́͑́ ̷̢̨̞̫͉̥͎͙̠́ ̵̢̧̩̟̱̆̉͋̀̂͆̓͋̚͠ ̷̩̼̣̜͍̞̲̫̗͆̒̈́͂̄̽̒ ̸̧̢̯͇̘͒ ̸̖͇͖̟͒̀̅8̵͙͙̩̯̄̈̈́1̴̛͔̪̥͚͍͍̳͊̈́́͜ ̸̲͕̙̟̺̫̜̤̈̅͗̉̌̈ͅ.̷̩̗̘̹͓̣̩̕.̵̧̹̭̪̐̽͋͌.̴̝̾͊̕
̷̢̡͓͉̘̝̣̹̞͋͒̍͊͐̾̍͜C̸͙͉̭̙̯̥̠̐͑̐͊̂̀͒͊͝͠o̷̢̬̲̜͚͖̪̳̹͖̔̍̍̋̓̉̕m̷̨̛͔̮̭̯͓̮̺̀̓̿̎̈́̀̕ͅḯ̵̪̅̓̑͋͊͘͘n̶͎̥̪̪̙͐ġ̵̛̝̿̑̈́̕ ̸̧̨͔̪̳̘̳̀̈́̃̅̊̌̋̍̔͘S̶̖̱̺̘̱͠o̶̱͓̺̿̊ö̸̡͎̞͎̺́̐͐n̴̻̪̯̠̳̣̤̓͒͋͘̚͠͝ͅ.̶̢͚̲͓̩͙̈́̍͗́̕.̸̢̧͓̱̼̠̪̻̘͙̂.̶̧̢͔̪̭͌̌͐.̵̼̜͉̓ͅ

🅼🅴🆂🆂🅰🅶🅴🆂 🅵🆁🅾🅼       🆃🅾     81 ...
🅲🅾🅼🅸🅽🅶 🆂🅾🅾🅽....



------------------------------------ x ------------------------------------

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 82 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరాశర మహర్షి - 1 🌻

వంశము: వసిష్ఠమహర్షి(తాత), శక్తి(తండ్రి)
భార్య(లు): సత్యవతి
కుమారులు/కుమార్తెలు: వ్యాసమహర్షి
కాలము: భౌగోళిక ప్రాంతములు: బదరికాశ్రమం 
నదులు: యమున
బోధనలు/గ్రంధాలు: పరాశరస్మృతి, పరాశరగీత, వృద్ధపరాశరహోర


🌻. జ్ఞానం:

1. కలియుగంలో మనం అవలంబించిన స్మృతి ‘పరాశరస్మృతి’ అని నిర్ణయం జరిగింది. ఈ స్మృతికారకుడు పరాశరమహర్షి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క స్మృతి ఎందుకుండాలి అంటే, మనుష్యులయొక్క శక్తిసామర్థ్యాలు అన్ని యుగాలలోను ఒకేవిధంగా ఉండవు.

2. మనకు నేడు 80 ఏళ్ళు పూఋనాయుర్దాయం అనుకుంటే, 20 ఏళ్ళు యౌవనం ఉంటుంది. అప్పుడే మనిషికి సంసారతాపత్రయం మొదలు. సంసారం, పిల్లలను కనటం, ఇల్లు వాకిలి ఏర్పాటు మొదలైనవి. 60 ఏళ్ళకు వార్ధక్యం మొదలు.ఈ ధర్మాచరణ అనేది ఆయువునుబట్టి, ఆయుర్దాయకాలంలో ఉండే మనోబలం, శరీర దారుఢ్యం, జీర్ణశక్తి, ఆకలిని తట్టుకునేశక్తి వాటినిబట్టి నిర్నయించబడుతుంది. ధర్మాలు జీవనవిధానంలో భాగం కాబట్టి.

3. కాబట్టి ఈ శరీరమెంత శక్తిసామర్థ్యాలతో ఉండినా, మనకు మానసిక బలంకూడా అవసరం. ధ్యానశక్తిగాని, యోగశక్తిగాని, ఏకాగ్రతయొక్క శక్తి సామర్థ్యాలుగాని, మనస్సును ఒక వస్తువునందు లగ్నంచేయాలి అంటే – ఇవి అన్ని యుగాలలోనూ, అందరు మనుష్యులలోనూ ఒకేలా ఉండవు. 

4. కాబట్టి ఆ యుగములనుబట్టి, వ్యక్తులనుబట్టి ఆచారాలు, వ్యవహారాలు, ధర్మాలు, నిర్దేశించబడ్డాయి. మళ్ళీ అన్ని ధర్మాలకూ గమ్యస్థానంమాత్రం ఒక్కటే! ఏ మార్గంలో జీవిస్తే చిట్టచివరకు ఈ ప్రపంచ జీవనం మీద కొంత వైముఖ్యము, జ్ఞానలో అభివృద్ధి, వైరాగ్యము, జ్ఞానేఛ్ఛ – ఈట్లాంటివన్నీ ఎలా జీవిస్తే కలుగుతాయో, అట్లా జీవించడంకోసమే ధర్మం. అధర్మంలో ఉండేవాడికి ఎప్పుడూ ఆశలే! ఎప్పుడూ బాధలే!

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

11.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 83 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. పరాశర మహర్షి - 2 🌻

5. ధర్మాచరణ మనిషి యొక్క ప్రగతికి దోహదం చేసేటటువంటి మార్గం. యుగధర్మాలన్నీ మనుష్యుల శక్తినిబట్టి ఏర్పడ్డాయి. దాన్నే యుగధర్మం అంటున్నాం. ఈశ్వరాజ్ఞ తెలిసిన ఋషులు అలా నిర్ణయంచేసారు. 

6. కృతయుగంలో మనుధర్మశాస్త్రం, త్రేతాయుగంలో గౌతముడి ధర్మశాస్త్రం ఉండేవట, ద్వాపరయుగంలో శంఖలిఖితుల(స్మృతి)ధర్మమే ప్రవర్తించింది. కలిలో శంఖలిఖితుల ధర్మం పాటించగల శక్తిసామర్ధ్యాలు మనకు లేవుకాబట్టి కలిలో ‘పరాశరస్మృతి’ నిర్ణయించబడింది.

పరాశరుడు ఈ కాలానికి అనుగుణమైన కొన్ని నియమాలు చెప్పాడు. కాబట్టి ఈ యుగానికి ధర్మశాస్త్రకర్త పరాశరుడని తెలుసుకోవాలి.

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం|
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్||

7. అలా వ్యాసుడి స్మరణ చేస్తాము. ఆయన పైతరాలు – ఆయ్న తాత ఎవరు? తండ్రి ఎవరు? కొడుకు ఎవరు? ఇంతమందిని చెప్పారు శ్లోకంలో. వ్యాసుడుని నమస్కరించాలంటే, ఆయన ముత్తాత వసిష్ఠుడు; తాతయైన – అంటే వసిష్ఠుడి కొడుకైన శక్తి; తండ్రియైన పరాశరుడు; కొడుకైన శుకుడు – ఇంతమందిని స్మరించి, “…అట్టి వ్యాసుడికి నమస్కారం” అని చెప్పబడింది. 

8. తండ్రి, తాత, ముత్తాత, ముగ్గురిపేర్లు చెప్పి ఆయన కొడుకు ఎవరో చెపితేనే, వారి వంశం ఎంత ఉత్తమమైనదో తెలుస్తుంది. వాళ్ళ శక్తిసామర్థ్యాలేమిటి? ఎలాంటివాళ్ళు వాళ్ళూ! వాళ్ళను స్మరించే అధికారమైనా మంకుందా అని ఆలోచన వస్తుంది! అంతటి ఉన్నతుల వారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

13.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 84 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరాశర మహర్షి - 3 🌻

9. ఈ మనుష్యుల్లో గొప్ప ప్రతిభ ఉంటేకూడా, అది ఒక తరం రెండు తరాలు ఉండటమంటేనే ఎక్కువ గొప్ప. ఈ కలియుగంలో మనవంశాలలో రెండు తరాలు బాగుంటే మూడోతరం సరిగా ఉంటుందో లేదో! అన్నీ ఉంటే, ఆస్తి పోగొట్టుకుంటారు. ఆస్తి ఉంటే, గుణం పోగొట్టుకుంటారు. గుణంపోతే, ఆయర్దాయం పోగొట్టుకుంటారు. ఇలా ఉన్నారు మనుష్యులు. దీనికి కారణం, మహర్షులు చెప్పిన ధర్మాచరణమార్గంలో మనం ఉండకపోవటమే.

10. అల్పత్వంవల్ల – క్షుద్రత్వంవల్ల – మనుష్యులు తేజస్సు, ఓజస్సు, శక్తి సామర్థ్యాలు పోగొట్టుకుంటారు ఆ తరాల్లో రెండు తరాలయేటప్పటికి ధన దారిద్య్రము, గుణదారిద్య్రము వీటిల్లో ఏదో ఒకటి వస్తుంది. ఈ రెండు ఉంటే, ఆరోగ్యదారిద్య్రము. ఏద్యితేనేం పోవటానికి? వివేకంతోకూడిన లక్షణాలు ఉండాలి. ధైర్యస్థైర్యాలుండాలి. ఐశ్వర్యముండాలి. ఇవన్నీ ధర్మ మార్గంలో లభిస్తాయి. ధర్మాన్ని ఆచరిస్తే ఇవన్నీ వస్తాయి అని ఋషుల ఉద్దేశ్యం. ధర్మాచరణచేతనే వాళ్ళు అలాంటి పరంపరలో ఉన్నారు.
11. ఋషులు ఎదుటివారిలో ఏ గుణం చూస్తారో, ఏ దుర్గుణం చూస్తారో, ఆ గుణానికి – ఆ దుర్గుణానికి అనుగుణమయినటువంటి జన్మ ఎత్తమని అంటారు వాళ్ళు. అంతే! వారు అలా అంటే, ఆ గునంవల్ల జన్మ లభిస్తుంది. వాళ్ళు సత్యమే చెప్తారుకాబట్టి ఆ మాట నిజమవుతుంది.

12. జీవలక్షణం – అది ఏదయినా సరే – లేకపోతే అసలేరాదు, ఉన్నది ఎలాగూ పోదు. రెండూ అంతే! యోగబలం అనేది పొమ్మటే పోతుందా! నేను అందరిలాగా మామూలుగా బతకాలని ఒక మహాయోగి అనుకుంటే, అది కూడా సాధ్యంకాదు. ఉన్నవాడికి పోదు, లేనివాడికి రాదు.

13. మనుష్యగర్భంలోంచీ వచ్చేటప్పుడు శిశువులకు, పశువులకు భేదంలేకుండానే పుడతారు. వాళ్ళు బుద్దిగాని, జ్ఞానంగాని, తామెవరో తెలుస్కునేటటువంటి శక్తిగాని ఏమీలేకుండా ఉంటారు.

14. మనుష్యులుకూడా ఆ దశలో పశుప్రాయులై ఉంటారు. అజ్ఞానం, అవిద్య, పశువువంటి శరీరం, ప్రాణం మాత్రం కలిగి ఉంటారు. అలాగే పుట్టి పెరుగుతారు. ముందర లౌకికజ్ఞానం వస్తుంది. లోకజ్ఞానంలోంచి కాస్త వివేకం తెలుస్తుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

14.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 85 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరాశర మహర్షి - 4 🌻

15. సదాశివుడిని స్తోత్రంచేస్తూ పరాశరుడు ఆయనను ఆనందబ్రహ్మాధిష్ఠాన దేవత్వు నీవు అన్నాడు. అంటే శివతత్త్వం అన్నమాట! ‘ఆనందోబ్రహ్మేతి వ్యజనాత్’ అని అంటూంటాం. దానికి అధిష్ఠానదేవతవు అన్నాడాయన. పంచ బ్రహ్మలలో రుద్రుడు అయిదవబ్రహ్మ.

16. ఆదివస్తువు- శివుడనేది- శుద్ధతత్త్వమే! శివనామాన్ని మనం ఉత్కర్షకోసం వాడతాము. అంటే సర్వప్రవృత్తిలక్షణ లక్షితులైన దేవతలందరికీ అతీతమైన వస్తువు ఇది. సృష్టిలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి. కాని అతడికి లక్షణమేలేదు. ఆనందమే – శుద్ధ ఆనందమే – ఉంది.

17. శివారాధన అంతాకూడా, రుద్రుడినే నిమిత్తమాత్రంగా చేసుకుని రుద్రస్తుతిచేసి, గమ్యస్థానాన్ని శివ తత్త్వంగా పెట్టుకోవడం అన్నమాట. రుద్రుని వర్ణనతోడి ఉపాసన లౌకికఫలాలకోసం చేయటం వేరు. ఏ కోరికా లేక చేసే రుద్రం జ్ఞానప్రదం. రుద్రుడు పూర్తి నివృత్తియందుంటాడు. లోకములందు నిస్పృహతో ఉంటాడు. అతడు దేనినీ చూడటంకానీ, దేనివిషయంలోనూ అతడిలో ఎలాంటి భావాలూ కలగటంకాని ఉండవు.

18. సమిధాధానం అని – ఏదైనా ఊరు వెళ్ళాల్సి వస్తే – ఆ అగ్నిహోత్రం (నిత్యాగ్నిహోత్రాన్ని) ఆరకుండా ఉండటానికి ఒక సమిధను ఆ అగ్నిహోత్రంలో కాల్చి, ‘ఈ సమిధలో ఉండు!’ అని చెప్పి దాన్ని చూరులోపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు పూర్వులు. సమిధాధానం అంటారు దాన్ని. సన్యాసం పుచ్చుకున్నప్పుడు, ఆ అగ్నిని తన ఆత్మలోనికి తీసుకుంటారు. ఈ అగ్నులన్నిటినీకూడా ఆత్మారోపణం చేసుకుంటారు. ఆత్మలోకి తీసుకుంటారు. విసర్జించడు. ఏదో పర్యవసానం ఉండాలి అగ్నికి. 

19..అగ్నిముఖంగా సంకల్పంచేసిన తరువాత, మధ్యలో, “నేను ఇక మానుకున్నాను. ఇప్పుడు నేనేం చెయ్యదలుచుకోలేదు, వెళ్ళిపో!” అని అంటే అలా మధ్యలో పో అంటే పోతాడా ఆ దేవత! ఆయనకు ఆగ్రహం వస్తుంది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

15.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 86 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరాశర మహర్షి - 5 🌻

20. ఒకసారి జనకమహారాజు (అదే వంశంలో మరొక జనకుడు) పరాసరమహర్షి దగ్గరికి వెళ్ళి, “ధర్మాన్ని తెలుస్కుందామని నీ దగ్గరికి వచ్చాను, నాకు ధర్మాన్ని గురించి చెప్పు” అని అడిగాడు. అందుకు ఆయన రాజుతో, “ఫలం కావాలంటే వృక్షం కావాలి. వృక్షం కావాలంటే బీజం కావాలి కదా! అలాగే సౌఖ్యం కోరేవాడు ధర్మాన్ని ఆశ్రయిస్తాడు. ఎప్పుడో భవిష్యత్తులో సుఖం కావాలంటే ఇప్పుడు ధర్మాచరణచేయడమే కర్తవ్యం. 

21. “సత్కృత్యమైనా, దుష్కృత్యమైనా ఆ పాపపుణ్యములు ఫలాన్ని ఇవ్వకుండా మనుష్యులను వదిలిపెట్టవు. కాబట్టి మనస్సు, వాక్కు, దృష్టి వీటన్నిటిటొటీ సత్యం, శమము మొదలైన వాటితో కూడిన సత్పథాన్ని ఆశ్రయించాలి. సమదర్శియై, న్యాయధర్మములలో ఉండేవాడికి దేవతలు నమస్కరిస్తారు. 

22. మనుష్యుడు బంధ విముక్తుడు కావాలి. వేదాధ్యనం చేయటంచేత ఋషిఋణం తీర్చుకుంటాడు. యజ్ఞయాగాదుల చేత దేవతల ఋణం తీర్చుకుంటాడు. అతిథి పూజచేసి ఆతిథ్యం ఇచ్చి, అతిథిఋణం తీర్చుకుంటాడు. దానధర్మములుచేసి ప్రజలఋణం తీర్చుకుంటాడు. ఈ ప్రకారంగా మనిషి అన్ని ఋణాలూ తీర్చుకును పవిత్రుడవుతాడు. ధర్మమార్గం ఇంతే! ఈ జీవితం అనిత్యమని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి సుమా! సుఖ దుఃఖాలు కలిగినప్పుడుకూడా ధర్మవిషయం మరచిపోకుండా ఉండటం శ్రేయస్సుకు మార్గం” అని చెప్పాడు.

23. “తపోధిక్యత అంటారుకదా! తపస్సు అనేది ఎలాగ ఉంటుంది? దానికి ఉత్కృష్టత ఎలా ఏర్పడింది?” అని జనకుడు అడిగాడు. “మహారాజా! విద్యాధరులున్నారు. ఋషులున్నారు. దేవతా గనములున్నవి. వాళ్ళందరూ అట్టిస్థితికి ఎలాగ వెళ్ళరనుకుంటున్నావు? తపస్సు చేతనే! తపస్సు ఆ ఉత్తమలొఖాలకు మార్గం. బ్రహ్మదేవుడికి ఈ సృష్టించే శక్తి తపస్సువల్లనే వచ్చింది.

24. ఐహికాముష్మికమయిన ఏ కోరికైనాకూడా తీర్చుకోవాలంటే తపస్సే కారణం. ఇంకొక మార్గమే లేదు. దారాపుత్రులు, సంసారము, ధనము, దుఃఖము – వీటిలో పడ్డవాడిక్కూడా, ఈ సంఘాన్ని తప్పించుకునేందుకు, చిత్తము పరిశుద్ధతపొంది శాంతి కావాలంటే కూడా దానికి తపస్సే మార్గం. 

25. తపస్సు లేని వాడిని లోభమోహాలు వశపరుచుకుంటాయి. తపస్సులో ఉన్నవాళ్ళను లోభము, మోహము, కామము ఏమీ చెయ్యవు. ధర్మార్థకామమోక్షాలన్నిటికీ ప్రారంభమ్నుంచీ చివరిదాకా ఉండే మార్గం, గమ్యస్థానం, ఉపాయం అంతాకూడా తపస్సే.

26. పరమపుణ్యపురుషులు, యోగులు, మహర్షులు మొదలైనవాళ్ళు అంతవారుకావటానికి కారణం తపస్సే అని తెలుసుకో!తపస్సు యొక్క ఫలం తెలుసుకోవాలంటే వాళ్ళచరిత్రలు తెలుసుకుంటే చాలు. “వాళ్ళకు కోరికలు లేవు, దుఃఖం లేదు. వాళ్ళు పరమ శాంతచిత్తులు. లోకంలో మానసికమయిన ఎట్టివికారములూ లేవు. సృష్టిలోనూ, దేనియందూ సంగబుద్ధి వారికిలేదు. 

27. వారి దగ్గరికి వెళ్ళగానే ఇతరులకు కూడా శాంతి, అనుగ్రహము ప్రసాదించగలిగిన శక్తి వారికి తపస్సు వల్లనే వచ్చింది. వాళ్ళను చూస్తే తపస్సు యొక్క శక్తి తెలుస్తుంది” అని బోధించాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

------------------------------------ x ------------------------------------

Image may contain: 2 people, people standing

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 87 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. పరాశర మహర్షి - 6 🌻

28. ఏది మేలు? పరంగతి అంటే ఏమిటి? నాశనం లేనటువంటి కృత్యమెట్టిది? దానిని చెప్పమని” జనకుడు అడిగాడు. 

29. “అన్నిటికంటేమేలు అసంగమే! సంగబుద్ధి దేనిలోనూ లేకపోవటమే! అంటే, నిస్సంగత్వం. జ్ఞానమే పరమగతి. దానిని మించిన పరమగతి ఎవరికీ లేదు. బ్రహ్మదేవుడికికూడా పూజ్యమైన వస్తువు, నమస్కరించబడే వస్తువు జ్ఞానమే! నాశనంలేని కర్మ ఏమిటంటే, తపస్సే” అను బోధించాడు పరాశరుడు.

3౦. తపస్సనే మాటను నిత్యమూ వాడుతుంటాము. రుద్రుడిని గురించి రాక్షసులు తపస్సుచేసారు. తీక్షణమైన తపస్సుచేసారు. దానికి పర్యవసానంగా ఈశ్వరుడిని వరాలు అడగటంవల్ల, వాళ్ళ తపస్సు నశిస్తుంది. నిరంతరమై, ఏ వరమూ అడగని తపస్సు నాశనరహితమై కర్మ అనబడుతుంది. 

31. పర్యవసానంలేని తపస్సు చిరకాలం అలా చేస్తూనేఉంటే అది నాశనం చెందదు. ఈ విషయం తెలుసుకోవటమే సర్వవేదసారం తెలుసుకోవటమంటే. ఇలా ఈ ప్రకారంగా సర్వవేదసారములను తెలుసుకున్నవాడు తపోయోగములందు ఉందవచ్చు అనికూడా వివరించాడూ పరాశరుడు.

32. విషయములందు ఉనికి కలిగితే, వాటిలో తానుంటాడు. విషయములనేవి యథార్థంగా ఉన్నాయి అనే గుర్తింపుకూడా అతనికి ఉంటుంది. ఇంద్రియములున్నాయి, సుఖదుఃఖాలున్నాయి, అన్నీ ఉన్నాయనే గుర్తింపు కలిగినవాడైనా, తనకూండే విజ్ఞానంవలన తామరాకుమీద నీటివలే దానివలన అతడు దూషితుడుకాడు. 

33. అట్లాంటి విజ్ఞానానికి ఈ సంసారము ఎలాంటి దోషమునూ ఇవ్వదు. ఉదాహరణకు, కమలం ఉంది. పంకజం అని దానికి పేరు. పంకం అంటే బురద. కాని పంకజానికి ఆ పెఋఐతే ఉందికాని, దానికి ఏమయినా పంకం అంటిఉంటుందా! దాని నాళం, వేరు, మూలము బురదలో ఉంటాయి కాని ఆ కమలంమాత్రం ఎంత నిర్మలంగా ఉంటుంది. 

34. అలాగే తన ఉనికియొక్క మూలం సంసారంలో ఉన్నాప్పటికీ, జ్ఞానంచేత – జలంలో ఉన్న పరిశుద్ధమైన ఈ కమలంవలెనే – మనుష్యుడు పరిశుద్ధుడుగా ఉంటాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹



🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 88 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరాశర మహర్షి - 7 🌻

35. సంసారం అనాది. జీవుడికి సంసారంతో సంబంధం అనాది. అప్పటి నుంచీ ఉంది. దానిని తెంచుకోవటం స్వార్థం కాదు. అదే కర్తవ్యం. 

36. ఆహారం తినటము, సుఖపడటము, నిద్రపోవటము, పిల్లలను కనటము – ఇంతే తప్ప నాకు ఇంతకుమించి ఇంకేదీ లేదనుకునేవాడు శీఘ్రంగా నశిస్తాడు. మనిషిపొందే దుఃఖాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సుఖమేమో చాలా అల్పం. 

37. ఎప్పుడో ఒక్క ఘడియమాత్రమే ఉండి, పొయే సుఖదుఃఖాలు యథార్థమని ఎవరు నమ్ముతారో – అవి యథార్థమని ఎవరు భావిస్తారో – వాళ్ళు శాస్వతంగా అందులోనే ఉండిపోతారు. అది సత్యమనుకుంటూ అందులోనే ఉంటారు. అది అస్త్యమనుకుంటే, అప్పుడే అందులోంచీ బయటికివెళ్ళిపోతారు.

38. సుఖదుఃఖములందు సత్యత్వబుద్ధి, నిత్యత్వబుద్ధి ఎవడియందుంటాయో వాడికి నిత్యమూ సుఖదుఃఖాలు ఉంటూనే ఉంటాయి. అవి అనిత్యము అని తెలుసుకోవాలి. ఎందుకంటే, ‘నా ఉనికే అనిత్యమయితే, నాకుండే సుఖదుఃఖాలు నిత్యము ఎలా అవుతాయి? నేనే అనిత్యము కదా!’ అన్న వివేకం కలగాలి.

39. ‘మిత్రులు, భార్య, భ్రాతలు, పుత్రులు వీళ్ళంతా మనిషికి నిజకార్యపరులు. వాళ్ళువాళ్ళ కార్యంకోసం నిన్ను ఆశ్రయించి ఉన్నారు.

40. కాని నీ యోగ క్షేమములకొరకు నిన్ను ఆశ్రయించి లేరు’ అని గుర్తుంచుకోవాలి. ‘నా భార్యకు నా మీద చాలా ప్రేమ’ అంటాడు ఒకడు. అయితే భార్య తనకొరకై నిన్ను ప్రేమిస్తుంది. మనమెప్పుడూకూడా మనకు ఉపయోగపడేవస్తువునే ప్రేమిస్తాము కదా! ఇందులో కొద్దిగా కూడా అబద్ధం లేదు. 

41. జాగ్రత్తగా ఆలోచిస్తే, తండ్రికి పుత్రులమీద ప్రేమ, పుత్రులకు తండ్రి మీద ఉండే ప్రేమ అమతా స్వార్థంతో కూడుకున్న ప్రేమయే. అటువంటి ప్రేమని మోహం అంటారు. అటువంటి ప్రేమ సత్యం కాదు. కాబట్టి వాళ్ళు(సంబంధం ఉన్నవారందరూ) నిజసాత్వికులు. 

42. వాళ్ళు వారి పనులకోసమనే తనను ఆశ్రయించి ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి! ‘బోధను నువ్వుపొందితే అది ఆత్మత్రాణం. నిన్ను నీవు రక్షించుకోవటం బోధలో – అంటే జ్ఞానంలో – ఉంది. ఈ బోధయే మహాలక్ష్మి. ఇట్టి అభేదదృష్టి కలిగినవాడే ధీరుడు.

43. ధైర్యలక్ష్మి-జ్ఞానలక్ష్మిని కలిగిఉన్నవాడు, దానినెప్పుడూ వదలకూడదు. ఎట్టిపరిస్థితులలోనూ ఆ ధైర్యాన్ని, ఆ జ్ఞానాన్ని వదకూడదు’ అని సారాంశం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


------------------------------------ x ------------------------------------

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 89 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరాశర మహర్షి - 8 🌻

44. అంటే ఎవరియందూ ప్రేమ పెట్టుకోకూడదనికాదు ఇందులో అర్థం. తన ప్రేమ నిస్సంగంగా ప్రేమకొరకే ఉండాలి. ఇతరులు చూపించే ప్రేమ స్వార్థంతో కూడిఉంది కాబట్టి, దానిని తిరస్కరించమనీ కాదు. వాళ్ళు చూపించే ప్రేమవెనుక వాళ్ళేది కోరుతున్నారో, ప్రేమతోటే దానిని తాను ఇవ్వాలి. కాని, నిస్సంగమైన ప్రేమతో ఇవ్వాలి. సంగం(మోహబుద్ధి) వాళ్ళలో ఉన్నప్పటికీ, అది నీలో ఉండనక్కరలేదు. 

45. వాళ్ళు స్వకార్యధురంధరులై నిన్ను ప్రేమిస్తున్నారనే కారణం తెలిసిన తరువాత కూడా, వాళ్ళను ద్వేషించనక్కరలేదు. ప్రేమతోటే వాళ్ళకు సేవచేసి, ఋణం తీర్చుకో! వాళ్ళు నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నారని అనుకోవడం మోహమన్నమాట. 

46. ఇంకా గట్టిగా చెప్పాలంటే, వాళ్ళకు సేవచేయలసిందే! వాళ్ళను ప్రేమతో రక్షించు కోవలసిందే! నీవు వాళ్ళకు యావత్తూ ధారపోయాల్సిందే! నీ శక్తిసామర్థ్యాలు, ధనం అంతా కూడా వాళ్ళకు ఇచ్చేయాలి. అప్పుడే ఋణం తీరుతుంది. 

47. వాళు మన దగ్గిరికి రావటానికి కారణం మనం ఋణగ్రస్తులం కావటమే! అయితే, ఆ ఋణంతీరే మార్గంలో ఉన్నప్పటికీ, దానిని నువ్వు మోహంతో చేస్తున్నావుకాని, ఋణం తీర్చుకోవటానికి చేయటం లేదు. నువ్వు మోహం లేకుండా ఇస్తే నీకు ఋణం తీరుతుంది.

48. శౌచాదిక అచారఫలంగా మనుష్యుడు బ్రహ్మలోకప్రాప్తి పొంది తిరిగివచ్చి యోగియై జన్మించి, తరువాత ముక్తినొందగలడు. శౌచమార్గంలో బ్రహ్మలోకానికి వెళ్ళితే అది ముక్తి అనబడదు. ఈ విషయంలో కార్యబ్రహ్మ ఎప్పుడూ కూడా ప్రవృత్తి మార్గమే చెపుతాడు. నివృత్తిమార్గం చెప్పడు. 

49. కనుక సామాన్యుడికి ఈశ్వరారాధన శర్ణ్యమయింది. కోరికలు తీర్చుకోవటానికి ఎవరినయినా ఆరాధన చేయవచ్చు. ఏ భూతాన్నో, ప్రేతాన్నో ఆరాధన చేసినా, అవి డబ్బుపట్టుకొచ్చి ఇస్తాయి. అంటే మన క్షుద్రమైన కోరికలు ఓ పిశాచంకూడా తీర్చగలదు. అందుకై భగవంతుణ్ణే ఆరాధించనవసరంలేదు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹


20.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 90 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరాశర మహర్షి - 9 🌻

50. భగవంతుణ్ణి ఆర్యుడు ఆరాధించేటప్పుడు – ఆరాధ్యవస్తువుగా భగవంతుణ్ణి మాత్రమే ఎందుకు గుర్తించాడంటే, నాలుగో పురుషార్థమయిన మోక్షాన్ని కేవలం పరమేశ్వరుడే ఇవ్వగలడనే నమ్మకంవలన! అందువల్లనే ఈశ్వరుడు పరమపూజ్యుడయ్యాడు. 

51. అటువంటి నివృత్తి, మోక్షము బ్రహ్మదేవుడివ్వటంలేదు. దానికేదో శాపాలు అవీ కల్పించబడ్డాయి పురాణాలలో. కాని యథార్థంగా బ్రహ్మయొక్క లక్షణమే ఇది. గాధలు ఎవరైనా కల్పించవచ్చు. బ్రహ్మయొక్క ప్రవృత్తి సృష్టిచేయటమే! అదే ఆయన కార్యం. సృష్టిలో పంచభూతములలో దేహాత్మభావనతో జీవుడు ఉండడమనేది బ్రహమ ఉద్దేశ్యం. సత్కర్మలాచరించి, ఇక్కడ సుఖాలున్నాయి, అక్కడ స్వర్గముంది, ఇక్కడ నరకముంది – జాగ్రత్తగా ఉండమని తెలుపుతుంది బ్రహ్మయొక్క ఈ ప్రవృత్తి మార్గం. మోక్షవిషయం దాని తరువాతిది.

52. ఈ యజ్ఞాదిక్రతువులన్నీకూడా బ్రహ్మముఖము నుంచీ వచ్చి, వేదములు ప్రతిపాదించినటువంటి త్రిగుణములతో కూడినటువంటివి. కర్మలు జ్ఞాన స్వరూపములుకావు. సుగునాత్మకమైన వేదములచేత ప్రతిపాదించబడినవి! వేదకర్మలెప్పుడూ కోరికలకు ఫలములు ఇచ్చేవే. ఎవడైనా కేవలం జ్ఞానం కోసమే వీటిని ఆచరిస్తున్నాడనేది నిజం కాదు.

53. శంకరులు చెప్పిన శ్రుతివాక్యములు, ఉపనిషద్వాక్యములు ఎక్కువగా ఉన్నాయి. శృతులలోంచి కొన్నివాక్యములు, బ్రాహ్మణములలోంచి కొన్ని వాక్యములను ఆయన తీసుకున్నారు.

54. ‘కర్మబ్రహ్మస్వరూపిణే’ అంటూ అగ్నిహోత్రుడికి రోజూ నమస్కారం చేస్తున్నాం కదా! బ్రహ్మ కర్మస్వరూపుడు అంటే, కార్యబ్రహ్మస్వరూపుడు అని అర్థం చెప్పుకోవచ్చు. ‘కర్మలో నిర్గుణమయిన బ్రహ్మస్వరూపుడని కాదు’. ‘కార్యబ్రహ్మలోంచీ వచ్చిన వేదసమ్మితమైనటువంటి కర్మస్వరూపుడివి – అగ్నిహోత్రుడివి నీవు – నీకు నమస్కారం. నాకు ఐశ్వర్యం ఇయ్యి. ఆరోగ్యం ఇయ్యి’ అని ప్రార్థిస్తాం. 

55. అంటే నిర్గుణమైన బ్రహ్మవస్తువైతే, ఇవన్నీ ఎలా అడుగుతాము? వైదికకర్మలన్నీ సగుణమైనవే. మన ప్రార్థన అంతా లౌకికమే! యజ్ఞమూ లౌకికమే! జ్ఞానంకోసం కాదు. ‘నిస్త్రైగుణ్యో భవార్జున!’ అని భగవద్గీతలో కృష్ణపరమాత్మ అన్నమాటలకు – త్రిగుణములకూ అతీతుడవుకమ్మనే అర్థం.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹


------------------------------------ x ------------------------------------


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 91 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరాశర మహర్షి - 10 🌻

56. యజ్ఞయాగాది క్రతువులన్నీ చేసి, శౌచారలన్నీ బాగా పాటించి నటువంటి యథార్థమయిన బ్రాహ్మణ జీవనము, ఉత్తమోత్తమమయినదై బ్రహ్మలోకప్రాప్తికి దారి తీస్తుంది. అది కొంచెం తక్కువ స్థాయిదైతే, స్వర్గం ప్రాప్తిస్తుంది. 

57. స్వర్గానుభవం పూర్తయ్యాక ఆ జీవుడు మళ్ళీ ఈ లోకానికే వచ్చి జన్మించి, జ్ఞానంచేత యోగి అవుతాడు. అది చూచి వచ్చిన తరువాత, కర్మఫలం ఇంతేనని లోపలి జీవాత్మకు అవగత్మవుతుంది.

58. ‘ఓహో! ఇంత ఉత్కృష్టమైన కర్మలకు ఫలముగా ఆ లోకమందు కొంతకాలం ఉనికి(స్థితి) లభిస్తుంది. అంతే! మళ్ళీ ఇక్కడికే వస్తాము’ అన్న వివేకం, జ్ఞానం లోపల జీవుడికి కలుగుతుంది. 

59. ఈసారి దానియందు మరి అభిరుచి ఉండదు. జీవలక్షణం మారిందన్న మాట! ఒకమాటు అది చూచిన తరువాతనే జీవలక్షణం మారుతుంది. కాని స్వర్గమును ఎన్నడూ చూడని వాడికి స్వర్గమే గమ్యస్థానమవుతుంది.

60. ఒకసారి స్వర్గానుభవం తరువాత సుఖమందు, సుఖలాలసయందు, ఉత్తమలోకప్రాప్తియందు, అది ఇచ్చేటటువంటి కర్మలయందు వైముఖ్యము చేత, సహజంగా అతడికి ఒక ఉద్బొధం కలిగి యోగి అవుతాడు, ముక్తి పొందుతాడు అని పరాశరవాక్యం. 

61. అంటే, ‘బ్రహ్మలోకప్రాప్తి పొంది తిరిగి యోగియై జన్మించి ముక్తినొందగలడు’ అని. అట్టివాడు బ్రహ్మప్రళయం వచ్చేంతవరకు బ్రహ్మలోకంలో ఉండి, తరువాత ముక్తిని పొందుతాడు. సన్యాసి చేసేటటువంటి బ్రహ్మోపాసన, ప్రణవోపాసన ఇవన్నీకూడా ఒకప్పుడు బ్రహ్మలోకప్రాప్తినిస్తాయి. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

24.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 92  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. పరాశర మహర్షి - 11 🌻

62. బ్రహ్మలోకంలో మళ్ళీ రెండు రకాలయిన జీవులున్నారని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. మోక్షాపేక్ష కలిగి అక్కడికిమాత్రమే వెళ్ళగలిగే యోగులు అక్కడ ఉన్నారు. ప్రళయందాకా ఉండి బ్రహ్మలో లయంపొందుతారు వాళ్ళు. 

63. ఎవరయితే భూలోకవాసన వదలక పుణ్యకార్యాలు మాత్రమే జ్ఞనాపేక్ష లేకుండా ఇక్కడ చేస్తారో, వాళ్ళు మళ్ళీ ఈ లోకానికి వస్తారు. ఇక్కడినుంచే ముక్తికిమార్గం ఒకనాడు పొందుతారు.

64. సన్యాసికి నమస్కరిస్తున్నప్పుడు మనంకూడా ఆ మాటనే అంటాం. వదికాచారంలో కర్మలు చిత్తశుద్ధికొరకు ప్రతిపాదించబడ్డాయి. 

65. ఇప్పుడు ముక్తి పొందలేదు అంటే అర్థం, ‘జ్ఞానం చేత సన్యసించినవాడు కాదు’అని, ‘జ్ఞానం కొరకు సన్యసించిన వాడని.’ ఈ రెండు రకాల వారి మధ్య భేదం అలా ఉంటుంది. “పాపం నాశనమయితే తప్ప జ్ఞానమందు కోరిక కలుగదు. 

66. గుణవంతుడు, సజ్జనుడు ఎవరయినా జ్ఞానబోధచేస్తే దన్ని విధిగా ఆచరించాలి. దాని వలన జ్ఞానోదయమవుతుంది. పెద్దలు చేసిన హితబోధ ఆచరించటమే శరణ్యం. అప్పుడే జ్ఞానోదయం”.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

25.Aug.2020

------------------------------------ x ------------------------------------




🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 93  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. పరాశర మహర్షి - 12 🌻

67. జ్ఞానోదయం అనేది అనేక దశలలో ఉంది. బ్రహ్మజ్ఞానం అనేది ఒక్కమాటే కలుగదు. వివేకము వెంటనేరాదు. కామక్రోధాదులు కూడా కొంతవరకు శాంతిని పొందుతాయి. వాటికి అవకాశంవస్తే, నిదురించే సర్పాలు లేచినట్లు మళ్ళీ లేస్తాయి. జ్ఞాని తనంతట తను దేనియందూ కూడా కామ క్రోధాదులు కలిగి ఉండడు. 

68. అయితే దానివలనకూడా మనిషి గర్వాన్ని పొందవచ్చు. గర్విష్ఠికావచ్చు. “అటువంటి గర్వం నీకు కలిగిననాడు నీవు ఉపశాంతి పొంది దానిని విడిచిపెట్టు. గర్వాన్ని నువ్వు ప్రోత్సహించుకోకు. 

69. అంటే శాంతిని ఎప్పుడయితే పొందుతావో, ఆ తరువాత నీకు జ్ఞానంలో అభివృద్ధిపొందే శక్తి కలుగుతుంది. ఎంత జ్ఞానముందో అంత శాంతిని పొందుతావు.

70. “ఒకసారి మొలక మొలిచేదాకా దానిని జాగ్రత్తగా చూచుకుని ఆ తరువాత దానికి తగిన నేల, నీరు, సమ్రక్షణ ఇస్తే అది మహావృక్షంగా ఎలా పెరుగుతుందో – జ్ఞానము, శాంతి పరస్పర అవలంబనంతోటి, ఆలంబనంతోటి అలా పెరుగుతాయి. వానిని సంరక్షించుకోవాలి. దానికి భంగకరమయిన పరీక్ష వచ్చినప్పుడు పరీక్షకు నిలబడు” అని ఆయన బోధ. 

71. “మనిషిలో షోడశ వికారాలు ఉన్నాయి. జితేంద్రియుడై వాటన్నిటినీ నెమ్మదిగా జయించి, క్రమంగా శాంత స్వరూపుడయిన మహేశ్వరుడిని ఆరాధనచేస్తే ఆ ఈశ్వరారాధనతో మనిషి ముక్తి పొందుతాడు” అని బోధించాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద 

26.Aug.2020

------------------------------------ x ------------------------------------




🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 94  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరాశర మహర్షి - 13 🌻

72. ఓకసారి బ్రహ్మ, మైత్రేయాది మహర్షులు పరాశరుని, “జీవబ్రహ్మాంశ” లక్షణములను గురించి వివరంగా చెప్పమన్నారు. 

73. ఆయన జ్యోతిషశాస్త్రం చెప్పాడు. మనుష్యుల్లో కలిగిన జీవబ్రహ్మాంశ భేదములు జ్యోతిషశాస్త్రంద్వారా తెలుసుకోవాలి. జీవుడికి – అంటే కర్మచేత ఈ శరీరాన్ని పొందినటువంటి జీవత్వానికి – శుభాశుభములు దగ్గరలోనే ఉంటాయి. ఈ కర్మలన్నిటికీ అతీతంగా స్వతంత్రంగా ప్రకాశించే వస్తువులో బ్రహ్మయే ఉంది. 

74. అది అంతర్యామిగా. జీవుడియొక్క పరిణామదశలయందు భావనచేసి, మనో బుద్ధి చిత్తాహంకారములతో దేహాత్మభావన కలిగిన మనుష్యులు ఏయే సమయాల్లో ఆత్మదర్శన హేతువయినటువంటి ధర్మార్థాలను ఆచరించాలో; కామాన్ని వదిలిపెట్టి, నాలుగో పురుషార్థమైన మోక్షాన్ని ఎలాచేరాలో ఆ మార్గాన్ని బోధించటమే జ్యోతిషశాస్త్రబోధలో పరాశరమహర్షి ఉద్దేశ్యం. 

75. జీవబ్రహ్మాంశ భేదములెలా తెలుసుకోవాలి? అంటే దానికి సమాధానంగా జ్యోతిషశాస్త్రం చెప్పాడు. అంతే కాని, భౌతికజీవనంలోని క్షణికమైన శుభాశుభాలు తెలుసుకోవటానికి చెప్పలేదు. దీనివల్ల జీవబ్రహ్మాంశభేదం తెలుస్తుంది. దానివల్ల శుభాశుభములు కూడా కలుగుతాయి. 

76. ఇప్పుడీ అర్థంలో జీవాంశ ఏది, బ్రహ్మాంశ ఏది, ఈ జాతకుడిలో? బ్రహ్మాంశ అంటే జ్ఞానాంశ. తరుణోపాయం వెతుక్కునేటటువంటి మార్గంలో ఈతడి ప్రస్తుతస్థితి ఎటువంటిదనే విచారణలో ఉన్నటువంటిది బ్రహ్మాంశ. 

77. జీవాంశ అంటే, దానికి ఇతడు చేయవలసిన తపస్సు. తపస్సా! యోగమా! భక్తా! ఇతడికి ఏది ఉత్తమమో, ఇతడి కులాచారం, సంస్కారాలనుబట్టి ఎటువంటిదయితే బాగుంటుంది? ఏ దైవాన్ని ఆరాధించాలి? ఎటువంటి ధర్మాన్ని ఆచరించాలి? ఇతడికి యోగ్యమైనటువంటి మోక్షోపాయం ఏది? అని, ఆ బ్రహ్మాంశను గురించి ఈ స్థితిని తెలుసుకున్న జ్యోతిష్యుడు ఈ జీవాంశకు కర్తవ్యబోధ చెయ్యాలి. ఆ పరిణామదశలు తెలుసుకోవడం కోసమే జ్యోతిషశాస్త్రమని పరాశరుడి ఉద్దేశ్యం.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


27 Aug 2020

------------------------------------ x ------------------------------------


🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 95  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శంఖలిఖిత మహర్షులు - 1 🌻

బోధనలు/గ్రంధాలు: లఘు శంఖస్మృతి, శంఖస్మృతి, లిఖితస్మృతి, శంఖలిఖితస్మృతి

🌻.. జ్ఞానం:

1. ప్రతీవ్యక్తి ఋషులలోని ఎవరోఒకరి గోత్రంలో ఉన్నవాడేకాబట్టి, ఋషుల చరిత్రలు మన అందరి తండ్రుల చరిత్రలు. వాళ్ళందరికీ మనం సేవచేయలేము. వాళ్ళ స్మరణచేసి వాళ్ళకు మనసులో నంస్కారము చేయటం కూడా వాళ్ళా ప్రసన్నతకు హేతువవుతుంది. 

2. మరి ఈ ఋషులదృష్టి మనమీద ఎందుకు పడటంలేదని సందేహం. అది మనం కోరుతున్నామా? అని ప్రశ్న. ఆ ఋషులు లోకహితంకోసం సంకల్పంచేసి, అఖండమైన తపస్సుచేసి జీవన్ముక్తులయ్యారు, తపోలోకానికి వెళ్ళిపోయారు. 

3. ఈ భరతవర్షంలో వాళ్ళ సంతానమైనటువంటి భారతీయులు వాళ్ళ బోధలు విని, ఆ ప్రకారంగా జీవించి తరించాలని వారి ఆకాంక్ష. అందుకు కాకపోతే మరెందుకు, ఎవరి కోసం ఈ స్మృతులువ్రాసారు? మనకోసమేకదా! 

4. ఆ స్మృతులు ఉన్నాయో లేవో తెలియని స్థితిలో నేడు మనం ఉండి, వాళ్ళు ఎలాగ జీవించమని శాసనములు మనకు వ్రాసిపెట్టారో వాటిని విస్మరించి, అప్పుడప్పుడు వాళ్ళ పేర్లు మాత్రం వింటున్నాం. ఆ ఋషుల సంప్రదాయాన్ని విస్మరించడం అంటే(స్మృతిని విస్మరిస్తే) విష్ణువును విస్మరించినట్లే.

5. కాబట్టి ఋషులు లోకహితం కోసమనే ధర్మశాసనం చేసివెళ్ళారు. అంటే మనం ఈ లోకంలో సుఖంగా ఉండడానికీ, అలాగే ఇక్కడ ఏయే ధర్మాలను మనం పరిపాలిస్తే ఆముష్మికమైన ఉత్తమమార్గాలలో మనం ఉత్తరగతికి వెళతామో, ఆ మార్గాన్నీ చెప్పినవి వారి స్మృతులు. ఈ ఋషి గోత్రాలు, ఈ సంప్రదాయాలు లేకపోతే భారతీయత ఏమిటి? భారతీయ సంప్రదాయాలంటే కేవలం వర్ణధర్మమే కాదు.

6. సమస్తవర్ణాలకు, సమస్త ఆశ్రమాలకు ధర్మాలుచెప్పి మానవజాతి యావత్తు క్షేమాన్నీ కోరినవారు మహర్షులు. అట్టివాతి స్మృతిని మనం విస్మరిస్తే వాళ్ళ అనుగ్రహం మనకు ఎలా కలుగుతుంది?

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

28 Aug 2020

------------------------------------ x ------------------------------------


🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 96  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శంఖలిఖిత మహర్షులు - 2 🌻

7. ఈనాడు మనం కొత్తరకమయిన విజ్ఞానం నేర్చుకున్నాం. సుఖంగానే బ్రతుకుతూ ఉండవచ్చు. లౌకికమైనటువంటి దృష్టితోచూస్తే, “నాకేం లోటండీ! సైన్స్, టెక్నాలజీ, ధనం, సుఖం, వాహనాలు సంపాదించాను” అనవచ్చు. ఇవేమీ మహర్షులకు విరుద్ధంకాదు. వీటికి మహర్షులు దుఃఖపడరు. ఇవి అధర్మం అని వాళ్ళ ఉద్దేశ్యం కాదు. 

8. అయితే, అతిథి అభ్యాగతుల విషయంలో ఒక సత్యము, శౌచము, ధర్మము, దేవతలను అనుగ్రహంకోసమని అర్చన చేయటము, దేశభక్తి, ప్రజలయందు ప్రసన్నత, ఇతరులయందు దయ, కష్టపడే వాళ్ళయందు సానుభూతి ఇట్లాంటి మానవధర్మాలెన్నో ఉన్నాయి. ఇవి విస్మరించడమే ధర్మపతనం.

9. పాపమే వృత్తిగా పెట్టుకున్నవాళ్ళ మాట వదిలేస్తే, మనం పాపం చేయకపోయినప్పటికీ, ధర్మాచరణం అనేటటువంటిది-ఆ ఋషులు ఏది ఆచరించారో అది-చెయ్యక పోవటం చేత, వాళ్ళు మన స్మృతిపథంలోంచీ వెళ్ళిపోతున్నారు క్రమక్రమంగా. 

10. జీవహింస చేయటంలో మనలో దయాదాక్షిణ్యాలులేవు. మరో ఆలోచనలేకుండా తృణప్రాయంగా నిరాలోచనగానే లక్షల పశువులను చంపగలుగుతున్నాం మనం.

11. కష్టపడుతూ దరిద్రంలో ఉండేవాడిని మనం సానుభూతితో చూడటంలేదు. ‘వాడి కష్టానికి నాకేమయినా బాధ్యత ఉందా? వాడి కష్టాలు తీరటానికి నేనేమయినా చేయాలా?’ ఇట్లాంటి భావనలే పుట్టటంలేదు మనకు. ఎవరిమటుకు వారే, ధనవంతుడు అధిక ధనవంతుడు కావాలని! దానికి పరిమితిలేదు. 

12. ‘నేను తృప్తిగా ఉన్నా’ననే భావం ఎవరికీ కలగటంలేదు. ఇటువంటి నేటి భావనలన్నీ ఆర్యధర్మములు కానేకావు. మన ఋషులు మనకు ఏ ధర్మమార్గంలో ఉండమన్నారో, ఆ మార్గానికి సంబంధించిన ధర్మాలలో నేడు మనం అతిక్రమించని ధర్మంలేదు అంటే అతిశయోక్తికాదు. 

13. అందువల్ల మరల మన ఋషులను మనం స్మరిస్తే, ధర్మమార్గంలో వెళ్ళేటటువంటి మనోబుద్ధి చిత్తములు అనుగ్రహించమని మనం వారిని అర్థిస్తే, వారు అవి ప్రసాదిస్తారు. వారు దివ్యదేహాలలో ఉన్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

29 Aug 2020

------------------------------------ x ------------------------------------


🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 97  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శంఖలిఖిత మహర్షులు - 3 🌻

14. అంతఃకరణలో ధర్మంమీద శ్రద్ధకలిగినవాడు భారతదేశం మళ్ళీ ఒక భూలోకస్వర్గం అవుతుంది. ఋషులకు మనయందు అనుగ్రహం ఉందికాని, మాటవినని కొడుకును తండ్రి ఎలా చూస్తాడు? 

15. అలాగే, వారి మార్గాన్ని అనుసరించకపోవడంచేత మనకు ఒక దోషం సంక్రమించింది. ఈ రాజకీయ స్వాతంత్రము, ఈ ఇండస్ట్రీస్, కమ్మునికేషన్స్ వీటివల్ల మనకు వచ్చేటటువంటి గొప్ప ఏమీలేదు. 

16. దీనివల్ల మనకు ఆత్మగౌరవం పెరగదు. జ్ఞానం పెరగదు. శాంతి సుఖములుకూడా దీనివల్ల అసలే పెరగవు. అశాంతి, అసౌఖ్యము, దుఃఖము, భయము, ఎప్పుడూ ఆపద, మృత్యుభయము ఇవన్నీ మనను వెంటాడుతూనే ఉంటాయి, ఇన్నీ ఉండికూడా ఈ సంపదలన్నీ ఎప్పుడూ మనిషి విషయంలో శాశ్వతంకాదు. దేశానికి సంపద శాశ్వతం కావచ్చుకానీ మనిషికి కాదు.

17. “ఈ పశువధ మానండి. ఇది చాలా భయంకరంగా ఉంది” అని చాలా మంది పదేపదే వాస్తున్నారు, అనేకమంది అంటున్నారు. అంటే, ఇన్ని పశువులను వధించటము క్రూరమని నేడు అంటున్నాదు. ఇంత భారీస్థాయిలో ప్రతీ ఊళ్ళోను అనేకవందల పశువులను చంపడం నాడు లేదు. ఇప్పుడు లక్షలాది పశువులను ఒక్కొక్కరోజున క్షణంలో చంపేటటువంటి ఈ యాంత్రిక విధానం ఎప్పుడాఇతే వచ్చిండో, అది ఆలోచించదగిన విషయం.

18. మన మహర్షులు చెప్పినటువంటి బోధలు, వారు మనకిచ్చిన ప్రాపంచికమైన కర్తవ్యాలు మరచిపోయామని గుర్తుచేసుకోవాలి. వారు లోకహితం కోరి మనకు ఎన్నో ధర్మాలు చెప్పారు. తమ సంతానం మాత్రమే బాగుండాలనికాదు. మహర్షుల యొక్క ఉద్దేశ్యం తమ సంతానంవలన లోకానికి హితం జరగాలి. తద్వారా సంతానం పుణ్యశ్లోకులుకావాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

30.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 98 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శంఖలిఖిత మహర్షులు - 4 🌻

19..ప్రతి ఋషివాక్యానికి ఎంతో లోతైన, విశాలమైన, సమస్త జగత్తుకూ హితంచేకూర్చే భావం కలిగిన అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకు వారు చెప్పినవాటిలో, పితృదేవతలను అర్చించటం ఒక విధి. అంటే చచ్చిపోయిన వాళ్ళను అర్చించటం. ‘బ్రతికిఉన్నవాళ్ళకు అన్నంపెట్టమని చెప్పవచ్చుకదా!’ అని తద్దినాలపై ఒక విమర్శ. బ్రతికేవాడికే అన్నంపెట్టమని వారు చెప్పారు. 

20. అయితే చనిపోయినవారి పేరుమీద పెట్టమని, వారిని జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పారు. అంటే చచ్చిపోయిన వాడు తింటాడా? వాడికి తద్దినం ఎందుకు పెట్టాలి? అనే ప్రశ్నలకు; పోయినవాడికి శ్రాద్ధం పెట్టి, ఉన్నవాడికే భోజనం పెట్టమన్నారు. అయితే వారు ఈ ఉద్దేశ్యం మరచిపోయి, ఇటువంటి కుతర్కంతో కూడిన వాదనలు మనవారు కొందరు చేస్తూ ఉంటారు.

21. రోజూ ఒక్కమారైనా దేశం కోసం ప్రార్థనచేయాలి. ‘గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు’ అని రోజూ నమస్కరించాలి. 

22. అంటే, “గోవు నుంచి సమస్త పశువులు, బ్రాహ్మణులనుంచి సమస్త మానవులు” అని దాని అర్థం. అంతేకాని, గోవులు, బ్రాహ్మణులుమాత్రమే బాగుండాలి, మిగతావారు అక్కరలేదు అని కాదు. అలా ఉండనేఉండదు వైదికమార్గం. ‘గోవులతో మొదలుపెట్టి క్రిమికీటకాదులవరకు, ఒకరికొకరు హానిచేయకుండా ఎవరిబ్రతుకు వాళ్ళు బ్రతుకుతూ శాంతితో ఉందురుగాక! విద్యావంతులు, అవిద్యావంతులు, ధనవంతులు, దరిద్రులు, అంతా సుఖంగా ఉందురుగాక!’

23. రోజూ సంధ్యావందనంలో అనవలసిన మాటలివి. వాళ్ళందరూ సుఖపడాలి అని బ్రహ్మణుడు మూడుసార్లు అనాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

31.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 99  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పిప్పలాద మహర్షి - 1 🌻

వంశము: దధీచి-సువర్చల(తండ్రి-తల్లి), చ్యవనమహర్షి-సుకన్య(తాత-నానమ్మ)

భార్య(లు): పద్మ

కుమారులు/కుమార్తెలు:

కాలము:

భౌగోళిక ప్రాంతములు: 

నదులు: గోదావరి, పుష్పభద్ర

బోధనలు/గ్రంధాలు: బ్రహ్మోపనిషత్తు

🌻. జ్ఞానం:

1. దేవతలు అమరులు అంటారు కదా! మరి చనిపోవటమేమిటి! అని సందేహం. అమరత్వం అంటే, వారు ఆ లోకలనుంచీ తాము వెళ్ళిపోవచ్చు, లేదా లోకంలో ఉండగానే లోకమంతా క్షయమైపోవచ్చు.

2. ఈ లోకాలన్నీకూడా కర్మఫలాలను ఇచ్చే లోకానే! వాళ్ళ అమరత్వం ఎంతవరకంటే మనతో పోలిస్తే అమరలు వాళ్ళు. అంటే! ఏదీ శాస్వతం కాదు. శాస్వతమైన వస్తువేదీ లేనేలేదు. మనం మర్త్యులం. వాళ్ళు అమర్త్యులు. మనతో పోలిస్తే వాళ్ళు అమరులు. మరి లోకాలు ఉన్నాయి. వాటికి ప్రళయం వచ్చినప్పుడు ఏమైపోతున్నాయవి! పుణ్యహీనత ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు పతనం తప్పదు.

3. దేవతలకు ఎందుకు నాశనం కలిగిందంటే, వాళ్ళు ఏ పుణ్యంచేత దేవలోకంలో సుఖపడుతున్నారో ఆ పుణ్యం నశించింది. పుణ్యనాశనం వల్ల వాళ్ళు పతనం చెందటమే వాళ్ళనాశనంగా మనం అర్థం చేసుకోవచ్చు.

4. దధీచిమహర్షి యొక్క ఎముకలు తీసుకుని అతడి చావుకు కారణమైన దేవతలయొక్క పుణ్యం క్షీణించటం జరిగింది. దానికితోడు, మళ్ళీ పుణ్యం సంపాదించుకోవటానికి శక్తిలేని వాళ్ళలాగా అవమని శపించింది పిప్పలాదుడి తల్లి. కాబట్టి వాళ్ళు శిక్ష పొందక ఏమవుతారు? 

5. శాపగ్రస్తులైన దేవతలు భూలోకంలో పుడుతున్నారుకదా! శాపగ్రస్తులైన మనుష్యులలాగా, శిక్షార్హులై ఆ లోకంనుంచి క్రింద పడిపోయేటటువంటి లక్షణమున్న దేవతలు అమరులు అనడంలో అర్థమేమిటి? ఆ మాట సాపేక్షంగా అన్నదే తప్ప శుద్ధ సత్యం కాదు. పక్షులతో మనిషిని పోలిస్తే, మనం చిరంజీవులం. మనకు మార్కండేయుడికి ఎంత తేదాఉన్నదో; కుమ్మరి పురుగుకు మనకు అంత తేడా ఉంటుంది. అంతే! ఎవరు సర్వాధికులు అంటే ఎవరూలేరు. ఒకరికంటే ఒకరికే ఎక్కువ తక్కువలు. 

6. మన నూరేళ్ళజీవితంలో, ఆ క్షుద్రమైన కీటకాలు కొన్నివేల జన్మలెత్తుతాయి. ఒకటి లెక రెండు సంవత్సరాలలో వెయ్యి జన్మలెత్తుతాయి ఆ పురుగులు. బ్రహ్మ కూడా అంతే! ఏ జీవుడికైన ఒక లోకం, ఒక్స్ శరీరం, వాని పూర్వపుణ్యాన్నిబట్టి తరతమభేదాలతో ఉంటాయి. కానీ కేవలంగా ఏవీలేవు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

01 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 100 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పిప్పలాద మహర్షి - 2 🌻

7. పరీక్షించాలనే బుద్ధి దేవతలకు ఎందుకు పుడుతుందని సందేహం కలుగవచ్చు. పరీక్షించబడనటువంటి గుణమేదైనా, అది ఋజువు కానట్లే అర్థం. ఉదాహరణకు పతివ్రత ఒకరున్నారు. ఒక పరీక్ష తర్వాతే ఆమే మహత్తు ఈ లోకానికి తెలుస్తుంది. 

8. అటువంటప్పుడు ధర్మదేవతకు ప్రమాదం(శాపం) కలిగి, మరి ధర్మదేవత క్షీణిస్తున్నది కదా, దానివల్ల లోకానికేం లాభం! అన్న సందేహం కూడా కలుగవచ్చు. అది విధిలోని యుగధర్మం. ఈ సంఘటన నిమిత్తమాత్రం. 

9. ప్రతి ఋషిచరిత్రలో ఈ పరీక్షలో వాళ్ళు గెలిచినట్లు, వాళ్ళ మహిమలు ఋజువయినట్లు గాథలతో చెపుటున్నారు. సామాన్యుడికి పరీక్ష ఉండదు. గొప్పవాళ్ళకే ఈ పరీక్షలన్నీ ఉంటాయి.

10. ధర్మదేవత అంటే సృష్టిలో లోకాలను పరిపాలించి పోషిస్తున్నటువంటి శక్తి. సమస్త దేవతలలోనూ, యక్ష, కిన్నేర, కింపురుషాది దేవతలందరిలో కూడా ధర్మము అనే భావన్-అలాంటి ఒక శక్తి-ఉంది. దేంట్లో ధర్మభావన ఉంటుందో అదే ఈ జగత్తుకు క్షేమంగా ఉండటానికి కారణమౌతోంది.

11. జగత్కల్యాణం కోసం పుణ్యం సంపాదిస్తుంటారు. పుణ్యానికి ముందు ధర్మభావన ఉండాలి.ధర్మమందు నిష్ఠ కలిగిన వాడే పుణ్యం చేస్తాడు. అంటే ధర్మమే లోకలో క్షేమము. ధర్మం ఏం చెబుతుంది? పుణ్యం చేయమని చెబుతుంది. పుణ్యము, తపస్సు, దానము, అన్నీకూడా ధర్మం ఆధీనంలోనే ఉంటాయి.

12. మిగతా దేవతలందరినీ బ్రహ్మ సృష్టించారు కదా! మరి ధర్మదేవతను ఎవరు సృష్టించారు? అంటే, సృష్టి అలాగే ఉంది. దేవతలందరినీ ఈశ్వరుడే సృష్టించారు. అయితే ధర్మదేవతను మాత్రం ఆయన సృష్టించలేదు. 

13. ప్రత్యేకంగా ధర్మదేవత అని ఎవరూ సృష్టింపబడలేదు. యముడున్నాడు. ఆయనను ధర్మదేవత అంటాం. యముడి యొక్క అధికారం ఏమిటి? క్రింది లోకాలలోని జీవుల యొక్క పాపపుణ్యాల విచారణ జరిపి వాళ్ళకు ఉత్తరగతులను నిర్ణయించడం ఆయన పని. అంతవరకు మాత్రమే ధర్మదేవత. అతడిని ధర్ముడని, ధర్మదేవత అని అంటారు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద 

02 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 101 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పిప్పలాద మహర్షి - 3 🌻

14. అయితే మొత్తం సృష్టిలో ధర్మదేవత ఉంది. సృష్టిలో, బ్రహ్మలో ధర్మముంది, ఇంద్రుడిలో ధర్మముంది. సృష్టిలో స్ధర్మమూ ఉంది. అన్నింటిలోనూ ఉంది.

15. హింసచేసి బ్రతకటం ధర్మం అనే రాక్షసులున్నారు. వాళ్ళ స్వభావం అది. అయితే వాళ్ళు అధర్మాన్ని వదిలిపెట్టి క్షేమాన్ని పొందటానికి, దేవతలు కావటానికి మార్గాలున్నాయి. 

16. ఈ ప్రకారంగా ధర్మము, అధర్మము రెండుకూడా సృష్టి అంతా వ్యాపించి, సృష్టిలోనే ఉన్నాయి. ఈ సృష్టిలో ఉండేటటువంటి పోషకపదార్థము – సుఖాన్నిచ్చేది, మంచి భవిష్యత్తునిచ్చేది, క్షేమాన్నిచ్చేది అయిన ధర్మమనే ఒక లక్షణం-దేవతాస్వరూపం-సృష్టిలోకి వచ్చింది.

17. ఒకసారి కబంధఋషి “దేవా! ప్రజాసంసృష్టి ఎలా జరుతున్నది?” అని అడిగాడు. 

పిప్పలాదుడు, “సృష్టి చేయబడవలసినటువంటి జీవుల యొక్క అదృష్టరేక ఎలా ఉందో, పూర్వకర్మ ఎలాఉందో ఆ ప్రకారంగానే పునఃసృష్టి జరగాలి కదా! దానికొక నిమిత్తమైన శక్తి ఉండాలి కదా! కర్మానుసారంగా మళ్ళీ దేహమో, పునఃసృష్టో జరగాలి. సృష్టిలో అది శాసనం. కానీ నిమిత్తమాత్రంగా సృష్టిచేసేవాడు ఒకడుండాలి కదా! ఆ చేసేవాడే బ్రహ్మదేవుడు. 

18. అయితే ఆయన తన ఇష్టానుసారంగా సృష్టి చేయలేడు. జీవులకు కర్మాధీనమైనటువంటి ఏ శరీరం ఎక్కద ఏ లోకంలో ఎలా పుట్టాలో ఆ ప్రకారంగా నడిపించేవాడుమాత్రమే అతడు.

19. “ఒకసారి బ్రహ్మ ఒక మిథునాన్ని సృష్టించాడు. ఆ మిథునంపేరు ‘రయిప్రాణము’. ‘రయి’ అంటే చంద్రుడు, ‘ప్రాణము’ అంటే సూర్యుడు. రయి అంటే మనసు అనికూడా అర్థం. మనసు అంటే ఆత్మ అనీ అర్థం. ప్రాణం అన్నాడు దానిని. వాళ్ళిద్దరివలనే సృష్టిజరుగుతుంది. 

20. ఈ సృష్టిక్రమము అనేకమంది మహర్షులు అనేకమందికి చెప్పారు. ఆ సూర్యుడే వైశ్వానరరూపుడై సర్వవ్యాపకుడు, విశ్వరూపుడు అవుతున్నాడు. ప్రాణాగ్నులన్నీ అతడివలననే ఉదయిస్తున్నవి” అని బోధించాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

03.Sep.2020

------------------------------------ x ------------------------------------



🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 102  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పిప్పలాద మహర్షి - 4 🌻

21. అతడు ఈ జీవకోటికి అంతర్యామిగా ఉన్నాడు. అంతే కాకుండా కాలరూపుడై ఉన్నాడు. అంతర్యామిగా కాలరూపుడు అంటే, పుట్టిన శరీరం ఒకసారెపుడో నశించాలి. కాబట్టి దానికి వృద్ధిక్షయములు అన్నీ ఉంటాయి. వాటిని విధిస్తూఉండే అంతర్యామి ఒకరు లోపల ఉన్నారు. పరబ్రహ్మ వస్తువే ఉందక్కడ. తరువాత అంతర్ముఖంగా అదే అతడు చేసే కర్మకు సాక్షిగాకూడా ఉన్నది. 

22. ఎందుచేతనంటే ప్రతీజీవుడియందు అతడుచేసే కర్మ చూచేదెవరు? ఎవరు నిర్ణయం చేస్తున్నారు? అంతస్సాక్షిగా ఉన్న పరమాత్మవస్తువు జీవాత్మకు వెనుక, ద్రష్టగా(చూచేవాడుగా) సాక్షిగా ఉన్నాడు. (“ద్వా సుపర్ణా…” అనే ఉపనిషన్మంత్రానికి ఈ అర్థమే ఉంది. ఆ మంత్రంలో వర్ణితమైన వృక్షం ఈ దేహం. అందులోని రెండు పక్షులు – ఒకరు జీవాత్మ, మరొకరు పరమాత్మ. అతడు ద్రష్ట. చూచేవాడు కాబట్టి అతడిని సాక్షి అని అంటారు.)

23. “అంతటా వ్యాపించిన ఆ పరమాత్మ సృష్టిస్థితిలయములకు హేతువు అవుతున్నాడు. సర్వస్వరూపుడు అతడే! యజ్ఞంలో అర్చించబడేది అతడే! దక్షిణాయనానికి, ఉత్తరాయణానికి ఆయనే కారకుడు. 

24. కర్మానుసారంగా జీవులకు దక్షిణాయనంలో పితృయానమార్గంలో చంద్రమండల ప్రాప్తి, ఉత్తరాయణంలో అర్చిరాది మార్గమున బ్రహ్మలోకప్రాప్తి అతడే కల్పిస్తున్నాడు. మొదటిది పునరావృత్తి సహితము, రెండవది పునరావృత్తి రహితము. 

25. అంటే పితృయానమార్గంలో చంద్రలోకానికి వెళ్ళినప్పుడు జీవుడికి మళ్ళీ పునర్జన్మ కలిగితీరుతుంది. ఉత్తరాయణంలో యోగ్యుడై వెళ్ళిపోతే పునర్జన్మ కలుగదు. అంటే అందరికీ అనికాదు. 

26. ఎందుకంటే ఉత్తరాయణంలో అనేక జీవులు చనిపోతున్నాయి. మేక, కుక్కలతోపాటు ఎన్నో జీవులు చనిపోతున్నాయి. మహాపాపాలు చేసినవాళ్ళు కూడా చనిపోతున్నారు. ఉత్తరాయణంలో పుణ్యశీలి, జ్ఞానం కోరేవాడు పోతే అతడి పుణ్యం సఫలమయే కాలం వచ్చిందన్నమాట. అప్పటికే మోక్షంపై కోరిక ఉండి పుణ్యంచేసినవాడు ఉత్తరాయణ కాలంలోపోతే, అతడు పరమపదానికి వెళతాడు” అని చెప్పాడు పిప్పలాదుడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

04.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 103 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పిప్పలాద మహర్షి - 5 🌻

27. సంవత్సరానికి అయిదే ఋతువులున్నాయని చెప్పాడు. అంటే ఇక్కడ హేమంత శిశిర ఋతువులు రెండూ ఒకే ఋతువు అని ఆయన్ ఉద్దేశ్యం కావచ్చు. మాసము ప్రజాపతిస్వరూపము. మాసంలో శుక్లపక్షం ప్రాణస్వరూపము. మాసము అంటే బ్రహ్మ అనే అర్థం. ప్రజాపతి అంటే, ఎక్కడ ఆ మాట వచ్చినప్పటికీ కూడా, దానికి బ్రహ్మదేవుడు అని అర్థం. 

28. “ఓం భూర్భువస్సువః స్వాహా… ప్రజాపతయ ఇదం న మమ” అనే మంత్రంలో ఉన్న ప్రజాపతి, బ్రహ్మశబ్దవాచకం. అన్నము ప్రజాపతిస్వరూపంగా భావించబడింది. పగటి కాలం అంతా ప్రాణస్వరూపము, ఇదే శ్రేష్ఠమైనది అని ఈ ప్రకారంగా ఆయన అనేక విషయాలు చెప్పాడు.

29. అనేకమంది ఋషులు కాస్త తేడాతో చాలా మహత్తుతో చెప్పిన మాటలే ఇవి. అయితే అన్నీ ఒక్కలాగ ఉండకపొవచ్చును. ఆ భాషలో, మాటలలో మొత్తం ఈ సృష్టీంతా యథార్థంగా ఉందనేటటువంటి భావంతో జీవుల యొక్క రాకపోకలను గురించి చెప్పుతుంది అది.

30. మరొక ఋషి పిప్పలాదుని, “దేవా! శరీరాన్ని భరించేదెవరు?” అని అడిగాడు. ఆ ప్రశ్నకు పిప్పలాదుడు, “శరీరాన్ని భరించేది, ప్రకాశింపచేసేది ప్రాణమే! ప్రకాశింపచెయ్యటము అంటే, ఈ చైతన్యాన్ని ఇచ్చి పనిచేయించేదికూడా ప్రాణమే” అని చెప్పాడూ. 

31. అలాగే మరొక ఋషి, “ప్రాణం అనేది ఎట్లా పుడుతుంది? శరీరంలోకి ప్రాణం ఎట్లా ప్రవేశిస్తుంది?” అని అడిగాదు. దానికి పిప్పలాదుడు, “మొదట ఆత్మ నుంచే ఆత్మ పుడుతుంది. తరువాత దానినుండి ప్రాణం పుడుతుంది. 

32. అంటే దాని అర్థం ఏంటంటే, ఆత్మవస్తువు పంచభూతములలో ప్రవేశించగానే ప్రాణం అందులోంచి బహిర్గతమవుతుంది అని వేద శాస్త్రం చెబుతున్నది. ప్రాణం ఎక్కడినుంచో రాదు. ఆత్మయందే ఉన్నది” అని చెప్పాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

05.Sep.2020

------------------------------------ x ------------------------------------



🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 104   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. పిప్పలాద మహర్షి - 6 🌻

33. సౌర్యాయణి అనే ఋషి పిప్పలాదుని, “డెవా! శరీరంలో నిద్రించేది ఏది? మేల్కొనేది ఏది? సుఖమంటే ఏమిటి?” అనీ అడిగాడు. 

దానికి పిప్పలాదుడు, “ఇంద్రియములన్నీకూడా మనసులో లయం చెందటమే నిద్ర. ఇంద్రియాలు మనసులో లయిస్తాయి. జ్ఞానేంద్రియ పంచకము – అంటే కన్ను, చర్మము వంటి కర్మేంద్రియపంచకము వెనుక సూక్ష్మరూపంలో ఉండే జ్ఞానేంద్రియ పంచకము – మనసులో లయిస్తే దానిని నిద్ర అంటాము” అని చెప్పాడు. 

34. “ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ పంచకము, అంతఃకరణ చతుష్టయాన్ని నడిపించటానికి కావలసిన ప్రాణశక్తిని మనలోంచి ఉద్భవంచేసి నడిపించేశక్తి ఆ పరమాత్మయందు ఉంది. కాని దానియందు ఈ ఇంద్రియములుకాని, ఈ ధాతువులుకాని ఏవీ ఉండవు. వాటికన్నిటికీ కావల్సిన శక్తిమాత్రమే అందులో ఉంటుందికాని దానిలో వస్తువులేవీ ఉండవు” అని తెలిపాడు.

35. ఓంకారోపాసన గురించి తెలియచేయమని మరొక ఋషి అడిగాడు. 

దానికి పిప్పలాదుడు, “ఓంకారం ఏ కొద్దికాలం ఉపాసించినవారైనాసరే ఋగ్వేదాభిమాని అయినటువంటి దేవతలవల్ల మళ్ళీ మనుష్యులై పుడతారు. అయితే అధికంగా ఉపాసన చేసినవాళ్ళు యజుర్వేదాభిమాని అయినటువంటి చంద్రుడివల్ల చంద్రమండలానికి వెళ్ళి తిరిగివస్తారు. 

36. త్రిమాత్ర అంటె ఇంకా ఎక్కువ ఉపాసించినవాళ్ళు, పాప విముక్తులై, సామవేదాభిమాని దేవతచే సూర్యమండలమార్గంలో బ్రహ్మలోకానికి వెళతారు. ఋక్‌యజుస్‌సామవేదాలకు ఉత్కృష్టస్థితి ఈ క్రమంలో ఉంటుంది” అని చెప్పాడు.

37. “షోడశ కళాపురుషులు అంటే ఎవరు?” అని మరొక ఋషి అడిగారు. “అతడు శరీరంలో ఉన్నాడు. కాబ్ట్టి దేహం స్వస్థంగా ఉండటానికి ఆధారమైన ఐదు విధముల ప్రాణశక్తి, ఆ ప్రణానికి తోడుగా శ్రద్ధ, ఐదు ఇంద్రియాలు, పృథ్వి మొదలైన పంచభూతములు – ఇవే పురుషులు. మనసు, అన్నము, వీర్యము సమస్తమూ పుడుతూ నిత్యమూ జీవనక్రియ నడుస్తూ ఉందికదా! 

38. ఈ క్రియలన్నిటినీ షోడశకళలంటారు. నదులన్నీ సముద్రంలో ప్రవేశించినట్లు, అవన్నీ సర్వసాక్షి అయిన పురుషుడిలోపల ప్రవేశించి అస్తమిస్తాయి. దానినే మృత్యువంటారు. అవి శాశ్వతంగా అస్తమిస్తే అతడు అమృతుడవుతాడు. ఆ పురుషునిలోకి వెళ్ళి నిద్రించినపుడే మృత్యువు, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు పునర్జన్మ ఉంటుంది. మళ్ళీ రాకుండా వెళితే మాత్రం అది మృత్యువుకాదు, అమృతత్త్వం” అని చెప్పాడు పిప్పలాదుడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

07.Sep.2020

------------------------------------ x ------------------------------------




🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 105  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పిప్పలాద మహర్షి - 7 🌻

39. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు శత్రువులు; సమదమాది షట్కసంపత్తి; తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం అనే సుగుణాలు - వాటి యొక్క నిష్ఠనుబట్టి - ఆ దేహాన్ని ఆశ్రయించి ఎప్పుడూ ఉంటాయి. 

40. వీటిలో ఏ గుణములు అతడు ఆశ్రయిస్తాడో అటువంటి ఫలాన్నే పొందుతాడు. అంటే శమాది షట్కసంపత్తి, అరిషడ్వర్గము రెండూకూడా దేహమందు సహజంగా ఉంటాయి. 

41. ఈ జీవుడు దేనిని వాడుకుని దేనిని ఆశ్రయిస్తాడో, తన దేహమదుండే ఆ వస్తువులను బట్టి అతడు ఫలం పొందుతాడు. ఇన్ని విషయాలు చెప్పనక్కరలేదు. ఒక్కటే మార్గం ఉంది. 

42. నీలో ఆరు దుర్గుణాలు, ఆరు సుగుణాలు ఉన్నాయి. నువ్వు దేనిని ఆశ్రయిస్తే, నిరంతరం మనిషిజన్మనెత్తుతూ సుఖదుఃఖాలు అనుభవిస్తావు. రెండూ స్వతంత్ర మార్గాలు. ఇందులో ఉండి అందులో వెళ్ళలేడు. అందులో ఉండి ఇందులోకి రాలేడు.

43. “ఇష్టానిష్ట శబ్దములు అనే పేరుతో షడ్జము, ఋషభము, గాంధారము, పంచమము,మధ్యమము, ధైవతము, నిషాదము అని ఉన్నవి. శుక్ల, రక్త, కృష్ణ, ధూమ్ర, కపిల, పాండురములని ఏడుధాతువులున్నాయి. వాటికి వర్ణములున్నవి. రసము నుండి రక్తము, రక్తము నుండి మాంసము, మాంసము నుండి మేదస్సు, మేదస్సు నుంచీ మజ్జ, మజ్జ నుంచీ శుక్లము, ఇవన్నీ కలుగుతాయి” అని చప్పాడు.

44. దుఃఖానికి కారణము జన్మమే అంటారు. ఇది పరమ దుస్సహమైనది అని తెలిసినవాడు జన్మ నివృత్తి కోసం ధర్మాన్నిగాని, యోగజ్ఞానసాధన కాని అవలంబిస్తాయి. 

45. అందుకే ఈ జన్మనుగూర్చి, గర్భనరకంలో ఉన్నప్పుడు దుఃఖపడతాడు. ఆ విషయం, ఆ జీవికి గర్భమ్నుండి బయటపది జన్మనెత్తిన తర్వాత ఎప్పుడో, తనుగర్భంలో ఉండి వేదనపడిన విషయం స్మృతిపథానికి వచ్చి, మోక్షమందు తీవ్రమైన ఇచ్చ కలుగుతుంది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద 

08.Sep.2020

------------------------------------ x ------------------------------------



🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 106  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. పిప్పలాద మహర్షి - 8 🌻

46. ప్రతి జీవుడికి కూడా భగవంతుడి అనుగ్రహంతో ఎప్పుడో ఒకప్పుడు ఈ తీవ్రమైన వైముఖ్యం దైవికంగా కలుగుతూనే ఉంది. తల్లిగర్భమ్నుంచి బయటకు వచ్చి పెరుగుతున్న సమయంలో, ఆ నరకాన్ని గురించి మరచిపోయి వాడు పాపపుణ్యాలు చేస్తున్నాడు.

47. తీవ్రమైన ఎదో గొప్ప సంఘటన దైవికంగా జరిగినప్పుడు, గర్భనరకలో ఉన్నపుడు తాను ఎట్టి వేదనకు గురి అయినాడో అది మళ్ళీ స్మృతి పథానికివచ్చి మోక్షేఛ్ఛకు హేతువవుతుంది. దానికోసం అన్వేషించి ఉత్తీర్ణుడవుతాడు. 

48. అయితే అలాంటి ఘటనలు దైవయోగంవలన మాత్రమే జరుగుతాయి. అజ్ఞానం ఎంత దారుణమైనదో అని లోపల ఉండగా అనుకుంటాడట. “కామక్రోధ సంకటాలు ఎంత బాధాకరమైన విషయాలు! నేను బయటపడగానే వీటినిజయిస్తాను. 

49. ఈ సంసారమనే సంకెళ్ళను పిండిపిండి చేస్తాను” అని ఇలాంటి విషయాలు అనేకంగా అనుకుంటూ ఉంటాడు. కాని భూమిమీద పడగానే మరచిపోతాడు.

50. ‘గర్భవాసమ్నుంచీ బయటకురాగానే శివస్మరణ చేస్తాను. లయక్రియకు హేతువు, జగత్తునంతా తనలోనికి తీసుకునేవాడు రుద్రుడు. సర్వశక్తి మయుడు, చిదాత్ముడు సర్వకారణకారణుడు, భర్గుడు, పశుపతి, మహాదేవుడు, జగద్గురువు అయినటువంటి ఈశ్వరుడిని నేను శరణు వేడుతాను. మహా తపస్సు చేస్తాను. శాశ్వతంగా ముక్తిని పొందుతాను” అని ఇన్నీ అనుకుంటాడట జీవుడు. ఇవతలికి రాగానే అన్నీ మరచిపోతాడు. అవన్నీ చెప్పాడు పిప్పలాదుడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

09.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 107  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. పిప్పలాద మహర్షి - 9 🌻

51. అంతర్యామిగా అమృతుడుగా, ఆత్మసాక్షిగా ఉండేదే పరమపురుషుడు. అవిద్యచే ఆవరించ్బడి అతడే జివుడౌతున్నాడు. అంటే ఇక్కడ సందేహంగానే ఉంది అందరికీ! పరమాత్మవస్తువు జీవుడైనాడా! 

52. పరమాత్మ పరమాత్మ వస్తువుగా (వెనుక) లోపల ఉండగానే, జీవుడు వేరే ఉన్నాడా! ఆ విశిష్టాద్వైతానికి, వైష్ణవానికి, కొంతవరకు శైవానికి మూలాధారమైనటువంటి ఆధారమ్హూమికను “ద్వా సుపర్ణా…” మంత్రం కల్పిస్తుంది. 

53. చెట్టుపై రెండు పక్షులున్నాయి. ఒక పక్షి సాక్షిగా ఉంది, మరొక పక్షేమో ఫల తింతున్నది అని చెప్పిన ఉననిషత్ మంత్రం, రెండూ(అంటే జివాత్మ, పరమాత్మ) ఉన్నాయని ప్రతిపాదిస్తోంది. ఇవి రెండులేవని, ఒకటి వస్తువు, మరొకటి దాని చాయ అని మరికొందరు అంటున్నారు.

54. ఒక విషయంమాత్రం మనందరికీ తెలుసు. “నేను ఒక్కడినే ఉన్నాను. నాకు దుఃఖం ఉన్నది” అన్నది. ఆ విషయం మనకు తెలుసు. పరమాత్మ లోపల ఉన్నాడు. అంతటా ఉన్నాడు. అది వేరే విషయం. 

55. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అంతర్యామిగా కానీ, బహిర్యామిగా కాని, సర్వాంతర్యామిగా కాని, సర్వమయుడుగా కాని ఎలా ఉన్నప్పటికీ కూడా; అతడు విష్ణువో, శివుడో, ఎవరో ఒక పరమాత్ముడిగానే ఉన్నాడు అక్కడ. నాకు దుఃఖం ఉంది, రక్షకుడైన విష్ణువో, శివుడో రక్షిస్తాడు అని ఆశించి ప్రార్థన చెయ్యాలి. 

56. ఈ విషయంలో ఏ శాస్త్రానికీకూడా సందేహంలేదు. లోపలే ఉన్నాడా? ఇవతలే ఉన్నాడా? ఈ జీవుడు ఈశ్వరుడు ఎలా అవుతాడు? ఇట్లాంటి ప్రశ్నలకు భక్తుడివద్ద తావు లేదు. 

57. వేదాంతి అంతా ఒక్కటే అంటాడు, ఈ జగత్తంతా ఒక్కటే అంటాడు. సర్వం ప్రహ్మమయం, బ్రహ్మ ఒకటే వస్తువు అంటాడు, ఇదేమో మిథ్య అంటాడు ఒకడు. ఇదంతా సత్యము అంటాడు యజ్ఞయాగాదిక్రతువులు చేసేవాడు. ఈ జగత్తు నిజంగా ఉందికాని ఈశ్వరుడు లేడంటాడు పూర్వ మీమాసకుడు. 

58. ఎందుచేతనంటే యజ్ఞం అవిద్యలోంచి పుట్టింది. అవిద్యా మూలకమైనటు వంటి లక్షణములు, ఆ ప్రసాదములనే ఇస్తుంది, అంతకంటే మించి అది ఇంక ఏమీ ఇవ్వదు ఇట్లాంటి మాటలన్నీకూడా పూర్వమీమాస చెపుతుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

10.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 108  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. పిప్పలాద మహర్షి - 10 🌻

59. ఆర్యమతంలో ఈ విషయంలో అందరూ మహర్షులే, అందరూ జ్ఞానులే, అందరూ ముక్తులే కావచ్చుకాని వాళ్ళ బోధలుమాత్రం అనేక రకాలుగా ఉన్నాయి. 

60. అందుకనే చిట్టచివరకు హిందూమతంలోని హిందూ ధర్మం అంతాకూడా భాగవతమతం అనేటటువంటి ఒక పెద్దసముద్రంలో చేరింది. సముద్రం ఎటూ ప్రవహించదు. నదులన్నీ ప్రవహించి సముద్రంలో చేరతాయి. కానీ సముద్రం ఎక్కడికి ప్రవహిస్తుంది? అందులోనే అన్ని నదులూ లయిస్తాయి. 

61. అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము, యోగము, సాంఖ్యము అన్నీకూడా భాగవతమతంలో లయించక తప్పదు. చివరకు అదే మనకు గమ్యస్థానమైపోయింది. ఇక్కడినుంచి మళ్ళీ వెనక్కుపోవటం అనేది లేదు. 

62. మళ్ళీ సాంఖ్య మతంలోకి వెళ్ళిపోతాము, యోగంలోగి వెళ్ళిపోతాము, మళ్ళి పూర్వమీమాంసకులము అయిపోతాము అని కలలు కనకూడదు. అలా జరగదు. భాగవతమతమే చిట్టచివరి దశ. ఇదే తుదిమెట్టు. మనందరికీ కూడా అదే శరణ్యం. అందులోనే మనం అన్నిటినీ అన్వయించుకోవాలి. 

63. అద్వైతమైనా, విశిష్టాద్వైతమైనా, ద్వైతమైనా, ఏదైనాసరే భాగవతమతంలో అన్వయించుకోవచ్చు. నేడు అనేకమంది అదే చేస్తున్నారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

11.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 109  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. అరుణి మహర్షి - 1 🌻

🌻. జ్ఞానం:

1. తపోవృత్తిలో ఉన్నా, ఆ వృత్తిలో ఉండేవాళ్లను అనుసరించినా అది తపస్సే అవుతుంది. 

2. వేదాధ్యనం చేయటమేకాక, ఎవరైనా అధ్యయనం చేస్తున్నప్పుడు నిరంతరం వింటూంటేకూడా ఫలం కలుగుతుంది. వాటిలో ఉండే శక్తి అట్లాంటిది.

ఈ ప్రపంచం అంతటికీకూడా అధిష్ఠానమైన ఒకానొక వస్తువున్నది. దానికి పరమాత్మ, బ్రహమవస్తువు అని పేర్లున్నాయి. 

3. అది తెలుసుకుంటే జగత్తులోని బంధన హేతువులైనటు వంటివన్నీకూడా జీవుడిని విసర్జిస్తాయి. అది నేర్చుకున్న తరువాత ఆ వస్తువును తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నవాడికే బంధనాలు అతడిని వదిలి పెట్టడము మొదలుపెడతాయి. 

4. ఆ ప్రయత్నమే అంత పవిత్రమైనదికాబట్టి అటువంటివస్తువును తెలుసుకునే ప్రయత్నంచెయ్యటానికీ, దానికి మార్గం అడగటానికే గురువును వినియోగించుకోవటం అవుతుంది కాని, ఈ విధ్యవల్ల ఏమీ లాభంలేదు.

కంటికి కనిపించేటటువంటి ప్రపంచం అంతాకూడా ఈ సృష్టికిపూర్వం సద్రూపమయిన బ్రహ్మముగానే ఉన్నది. 

5. దానినుంచి వివర్తమై పుట్టి, ద్వంద్వములతో ఉండి, సజాతీయ, విజాతీయ భేదములతో వచ్చిన ఈ జగత్తంతా ఉన్నది. సజాతీయ భేదమంటే, వృక్షములన్నీ – ఒక పనసచెట్టు, ఒక మామిడిచెట్టు – ఒకటే జాతివి. అది స్వజాతీయతలో భేదం. 

6. విజాయీవతతో కూడిన భేదమంటే – చెట్టుకు, రాయికి ఉండేటటువంటితేడా. అదీగాక స్వగతభేదమనే మూదవరకమైన భేదం ఓకటుంది. ఆ చెట్టుకే కాండం వేరు, కొమ్మలు వేరు, ఆకులు వేరు, పువ్వులు వేరు, కాయ వేరు, పండు వేరు. చెట్టులోనే ఇది మళ్ళీ స్వగతభేదం. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

12.Sep.2020

------------------------------------ x ------------------------------------



🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 110   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. అరుణి మహర్షి - 2 🌻

7. ఇలాగ భేదంతో ఉండేటటువంటి ఈ జగత్తంతా దేనియందు అధిష్ఠానంగా, దేని యందు విశ్రమిస్తుందో, దేనిని ఆధారంగా చేసుకోని ఈ జగత్తు పెరుగుతోందో అనేది తెలుస్కోవడాన్నే పరవిద్య అంటారు. ఈ మిగతా విద్యలన్నీ ఎందుకూ పనికిరావు.

8. పరమాత్మ వస్తువు తనకుతాను జగత్తుగా పరిణామం పొందాలి అనుకుని సంకల్పించినప్పుడు, మొట్టమొదట అగ్ని పుట్టింది. అగ్ని ఆయన తేజస్వరూపమే! ఆ తరువాత ఉదకము పుట్టింది. ఆ తేజము, ఉదకములయొక్క సంయోగముచేత అన్నం పుట్టింది.(అన్నము అంటే ద్రవ్యము అని అర్థం. అక్క తినేదికాదు అన్నము అంటే. అది ద్రవ్యమునకే పేరు.) 

9. ఈ తేజము, జలము, అన్నము – మూడుకలిసి త్రివ్రృత్కరణమంది సృష్టి నిర్వహించింది.(త్రివ్రృత్కరణము అని వేదాంతంలో చెప్తారు.

10. త్రివ్రృత్కరణమంటే, తేజంలోని సగభాగాన్ని తీసి జలం లోను, అన్నంలోను కలపటం; అన్నంలోని అర్థభాగంతీసి తేజములో, జలములో కలపటం – అంటే వీటిని ఆయా ప్రమాణాలలో ఒకదానితో ఒకటి కలపటం అనే పంచీకరణం ఎలా ఉంటుందో, త్రివ్రృత్కరణం అలా ఉంటుంది.)

11. అలా అగ్ని అంటే తేజము, ఉదకము; ద్రవ్యము అంటే అన్నము ఇవన్నీ కలిసి జీవులయ్యాయి. ఈ జీవులకు వాటిలో అనేకరకములైన జన్మలు – అండజము, స్వేదజము, ఉద్భిజము మొదలైనవి పుట్టాయి. ఈ ప్రపంచమంతటికీకూడా మూలపదార్థములు మూడే ఉన్నాయి. 

12. అంటే, జలముంది, అగ్ని ఉన్నాడు, ద్రవ్యముఉంది, అంతే! ఇంత వివిధంగా ఇన్ని ఏమీలేవు. ఉన్నవన్నీ కలిసి మూడే ఉన్నవి. వాటి వెనుక కాల పరబ్రహ్మవస్తువున్నది. సృష్టిని ఒక్కొక్క్ మహర్షి ఒక్కొక్కరకంగా బోధించాడు. “ఆ విధంగా ఒక్కొక్క రకంగా ఉన్నా, అవి మూడే ద్రవ్యములుగా ఉన్నాయి. 

13. ఆ బోధను జ్ఞాపకం పెట్టుకుంటే, అలాగే తపస్సు చేయగాచేయగా జగత్తంతా వట్టి జలమే కనబడుతుంది, అగ్నిమాత్రమే కనబడుతుంది, వట్టి ద్రవ్యంమాత్రమే కనబడుతుంది. ఈ ద్రవ్యమంతా ఒకేరాశిగా కనబడుతుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

14 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 111  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. అరుణి మహర్షి - 3 🌻

14. భేదాలు లేకుండా, ద్రవ్యాన్నిబట్టి పదార్థమే అనే జ్ఞానం కలుగుతుంది. దానికి సన్నిహితమైనటువంటి, దానికి ఆధారమైన బ్రహ్మవస్తువు యొక్క అనుభవం తపస్సులో కలుగుతుంది. అది ఒక మార్గం. 

15. ఈ వైవిధ్యానికి అంతులేదు. స్వజాతీయత, విజాతీయత భేదములు ఇంకా అనేకములు ఉన్నాయి. ఈ భేదము అపరిమితంగా పెరుగుతూఉంది. 

16. కానీ, ఇంత క్లిష్టంగా కనబడేటటువంటి ఈ ప్రపంచానికి ఒకే పరమాత్మ కారణమని తెలుసుకున్ననాడు; అది ఒకటే ఉందనే విశ్వాసంతో నీవు ఆ ఒక్కటీ ఏదని ప్రశ్నించుకుంటే, ఆ ప్రశ్న తపస్సు అవుతుంది. అదే నిన్ను రక్షిస్తుంది. నీవు దానిని కనుక్కోలేవు. 

17. ఎందుచేతనంటే, నీకున్నవి ఇంద్రియములు. ఒక ఇంద్రియానికి ఉండే శక్తి మరొక ఇంద్రియానికి లేదు. నీళ్ళలో ఉప్పువేశారంటే కంటికి కనబడదు.(కూరలో ఉప్పు సరిపోతుందా లేదా అని కంటితో చుచి ఎవరూ చెప్పలేరు. నాలుక మీద వేసుకుని రుచి చూచి చెప్పుతారు) జిహ్వేంద్రియానికి మాత్రమే ఉప్పును గుర్తించే శక్తి ఉంది. ఈ ప్రకారంగా, ఆత్మవస్తువును గుర్తించగలిగిన ఇంద్రియము మాత్రం నీ పంచేద్రియాలలో లేదు. 

18. అది నీ అంతఃకరణమనే దానితోనే గుర్తించబడుతుంది. నాలుకతో ఉప్పును ఎలా గుర్తుపడతావో, అలాగే పరిశుద్ధమైన అంతఃకరణతో, ఏకాగ్రతతో ఏనాడు నీవు అన్వేషిస్తూ ప్రశ్నయందుంటావో, ఆనాడు నీకు ఆత్మవస్తువుయొక్క సాన్నిధ్యం ఏర్పడుతుంది. 

19. నిజానికి రోజూ నిద్రావస్థలో నీవు దానిదగ్గరికే వెళ్ళుతున్నావు. అందుకనే సుఖాన్ని అనుభవిస్తున్నావు. మనస్సు, బుద్ధి, చిత్తము – అన్నీ నిన్ను గాఢనిద్రలో వదిలిపెడుతున్నాయి. 

20. అక్కడ ఈ మనోబుద్ధి చిత్తములు దాని(ఆత్మవస్తువు) సన్నిధిదాకా వెళ్ళక, ఈ అంతఃకరణ అక్కడికివెళ్ళి నిద్రపోతోంది. అన్నిటికీ హేతువైనటువంటి జీవత్వం పొందిన అంతరాత్మ అక్కడికి వెళుతుంది. దాని దగ్గరికి వెళ్ళినప్పుడే శాంతి కలుగుతుంది. కాబట్టి నీవు దానిని గుర్తించి, దానిని ఒకటే వస్తువుగా గుర్తించి తపస్సుచేసుకో. నీకు శాంతి కలుగుతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

15.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 112   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. అరుణి మహర్షి - 4 🌻

21. గ్రోధం అంటే మర్రిచెట్టు. దాని కాయలను పగులగోడితే అందులో గింజలుటాయి. మరి గింజను పగులకొడితే ఏముంటుంది? ఆ గింజలో ఏమీ ఉండదు. అది భేదించబడి నప్పుడు ఏమీ ఉండదు. కాని అందులో ఆ మహావృక్షం యొక్క సూక్ష్మ రూపం ఉంది. అలాగే ఆ పరమాత్మయొక్క సూక్షమమైన బీజమందు ఇంత జగత్తూ ఇమిడిఉంది. 

22. కాబట్టి నీవు దానిని భేదించటం సాధ్యపడదు. దానిని ఎవరూ భేదించలేరు. వీటన్నిటికీ మూలమైన ఒకానొక వస్తువన్నదనే జ్ఞానం – ఆ ఒక్కటీ ఏదో నీకు తెలియనక్కరలేదు- దానిని గురించిన ధ్యానమే నీకు తపస్సు అవుతుంది. అంటే తెలిసున్న వస్తువుగురించి ధ్యానము సులభమే. తెలియని వస్తువును గురించిన ధ్యానం కష్టం. 

23. మనకు తెలిసినవాళ్ళు దూరదేశంలో ఉంటే, వాళ్ళను గురించి మనస్సులో భావనచేస్తాము, వారు మనకు తెలుసు కాబట్టి. విష్ణుధ్యానం చెయ్యమంటే, ఆయనను ఎవరు చూచారు? ఆయన ఎలా ఉంటాడు? ఎవరో పెద్దలు, ఆశ్రమవాసులు ఈ రూపంలో ఉంటాడు ఇట్లా ధ్యానం చెయ్యమని చెప్పారు.

24. జగత్తులో ఉండే వైవిధ్యాన్ని గుర్తించే ఈ బుద్ధి, ఇంద్రియముల సాయం తోటే మనస్సు అక్కడికి వెళ్ళుతుంది. అయినప్పటికీ ఏ ప్రకారంగా బోధించబడిందో ఆ వస్తువును అలాగ స్వయంగా చూడగలిగిన శక్తి దానికిలేదు. 

25. కానీ అలా చేసినవాళ్ళు ఈ స్థితిలో అనుగ్రహంపొంది ఆ దర్శనం పొందుతున్నారు. ఇది ఎవరి శక్తి? ఇది మనోబుద్ధులయొక్క శక్తికాదు. దానిని అన్వేషిస్తూ వెళ్ళేవాడికి అదే ఎదురొచ్చి అనుగ్రహించి దర్శనమిచ్చే లక్షణము దానియందున్నది. 

26. ఆ ఈశ్వరానుగ్రహంమీద ఆధారపడి తపస్సు ఫలించవలసిందే తప్ప, తపస్సుచేసేవాడి సమర్థతే అక్కడ లేదు. కాబట్టి ఆ కల్యాణ గుణం దానియందున్నది అనే భావనతో తపస్సు చేస్తే, పరమాత్మవస్తువు నీకు దర్శనం అవుతుంది.

27. తండ్రికి ఉండవలసింది మమకారం కాదు, వాత్సల్యం. వాత్సల్యంలో మోహం ఉండదు, ప్రేమ ఉంటుంది. ప్రేమవల్ల పిల్లలు మంచిమార్గంలో వెళతారు. కానీ మన కుండే మోహం వలన వాళ్ళు బాగుపడరు. 

28. ప్రేమ పవిత్రమైనది. మోహమే బంధనము. మోహము తండ్రీకొడుకులిద్దరినీ దుఃఖంలో ముంచుతుంది. దుఃఖాన్ని ఇచ్చేటటువంటిది మోహం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

16 Sep 2020

------------------------------------ x ------------------------------------




🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 113  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. మతంగ మహర్షి - 1 🌻

జ్ఞానం:

1. పశువులు ఏం మాట్లాడుతున్నవో మనకు తెలియదు. మనం ఎంత ఘోరంగా వాటిని హింసిస్తాం? వాటి మనోభావాలకు ఒక భాషంటూపుడితే మనకు గురించి ఏం మాట్లాడతాయో ఊహించుకుంటే సరిపోతుంది. మంకు అంత తెలివిఉంది! 

2. నిష్కారణంగా ఒక కుక్కనుకొడతాం. అన్నంకోసం వచ్చింది. దానికీ ఆకలివేస్తుంది. మనకు ఆకలైతే, అన్నం వండుకుని తింటాం. ఆకలి తీర్చుకుంటాం. ఆకలి అందరికీ సమానమే! కుక్క శరీరమైనా అంతే! మనిషి శరీరం అంత్వాటిఏ! కొడితే అవికూడా తిట్టుకుంటాయి మనను. వాటి భాష అర్థమయితే మనకు తెలుస్తుంది. 

3. “ఏమిటి వీళ్ళందరూ వండు కుంటున్నారు, తింటున్నారు. నాకు అన్నం పెట్టటానికి ఏడుస్తున్నారు. పైగా కొడుతున్నారు. ఇంత అన్నం పారెయ్యకూడదా! పైగా యజ్ఞం చేస్తున్నాడట! ఊరివాళ్ళంతా చాలా గొప్పవాడిని అనుకుంటున్నారు” అని కుక్క అనుకుంటున్న భాష అర్థమయితే ఏమవుతుంది? కొంచం కూడా ఆలోచనలేదు. దాని ఆంతర్యం కనుక మనం తెలుసుకుంటే మనది ఎంత అనుచితమైన కార్యమో మనకు తెలుస్తుంది. 

4. కానీ మనం అదే తప్పుచేస్తే, మన యజ్ఞసంరక్షణ కోసం దానిని కొట్టినట్లు, మన శౌచం కాపాడుకోవటానికి కుక్కను కొట్టినట్లుగా, మనం చేసినపని పరమ ధార్మికమైనదని – లేకుంటే దనిని శిక్షించటంచేత యజ్ఞ సంరక్షణ చేసామని – అనుకుంటాం. ఇవన్నీ మన భావాలు. ఇలా మనం తెలివి ఉండికూడా చేసేటటువంటి పాపాలుంటాయి.

5. పశువులన్నీ పశువులుకావు. వాటిలో అన్నీ కేవలం జడత్వంలో ఉన్న జీవులు మాత్రమే కాదు. కొంతమంది యోగులు మళ్ళీ తపస్సు చేయాలనుకుంటే, “మనుష్య జన్మ ఎత్తితే ఏవైనా దోషాలు సంక్రమించవచ్చు.

6. కామక్రోధలోభాలతోసహా ఏదయినా జరగవచ్చు. నాకు నా జీవలక్షణము, నా యోగస్మృతి, నా ధ్యేయం, నేను ఏదికోరి ఈ తపస్సుచేస్తున్నానో అటువంటి స్థితి జీవునియందు ఉండాలి. ఈ శరీరం ఏదయినా క్షుద్రమయిన శరీరం అయినా చాలు. పక్షినైపుడతాను. 

7. ఆ శరీరంలో పాపంచేసే అవకాశంలేదు. మరొకరు పాపం చేస్తే వారి చేతిలో చచ్చిపోతాను కాని, నేను పాపం చేయను కదా! (పక్షి ఏం పాపంచేస్తుంది? పురుగులను తింటుంది. అది పాపం అని దానికి తెలియదు, దాని లక్షణం కాబట్టి. తెలిసి చేసేదే పాపం. ఆవశ్యకతలేని క్రూరకర్మ పాపం). 

8. కాబట్టి ఏం పాపం చేయనటువంటి పక్షి జన్మలో నేనుండి ఆ విశ్వనాథుని ఆలయంచుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అక్కడే ఓ మూల పడిఉండి ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక జన్మ గడుస్తుంది. 

9. ఆ జన్మలో నేను శరీరాన్ని వదిలిపెట్టి నీలో కలవాలి అని భవంతుణ్ణి ప్రార్థించి ఏరికోరి పక్షిజన్మ తెచ్చుకుంటారు కొందరు మహాత్ములు. ఈ జన్మలు, మహాత్ములగురించి మరి మనకు ఎలాగ తెలియడం అనుకుంటే, తెలియక పోయినా ఫరవాలేదు. అందరినీ సమతాదృష్టితో చూడాలి, అనవసరంగా వేటిని హింసించకూడదు అని దాని తాత్పర్యం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

19 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 114 🌹


🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ



🌻. మతంగ మహర్షి - 2 🌻


10. ఈ భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న పాపము, హింస మొదలైన వాటిని ఎవరైనాచూస్తే, మళ్ళీ మనుష్యుడై భారతీయుడుగా పుట్టటానికి భయపడతాడు. 


11. ఏ క్షేత్రంలోనో, ఏ గంగాతీరంలోనో పక్షిగా జీవించి ముక్తిపొందాలిని కోరుకోవటం నేటి ఈ భారతదేశంలో మరింత సమంజసం. ఎందుచేతనంటే, ఈ సమిష్టిపాపాన్ని ఏ ఒక్కరమూ పరైహరించలేము. దానిని కట్టడిచేయలేము. చూస్తూ ఊరుకుంటే దుఃఖహేతువవుతుంది అది. అశక్తులం. మనకు ఈ వేదన ఉన్నప్పుడు తపస్సు కొనసాగదు. 


12. అందుకని ఏ విషయములు, ప్రపంచజ్ఞానము లేనటువంటి పక్షిజన్మను ఏ క్షేత్రంలోనో, ఏదో ఆశ్రమంలోనో ఎక్కడో ఏ చెట్టునీడనో తీసుకుని అక్కడ జీవిస్తాను, ఈ జన్మ చివరి జన్మ అగునుగాక! అని భావిస్తారు.


13. మతంగమహర్షి కొన్నివేల సంవత్సరములు తపస్సుచేయగా, మొదటగా ఇంద్రదర్శనం అయింది. మతంగుడు తనను బ్రహ్మవిద్వద్వరునిగా అనుగ్రహించమని కోరాడు. 


14. ఇంద్రుడు ఆయనతో, “మతంగా! వరుసగా ఎన్నో జన్మలలో బ్రాహ్మణుడవై పుట్టిఉంటేనే బ్రహ్మవిద్వద్వరుడవు అవుతావు. అందువల్ల మరొక వరమేదైనా కోరుకో అన్నాడూ మతంగుడు ఒప్పొకోలేదు. అయితే మతంగుడు ఈ సారి ఏకపాదంపై నిలిచి వంద సంవత్సరాల పాటు తపస్సు చేసాడు. 


15. మళ్ళీ ఇంద్రుడు ప్రత్యక్షమై, “ఓ మతంగా! బ్రహ్మవిద్వద్వరుడివికావటం నీ తరంకాదు. ఇంతకు నూరురెట్లు తపస్సుచేస్తే చండాలుడు శూద్రుడవుతాడు. 


16. దానికి నూరురెట్లు అధికంగా తపముచేస్తే శూద్రుడు వైశ్యుడవుతాడు. దానికి వేయిరెట్లు అధికంగా తపస్సుచేస్తే వైశ్యుడు క్షత్రియుడవుతాడు. దానికి పదివేలరెట్లు అధికంగాచేస్తే క్షత్రియుడు దుర్బ్రాహ్మణుడవుతాడు. జీవలక్షణం నీలో ప్రవేశిస్తుంది. ఆ పదివేలరెట్లు తపస్సుచేస్తే సామాన్య బ్రాహ్మణలక్షణం నీకు రావచ్చును. బ్రాహ్మణలక్షణం అంటే సత్త్వగుణంతో కూడుకున్నదని అర్థం. 


17. వీటిలో రెండంతస్తులు. కాబట్టి ఇప్పుడు నీలో ఉన్న దౌర్బ్రాహ్మణ్యం పోవాలి. పూర్వం చేసిన పాపంవలన నీ జీవలక్షణంలో చండాలత్వం ఉన్నది. అది పోవాలంటే చిరకాలం తపస్సు చేయాలి.


సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద


20 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 115   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మతంగ మహర్షి - 3 🌻

18. “నువ్వు కేవలం సామాన్య బ్రాహ్మణుడివిగానే ఉన్నావు. కేవలం ఆదిలోనే ఉన్నావు ప్రస్తుతం. అంతంలో లభించేఫలం కావాలని కోరుకుంటున్నావు. నీలో ఉన్న బ్రాహ్మణత్వంవలన ఏమీ ప్రయోజనంలేదు. బ్రాహ్మణుడిగా పుట్టి జాతిలో ఉండే ధర్మాన్ని నిలబెట్టుకోవటము చాలాకష్టము. 

19. అనేక జన్మలకొక పర్యాయం బ్రాహ్మణజన్మ పొందినా; ధనవాంఛ, విషయలోలత్వం, అహంకారము నూటికి తొంభైతొమ్మిదికిపైగా ఉంది. సదాచారము వదలి బ్రాహ్మణత్వమును మంటగలిపి వంశానికి అపఖ్యాతి తెచ్చినవాళ్ళు చాలామందిఉన్నారు. కాబట్టి నీ ఆశలు అడిఆశలేకాని అన్యములుకావు. ఇకనైనా నీ తపస్సు మానుకుని ఏదయినా వరం కోరుకో!” అన్నాడు ఇంద్రుడు.

20. కులస్వభావం అంటే గుణమే. ఎవరైనా ఎప్పుడైనా కూడా బ్రాహ్మణుడు, శూద్రౌడు, చండాలుడు, లేఛ్ఛుడు అంటే అది గుణాన్ని గురించే. శరీరానికి కులం ఉంటుందా? లేదు. ఆత్మకూ కులంలేదు. మరి దేనికి కులం అంటే, గుణానికి. 

21. రూఢీగా మహాత్ములు, జ్ఞానులు అందరూ వేలసార్లు మరీమరీ ఈ సత్యాన్ని పురాణాలలో, ఇతిహాసాలలో, బ్రాహమణాలలో, వేదవాఙ్మయంలో చెపుతూవచ్చారు. 

22. బ్రహమపురాణంలో:

కర్మభిః శుచిభిః దేవి శుద్ధాత్మా విజితేంద్రియః|
శూద్రోపి ద్విజవత్ సేవ్యః ఇతి బ్రహ్మా బ్రవీత్ స్వయమ్||

23. అంటే, ఉత్తముడైన శూద్రుడు బ్రాహ్మణునివలెనే సేవించదగినవాడు. గుణమంటే ప్రవృత్తి అనే అర్థం. నీవు బ్రాహ్మణుడివేకాని నీ ప్రవృత్తి రాక్షసవృత్తి, రాక్షసుడివై పుట్టు అని శపిస్తూఉంటారు పురాణాలలో మన ఋషులు. మదించి ఉన్నావు, ఏనుగైపుట్టు; బుద్ధిలేకుండా గడ్డితింటున్నావు, గడ్డితినే పశువువైపుట్టు అని శపించడం మనం చూస్తూ ఉంటాం. 

24. అంటే మనిషే గడ్డితినే పశువై పుడితే, బాగా స్వేఛ్ఛగా తినవచ్చు కదా! అంటే, వాడి గుణానికి తగిన శరీరాన్ని ప్రసాదించి, ఆ ప్రవృత్తిని క్షయంచేయడం అన్నమాట. కొంచెం ఆలోచిస్తే అది అవసరమే అవుతుంది. అంటే యథోచితమైన జన్మను తీసుకోమని చెప్పటం. ‘నీ గుణానికి తగిన జన్మ నీకిస్తాను’ అని చెప్పటమే.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

21 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 116   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మతంగ మహర్షి - 4 🌻

25. ఋషులెప్పుడు సత్యవాక్కులే చెపుతారు. వాళ్ళుచెప్పేది శాపం అంటారుకాని, అది సత్యమే! ఆ వాక్కు యథార్థమవుతోంది. 

26. “నీలో రాక్షస ప్రవృత్తి ఉన్నది కాబట్టి రాక్షసుడివై పుట్టు. బ్రాహ్మణుడియొక్క రూపంలో రాక్షసవృత్తి కలిగిఉండి తిరిగితే, నిన్ను బ్రాహ్మణుడనుకుని నమస్కరిస్తారు. అందువలన అలా తిరగకు. ఇతరులు మోసపోకుండా ఉందురుగాక! నీవు సహజమైన జన్మ ఎత్తు!” అని ఋషుల తాత్మర్యం. 

27. దానిని ఈ జన్మలో శాపం అంటాం మనం. ఏం! ఇది సత్యం కాదా! సత్యవాక్కులు వాళ్ళవి. మహర్షులు సత్యాన్ని ఆరాధిస్తారు. అంతఃకరణలో ఎప్పుడూ సత్యాన్నే పెట్టుకుంటారు. అసత్యం అనేది మనసా వాచా కర్మణా అంటదు వాళ్ళను. 

28. మహర్షులందరూ సత్యవచనులు కాబట్టి వారు మహాత్ములవుతారు. ఏదో యోగబలముండి, తపోబలముండి, మనిషిని కుక్కను చేయగడొకడు. అంటే మాయల మరాఠికూడా అలా చేయగలడు. అయితే అంతమాత్రంచేత వాడు మహాత్ముదవుతాడా? అలాకాదు. ఋషులు అలాంటివారు కారు.

29. సత్యమే బ్రహ్మవస్తువు. సత్యమే జ్ఞానము. సత్యమే పరతత్త్వము. సత్యమే పరమేశ్వరుడు. సత్యమే శాశ్వతమైన వస్తువు.

30. సత్యము కానటువంటి వస్తువు అసలు ఉండదు. ఎల్లకాలము అది అనిత్యమైనది. అనిత్యమైనవస్తువు ఎప్పుడూ సత్యముకాదు. నిత్యము సత్యము అయిన వస్తువునే మహర్షులు ఉపాసిస్తారు. మనసులో ఏ భావనలో ఉంటారో, చిత్తమందుకూడా అదే భావన. అంతఃకరణలో అదేభావన చేస్తారు. వాళ్ళు దానిని అట్లాగే ప్రకటిస్తారు.

31. అసత్యంలో ఉండేవాళ్ళు సామాన్యులు, పామరులు. కాబట్టి మనకు ఋషులనుంచీ శిక్షగా వినిపిస్తుంది ఆ మాట. ఆ సత్యానికి దారితెలుసుకోవటానికి ఉత్తమమైన మార్గం వైదిక, ధార్మిక స్వధర్మనిర్వహణ. 

32. అట్టి మార్గమే సత్త్వగుణ ప్రధానత కలిగిన మార్గం అని సంప్రదాయం చెపుతోంది. ఆ సంప్రదాయంలో ఉన్న – వేదం చదివిన బ్రాహ్మణుడైనా, కాకపోయినా, సత్య మార్గంలో ఉండేవాడు-ఎవడైనా సరే, తనకు విహితమైన ధర్మమున్నదే – ఆ ధర్మాన్ని ఆచరించి సత్యాన్ని ఉపాసిస్తే – క్రమంగా ముక్తికి వెళతాడు. అంతేకాని పాండిత్యంచేత, కేవలం కర్మచేత కాదు.

‘నకర్మణా న ప్రజయా ధనేన| త్యాగేనైకే అమృతత్త్వమానశుః‘ –
అమృతత్త్వం అంటే సత్యమే.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

22 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 117  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఔర్వ మహర్షి 🌻

జ్ఞానం:

1. ఒకసారి సగరుడు ఔర్వుడి ఆశ్రమానికివచ్చి, విష్ణువును ఆరాధిస్తే కలిగే ఫలం ఏమిటని అడిగాడు. దానికి బదులుగా ఔర్వుడు, “వర్నాశ్రమ ధర్మాలు పాటించుకుంటూ విష్ణుభక్తియందు ఏకాగ్రత ఎవరు పొందుతారో సులభంగా అట్టివారికి ఆయన అనుగ్రహం కలుగుతుంది. 

2. పరస్త్రీ ధనాదులు ఆపేక్షించకుండా సహజవృత్తిని అవలంబించి ఆయన ఉపాసన చేయాలి. గురుభక్తి, బ్రాహ్మణసేవ, సర్వజీవులయందు ఆత్మభావముతో, శాస్త్రోదిక కర్మపరులై ఉండాలి. అటువంటివారంటే విష్ణువుకు అత్యంత ప్రీతి. జీవులకు ఆయన అనుగ్రహంతప్ప కోరుకునేదేమీ లేదు” అని అన్నాడు.

3. “గృహస్థుడు తపస్సుకు వెళ్ళి ఎట్టి విధులు పాటించాలి?” అని అడిగాడు సగరుడు. సగరుడికి ఆ ధర్మాలన్నీ చెప్పాడు. సంధ్యాది కృత్యములు, దేవర్షి తర్పణాలు చేసేవిధానాలు తెలిపాడు. అతిథిమర్యాద ప్రధానంగా చెప్పాడు. “అతిథి కోసమని ఆశ్రమందాటి బయటికివచ్చి గోదోహన కాలమంత(అంటే పాలుపితికే కాలమంత)వెతకాలి. ఎవరైనా అతిథి వస్తే అతడు విష్ణువే అనుకొని ఆతిథ్యమిచ్చి ఆ తరువాతే నువ్వు భోజనం చేయాలి. దీనిని విధిగా ఆచరించి వ్రతంగా పెట్టుకో!” అని భక్తి మార్గాన్ని ఉపదేశించాడు.

4. “బలవర్ధకమైన రుచికరమైన ఆహారం తీసుకో. ఆ ఆహారం జీర్ణమై ప్రాణశక్తి వృద్ధిపొందాలంటే అగస్త్యమహర్షి చెప్పిన బడబాలనస్తోత్రం చేసుకుంటూ ఉండు. తూర్పు, దక్షిణాలలో తలపెట్టుకోవాలి. జ్యేష్ఠాది నక్షత్రాలలోనే భార్యతో కాపురంచేయాలి” అని బోధచేసాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Whatsapp Group 
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin

Telegram Group 
https://t.me/ChaitanyaVijnanam

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

23 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 118 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. కండూప మహర్షి 🌻

బోధనలు/గ్రంధాలు: కండూపాఖ్యానమ్

🌻. జ్ఞానం:
కండుమహర్షి బాల్యంనుంచే తపస్సు చేసుకుంటున్నాడు. పురాణాలలో ఈయన తల్లితండ్రులెవరో, ఏ వంశస్థుడో చెప్పలేదు.

మోక్షం అంటే ఒక మామిడి పండుకాదు. ఏం కావాలంటే, ముక్తిని ప్రసాదించమని అంటే, ఏదీ వద్దని అర్థం. కాబట్టి ఇంత తపస్సుచేసి ఏదీ వద్దని అంటే ముక్తికాక మరేమిటి అర్థం?

కండుమహర్షి కామక్రోధాది ద్వంద్వాలన్నిటికీ అతీతుడై ఇంద్రియాలు దమించి ఏకాగ్రతతో ధ్యానంచేసి, బ్రహ్మాండమైన దివ్యతేజస్సులతో విష్ణుపదం పొందాడట. బ్రహ్మపారజపము అని ఆయన చేసినట్లు పురాణంచెబుతోంది. 

బ్రహ్మపారజపము అంటే ఏమిటి? పరబ్రహ్మయొక్క ధ్యానము ఎట్లా ఉంటుందంటే, పరమాత్మ స్వరూపుడైన హరి పరాత్పరుడు, అపారపారుడు, బ్రహ్మపారుడు అంటే ఈ బ్రహ్మసృష్టించిన జగత్తుకు పరమందున్నాడు. ఈ భౌతికమైన జగత్తును బ్రహ్మ సృష్టించాడు. ఆయన దీనికి పరమందున్నాడు. తమసఃపరస్తాత్… అని, 

గాయత్రియందు నాలుగో పాదం – తురీయ పాదం – ‘పరోరజసి సా2వదోం’ అని ఉంది. రజోగుణంచేత సృష్టించబడ్డ ఈ జగత్తుకు బయట ఉండే శుద్ధతత్త్వమేదయితే ఉన్నదో – ‘రజసః పరస్తాత్’ అది. ‘పరోరజసి సా అవతు ఓం’ అని దానికి విశ్లేషణం. 

అది తురీయపాదం. అది జపించటమే ఈ పరబ్రహ్మ ఉపాసన. దానికి వ్యాఖ్యానం వ్రాసారు. బ్రహ్మపారజపం చేసాడంటే, గాయత్రీమంత్రంలోని ఈ నాలుగవపాదాన్ని జపించాడు అని అనుకోవచ్చు.

అన్నిటికీ పరమాత్మయే కారణం. పరహేతువాతడు. సర్వకార్యములందు ఫలప్రదాత అతడు.

కర్తృకర్మరూపములచే సర్వమూ రూపొందిస్తాడు. అతడే కర్త, అతడే కర్మ, అతడే క్రియ. ఆ క్రియయొక్క ఫలముకూడా అతడే! భోక్త అతడే! అన్నిటిలోనూ పూసలోనిదారంలా అతడే ఉంటాడు. 

ఆ బ్రహ్మపేరే ప్రభువు, పిత, సర్వభూతుడు. అతడు అవ్యవము, నిత్యము, అజము అనే వర్ణములకు పాత్రుడై, అసంగుడై ఉంటాడు. అన్నింటిలోనూ ప్రవేశించి ఉండడంతప్ప, వానితో కలసి ఉండడం లేదు. 

బ్రహ్మము, అక్షరము, నిత్యము అయినవాడు పురుషోత్తముడు. అతడి దయచేత రాగాదులు, సర్వ దోషములుకూడా నశిస్తాయి. ఈ ప్రకారంగా ప్రార్థనచేయటమే బ్రహ్మపారజపమని వర్ణన ఉంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹



------------------------------------ x ------------------------------------


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 119 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. కండూప మహర్షి - 2 🌻

11. రోగికేకదా ఔషదం. కాబట్టి ఇదేదో(గాయత్రీ మంత్రంలోని ఈ నాలుగవపాదం)చేస్తే, సంసారం అంతా పాడయి పోతుందేమోనని, ధనాదులు పోతాయేమోనని కొందరికి భయం. 

12. సన్యాసి మాత్రం ఇది చేయాలనే కొందరు అంటారు. కాని ఇది మోక్ష విద్య. అది కోరేవారు సంసారం మనసులో వదలవచ్చు. ప్రామాణిక గ్రంథాల్లోకాని, మహర్షుల బోధల్లోగాని, స్మృతుల్లోకాని, తురీయపాదాన్ని చేయకూడదు అనిలేదు. 

13. అయితే గాయత్రియొక్క తురీయపాదం – అంతర్ముఖుడు, విరాగి, ఇంచుమించు సన్యాసదీక్షలో ఉండేవాడికిమాత్రమే యోగ్యమైన మంత్రం అన్నారు. అంటే అర్థం ఏమిటి? అందరూ మంత్రం జపిస్తే, మళ్ళీ ఈ మోహంతో ఇలాంటి కర్మలు చేయకూడదు అని అర్థం.

14. తన దృక్పథం, సాధన వలన వ్యక్తికి ముక్తివస్తుంది. కాని అతడివల్ల ఇతరులపై ప్రభావంలేదు. 

15. ఎవరు జపిస్తారో వారియందే భగవంతుడి అనుగ్రహం, అతడుమాత్రమే ఆ పరమపదం అందుకుంటాడు. పరమవస్తువు అది. సత్త్వంకాదు, రజస్సు కాదు. ‘పరోరజసి’ అది. అటువంటి వస్తువు ప్రాప్తమని చెప్పాలి.

16. మన కోరికలు చాలా పెద్దవి. ఉదాహరణకు లోక కల్యాణం అంటాం. మంచి వాళ్ళందరూ సుఖంగా ఉండాలని కోరుకున్నట్లయితే, దనిని ప్రసాదించగల శక్తి సామాన్యమైన యజ్ఞానికి ఎందుకుంటుంది? యజ్ఞానికి ఉండదు. యజ్ఞం నిర్వహించి దానిని పరమేశ్వరార్పణం చేస్తే, పరమేశ్వరుడి అనుగ్రహానికి అంతటి ఫలాన్ని ఇవ్వగల శక్తి ఉంటుంది. 

17. నేను చేసిన యజ్ఞమో, నేనుచేసిన తపస్సో అంతా అల్పమే! అది ఎవరికి అర్పించబడ్డదో, వారికి అనంతమైన శక్తి ఉన్నది కాబట్టి, ఈ కోరిక నెరవేరుతుందనే భావంతోటే చెయ్యాలి. సర్వమూ పరమేశ్వరార్పణం అని కదా మనం సమస్తకర్మలనూ ముగించేది!

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

25 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 120   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నరనారాయణ మహర్షులు - 1 🌻

🌻. జ్ఞానం:

1. శ్రీమహావిష్ణువు యొక్క ఏకవింశతి (ఇరవైఒకటి) అవతారములలో నరనారాయణావతారము నాలుగవది. 

2. ఆదివిష్ణువు భూమిపై అవతరించి అపుర్వమైన తపస్సుచేసి దాని ప్రభావంచేత రాక్షసవినాశనం, లోకసమ్రక్షణ చేయదలచి, ధర్ముడు అనే మహాత్ముడి భార్యకు కవలౌగా ఉదయించాడు. ఆ కవలలే నరనారాయణులు.

3. ఒకసారి నారదుడు వీళ్ళ దర్శనానికి వచ్చి, “సిద్ధిపొందాలంటే దేనిని ఆరాధించాలి?” అని అడిగాడు. అప్పుడు వాళ్ళు నారదుడితో, “నారదా! ధృవము, అచలము, ఇంద్రియాలకు అగోచరము, సూక్షమము, అనుపమము(అంటే దేనితోటీ పోల్చటానికి వీలుకానిది), సర్వములకు అంతరాత్మఅయి వెలిగే ఒక సత్యమున్నది. దీనినే తప్ప ఇంక ఏమీ ఆరాధించకూడదు. అంతకుమించి సేవింపదగిన వస్తువేలేదు. బ్రహ్మమొదలుగా సకల భూతములూ ఆ తత్త్వములోనే ఉన్నాయి” అన్నారు.

4. మనం చెప్పుకునే ‘యదంతస్తదుపాసితవ్యమ్’ అంతే ఇదే. అంటే లోపల ఉన్నదే ఉపాస్యవస్తువు. బాహ్యమైనది కాదు. రోజూ మంత్రపుష్పంలో, ‘సబ్రహ్మ స్సశివః సహరిఃసేంద్రస్సోక్షరః పరమస్వరాట్’ అంటూ ఇదే చెబుతాము. అది అక్షరమైనది. అదే బ్రహ్మ, అదే హరి, అదే ఇంద్రుడు, అదే పరమస్వరాట్ అని అర్థం. 

5. ఎంత పూజచేసినప్పటికీ, “నేను చేసిన ఈ పూజ బాహ్యపూజయే అయినప్పటికీ, దీనిని నేను ఇంద్రియములతో చేసినప్పటికీ, నోటితో-చేతితో- చేసినప్పటికీ; ఈ పూజ సర్వజగత్తుకూ మూలకారణమైనటువంటి అంతర్వస్తువు ఏదైతే ఉన్నదో దానికి చెంది, దానినుంచి నాకుఫలం లభించాలి. నేను ఆ సత్యవస్తువును స్మరిస్తూ ఉన్నాను. దానివల్ల, అసత్పదార్థాలతో చేసినటువంటి ఈ చిన్నపూజ అనబడేవస్తువు – ఈ క్రియ-ఫలప్రదం కావాలి. 

6. అలాగే భక్తిలోనూ, శ్రద్ధలోనూకూడా శూన్యమే అయిన ఈ పూజ(నేను చేసే పూజ) – అంతర్వస్తువుగా పరమాత్మను నేను స్మరించటంవలన ఫలప్రదం అగునుగాక!’ అని మంత్రపుష్పం అర్థమూ, ఉద్దేశ్యమూను. పూజ అయిపోయే సమయంలో ‘మంత్రహీనం క్రియాహీనం…’ అనడంలోని అంతరార్థం ఇదే. అదిలేకపోతే ఇది నిష్ఫలమవుతుంది. 

7. కేవల భౌతికపూజ యఠార్థం అనుకోకూడదు. యజ్ఞం కానీ, పూజ కానీ లోపభూయిష్టంగానే ఉంటుంది. లోపంలేకుండా చేయగలిగిన కార్యము (పని) ఏమిటంటే, అంతర్వస్తువును ఒకసారి ధ్యానించి, నమస్కరించి అక్కడ ఒక పుష్పం పెట్టటమే. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


26 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 121   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నరనారాయణ మహర్షులు - 2 🌻

8. ఆర్యుడు విగ్రహాన్ని ఆరాధించనే ఆరాధించడు. విగ్రహాన్ని ఆరాధిస్తున్నారని తెలియనివాళ్ళు అంటారు. అంటే విగ్రహాన్ని పూజచేస్తూ, అంతర్వస్తువును-ఒక దేవతను-సూక్ష్మవస్తువును-హిందువు ధ్యానిస్తాడు. ఆ విగ్రహమందుకూడా అంతర్యామి ఉన్నాడు అని భావన. తనలోపల ఉండే వస్తువును ఆరాధనచేసుకొని తాను అంతర్ముఖుడు కాలేడు. 

9. అందుచేత, బయట ఒక సుందరమైన విగ్రహాన్ని కల్పించుకొని ఆ నారాయణుడు అక్కడఉన్నట్లు భావనచేసి, కాని లోపల ఉండే వస్తువే ఫలాన్నిస్తుందని నిశ్చితంగా జ్ఞాపకం చేసుకొని, ఆర్యుడు ఫలాన్ని పొందుతున్నాడు. ‘అది మాకు ప్రతీక(symbol). మాది ప్రతీకోపాసన. 

10. అంతరాత్మయై, అందుండేటటువంటి వస్తువుయొక్క ప్రతిబింబం, విగ్రహంలో ఉంది. దీంట్లో ఉండే అంతర్వస్తువు మా లోపల ఉందనే భావంతో ఆరాధన చేస్తాం. అందుకనే మా పూజలు ఫలప్రదమవుతున్నాయి’ అని సమాధానం.

11. నిరంతరమూ ఆప్తకాములై లోకంలో ఉండేటటువంటి మునులు అవిద్య, అజ్ఞానములను జయించినవాళ్ళేకానీ, జ్ఞానవిషయంలో సంపూర్ణత్వము పొందాము అనేటటువంటి అహంకారంలో లేరు వాళ్ళు. వారిని ఈ లోకంలో బాధించగలిగేటటువంటి వస్తువు ఏదీ లేదు.

12. ఏకాంతమంటే ఎవరూలేనిచోటికి పారిపోవడంకాదు. అందరిలో ఉండికూడా ఏకాంతం సంపాదించాలి. అనేకమందిలో ఉండికూడా తనలోతనుండగలగటం ఏకాంతం. కాబట్టి సాధనద్వారా తన స్వరూపమందు తాను సంపాదించుకోగలిగింది ఏకాంతంకానీ; ప్రాంతంలోనూ, దేశంలోనూ, కాలంలోనూ కనపడేది ఏకాంతంకాదు.

బ్రహ్మప్రవృత్తిమార్గాన్ని శాసించేవాడే. 

13. ఈ వేదాలు, యజ్ఞాలు అన్నీకూడా బ్రహ్మముఖంలోంచి వచ్చినవే! ఇది ప్రవృత్తియేతప్ప నివృత్తికాదు. జ్ఞానమార్గమిదికాదని ఘంటాపథంగా జ్ఞానులు, పెద్దలు చెబుతున్నారు. సృష్టి ప్రవర్తిల్లి జీవులు శరీరాలుధరించి ఖర్మానుభవాన్నిపొందడం బ్రహ్మ అభిమతం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

27 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 122   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నరనారాయణ మహర్షులు - 3 🌻

14. ధారణంగా మనుష్యులు చేసే పని ఏమంటే, మనధ్యేయం ఒకటి. ఆ ధ్యేయాన్ని అడగం. దానికి మార్గం అడుగుతాం. నాకు తృప్తిని ఇవ్వమని అడిగితే, ఐశ్వర్యం ఇవ్వమని అడగక్కరలేదు. అయితే తృప్తిని అడగకుండా ఐశ్వర్యాన్ని అడుగుతాం! 

15. చిన్న విషయాలలో కూడా క్షేమమూ, లాభము, సుఖము, ఉంటాయనుకొని; ఇవి ఇచ్చే వస్తువులు ఏమైనా ఉంటేవాటిని అడుగుతాంకానీ, ఆ వస్తువుతో నిమిత్తంలేకుండానే క్షేమము, శాంతి, లాభము ఇక్కడ ఉన్నచోటే ఇవ్వమని అడగము! 

16. ఆ వస్తువు తనకు లభిస్తే శాంతి, సుఖము, లాభము అన్నీ కలుగుతాయి అని అనుకుంటారు మనుష్యులు. ఆ నిర్ణయంలోనే దోషం ఉంది. ఏది శాంతి నిస్తుందో దన్ని అడగకుండా, ఏదో వస్తువును అడుగుతాడు. ఆ వస్తువును దేవతలు ఇచ్చిపోతారు.

17. లోకంలో సమస్త విజ్ఞానమూ కోరేవారు మత్స్యావతారంలో ఉన్న రూపాన్ని ఆరాధిస్తారు. కులవృద్ధి, వంశవృద్ధి, సంతానం పెరగాలంటే ఇతడిని కూర్మావతారంలో ఆరాధిస్తారు. ముక్తికోరేవాళ్ళు ఈయనను వరాహావతారరూపంలో ఆరాధిస్తారు. 

18. చేసిన పాపం హరించాలి అనుకునేవాళ్ళు నృసింహస్వామి రూపాన్ని ఆరాధిస్తారు. లోకంలోని పరిజ్ఞానాన్ని, చాలా విషయాలను తెలుసుకోవలనుకునేవాళ్ళు వామనావతారాన్ని ఆరాధిస్తారు. ధనంకోరేవాళ్ళు బలరామావతారాన్ని, శత్రుజయం కోరే వాళ్ళు రామావతారాన్ని, మంచి సంతానం – ఒక్కడే కొడుకైనా పరవాలేదు బుద్ధిమంతుడు కావాలి అనుకునేవాళ్ళు – బలరామకృష్ణులను ఆరాధిస్తారు. 

19. అపూర్వమైన గొప్ప సౌందర్యం కావాలనుకునేవాళ్ళూ బుద్ధుడిని ఆరాధిస్తారు.(ఇందులో నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. సందేహం ఏమీ లేదు) ఇతరులమీద ఆధిపత్యం కావాలనుకునేవాళ్ళు కల్కిఅవతారంగా ఆయనను ఆరాధిస్తారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


28 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 123 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నరనారాయణ మహర్షులు - 4 🌻

20. భగవంతుణ్ణి ఏ కోరికకై ఏ రూపంలో ఆరాధించాలో సంప్రదాయం, శాస్త్రం చెబుతూనే ఉన్నాయి. ఔషదాలు ఆయా రోగాలకు ప్రత్యేకంగా ఎలా ఉన్నాయో, కోరికలు తీరటానికికూడా ప్రత్యేకంగా ఆయా దేవతల మంత్రాలు అలాగే ఉన్నాయి. 

21. ఉదాహరణకు, వివాహం కావలసిన కన్యకు హనుమంతుడి మంత్రం ఉపదేశిస్తారు ఒకరు! నైష్ఠిక బ్రహ్మచారి అయిన హనుమంతుడు బ్రహ్మజ్ఞాని, రామభక్తుడు. పెళ్ళికావలసిన పిల్లలకు ఆ మంత్రం ఉపదేశంచేస్తే సరిపోదు. 

22. కాని, వివాహితులైనవారికి దాంపత్యంలో దోషం, వియోగం సరిదిద్దగలడాయన. అన్ని ఔషదాలూ గొప్పవే! అలాగని చెప్పి, ‘మందులన్నిటిలోకీ గొప్పది ఏదయినా నా ఇచ్చే’యమని అడిగి, దానిని తింటామా? మనకున్న జబ్బుకు ఆ మందు అన్వయిస్తేనే అది పనిచేస్తుంది. 

23. సంతానం కోసం రామతారక మంత్రోపదేశం పొందినవాళ్ళు చాలామంది ఉన్నారు! రామతారకం సంతానాన్నిస్తుందా! దానికి వచ్చే ఫలంవేరు. అయితే అన్నీ మహత్తు కలిగిన మంత్రాలే, సందేహంలేదు.

24. ఒకసారి శౌనకముని నారాయణమహర్షితో, ‘మహాత్మా! నేణు సర్వవేదశాస్త్రాలూ చదివాను, కాని పరమార్థం అంటే ఏమిటో ఇంతవరకు తెలియటంలేదు. ఈ సంశయాన్ని నివారించగలరు” అని అడిగారు. 

25. దానికి నారాయణమహర్షి, ‘హరిభక్తితప్ప నీకు ఇంకోమార్గం, తరుణోపాయంలేదు. దానివలనే పరమార్థం తెలుస్తుంది. వేదశాస్త్రములలో ఎంత నిగూఢమైన రహస్యములు తెలుసుకున్నప్పటికీ అందులో పరమార్థంలేదు. నీవు తెలుసుకోలేవు. అది మార్గమే కాదు. అందువలన హరిభక్తిని అవలంబించు” అని చెప్పాడు.

26. “వేదవిద్యాధికారము ఉన్నా, లేకపోయినా అందరూ తరించాలంటే మార్గం ఏమిటి?” అని శౌనకుడు నారాయణమహర్షిని అడిగాడు. అప్పుడు నారాయణమహర్షి, “వాళ్ళకు సప్తసంతానాలున్నాయి. దానధర్మములు, సత్యవ్రతములు, వాపీ కూప తటాక ప్రతిష్ఠ, వనదేవతాలయ బ్రహ్మప్రతిష్ఠ, తనయుడు, కృతి అనే సంతానాలున్నాయి” అని చెప్పాడు. 

27. ‘వనదేవతాలయ బ్రహ్మప్రతిష్ఠ’ అంటే – ఆపదలో ఉన్నబ్రాహ్మణుడిని; తన భుజబలంతోకాని, ధనబలంతోకాని రక్షించటము; దుఃఖంతో కష్టపడుతున్న బ్రాహ్మణుడెవరైనా ఉంటే అతడికి గృహదానం చెయ్యటమూ, వీటిని బ్రహ్మప్రతిష్ఠలంటారు” అనికూడా అన్నాడు. 

28. ఉత్తముడైనటువంటి మహాకవి ఎవరైనా గొప్పగుణములు కలిగిఉండి శ్లాఘ్యమైన వస్తువులతో నిర్మాణము చేసిన కృతి ఏదయినా ఉంటే; దానిని కృతికర్తగా స్వీకరించటంకూడా సంతానంతో సమానమైనదే! దానివలన పుణ్యలోకాలు వస్తాయి. విష్ణుస్మరణమే అత్త్యుత్తమము. కాబట్టి అదే కైవల్య ప్రదాయకమైనట్టి, మహా మంత్రము, మార్గము అని చెప్పాడు శౌనికుడితో.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


30 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 124 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నరనారాయణ మహర్షులు - 5 🌻


29. పవిత్రభావంతో ఋషుల చరిత్ర వింటే, ఋషి ఋణం తీరుతుంది. ఋషి ఋణం తీరితే, మిగిలిన ఋణాలు సులభంగా తీరుతాయి. ఋషులు అనుగ్రహిస్తే పితృఋణం తీరుతుంది. వారి అనుగ్రహముంటే ఉత్తమ సర్మ ఫలాలు వస్తాయి. ఋషులు మనమీద అనుగ్రహిస్తే సమస్త యజ్ఞఫలాలూ ఇవ్వగలరు. వాళ్ళ నామస్మరణ మాత్రం చేత, ఇన్ని యజ్ఞాలుచేసే పనిలేకుండానే ఫలంవస్తుంది. 

30. ఒక్క ఋషి మాత్రమే – ఒక్కక్షణం మనను అనుగ్రహిస్తే చాలు; నూరు అశ్వమేధయాగాల ఫలం లభిస్తుంది. అంతటి సమర్థుల ఋషులు. అడిగి తెచ్చుకోవాలి. భక్తియుక్తులు, శ్రద్ధ ఉండాలి. మనం దేవతాధ్యానం సంప్రదాయపరంగా చేస్తూంటాంకాని; ఋషులచరిత్రవలన మనకు కలిగే ఫలాలు, దేవతానుగ్రహంవలనకూడా మనకు కలగనంతటి ఉత్కృష్టమైనవి.

31. ఋషులకు సహజంగా మనం సంతానంకాబట్టి, వాళ్ళకు మన యందున్న శ్రద్ధ, అనుగ్రహం దేవతలకు ఉండదు. దేవతలు కర్మాధీనులై ఉంటారు. కర్మవలన, యజ్ఞంవలన దానికి నిర్ణీతమైన సంప్రదాయంలో, శాస్త్రంలో స్మృతులలో ఎలా చెప్పబడి ఉన్నదో అలాంటి ఫలాన్నే వాళ్ళు ఇస్తారు. దానినే అనుగ్రహం అంటారు. కానీ కాస్త భక్తికి అపరిమితంగా సంతోషించి ఇచ్చే ఫలాలన్నీ దైవసంపత్తి – ఈశ్వరుడియొక్క లక్షణములు. ఈశ్వరుడియొక్క లక్షణములు ఋషులయందున్నాయి. 

32. ఈశ్వరుడు కర్మాధీనుడు కాడు. దేవతలు కర్మాధీనులు. భవంతుడు అలా కాదు. ఒక్క తులసీదళాన్ని భక్తితో సమర్పిస్తే, తీసుకుని మోక్షాన్నే అనుగ్రహిస్తాడు. లేదా వందసంవత్సరాలు ఈ భూమిని పరిపాలించమని చక్రవర్తిని చేసి తరువాత మోక్షాన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన ఇవ్వటానికి పరిధులులేవు. ఆయన అనుగ్రహానికి అవధులులేవు. కాబట్టి ఋషులు ఈశ్వరస్వరూపులు అనబడతారు.

33. కాబట్టే ఋషుల ఆరాధన ఈశ్వరారాధనతో తుల్యమై అంతటి ఫలాన్ని ఇవ్వగలదు. వాళ్ళు ఈశ్వరుణ్ణి చూపించగలరు. జ్ఞానాన్ని ఇవ్వగలరు. వాళ్ళ అనుగ్రహానికి అవధిలేదు. అందుకని ఈశ్వరారాధన, నిష్కళంకమైన భక్తి అది అందరికీ సులభంగా లభ్యమయ్యే వస్తువు కాదు. కనుక, ఈశ్వరుడి యందు అట్టి భక్తిని ఇవ్వమని అడిగితే, ఋషి ఇవ్వగలడు. మహర్షులే గురువు అనేభావన, సంప్రదాయం ఈ ఋషులవల్లనే. 

34. ఇట్టి మహాత్ములుండటంచేతనే ఇది మనకు సిద్ధించిన సంప్రదాయం. ఈ సంప్రదాయం ఇతర మతాలలో లేదు. దీనిని యథార్థంగా నమ్మి ఆ విశ్వాసంతో ఆరాధన చేసినట్లయితే, మన భవిష్యత్తంతా ఋషిప్రోక్తమయిన గురువులుగా, వాళ్ళను తండ్రులుగా, రక్షకులుగా భావించి ఈశ్వరుడిని చేరే మార్గం అర్థించటంలోనే – మన భవిష్యత్తుంది.

35. ఋషులు నిగ్రహానుగ్రహ సమర్థులు. త్రిమూర్తులను చూచినవారు, త్రిమూర్తులనుకూడా శాపగ్రస్తులను చేయగలిగినవాళ్ళు. అపరిమితమయిన శక్తిసామర్థ్యాలు కలిగినటువంటివాళ్ళు. మన భౌతికమైన జీవనవిధానంలో సుఖదుఃఖాలకు హేతువులు పాపపుణ్యాలు. 

36. పుణ్యం చేసినా, పాపం చేసినా మనం అల్పమైన శక్తిసంపదలు కలిగిన వాళ్ళమేకాబట్టి; మనకు భౌతికమైన క్షేమాన్ని, సుఖాన్ని ఇవ్వాలంటే, ఈ లోకంలో మనక్షేమాన్ని కోరేవాళ్ళు, మన తండ్రులైన ఋషులే శరణ్యం. వారే ఇక్కడ మనకు సుఖాన్నిస్తారు. ఇవాళ పుణ్యంచేస్తే ఫలితం ఎప్పుడో వస్తుంది మనబోటి సామాన్యులకు. 

37. కాని, మనగోత్ర ఋషినిగాని, మహాత్ములైన ఋషులనుకాని, ఋషులరూపంలో ఉన్న గురువులనుకాని ఆశ్రయిస్తే; పుణ్యం ఉన్నాలేకపోయినా ఆ ఫలాన్ని ఇప్పుడే ఇవ్వగల సమర్థులు వాళ్ళు. మన కర్మకాండ, స్మృతులు, మంత్రములు అన్నీ ఋషిప్రోక్తాలే. వాళ్ళ అనుగ్రహంతో మనకు లభించినటువంటి మార్గాలే ఇవన్నీ. 

38. ప్రతి మంత్రానికీ దేవతవలె, ఋషికూడా ఒకరున్నారుకదా! అంతే, ఆ మంత్రోపాసనతో ఆ దేవతను ఏ విధంగా ఆరాధన చేయాలో, తద్వారా ఏ ఫలం పొందవచ్చో మనకు చెప్పింది ఋషులే. మరి వారిని స్మరిస్తే ఇక మనకు మిగిలేది ఏముంది?

39. ఒక ముఖ్య విషయం – బ్రాహ్మణులైన మహర్షులు నేడు కూడా బ్రహ్మలోకానికి దిగువన తపోలోకంలో ఉన్నారు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


WhatsApp, Telegram, Facebook groups:


02 Oct 2020

------------------------------------ x ------------------------------------



🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 125   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. దత్తాత్రేయ మహర్షి - 1 🌻

జ్ఞానం:

1. ధర్మమనే కవచం పోతే రాక్షసుల బాధ ఎప్పుడూ ఉంటుంది. రాక్షసులు ఎప్పుడూ ఉంటారు. మనుష్యుడు ధర్మమనే కవచాన్ని ఏర్పాటు చేసుకుని ఆత్మరక్షణ చేసుకోవాలి దానితో. రాక్షసులు లేకుండా లోకాలను సృష్టించమని ఎవరూ అడగటానికి వీలులేదు. 

2. వారు పూర్వకల్పంలోని జీవులే. ఈశ్వరుడి యొక్క సృష్టి లక్షణమది. వాళ్ళ వల్ల బాధలేకుండా చేసుకోవాలి. లోకంలో తేళ్ళు ఉన్నాయి, పాములున్నాయి. అవి లేకుండా చెయ్యమని భవంతుణ్ణి అడగకూడదు. మనమే జాగ్రత్తగా నడవాలి. సృష్టి యొక్క లక్షణమే అది. 

3. ఈ శక్తులెందుకుండాలి అంటే, అవి లేకపోతే మనం చేసిన పాపాలకు శిక్ష ఎలా ఉంటుంది మరి? కాబట్టి పాపం చెయ్యగలిగే లక్షణం ఎప్పుడయితే మనుష్యుడికి ఉందో, దానికి శిక్షను ఇవ్వగలిగిన శక్తి సృష్టిలోకూడా లక్షణంగా ఇస్తాడు.

4. ఒకసారి అలర్కుడనే కాశీరాజు అడిగిన ప్రశ్నకూ దత్తాత్రేయుడు, “నిన్ను నీవు తెలుసుకో. ఇంద్రియముల యొక్క లక్షణములను బుద్ధితో ఆలోచించి తెలుసుకో! లోపల ఏ అంగములూ లేకుండా అంతర్యామిగా పరమాత్మ అనే వస్తువు ఉంటుందని తెలుసుకో! అసంగుడవై సర్వాంగముల యొక్క లక్షణములు తరువాత తెలుసుకో!” అని తత్త్వాన్ని ఉపదేశించాడు.

5. “ముందర విషయాలను గురించి, వాటి దోషాలను గురించి తెలుసుకో. వాటికి పరిహారం ఏది? అసలివి ఎందుకు వచ్చాయి? లోపల ఇవి ఎవరివి? ఈ దేహి ఎవరు? అని తెలుసుకుని చిచారణ చేసిచూస్తే, ఈ ఇంద్రియములు ఎవరివీ కావు. 

6. వీటన్నిటికీ అతీతంగా ఉండి అధిష్ఠానంగా ఉండే వస్తువును తెలుసుకున్న తరువాత, అప్పుడు నిస్సంగుడై అంతర్లీనుడై, తాను అస్మగుడై అప్పుడు ఈ అంగములు ధరించి కూడా దేని చేత బాధింప బడకుండా ఉండే యోగస్థితి సాధ్యం” అని ఉపదేశించాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


03 Oct 2020

------------------------------------ x ------------------------------------


🌹.    భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 126   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ



🌻. దత్తాత్రేయ మహర్షి - 2 🌻


7. కర్మ అనేది దుఃఖానికి హేతువు. ‘మమ’ అనటం దుఃఖానికి, ‘న మమ’ అనటం విర్వృత్తికి మార్గములు.

8. అహంకారమనేటటువంటి అంకురముచే పుట్టి, మమకారము మొదలుగా కలిగి; గృహము, క్షేత్రము అనే కొమ్మలతో పెరిగి; కూతురు, భార్య అనేటటువంటి చిగుళ్ళతో; ధనము, ధాన్యము అనేటటువంటి పెద్దపెద్ద ఆకులు వేసి; పాపముణ్యములు అనేటటువంటి పుష్పములు పూచి; సుఖదుఃఖాలనేటటువంటి పండ్లు కాచి, చిరకాలము పెరిగి, అజ్ఞానము అనేటటువంటి కుదుళ్ళతో నిండి, ముక్తి మార్గాన్ని కప్పేసేటటువంటి ఈ ‘మమ’ అనేటటువంటి వృక్షము నీడను ఆశ్రయించి, ఈ సంసారంలో ఏదో సుఖముందని పరిశ్రాంతులయేటటువంటి మిథ్యాసుఖజ్ఞానులై, సుఖానికి ఆధీనులై ఉండేటటువంటి వాళ్ళకు పరమపదం అనగా మోక్షం అనేది దుర్లభం. 

9. కాబట్టి నీవు ఆ మహావృక్షమును నిర్మలమయిన విద్య, సత్యజ్ఞానము అనేటటువంటి గొడ్డలి తీసుకుని చేదించుకో!” అని బోధించాడు. “తత్త్వనిధులైన సాధుజనులతో సంగం పెట్టుకో. అది పాషాణంవలె పనికొస్తుంది. 

10. దానితో, విమలవిద్య అనే గొడ్డలిని పదునుపెట్టుకుని నీవు ఆ మహావృక్షాన్ని చేదించుకో, నాశనం చెయ్యి. అలాగ నీవు పునరావృత్తిని, అంటే మళ్ళీ జన్మలేని స్థితిని సంపాదించుకుంటావు” అని చెప్పాడు.

11. అలర్కుడు ఆయనను, “అలా అయితే నేను నిర్గుణమైన బ్రహ్మైకత్వం ఎలాగ పొందగలుగుతాను, దానిని గురించి చెప్పండి” అని అదిగాడు. “వత్సా! శరీరమునందలి పరమజ్ఞానమునకు గురుడే ఉపద్రష్ట. మోక్షానికి యోగము జ్ఞానపూర్వమౌతుంది.

12. ప్రకృతిగుణములతో ఏకత్వం లేకపోవతం, బ్రహ్మైకత్వం కలగటం ముక్తి అనవచ్చును. ఆ ముక్తి పరమయోగములో కలుగుతుంది. యోగము సంగత్యాగమువలన సిద్ధిస్తుంది. 

13. సంగత్యాగమువలన నిర్మమత్వం, దానివలన వైరాగ్యం, దానివలన జ్ఞానం, దానివలన మోక్షం కలుగుతాయని చెప్పబడింది. యోగానికి ముందు ఆత్మను జయించాలి. అంటే తననుతాను జయించుకోవాలి. అది ప్రాణాయమంచేత మాత్రమే సాధ్యం. 

14. కామమును వృద్ధిచేసేటటువంటి కర్మలు యోగాన్ని విఘ్నంచేసేవి సుమా అని తెలుసుకుని యోగి కామ్యకర్మలు విడనాడాలి. శుద్ధాత్ముడై పరమాత్ముడిలో ఐక్యం సాధించేందుకు సంసిద్ధుడు కావాలి. అలాంటివాడికి, ఈ లోకంలో, తాను ఆ సాధనలో ఉన్న సమయంలో, ఎవరన్నా తనను గౌరవిస్తే అది విషంగా ఉంటుంది. అవమానమే అమృతమవుతుంది. తను ఎక్కడ ఉంటే అదే ఇల్లవుతుంది. 

15. కాబట్టి నీవు విచారంలేకుండా అటువంటి యోగబుద్ధితో మోక్షాన్ని అనుభవించూ అని బోధచేసాడు.


సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


04 Oct 2020

------------------------------------ x ------------------------------------




🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 127   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నారద మహర్షి - 1 🌻

బోధనలు/గ్రంధాలు: నారదభక్తి సూత్రాలు, నారద పురాణం, నారదస్మృతి, జ్యోతిర్నారదము, చతుర్వింశతి, బృహన్నారదము, లఘునారదము

🌻. జ్ఞానం:

1. నారదుడి యొక్క చరిత్రలేని కథకాని, పురాణంకాని, ఆయన పాత్రలేనటువంటి గాథకాని లేదు మనకు. ఈ మహర్షులు భౌతికమైన ప్రపంచానికి తండ్రులు. భౌతికమయిన జగత్తుకు కారణములు మాత్రమే సృష్టించాడు బ్రహ్మ; అంటే పంచభూతములను మాత్రమే సృష్టించాడు. 

2. దానిలోని మూలపదార్థాలు అనదగిన అహంకారము, బుద్ధి, మనస్సు, చిత్తము, ఇంద్రియములు (సాంఖ్యములో చెప్పబడినటువంటి పంచభూతములు, మనసు, బుద్ధి, చిత్తము, స్థూలమైన ఇంద్రియములు) – ఇట్లాంటివన్నీ సృష్టించాడు. ‘అహం’ అనే వస్తువుకూడా ఆయన సృష్టించాడు . 

3. వాటికి కారణభూతమైనటువంటి, అవి తాము కాని మహర్షులను కూడా ఆయన సృష్టించాడు. వాళ్ళను బ్రహ్మర్షులు అంటారు. మానవమాత్రులే జ్ఞానం చేత బ్రహ్మర్షిపదం పొందవచ్చు. అలాకాక, బ్రహ్మ నుంచీ సహజంగా పుట్టిన బ్రహ్మర్షులు వీరు. 

4. ఈ విధంగా సృష్టియొక్క కార్యక్రమాన్ని నడిపించడం కోసమని మౌలికమైన పదార్థములను సృష్టించిన బ్రహ్మకు ‘కార్యబ్రహ్మ’ అని పేరు.

5. సృష్టికార్యానికి మౌలికమయిన తత్త్వమును-పదార్హమును-మాత్రం సృష్టించటంచేత, మరి ఆ తర్వాత-జీవకోటి ఎట్లాఉండాలి? ఏరూపంలో ఉండాలి? వాళ్ళ మనోబుద్ధులు ఎట్లా పనిచెయ్యాలి? వాళ్ళకు కర్మమార్గము, జ్ఞానమార్గము ఏ విధములుగా ఉండాలి? అట్టి జీవుల సృష్టికోసం పుట్టిన వారు ‘ప్రజాపతులు’. 

6. మహర్షులు ఆ ప్రకారంగా బ్రహ్మచేత సృష్టించబడ్డారు. అదికూడా సృష్టి ప్రారంభమైన తరువాత, ఆ జీవకోటికి సత్యాసత్య విధానాలన్నీ బోధించడానికి వారు సృష్టిచేయబడ్డారు. 

7. కేవలం కర్మాధీనులుగా జీవులను అంధకార్మలో వదిలేస్తే, వాళ్ళకు ముక్తిమార్గం ఎవరు చూపించాలి? వాళ్ళు కర్మాధీనులై ఉంటారు. బుద్ధి మళ్ళీ కర్మాధీనమై ఉంటుంది. ఈ అనంతమైనటువంటి బుద్ధికర్మల యొక్క ఈ ఆటలో వాళ్ళు తగులుకుంటే, వాళ్ళు ఏనాటికి ముక్తి పొందుతారు? ఆ కారణాలవల్ల మహర్షులను సృష్టించాడు బ్రహ్మదేవుడు.

8. పంచబ్రహ్మ సిద్ధాంతమని ఇకటుంది. నిర్గుణమయిన ఒక పదార్థము, ఒక వస్తువు-సదాశివతత్త్వమనిగాని, నిర్గుణబ్రహ్మవస్తువనిగాని అనుకోవచ్చు దాన్ని. అది ఒకటే ఉంది. దాని నుంచి మొట్టమొడటిసారిగా రెండు పుట్టాయి.

9. ప్రకృతి-పురుషుల యొక్క రెండు తత్త్వములు పుట్టాయి. ఆ ప్రకృతి-పురుషుల తత్త్వమందు కామము – కోరిక – అనేది పుట్టింది. కామము అంటే సృష్టి అన్నమాట. సృష్టిస్తాననే కోరికే సంకల్పం; అది పుట్టింది. ఆ కోరికకు కారణం – పూర్వసృష్టి ఒకటి ఉండేది; 

10. ఇప్పుడు అది నశించి సూక్ష్మరూపంలో బ్రహ్మయందు లయించి ఉన్నది. దాని యొక్క పునరుత్పత్తికి (వర్తమానసృష్టికి) ఈ రెండు వస్తువులూ (ప్రకృతి-పురుషుడు) హేతువులు. ఈ మిధునాన్ని రెండవబ్రహ్మగా చెప్పుతున్నారు. కామేశ్వరి-కామేశ్వర మిధునం అని దానికి పేరు. రెండూ కలిపి రెండవబ్రహ్మ. 

11. దానినుంచి, హేతువైనటువంటి సంకల్పం, పూర్వసృష్టి యొక్క విజ్ఞానం అంతా కలిగిన వాడు – తన సృష్టిరూప జ్ఞానమేదో తెలుసుకున్నాడు – బ్రహ్మ యొక్క పరిజ్ఞానమంతా తెలిసినవాడు – భవిష్యత్కాలాన్ని శాసించ గలిగలిగిన వాడు – ఇన్ని విశేషములు (షడైశ్వర్యములని ఈశ్వరునియందు చెప్పబడియున్నవన్నీ) అన్నీ కలిగిన వాడైన విష్ణువు మూడవబ్రహ్మగా అవతరించాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


05 Oct 2020

------------------------------------ x ------------------------------------


🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 128   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. నారద మహర్షి - 2 🌻


12. ఆ కామేశ్వరి-కామేశ్వర మిధున ప్రణయఫలంగా విష్ణోత్పత్తి జరిగిందని; మూడవబ్రహ్మయైన ఆ విష్ణువు నాభికమలంనుంచి, ఈ భౌతిక సృష్టికి కారణభూతమైన మూలపదార్థములను సృష్టించిన బ్రహ్మయొక్క(చతుర్ముఖ బ్రహ్మయైన ఈ నాల్గవబ్రహ్మయొక్క) సృష్టిజరిగిందని పురాణకథనం. 

13. ఈ బ్రహ్మచేసిన సృష్టికి, ఒక లయక్రియ కాలాంతరములో అవసరమవుతుంది. కాబట్టి బ్రహ్మచేసే సృష్టిని లయంచేసేటటువంటి రుద్రుడు ఆ బ్రహ్మముఖం నుంచి పుట్టాడని; ఈ రుద్రుడే అయిదో బ్రహ్మ అని ఇలా ఈ అయిదుగురు బ్రహ్మలయొక్క చరిత్ర పురాణాలలో అనేకవిధాలుగా వర్ణించబడింది.

14. రుద్రుడికి, బ్రహ్మచేసినటువంటి సృష్టిని హరించి దానినంతా చివరకు తనలో లయంచేయటమే కర్తవ్యం. బ్రహ్మచేసిన సృష్టియొక్క ప్రళయం అది. ఆ ప్రళయానికి కారణం రుద్రుడు. తర్వాత రుద్రప్రళయం. అందు ఈ రుద్రుడు బ్రహ్మలో లీనమవుతాడు. బ్రహ్మప్రళయం అని ఒకటుంది. బ్రహ్మవిష్ణువులో లయంఅవుటాడు. విష్ణుప్రళయం అని ఒకటుంది. 

15. విష్ణువు ఆ రెండు తత్త్వము లందు (కామేశ్వరీ-కామేశ్వరులు) విలీనం చెందుతాడు. అవి తనను తామే ఉపసంహరించు కుంటాయి. అప్పుడు కేవలం నిర్గుణబ్రహ్మ వెలుగుతుంది.

ఈ ప్రకారంగా ఇట్టి రాకపోకలు సృష్టికి హేతువులుగా ఉన్నాయి.


16. వీటన్నిటిలోనూ పూసలలో దారంగా ఉన్నటువంటిది ఒకటుంది. అదే పరాశక్తి. ఆ ప్రాశక్తిని నిరూపణచేసి, ‘పంచ(బ్రహ్మ) మంచాధిశాయిని’గా పరాశక్తిని ఆరాధించేవాళ్ళను శాక్తేయులంటాము. ఈ అయిదుగురు బ్రహ్మలయందు, నిర్గుణమైన వస్తువులోనూకూడా ఆమె ఉన్నది! ‘కామేశ్వరీ-కామేశ్వర ప్రణయ మిధునం’ అనే భావన ఏదైతే ఉన్నదో, ఆ చైతన్యశక్తే పరాశక్తి. ఆమెది రెండవ స్థితి.

17. మూడవది విష్ణువుయందున్నది. బ్రహ్మయందూ ఆమె ఉన్నది. కాబట్టి ఈ అయిదుగురిలోనూ ఆమెయే అధికారికంగా విలసిల్లేటటువంటిది, నిరంతరంగా ఉండేది. అట్టిచైతన్య స్వరూపిణి అది. ఆ చైతన్యాన్ని చిద్గగనమందు యోగి దర్శనంచేసి, దానిని తెలుసుకుంటేకూడా ముక్తిలభిస్తుంది. బ్రహ్మను గురించి తపస్సు చేసి బ్రహ్మలోఉండే జ్ఞాన్నిపొందినా ముక్తి కలుగుతుంది. 

18. రుద్రుని యందు ఏ జ్ఞానము ఉన్నదో, దానిని ఆరాధించినా అది ముక్తికి హేతువవుతుంది. విష్ణువులో ఏ జ్ఞానముందో-సత్యజ్ఞానము-దానిని ఆరాధించినా అదికూడా మోక్షహేతువవుతుంది. 

19. ఇదంతా కాక, నిర్గుణమైన పరబ్రహ్మవస్తువు సర్వకారణకారకమైనది ఏదైతే ఉన్నదో, దానిని ఆరాధించినా మోక్షమే వస్తుంది. ఇవన్నీ మార్గములే! ఏదయినా మార్గమే!.


సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


06 Oct 2020

------------------------------------ x ------------------------------------





🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 129   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నారద మహర్షి - 3 🌻

20. రుద్రుడి యొక్క తత్త్వం ఏమిటంటే, అయిదవ బ్రహ్మగా అతడు అంతర్ముఖుడై ఉన్నాడు. శుద్ధజ్ఞానలక్షణ విలసితుడై, అంతర్ముఖుడై అతడు ఉండటచేత సాధారణంగా నిష్క్రియుడు.

21. అతడి యందు అతని యొక్క కార్యలక్షణము ఎప్పుడు వస్తుందంటే, లోకంలో ఏదయినా విపత్తు సంభవించినప్పుడుకాని, ఎవరైనా ఆరాధించినప్పుడుకాని (అతడున్నాడని తెలిసినవాడూ అతడిని ఆరాధిస్తే), అతడికి క్రియ ఏర్పడుతుంది తప్ప; లేకపొతే అతడి యందు క్రియలేదు. 

22. శుద్ధజ్ఞాన స్వరూపమై, ఆదియందున్న పరబ్రహ్మతత్త్వమైన సదాశివతత్త్వం ఏదయితే ఉన్నదో, దానియొక్క జ్ఞానం సంపూర్ణంగా కలిగి ఉండటంచేత – రుద్రుడు నిష్క్రియుడై, క్రియాతీతుడై సర్వకాలములకు అతీతుడైన స్థితిలో ఉంటాడు. 

23. కనుక రుద్రుడు ప్రథమమైనటువంటి పరబ్రహ్మ-సదాశివబ్రహ్మ-యొక్క రూపాంతరమే. అందుకని లోకమందున్న విభూతులు, ఐశ్వర్యము, సుఖము – వాటియొక్క స్పృహ అతడియందు ఉండదు. 

24. అయితే, ఈ రుద్రునికి మళ్ళీ పత్నిగా పరాశక్తి ప్రక్కన ఉన్నదని మనవేదాలు, పురాణాలు, శాస్త్రాలు విరూపణంచేసాయి. అంటే, మన ఉపాసనాసౌలభ్యంకోరకే ఈ సిద్ధంతం ఏర్పడినదని గ్రహించాలి. లేకపోతే, రుద్రుడు వివాహంచేసుకున్నాడని, ఆయనకు స్వాధీనంగా లేకుండానే ఆమె వెళ్ళిపోయి, దాక్షాయణిగా తనను తాను ఉపసంహారం చేసుకుందనీ, ఈ కథకంతటికీకూడా ఎలాగ అర్థం చెప్పుకోవాలి? సృష్టిమూలకమైన తత్త్వములకు – మన పౌరాణికగాధలన్నీ కొన్ని రూపకల్పనలని చేసుకోవాలి. 

25. కథారూపకల్పన లేకుంటే, ఆ తాత్త్వముల అంతరార్థం మానవబుద్ధికి సులభంగా అవ్గాహన కాదు.

దేవాలయంలో నందీశ్వరుడిని, గణపతిని ప్రతిష్ఠ చేస్తాం. ఆ రెండూ లేకపోతే ఈ రుద్రుణ్ణి మనం చేరటానికి, సమీపించడానికి, ఆయనను ఉపాసించడానికి సాధ్యంకాదు. ఆ వేదాంతతత్త్వమే మనయొక్క ఈశ్వర ఉపాసనా విధానములందుకూడా అనేక రూపాంతరములు పొంది వచ్చింది ఈ ప్రకారంగా.

26. జ్ఞానాజ్ఞానముల యొక్క అనేక అవస్థలలో జీవులు ఆయా పరిణామదశలలో ఉన్నారు. ఈ సృష్టిలో అనేక చరిత్రలు జరగవలసి ఉంది. దానికి దేవకార్యం అనిపేరు. 

27. ఈశ్వరుని నుండి బహిర్గతమైన జగత్తంతా – ఈ జీవకోటి అంతా కూడా – తనలో మళ్ళీ లయం చెందాలనేది ఒకటే ఆయన సంకల్పం. కానీ జీవులకు ఆయన్ స్వేఛ్ఛనిచ్చాడు. వాళ్ళందరినీ తను వెంటనే ఉపసంహారం చేసుకోవచ్చు కదా! అటువంటి క్రియయందు అతడికి కారణత్వంలేదు. అలాంటికారణం అతడు కాడు.

28. స్వేఛ్ఛ జీవాహంకారానికి ఇవ్వటంచేత, దానంతట దానికే ఎప్పుడైతే ఆ మోహమ్నుంచి విడిపోదామనే మోక్షేఛ్ఛ కలుగుతుందో, అప్పుడే దానికి మార్గాలు ఈ సృష్టిలో ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కర్మయొక్క బంధ్నాన్నే కోరుకొని శాశ్వతంగా ఇక్కడే ఉండేవాళ్ళకు దానికి ఏర్పాట్లు వేరే ఉన్నయి.

29. రెండు విధాలుగా రాచబాటలు వేసి ఈశ్వరుడు జీవాత్మకు ఇచ్చాడు. అతడు మనకు ఇచ్చిన దానికే చిత్తము – బుద్ధి – మనసు అని మనమంటున్నాం. అంటే, జీవుని కివ్వబడిన ‘స్వేఛ్ఛ’ పేరే, మనోబుద్ధిచిత్తములు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద 


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


07 Oct 2020

------------------------------------ x ------------------------------------





🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 130   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నారద మహర్షి - 4 🌻

30. విష్ణువు యొక్క నాభికమలంలోంచి వచ్చినటువంటి బ్రహ్మ, విశ్వాన్ని సృష్టించమని తనకు విష్ణువుయొక్క ఆజ్ఞ అవటంచేత; “తాను ఏమి చేయాలి? సృష్టిని ఎక్కడ ప్రారంభించాలి?” అనే విచికిత్సచేసాడు.

31. ఈ ప్రశ్నలకు సమాధానం విష్ణువు ఆయనకు చెప్పలేదు. “నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చుకో!” అని బ్రహ్మను చాలాదూరం పంపించివేసాడు. నాభికమలంలోంచి ఒక గొప్ప తేజస్సు శతకోటియోజనాల దూరం ఎక్కడికో వెళ్ళిపోయింది. 

32. ఆ ప్రకారంగా విష్ణువుయొక్క నాభికమలంనుంచీ చాలాదూరం వెళ్లిపోయి, సుదూరంలో బ్రహ్మాండమయిన ఒక కమలం విస్తారితమై, అందులో తననుతాను చూచుకున్నాడు. అక్కడ తనొక్కడే ఉన్నాడు బ్రహ్మ. తనుతప్ప ఇంకొకరు లేరు. ‘నేనెవరిని?’ అని అడిగితే జవాబు చెప్పేవారెవరూ లేరు.

33. తానొక్కడే ఉన్నప్పుడు, తన విషయం తనకు తెలియనప్పుడు, ఏ మనిషైనా యోచన చేస్తాడు. తనకు శరణ్యంగా తన బుద్ధి ఒక్కటే ఉంటుంది. దాన్నే శరణు అంటాడు. కాబట్టి తానెవరో తెలుసుకోవటానికి చిరకాలం చేసే ప్రయత్నానికే – ‘తపస్సు’ అని పేరు. 

34. అంతర్ముఖుడై, ‘నేనెవరిని? నేనేంచేయాలి? నాకాజ్ఞ ఏమిటి? నా కర్తవ్యం ఏమిటి? ఒకవేళ కర్తవ్యమే సృష్టి అయితే, సృష్టియొక్క ఉపక్రమణము ఎలాగ? ఏ ప్రకారంగా మొదలుపెట్టాలి? ఎక్కడ మొదలుపెట్టాలి?’ ఈ విషయమంతా తెలుసుకునేందుకు బ్రహ్మ తపస్సు చేసాడు. 

35. ఆ తపస్సులో – “ఓహో నేను ప్రత్యక్షంగా ఏ విషయాన్నీ సృష్టించటంకాదు. సృష్టికి హేతువులైనటువంటి ఋషులను (ప్రపంచ జ్ఞానము-బ్రహ్మజ్ఞానము రెండూ కూడా ఏకకాలమందు కలిగిన మహర్షులను) నేను సృష్టించాలి. 

36. అప్పుడు పంచభూతాత్మకమైన శరీరములు, అందులో జీవాత్మలూ, వాటియొక్క కారయకారణ లక్షణములన్నీ కూడా ఆ ఋషులే బోధించి చెప్తారు. అది వాళ్ళ పని” అన్న్ జ్ఞానం ఆయనలో ఉద్బుద్ధమయ్యింది. అప్పుడు ఆయన తనలోంచి బ్రహ్మర్షులను సృష్టించాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద 


08 Oct 2020

------------------------------------ x ------------------------------------



🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 131  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. నారద మహర్షి - 5 🌻

37. అలా పుట్టిన బ్రహ్మర్షులలో- మొదటివారు సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనేవాళ్ళు నలుగురు పుట్టారు. వాళ్ళు ఈ సృష్టికి ఉపక్రమం చేయాలని ఆయన ఉద్దేశ్యం. ఆ బ్రహ్మ మనసులోంచి నేరుగా పుట్టినవాళ్ళు వాళ్ళు. అందుకని వారిని బ్రహ్మమానసపుత్రులు అన్నారు.

38. ఆయన సంకల్పమేదయినప్పటికీ; తపస్సులో ఆత్మజ్ఞాన స్వరూపుడై విష్ణుతత్త్వాన్ని గురించి ధ్యానంచేసి ఉండిఉండటం చేత, అతడికి కర్తవ్యం ఏమిటో తెలిసింది. 

39. తనలో ఉండే బ్రహ్మజ్ఞానం, సహజంగానే, తననుండి పుట్టిన వాళ్ళలోనూ ఉంది. ఈ బ్రహ్మజ్ఞానం వాళ్ళలో ఉన్నంతసేపూ వాళ్ళు సృష్టి నియుక్తులు కాలేరు. బ్రహ్మజ్ఞానం ఈ సృష్టిలో సమస్తకార్యాలకూ అవరోధంగా విముఖంగా పరిణమిస్తుంది. అది సృష్టి విస్తరణ సంకల్పం వాళ్ళళ్ళో పుట్టనివ్వదు. కాబట్టి ఆ నలుగురూ సృష్టిచేయలేదు. 

40. వాళ్ళు బ్రహ్మజ్ఞానం చేత కలిగినటువంటి ఒక మహానందస్థితిలోకి వెళ్ళిపోయారు.

మరికొంతకాలానికి, తన సంకల్పం నెరవేరటానికి తన వామపాదంలోంచి స్వాయంభూమనువును, శతరూప అనే సుందరిని బ్రహ్మ సృష్టించాడు. ఆ రెండవబ్రహ్మయొక్క లక్ష్యం ఏదయితే ఉన్నదో – దాని ప్రకారం ప్రకృతీ-పురుషుడూ ఇద్దరూ ఉండాలికదా! అందుకనే, ఆయనతోపాటు శతరూపనుకూడా సృష్టించాడు.

41. స్వయంభూ మనువు- శతరూపలలో అవిద్యను ప్రవేశపెట్టాడు బ్రహ్మ. బ్రహ్మజ్ఞానంలో విస్మృతి -అవిద్య అంటే, ఇక ఉండేది సృష్టి జ్ఞానమే. అజ్ఞానం అనే వస్తువులేదు. కాబట్టి బ్రహ్మవస్తువు యొక్క ఆ పరిజ్ఞానం, ఆ ప్రజ్ఞ వాళ్ళల్లో మాయావృతం అయి; శతరూప స్త్రీగా స్వయంభూ మనువుకు కనబడుతుంది, నచ్చుతుంది. బాగుంది అనిపిస్తుంది. అలాగే శతరూపకుకూడా అనిపిస్తుంది. 

42. ఇదే అవిద్య యొక్క ప్రారంభం అనుకోవటమే. ఆ తరువాత సృష్టిక్రమం ప్రారంభమయింది.

వాళ్ళదగ్గరినుంచే సమస్త క్షత్రియకులములూకూడా స్వయంభూమనువుకు పుట్టారట! తరువాత చతుర్ముఖుడు తన ఫాలభాగంనుంచీ ఏకాదశరుద్రులను సృష్టించాడట. వాళ్ళందరూ క్రోధమూర్తులయ్యారట. 

43. ఆ తరువాత ఆ కమలాసనుడు తన చెవులలోంచి పులస్త్యపులహులనే ఋషులను సృష్టించాడు. నేత్రములలోంచి అత్రిక్రతువులను సృష్టించాడు. నాసికనుంచి సూర్యుడిని, ముఖంనుంచి అంగిరసుణ్ణి సృష్టించాడు. దక్షిణ వామ పార్శ్వముల నుంచీ భృగువు, దక్షులను; గ్రీవమునుండి నారదుణ్ణి పుట్టించాడు. నారదుడు పుట్టగానే తన తల్లితండ్రులను చూచాడు.

44. మొట్టమొదట అతడు బ్రహ్మనుచూస్తే, ఆయనేమో తపస్సులో ఉన్నాడు. ఆయన పలుకలేదు. అమ్మవారుమాత్రం తనవైపు వాత్సల్యంతో చూస్తోంది, సరస్వతీదేవి-శారదాదేవి. ఆమె దగ్గరికి వెళితే, ఈతడికి గానవిద్యను ఇచ్చింది. ఆ సంగీతవిద్యను – గానవిద్యను – ఆయన తీసుకుని దానిని అభ్యసించి ఉత్తీర్ణుడయ్యాడు. ఇంతలో లోకాలన్నీ సృష్టించబడ్డాయి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద 



Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


09 Oct 2020

------------------------------------ x ------------------------------------


🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 132   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నారద మహర్షి - 6 🌻

45. చీకటి పడితే నక్షత్రాలెలా కనబడతాయి? అక్కడ ఉన్నవే కనబడతాయి. మళ్ళీ ఈ వెలుగు రాగానే, అది మన కళ్ళమీద పడగానే, యథార్థం కనబడటం మానేసింది. అది కృత్రిమకాంతి. మరి ఉన్న నక్షత్రములను కనపడకుండా చేసేది వెలుగవుతుందా? అయితే, సృష్తిలో బ్రహ్మ ఈ ప్రజాపతులైన నారదాదులకు ఉపదేశించిన విద్యయొక్క స్వరూపం ఎట్లాంటిదంటే; సత్యాన్ని మరుగుపరచి అస్త్యరూపమయిన ప్రపంచాన్ని సృష్టించటమే – దాన్నే సత్యమనుకుని దాన్నే సృష్టించటం మొదలుపెట్టటమే.

46. బ్రహ్మ బ్రహ్మజ్ఞానము, శివతత్త్వజ్ఞానము తనయందే ఇముడ్చుకున్నాడు. మనకుండే అవిద్య అక్కడ ప్రారంభమయింది. ఆయన సృష్టిలో భాగం కాబట్టి, ఉన్న సద్వస్తువుయొక్క పరిజ్ఞానం, ప్రజ్ఞ మనకులేక బ్రహ్మ తనలో ఉంచేసుకున్నాడు. కానీ మనం పొందకుండా దానిని నిషేధించలేదు. లోపల సత్యం ఉన్నది. 

47. కాని సత్యమున్నదనే జ్ఞానంమాత్రమే లేదు మనకు. సత్యం ఎక్కడినుంచో సంపాదించుకునే పనిలేదు; లోపల ఉన్నదే! ఉన్న వస్తువును తెలుసుకోవటానికి ఏంప్రయత్నం చెయ్యాలి? ఉన్నదని తెలివిలేకపోవటానికి, ఆ అవరోధానికి ఏమేమి హేతువులున్నాయో, లక్షణాలు ఉన్నాయో; ఆ లక్షణములను నిర్మూలించటమే అవిద్యను నిర్మూలించటం. 

48. కాని విద్యను ‘సంపాదించటమనేది’ కాదది. సంపాదించటం అంటే, నిన్నలేనిది ఇవాళ రావటం. అలా వచ్చింది మళ్ళీ రేపు పోతుంది. అంటే ఇవాళ లేని జ్ఞానం వస్తే, మళ్ళీ రేపు పోవచ్చు కదా! ఇప్పుడు ఉన్నది(మన స్థితికి) అవిద్య. పోవలసింది అవిద్య. మిగలవలసింది అవిద్య.

49. నారదుడు మరుత్తులు పరిపాలించే లోకాలకు వెళ్ళాడు. అక్కడ వాయుదేవుడు దర్శనమిచ్చి “నాయనా! నువ్వు శారదాదేవి దగ్గర సంగీతాన్ని నేర్చుకున్నావు. ఇతర విద్యలన్నీ నేర్చుకున్నావు. 

50. నీకు ‘మహతి’ అనే వీణను ఇస్తున్నాను” అని అంటూ మహతిని ఇచ్చాడు. నారదుడు తన కంఠాన్ని ఆ వీణతో లయంచేసాడు. నారదుడు – స్థాయి, సంచారి, ఆరోహణ, అవరోహణ రూపాలతో; వాది, సంవాది అనే పాదభేదములతో తన మహతిని చక్కగా సారించాడు. అంటే అది సనాతనమైన భారతదేశ సంగీతం. 

51. ఆ స్థాయి, ఆంత్ర, సంచారి – ఈ ప్రకారం ఆయన వీటియందు నిర్ధిష్టమైన ఆ పాదభేదములతో సారితములైనటువంటి మధ్యమ, పంచమ, గాంధార, ఋషభ, దైవత, షడ్జ, నిషాదములనేటువంటి సప్తస్వరాలుగా ఆ నాదమును ఏడుభాగాలుగా చెయ్యగలిగాడు. సంగీతానికి ఆయన తండ్రి. నారదుడూ, తాను సృష్టించిన ఈ రాగములను ఎప్పుడయితే విభాగం చేసాడో, వాటికి సమీకరణాలు పుట్టాయి.

52. అంతకుముందు బ్రహ్మదేవుడికి, ఇతర దేవతలకు తెలిసినటువంటి నాదం ప్రణవనాదం ఒకటే! అది తప్ప వాళ్ళకు ఇంకొకటేమీ కనబడటంలేదు సృష్టిలో.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద 


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


10 Oct 2020

------------------------------------ x ------------------------------------


🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 133  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నారద మహర్షి - 7 🌻

53. ఉన్నది ఒకేనాదం అయినప్పటికీ; వాయువు యొక్క వికార భేదముల చేత పుట్టినటువంటి వర్ణములు, అలాగే స్వరములు, ఆ స్వర్ణాల్లోంచి వచ్చిన రాగాలు, రాగంలోంచి భావము – ఇవి మాత్రమే సంగీతానికి సరిపోవుకదా! 

54. అందుకని ఆయన కొన్ని వస్తువులను కూడా సృష్టించాడు. మృదంగం, వేణువు – ఈ ప్రకారంగా ఇట్లాంటి వాయిద్యాలనుకూడా వర్ణించి ఆయన బ్రహ్మ దేవుడికి చెప్పినవి, సాక్షాత్తు పరమేశ్వరియైన సరస్వతీదేవి తనకు చెప్పిన జ్ఞానంనుండే. 

55. ఆ వాద్యాలన్నీ ఆమెలోపల ఉండి నిద్రిస్తున్నాయి. ఆ విద్యను గ్రహించాడు. అంతకు ముందు ఆమెయందు పరా-పశ్యంతీ స్థాయిలలో ఉన్నదంతా కూడా బహిర్ముఖమై, మధ్యమా-వైఖరీ రూపంగా ఈయన కిచ్చింది. ఒకటేమో అవ్యక్తము, మరొకటేమో వ్యక్తము. తర్వాత నారదుడు తంత్రీముఖములందు, ఆహతము – అనాహతములనే గాన మాత్ర విశేషములను ఇచ్చాడు. 

56. ఆహతము అంటే, రెండు వస్తువుల తాకిడిచేత వచ్చేశబ్దం; అనాహతం అంటే ఎలాంటి తాకిడీలేకుండా పుట్టే శబ్దం. హృదయంలోని చక్రానికి యోగశాస్త్రంలో ‘అనాహత’మని పేరు. అనాహతం అంటే, ఆహతంకాని శబ్దము, హృదయంలో ఉంది. యోగులు దానిని వింటారు.

57. ఇప్పుడు మనం ఉత్పత్తిచేస్తున్న – సంగీతంలో ఏయే దోషములు ఉన్నాయో, అవిలేకుండా ఆయన ఆది సంగీతవిద్వాంసుడుగా అక్కడ పాడాడు. ఆ గానంతో దేవతలందరూ సంతోషించారు. బ్రహ్మదేవుడుకూడా బహిర్ముఖంగా సంగీతం వినటం అప్పుడే మొదటిసారి.

58. అమ్మవారు కూడా తను ఆయనకు ఇచ్చిన విద్య మళ్ళీ వింటున్నది. బ్రహ్మ సంతోషించి నారదునితో, “నాయనా! నీ జీవితమంతా సంగీతమే! స్మగీతమే నీవు. అలాగే ఉండు శాశ్వతంగా. 

59. నేకేమీ పనిలేదు. దైవకార్యం ఏదయినా చెయ్యటానికై నీకు ఏదయినా కర్తవ్యం అప్పుడప్పుడు పుడితే, దానిని చేస్తావు. అంతేకాని దానిఫలంతో నీకేమీ సంబంధం ఉండదు. ఈశ్వరుడియొక్క సంకల్పం ఏదయితే ఉంటుందో, అది ఎందుకై అవసరమని అనుకుంటారో, దానికి నిమిత్తకారణంగా ఏవో కొన్ని పనులు చేస్తూ ఉంటావు. ఆ పని అయిపోగానే నీకేమీ కర్తవ్యం ఉండదు. తిరుగుతూనే ఉంటావు’ అన్నాడు. 

60. “మరి నన్నేమి చెయ్యమంటావు తండ్రీ?” అని అడిగితే, ‘ఇదిగో నీకు అష్టాక్షరి ఉపదేశం చేస్తున్నాను. అది శ్రీమహావిష్ణు తత్త్వం. ఆయన నాకు తండ్రి. ఆయన నాకు గురువు. నా పుట్టుకకు హేతువు. ఆయనను గురించి నాకు అంతే తెలుసు. విష్ణుతత్త్వాన్ని అంతా నీకు చెప్తాను” అన్నాడు బ్రహ్మ.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద


11 Oct 2020

------------------------------------ x ------------------------------------




🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 134   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నారద మహర్షి - 8 🌻

61. నిర్గుణ పరబ్రహ్మ వస్తువును తొలిగా నారదుడే స్వయంగా తెలుసుకోవాలి. తాను చెప్పడు. చెబితే తాను కార్యబ్రహ్మ కానేరడు. “నీవే తెలుసుకుంటావు ఆ అష్టాక్షరి అర్థమేదో!” అని చెప్పి, ఆయనను గమ్యస్థానానికి తీసుకు వెళ్ళగలిగిన మార్గాన్ని ఉపదేశించాడు బ్రహ్మ. అదే అష్టాక్షరీమార్గం.

62. గమ్యం నారదుడే చేరుకుంటాడు. అంతవరకే! తాను మార్గాన్ని ఉపదేశించిన గురువు. గమ్యస్థానానికి వెళ్ళలేక కష్టంలో ఉన్నప్పుడు, తానే వచ్చి ఆ గమ్యస్థానానికి చెర్చేవాడు గురువు అని చెప్పి; ఆద్యంతములందు గురువు ఉంటాడనీ, ఆయన ఆద్యంతరహితుడనీకూడా – అలా రెండువిధాలుగా చెప్పారు.

63. మహర్షి లక్షణం కూడా చెప్పాడు బ్రహ్మ. “జీవసృష్టికి సమయం వచ్చింది. ఈ జగత్తంతా భవిష్యత్తులో జీవులు పుట్టబోతున్నారు. వీళ్ళందరూకూడా కేవలం అజ్ఞానంలో లేరు. శుద్ధజ్ఞానంలోనూ లేరు.

64. అలాగే దేవతలందరూకూడా జ్ఞానాజ్ఞాన సమ్మిశ్రమంలో ఉన్నారు. వీళ్ళకు కొంతజ్ఞానం, కొంతఅజ్ఞానం ఉంది. వారికి తమకుతాము ఏంచేసుకోవాలో తెలియదు. మనుష్యజాతి పుడుతుంది. చరిత్ర అంతా భవిష్యత్తులో నేవే చూస్తావు, వెళ్ళునాయనా!” అన్నాడు బ్రహ్మ.

65. బ్రహ్మ తాను సృష్టించిన కొడుకులందరినీ ఒకసారి పిలిచి, “మీరు పుత్రులను కనండి! ప్రజలను సృష్టించండి. వివాహితుల కండి. మీకు భార్యలను నేను సృష్టిస్తాను” అన్నాడు. వాళ్ళు ఎవరూ ఏమీ మాట్లాడక, మౌనం వహించారు. తలలు వంచుకుని నిలబడ్డారు.

66. అప్పుడు వాళ్ళు తమలో తాము, “మేము స్వయంసమృద్ధిగా సుఖంగా ఉన్నాము, మేమిప్పుడు చేయాల్సిన పని ఏముంది? మేము బాగానే ఉన్నాము. ఈయన ఏదో పని చెపుతాడేమిటి? వివాహం చేసుకోమంటాడు. సంతానం కనమంటాడు. సంతానం ఏమిచేసుకోవాలో తెలియదు. అదంతా ఆయన పనేమో! ఆయన పని మనచేత చేయిస్తుంటాడు” అనుకున్నారు.

67. నారదుడి అభిప్రాయం కూడా అలాగే ఉంది. అయితే నారదుడు మాత్రం ఇతరుల వలే కాక, బయటపడ్డాడు: “తండ్రీ! నీవు ఇప్పుడే కదా అష్టాక్షరి చెప్పావు నాకు. ఆ విష్ణుపదం ఎక్కడో ఉంది. అది నీకు కూడా అందనంత దూరంలో ఎక్కడో ఉంది. ఆ విష్ణుపదం ఏమిటో చూద్దామనే ఆకాంక్ష నాలో కలిగింది.

68. ఈ అష్టాక్షరీ జపం నేను చేసుకుంటూ దీనిమార్గంలో వెళ్ళిపోతాను. నాకు అన్నగార్లున్నరు, సనకసనందాదులు. వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళను ఏమీ అనలేదు కదా! మరి వాళ్ళు ఆనందంలో ఉన్నారు. వాళ్ళు నాకంటే ముదుపుట్టినవాళ్ళు. మరి వాళ్ళు వెళ్ళిపోయారు కదా! నేనుకూడా వాళ్ళలాగానే వెళ్ళిపోతాను. నేను మాత్రం నువ్వుచెప్పినట్లు వివాహంచేసుకోను” అన్నాడు నారదుడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద 


12 Oct 2020

------------------------------------ x ------------------------------------



🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 135   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నారద మహర్షి - 9 🌻

69. అప్పుడు బ్రహ్మ కొంచెం కోపాడ్డాడు,”నేను నిన్ను సృష్టించాను. నీకు ఆజ్ఞ ఇస్తే నన్ను కాదంటావా? వీళ్ళందరూ మౌనంగా ఉన్నారు. నిన్ను శిక్షించగలను జాగ్రత్త!” అన్నాడు. “తండ్రీ! సారహీనమైన, ఘోరమైన దుఃఖం పాలుజేసే సంసారంలో నన్ను పడేస్తానన్నావు కదా! నీ ఆజ్ఞాపాలన అంటే అదే కదా! అలాచేయకపోతే శిక్షిస్తావు. 

70. అంతకన్నా శిక్ష ఇంకా ఏముంటుంది? కబట్టినువ్వు ఇంతకంటే ఇంక ఏం శిక్షించగలవో చూస్స్తాను నేను!” అన్నాడు నారదుడు. “కాబట్టి శాపగ్రస్తుణ్ణి చేసినా, నువ్వు ఏం చేసినా సంతోషమే, చెయ్యి!” అన్నాడు. బ్రహ్మకు కోపం వచ్చింది. “నువ్వు విధేయుడివిగా ఉన్నావు. నేను ఒప్పుకోను. 

71. పోనీ నిన్ను సనకసనందాదులవలే వదిలేస్తే, నా కార్యమెలా నెరవేరుతుంది? ఇప్పుడు నీలో ఉండేటటువంటి వైరాగ్యప్రవృత్తిని నేను హరిస్తాను. నీలో అవిద్యను ప్రవేశపెడతాను. అది నా చేతిలో ఉంది” అని అతడిలో అవిద్యను ప్రవేశపెట్టి, “సంగీతం ఒకటి తీసుకున్నావుకదా! ఈ సంగీతవిద్యను గంధర్వులుకూడా భవిష్యత్తులో వాళ్ళవృత్తిగా తీసుకుంటారు. సంగీతము, నాట్యము మొదలైన గంధర్వ విద్యలు.

72. గంధర్వ లోకంలో వాళ్ళకు అదే వృత్తి, ప్రవృత్తి. వాటినే ఆశ్రయించుకుని ఈశ్వరారాధన చేస్తారు. సుఖంగా ఉంటారు. ఈశ్వరారాధన చేసినా వాళ్ళకు భక్తి, జ్ఞానము, అంతర్ముఖత్వము ఉండదు. సంగీతం ద్వారానే ఈశ్వరుడిని ఆరాధిస్తారు. వారివలనే నీ తత్త్వజ్ఞానాన్ని విస్మరించి నువ్వుకూడా గంధర్వుడివై, స్త్రీలోలుడివై అప్పుడు నా సంకల్పం నెరవేరుస్తావు” అన్నాడు.

73. అప్పుడు నారదుడు ఆయనతో, “నువ్వు విష్ణువు జగత్పూజ్యుడని ఇంతకుముందే చెప్పావు తండ్రీ! ఆయన పరమ జ్ఞానస్వరూపుడని, ఆయనను ఆశ్రయిస్తే జ్ఞానం కలుగుతుందని చెప్పావు. ఆ కారణం చేత ఆయన పూజ్యుడన్నావు. నువ్వు అడిగినది నేను వద్దంటే, నాకు అజ్ఞానాన్నిచ్చి నన్ను శాపగ్రస్తుడిని చేసావు. జ్ఞానాన్నిచ్చే విష్ణువు పూజ్యుడయితే, నీవు జగత్పూజ్యుడివి కాదన్నమాటే కాదన్నమాటే కదా!

74. నీకు భూలోకం లో గాని, మరెక్కడా గాని పూజ ఉండదు. కాబట్టే నేనిలా అంటున్నాను నిన్ను. ఇప్పుడు నీ ముఖతః ఇవ్వబడింది కనుక, అష్టాక్షరీ మహామంత్రోపదేశం అప్రతిహతమైన శక్తి కలిగినది. నేను ఏ గంధర్వ జన్మ ఎత్తినా, స్త్రీ జన్మ ఎత్తినా, పశుజన్మ ఎత్తినా ఆ హరిభక్తి, అష్టాక్షరీ నన్ను విడవకుండుగాక!” అని శాసనం చేసుకున్నాడు. తండ్రి సమక్షంలో శాసనాన్ని చేసుకున్నాడు. 

75. అట్టి మహత్తర శక్తి సంపన్నుడు నారదుడు. అతడి సంకల్పం అవక్రంగా ఉంది. సంసారం ఒక విషవృక్షం అని చెపుతూ, అందులో రెండు స్వాధుఫాలాలు అని చెపుతారు పెద్దలు. ఈ విషవృక్షానికి మధురఫలాలు ఎలా కాస్తాయి అంటే, ఆ మధురఫలాలు లేకపోతే ఆ విషవృక్షాన్ని అందరూ ఛేదించి వెళ్ళిపోతారు. దాంట్లో కూడా ఒకటో రెండో రుచికరమైన ఫలాలు దొరుకుతాయి కాబ్ట్టే దాన్ని ఆశ్రయించి, అది ఎంత విషవృక్షమైనా దానిని వదలరు. ఆ స్వాధుఫలాలు రెండూ అనుకూలమైన దాంపత్యం (అనుకూలమైన భార్య), పుత్రసర్శనం అనేవి. వాటికోసం ఆశిస్తారు. సంసారంలో ప్రవేశిస్తారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 
https://t.me/ChaitanyaVijnanam


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద


13 Oct 2020

------------------------------------ x ------------------------------------


------------------------------------ x ------------------------------------


No comments:

Post a Comment