శ్రీ శివ మహా పురాణము - 199


🌹 . శ్రీ శివ మహా పురాణము - 199 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴

44. అధ్యాయము - 19

🌻. శివునితో కుబేరుని మైత్రి - 1 🌻

బ్రహ్మోవాచ |

పాద్మే కల్పే మమ పురా బ్రహ్మణో మానసాత్సుతాత్‌ | పులస్త్యాద్విశ్రవా జజ్ఞే తస్య వైశ్రవణస్సుతః || 1
తేనేయ మలకా భుక్తా పురీ విశ్వకృతా కృతా | ఆరాధ్య త్ర్యంబకం దేవషుత్యుగ్ర తపసా పురా || 2
వ్యతీతే తత్ర కల్పేవై ప్రవృత్తే మేఘ వాహనే | యాజ్ఞ దత్తి రసౌ శ్రీ దస్తపస్తేపే సుదుస్సహమ్‌ || 3
భక్తి ప్రభావం విజ్ఞాయ శంభోస్తద్దీపమాత్రతః | పురా పురారేస్సం ప్రాప్య కాశికాం చిత్ర్ప కాశికామ్‌ || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

పూర్వము పాద్మకల్పమునందు బ్రహ్మనగు నా యొక్క మానసపుత్రుడైన పులస్త్యునకు విశ్రవసుడు అను కుమారుడు కలిగెను| అతనికి వైశ్రవణుడు (కుబేరుడు) అను కుమారుడు కలిగెను (1).

ఆతడు పూర్వము ముక్కంటి దేవుని అతిఘోరమగు తపస్సుతో నారాధించి విశ్వకర్మచే నిర్మింపబడిన ఈ అలకాపురిని పాలించెను (2).

పాద్మకల్పము గడిచి, మేఘ వాహన కల్పము రాగా, యజ్ఞదత్తుని కుమారుడుగా నున్న ఈ కుబేరుడు ఘోరమగు తపస్సును చేసెను (3).

దీపమును వెలిగించుట మాత్రము చేత తనకు లభించిన మహా ఫలముచే భక్తియొక్క ప్రభావమును ఎరింగి, ఆతడు పూర్వము పురారియగు శివుని చైతన్య స్వరూపమును ప్రకాశింపజేయు కాశీనగరమును చేరుకొనెను (4).

శివైకాదశముద్బోధ్య చిత్తరత్నప్రదీపకైః | అనన్య భక్తిస్నేహాఢ్య స్తన్మయో ధ్యాననిశ్చలః || 5
శివైక్యం సుమహాపాత్రం తపోsగ్ని పరిబృంహితమ్‌ | కామక్రోధమహావిఘ్న పతంగాఘాతవర్జితమ్‌ || 6
ప్రాణసంరోధనిర్వాతం నిర్మలం నిర్మలేక్షణాత్‌ | సంస్థాప్య శాంభవం లింగం సద్భావకుసుమార్చితమ్‌ || 7
తావత్తతాప స తపస్త్వగస్థిపరిశేషితమ్‌ | యావద్బభూవ తద్వర్ష్మ వర్షాణామయుతం శతమ్‌ || 8

ఆతడు చిత్తము అనే రత్న దీపముచే ఏకాదశ రుద్రులను మేల్కొలిపి, అనన్యమగు భక్తితో, ప్రేమతో నిండిన హృదయము గలవాడై. ధ్యానమునందు అచంచలుడై యుండెను (5).

ఆతడు మహాత్ములకు మాత్రమే లభ్యమగునట్టియు, తపస్సు అనే అగ్నిచే వృద్ధి పొందింపబడునట్టియు, కామక్రోధరూపములో నుండే మహావిఘ్నములను పక్షుల దెబ్బలు తగులనట్టి శివైక్యమును భావనచే పొందెను (6).

ఆతడు ప్రాణాయామములో వాయువును స్తంభింపజేయుటచే వాయు సంచారము లేనట్టియు, దోషరహితమగు అంతర్ముఖత్వముచే కాలుష్యములు లేనట్టి మనో దేశమునందు శంభులింగమును స్ధాపించి పవిత్రమగు చిత్త వృత్తులనే పుష్పములచే నారాధించెను (7).

ఆతడు శరీరములో చర్మము, ఎముకలు మాత్రమే మిగులునంత వరకు పదివేల వంద సంవత్సరముల కాలము తపస్సు చేసెను (8).

తతస్సహ విశాలక్ష్యా దేవో విశ్వేశ్వరస్స్వయమ్‌ | అలకాపతి మాలోక్య ప్రసన్నేనాంతరాత్మనా || 9
లింగే మనస్స మాధాయ స్థితం స్థాణుస్వరూపిణమ్‌ | ఉవాచ వరదోSస్మీతి తదాచక్ష్వాలకాపతే || 10
ఉన్మీల్య నయనే యావత్స పశ్యతి తపోధనః | తావదుద్యత్స హస్రాంశు సహస్రాధికతేజసమ్‌ || 11
పురో దదర్శ శ్రీ కంఠం చంద్రచూడము మాధవమ్‌ | తత్తేజః పరిభూతాక్షితేజాః సంమీల్య లోచనే || 12
ఉవాచ దేవదేవేశం మనోరథపదాతిగమ్‌ | నిజాం ఘ్రిదర్శనే నాత దృక్సామర్థ్యం ప్రయచ్ఛమే || 13

అపుడు విశ్వేశ్వర దేవుడు నిడివికన్నుల అర్ధాంగితో కూడి ప్రసన్నమగు మనస్సుతో స్వయముగా ప్రత్యక్షమై అలకాపతియగు కుబేరుని చూచెను (9).

ఆతడు మనస్సును లింగమునందు లగ్నము చేసి స్థాణువు వలె నిశ్చలుడై యుండెను. అపుడు ఆయన 'హే అలకాపతే! వరము నిచ్చెదను కోరుకొనుము' అని పలికెను (10).

తపస్సే ధనముగా గల ఆ కుబేరుడు కన్నులను తెరచి, ఉదయించే కోటి సూర్యుల కన్న అధికమగు తేజస్సు కలిగినట్టియు (11),

విషమును కంఠమునందు ధరించినట్టియు, చంద్రుని శిరస్సుపై అలంకరించుకొనియున్న పార్వతీ పతిని ఎదురుగా చూచెను. ఆ తేజస్సును కన్నులతో చూడజాలక, ఆతడు వెంటనే కన్నులను మూసుకొనెను (12).

మనోగోచరము కాని ఆ దేవదేవునితో ఆతడిట్లనెను. నాథా! నీ పాదములను చూడగలిగే శక్తిని నా కన్నులకు ఇమ్ము (13).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ మదగ్ని మహాపురాణము - 70


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 70 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 29
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సర్వతో భద్ర మండల విధి - 3 🌻

ఇన్దీవరదలాకారానథవా మాతులుఙ్గవత్‌ | పద్మపత్రాయతాన్వాపి లిఖేదిచ్ఛానురూపతః. 24
భ్రామయిత్వా బహిర్నే మావరసన్ధ్యరే స్థితః | భ్రామయేదరమూలం తు సన్ధిమధ్యే వ్యవస్థితః. 25
అరమధ్యే స్థితో మధ్యమరణిం భ్రామయేత్సమమ్‌ | ఏవం సన్ధ్యన్తరాః సమ్యఙ్మాతులుఙ్గనిభాః సమాః. 26

క్షేత్రమును మూడు భాగములుగ విభజించి, మరల లోపలినుండి ఒక్కొక్కదానిని రెండేసి భాగములు చేయవలెను. లోపల నున్న ఐదు కోష్ఠములను తుడిచివేసి వాటిపై ఆకులు నిర్మింపవలెను. ఈ ఆకులు ఇందీవరదళాకారములో గాని, మాతులింగ ఫలాకారములో గాని, కమలదళాకారమలో గాని ఉండవచ్చును.

లేదా వాటి ఆకారమును తమ ఇచ్ఛ ప్రకారము చేయవచ్చును. ఆకుల సంధుల మధ్యదారముంచి, దానిని వెలుపల నున్న నేమి (చక్రాంతము) వరకు లాగి, నాలుగు వైపుల త్రిప్పవలెను.

ఆకుయొక్క సంధియందు దారమునుంచి దాని మూలభాగమును త్రిప్పవలెను. ఆకు మధ్యస్థానము నందు దారము ఉంచి ఆ మధ్యభాగము నలువైపులకును సమముగా దారము త్రిప్పవలెను. ఈ విధముగా త్రిప్పగా మాతులుంగాకారము గల ఆకు లేర్పడును.

విభజ్య సప్తధా క్షేత్రం చతుర్దశకరం సమమ్‌ | ద్విధా కృతే శతం హ్యత్ర షణ్ణవత్యధికాని తు. 27
కోష్ఠకాని చతుర్భిసై#్తర్మధ్యే భద్రం సమాలిఖేత్‌ | పరితో విసృజేద్వీథ్యై తథా దిక్షు సమాలిఖేత్‌. 28
కమలాని పునర్వీథ్యై పరితః పరిమృజ్య తు | ద్వే ద్వే మధ్యమకోష్ఠే తు గ్రీవార్థం దిక్షు లోపయేత్‌. 29
చత్వారి బాహ్యతః పశ్చాత్త్రీణి త్రీణి తు తోపయత్‌ | గ్రీవా పార్శ్వే బహిస్త్వే కా శోభా సా పరికీర్తితా. 30
విసృజ్య బాహ్యకోణషు సప్తాన్తస్త్రీణి మార్జయేత్‌ | మణ్డలం నవభాగం స్యాన్న వవ్యూహం హరిం యజేత్‌. 31
పఞ్చవింశతికవ్యూహం మణ్డలం విశ్వరూపకమ్‌ | ద్వాత్రింశద్ధస్తకం క్షేత్రం భక్తం ద్వాత్రింవతాసమమ్‌. 32
ఏవం కృతే చతుర్వింశత్యధికం తు సహస్రకమ్‌ | కోష్ఠకానాం సముద్దిష్టం మధ్యే షోడశకోష్ఠకైః. 33
భద్రకం పరిలిఖ్యాథ పార్శ్వే పఙ్త్కిం విమృజ్య తు | తతః షోడవభిః కోష్ఠైర్దిక్షు భద్రాష్టకం లిఖేత్‌. 34

పదునాలుగు హస్తముల క్షేత్రమును ఏడు భాగములుగ విభజించి, మరల రెండేసి భాగములుగ విభజింపవలెను.

లేదా - తూర్పునుండి పశ్చిమము వరకును, ఉత్తరమునుండి దక్షిణము వరకును పదునైదేసి సమానరేఖలు గీయవలెను. ఇట్లు చేయుటచే నూటతొంబదియారు కోష్ఠము లేర్పడును. వీటిలో మధ్య నున్న నాలుగు కోష్ఠములచే భద్రమండలము ఏర్పరుపవలెను. దాని నాలుగు వైపుల వీథికొరకై స్థానము విడువవలెను.

మరల అన్ని దిక్కులందును కమలములు గీయవలెను. ఆ కమలములు నాల్గు వైపులందును వీథికొరకై ఒక్కొక్క కోష్ఠమును తుడిచివేయవలెను. పిమ్మట, మధ్య నున్న రెండేసి కోష్ఠములను కంఠభాగముకొరకై తుడిచివేయవలెను.

పిమ్మట వెలుపల నున్న నాలుగేసికోష్టమలలో మూడు మూడు కోష్ఠములను తుడిచివేయవలెను. వెలుపల నున్న ఒక్కొక్క కోష్ఠమును కంఠస్థానపార్శ్వమునందు మిగల్చవలెను. దానికి ద్వారశోభ యనిపేరు.

వెలుపల నున్న కోణములలో ఏడింటిని మినహాయించి లోపల నున్న మూడేసి కోష్ఠములను తుడిచివేయవలెను. దానికి 'నవనాలము' లేదా ''నవనాభమండలము'' అని పేరు.

దాని తొమ్మిది నాభులయందు, నవవ్యూహరూపుడైన శ్రీహరిని పూజింపవలెను. ఇరువదియైదు వ్యూహముల మండలము విశ్వవ్యాపి యైనది. ముప్పదిరెండు హస్తముల క్షేత్రమును, ముప్పదిరెండుచేతనే సమముగా విభజింపవలెను.

అనగా పైనుంచి క్రిందికి ముప్పదిమూడు రేఖలు గీసి, అడ్డముగా కూడ ముప్పదిమూడు రేఖలు గీయవలెను. ఈ విధముగ ఒక వెయ్యి ఇరువదినాలుగు కోష్ఠములు ఏర్పడును. వాటిలో మధ్య నున్న పదునారు కోష్ఠకములతో ''భద్రమండలము''ను నిర్మింపవలెను.

మరల నాలుగు ప్రక్కల నున్న ఒక్కొక్క పంక్తిని విడువలెను. పిమ్మట ఎనిమిది దిక్కులందును పదునారు కోష్ఠకములచే ఎనిమిది భద్రమండలములు ఏర్పరుపవలెను. దీనికి ''భద్రాష్టకము'' అని పేరు.

తతో7పి పఙ్త్కిం సంమృజ్య తద్వత్‌ షోడశభద్రకమ్‌ |

లిఖిత్వా పరితః పఙ్త్కిం విమృజ్యాథ ప్రకల్పయేత్‌. 35
ద్వారద్వాదశకం దిక్షు త్రీణి త్రీణి యథాక్రమాత్‌ | షడ్భిశ్చ పరిలుప్యాన్తర్మధ్యే చత్వారి పార్శ్వయోః. 36

దాని తరువాత నున్న ఒక పంక్తి చెరిపి వేసి మరల వెనుకటి వలె పదునారు భద్రమండలములు వ్రాయవలెను. పిమ్మట అన్ని ప్రక్కలను ఉన్న ఒక్కొక్క పంక్తి చెరిపివేసి ఒక్కొక్క దిక్కున మూడేసి చొప్పున పండ్రెండు ద్వారములు నిర్మింపవలెను. వెలుపల నున్న ఆరు కోష్ఠములు తుడిచివేసి మధ్యభాగముయొక్క పార్శ్వభాగములందలి నాలిగింటిని తుడిచివేయవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 86


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 86 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరాశర మహర్షి - 5 🌻

20. ఒకసారి జనకమహారాజు (అదే వంశంలో మరొక జనకుడు) పరాసరమహర్షి దగ్గరికి వెళ్ళి, “ధర్మాన్ని తెలుస్కుందామని నీ దగ్గరికి వచ్చాను, నాకు ధర్మాన్ని గురించి చెప్పు” అని అడిగాడు. అందుకు ఆయన రాజుతో, “ఫలం కావాలంటే వృక్షం కావాలి. వృక్షం కావాలంటే బీజం కావాలి కదా! అలాగే సౌఖ్యం కోరేవాడు ధర్మాన్ని ఆశ్రయిస్తాడు. ఎప్పుడో భవిష్యత్తులో సుఖం కావాలంటే ఇప్పుడు ధర్మాచరణచేయడమే కర్తవ్యం.

21. “సత్కృత్యమైనా, దుష్కృత్యమైనా ఆ పాపపుణ్యములు ఫలాన్ని ఇవ్వకుండా మనుష్యులను వదిలిపెట్టవు. కాబట్టి మనస్సు, వాక్కు, దృష్టి వీటన్నిటిటొటీ సత్యం, శమము మొదలైన వాటితో కూడిన సత్పథాన్ని ఆశ్రయించాలి. సమదర్శియై, న్యాయధర్మములలో ఉండేవాడికి దేవతలు నమస్కరిస్తారు.

22. మనుష్యుడు బంధ విముక్తుడు కావాలి. వేదాధ్యనం చేయటంచేత ఋషిఋణం తీర్చుకుంటాడు. యజ్ఞయాగాదుల చేత దేవతల ఋణం తీర్చుకుంటాడు. అతిథి పూజచేసి ఆతిథ్యం ఇచ్చి, అతిథిఋణం తీర్చుకుంటాడు. దానధర్మములుచేసి ప్రజలఋణం తీర్చుకుంటాడు. ఈ ప్రకారంగా మనిషి అన్ని ఋణాలూ తీర్చుకును పవిత్రుడవుతాడు. ధర్మమార్గం ఇంతే! ఈ జీవితం అనిత్యమని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి సుమా! సుఖ దుఃఖాలు కలిగినప్పుడుకూడా ధర్మవిషయం మరచిపోకుండా ఉండటం శ్రేయస్సుకు మార్గం” అని చెప్పాడు.

23. “తపోధిక్యత అంటారుకదా! తపస్సు అనేది ఎలాగ ఉంటుంది? దానికి ఉత్కృష్టత ఎలా ఏర్పడింది?” అని జనకుడు అడిగాడు. “మహారాజా! విద్యాధరులున్నారు. ఋషులున్నారు. దేవతా గనములున్నవి. వాళ్ళందరూ అట్టిస్థితికి ఎలాగ వెళ్ళరనుకుంటున్నావు? తపస్సు చేతనే! తపస్సు ఆ ఉత్తమలొఖాలకు మార్గం. బ్రహ్మదేవుడికి ఈ సృష్టించే శక్తి తపస్సువల్లనే వచ్చింది.

24. ఐహికాముష్మికమయిన ఏ కోరికైనాకూడా తీర్చుకోవాలంటే తపస్సే కారణం. ఇంకొక మార్గమే లేదు. దారాపుత్రులు, సంసారము, ధనము, దుఃఖము – వీటిలో పడ్డవాడిక్కూడా, ఈ సంఘాన్ని తప్పించుకునేందుకు, చిత్తము పరిశుద్ధతపొంది శాంతి కావాలంటే కూడా దానికి తపస్సే మార్గం.

25. తపస్సు లేని వాడిని లోభమోహాలు వశపరుచుకుంటాయి. తపస్సులో ఉన్నవాళ్ళను లోభము, మోహము, కామము ఏమీ చెయ్యవు. ధర్మార్థకామమోక్షాలన్నిటికీ ప్రారంభమ్నుంచీ చివరిదాకా ఉండే మార్గం, గమ్యస్థానం, ఉపాయం అంతాకూడా తపస్సే.

26. పరమపుణ్యపురుషులు, యోగులు, మహర్షులు మొదలైనవాళ్ళు అంతవారుకావటానికి కారణం తపస్సే అని తెలుసుకో!తపస్సు యొక్క ఫలం తెలుసుకోవాలంటే వాళ్ళచరిత్రలు తెలుసుకుంటే చాలు. “వాళ్ళకు కోరికలు లేవు, దుఃఖం లేదు. వాళ్ళు పరమ శాంతచిత్తులు. లోకంలో మానసికమయిన ఎట్టివికారములూ లేవు. సృష్టిలోనూ, దేనియందూ సంగబుద్ధి వారికిలేదు.

27. వారి దగ్గరికి వెళ్ళగానే ఇతరులకు కూడా శాంతి, అనుగ్రహము ప్రసాదించగలిగిన శక్తి వారికి తపస్సు వల్లనే వచ్చింది. వాళ్ళను చూస్తే తపస్సు యొక్క శక్తి తెలుస్తుంది” అని బోధించాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

𝒯𝓌𝓮𝓁𝓋𝓮 𝒮𝓉𝒶𝓃𝓏𝒶𝓈 𝒻𝓇𝓸𝓂 𝓉𝒽𝓮 𝓑𝓸𝓸𝓀 𝓸𝒻 𝒟𝓏𝓎𝒶𝓃 - 17


🌹 𝒯𝓌𝓮𝓁𝓋𝓮 𝒮𝓉𝒶𝓃𝓏𝒶𝓈 𝒻𝓇𝓸𝓂 𝓉𝒽𝓮 𝓑𝓸𝓸𝓀 𝓸𝒻 𝒟𝓏𝓎𝒶𝓃 - 17 🌹
🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴

STANZA IV


🌻 The Gift of Mind - 5 🌻

32. The time had come. People began to talk about the Periods. They started to rise above the concept of Time and break away from the ground. Man understood that he was the nexus of the decaying temporal and the undecaying eternal.

He was the possessor of two opposite poles, on one of which was the epicentre of death, and the other one — the centre of Immortality. He was, at one and the same time, the son of ashes and the Son of God.

It was indeed a challenge to understand himself, since he had been woven entirely of contradictions, which had taken up a firm position inside him, unwilling to change their own polarity.

He was being torn apart: on the one hand, the mortal was luring him with all its might, while on the other, the immortal was attracting and charming him with the marvellous Fires of Spirit. Man kept swinging from one extreme to another.

Decaying, earthly treasures held no importance for the Light, but decay could not recognize the Divine Gifts of Eternity. A fierce internal struggle was underway: man was in conflict with himself.
🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 35


🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 35 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం - 5 🌻

నంద్యాలలో విశ్వబ్రాహ్మణులలో సంపన్నులను 'పాంచాననం 'అని పిలిచేవారు. వీరు చాలా అహంకారంతో ప్రవర్తించేవారు. సహాయం కోరి వచ్చిన వారితోనూ, ఇతరులతోనూ, వయసులో పెద్దవారు అని కూడా చూడకుండా తలబిరుసుతనంతో కించపరుస్తూ మాట్లాడేవారు.

ఒకసారి బ్రహ్మంగారు ఆ ఊరికి వచ్చారు. ఆ ఊరిలోని కొందరు భక్తులు స్వామి వారికి భోజనాది వసతులు కల్పించారు. కానీ,పాంచాననం వారు మాత్రం తమకేమీ పట్టనట్టు వున్నారు.

ఇదంతా గమనించిన బ్రహ్మేంద్రస్వామి తానే వారి వద్దకు వెళ్లి "నాయనలారా నా తప్పేముంది? అతి పేదలమైన మేము క్షుద్భాదని ఓర్వలేక మా ఆకలి తీర్చగలరని మీ వద్దకు వచ్చాము. మాకు భోజన సదుపాయములు కల్పించి మా ఆకలి తీర్చగలవారు మీరొక్కరే అని భావిస్తున్నాను. అందువల్ల మీ దగ్గరికి వచ్చాం" అని పలికారు.

వారిలో ఒక వృద్ధుడు 'తినేందుకు ఎంత అన్నం అవసరం అవుతుందో చెప్పమని 'పరిహాస పూర్వకంగా అన్నాడు.

“మాకు ఎంత అవసరం అవుతుంది నాయనా?! ఏదో మా కడుపు నిండితే చాలు" అని బ్రహ్మంగారు జవాబిచ్చారు.

బ్రహ్మంగారిని ఏదో విధంగా అవమానపరచాలని అనుకున్నవారిలో ఒక వ్యక్తి "అబ్బే... మీరు మరీ అంత తక్కువ తింటే మాకు సంతృప్తి వుండదు స్వామిగారూ! మీరు మా అతిథి. మేం మీ కోసం పుట్టి బియ్యం వండి నైవేద్యం అందిస్తాం. మీరు ఏమీ మిగలకుండా తింటేనే మాకు ఆనందం కలుగుతుంది'' అని ఎగతాళిగా అన్నాడు.

“మీరు అంత అడిగినప్పుడు నేను కాదు అని ఎలా అనగలను నాయనా! అలాగే చేయండి ” అన్నారు బ్రహ్మంగారు.

ఆ విశ్వబ్రాహ్మణులు పుట్టి బియ్యం వండించారు. దానిని ఆరగించమని స్వామి వారిని, శిష్యులను భోజనానికి పిలిచారు.

వీరికి తగిన జవాబివ్వాల్సిందేనని నిశ్చయించుకున్న స్వామివారు తన శిష్యుడయిన సిద్ధయ్యను పిలిచి "ఈ అన్నం మొత్తం నువ్వొక్కడివే స్వీకరించి, మనకు అన్నం దానమిచ్చిన వారిని సంతుష్టులను చేయి" అని ఆజ్ఞాపించారు. తర్వాత ఆ అన్నపు రాశి నుంచి ఒక ముద్దను తీసుకుని పక్కకు నిలబడ్డాడు. గురుదేవుని ఆజ్ఞ ప్రకారం ఆ పుట్టి అన్నాన్ని కూడా వేగంగా ఆరగించేశాడు.

వెంటనే జీర్ణం చేసుకుని, తనకు మరింత అన్నం కావాలని సంజ్ఞ చేశాడు. దీన్ని చూసి నిర్ఘాంతపోయిన ఆ విశ్వబ్రాహ్మణులు బ్రహ్మంగారు కావాలని ఈ విధంగా చేశారని గ్రహించారు. వారి శక్తిని గ్రహించి, తమ అహంకారాన్ని, అజ్ఞానాన్నిక్షమించమని కోరారు.

బ్రహ్మంగారు చిరునవ్వు నవ్వి, తన చేతిలో వున్నఅన్నపు ముద్దను సిద్ధయ్యకు తినిపించాడు. అప్పటికి గానీ అతనికి కడుపు నిండలేదు. తర్వాత ఆ విశ్వ బ్రాహ్మణులు స్వామికి పూజలు చేసి, తమకు తత్వోపదేశం చేయమని అభ్యర్థించారు. బ్రహ్మంగారు వారందరికీ జ్ఞానోపదేశం చేశారు.

తర్వాత స్వామివారు అక్కడి నుంచి బయల్దేరి అహోబిలం చేరి అక్కడ వున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అక్కడ నుంచీ మళ్ళీ బయలుదేరి కడపకు చేరారు. కడప నవాబుకు తమ రాక గురించి తెలిపారు.

వెంటనే నవాబు తన పరివారంతో సహా బ్రహ్మంగారి దగ్గరకు వెళ్లి , ఆయనకు సకల గౌరవ సత్కారాలు చేసి, తమతో పాటు తోడ్కొని వెళ్లాడు.

బ్రహ్మంగారి మహిమలు గురించి విన్ననవాబు, ఏదో విధంగా స్వామి వారి మహిమలను చూడాలని నిర్ణయించుకుని, స్వామి దగ్గరకు వచ్చి, మరుసటి రోజు కచేరీ ముందు వున్న మైదానంలో జరిగే సభకు రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చిరునవ్వుతో "నీ మనస్సులో వున్న కోరిక తెలిసింది.నువ్వు అనుకున్నదానిని నేను చేసి చూపించగలను'' అని చెప్పి పంపించారు.

తన మనస్సులో బ్రహ్మంగారి మహిమను పరీక్షించాలి అనుకున్నట్టు ఈయన ఎలా కనిపెట్టారో అర్థంకాక నవాబు విస్మయంలో మునిగిపోయాడు. తాను ఏర్పాటు చేస్తున్న సభ గురించి అందరికీ తెలిసేలా చాటింపు వేయించాడు నవాబు.

మరుసటి రోజు సాయంత్రం ప్రజలందరూ సభా స్థలం వద్దకు చేరుకున్నారు. వీర బ్రహ్మేంద్రస్వామి తన శిష్యులతో సభకు వచ్చి ఆశీనులయ్యారు. నవాబు లేచి నిలబడి "స్వామీ! నా వద్ద ఒక చూడి గుర్రం వుంది. అది ఆడ గుర్రాన్ని కంటుందో లేక మగ గుర్రాన్ని కంటుందో తెలియజేయండి" అని కోరాడు.

స్వామి చిరునవ్వుతో ఆ గుర్రాన్ని సభకు తీసుకురమ్మని కోరగా , నవాబు స్వామివారి ఎదుటకు గుర్రాన్ని తెప్పించాడు. స్వామి ఆ గుర్రాన్ని చూసి "దీని గర్భంలో నాలుగు తెలుపురంగు కాళ్ళు, నొసట చుక్క, పువ్వుల తోక కలిగిన మగ గుర్రం ఉంది. అలాంటి వింత గుర్రమే జన్మిస్తుంది" అని చెప్పారు.

ఆ మాట విన్న తర్వాత కూడా నవాబుకి వున్న సందేహం దూరం కాలేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

అద్భుత సృష్టి - 7


🌹. అద్భుత సృష్టి - 7 🌹
✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟 2. భూమి - మానవ సృష్టి - 2 🌟

🌟. ఈ భూమిని సమాచార ప్రసరణ కేంద్రంగా మలచిన వారు "కాంతి శరీరధారులు"! 'కాంతి' అంటే 'చైతన్యం'. కాంతే సమాచారం. ఈ సమాచారాన్ని విభిన్న ప్రకంపనల రూపంలో.. DNA లోని జన్యువులలో పదిలపరచి ఈ భూమిని ప్రయోగశాలగా మార్చారు.

ఇక్కడ కొన్ని కోట్ల సంవత్సరాలు (అనేక యుగాలు) ఎన్నో జన్యుపరిజ్ఞాన పరిశోధనలు జరిగాయి. మన పుస్తకాలలో చదువుకున్న చరిత్రకు పూర్వమే భూమి ఎంతో గొప్ప నాగరికతను సంతరించుకుంది. ఇప్పుడు modern science చేస్తున్న కొత్త కొత్త ప్రయోగాలు అన్నీ ఈ భూమిపై ఎప్పుడో జరిగిపోయాయి!

💫. ఇంతటి జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకున్న ఈ భూమి అనే సజీవ గ్రంథాలయాన్ని సొంతం చేసుకోవడానికి ఎన్నో విశ్వాలవాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి యుద్ధాలు కూడా చేసుకున్నారు.

💫. ఇప్పటి కాలమానం ప్రకారం మూడు లక్షల సంవత్సరాలకు పూర్వం ఈ భూమి దురాక్రమణకు గురి అయింది. ఈ ఆక్రమణదారులకు భూమి, భూలోకవాసులు విజ్ఞానులుగా, స్వతంత్రులుగా ఉండటం ఇష్టం లేదు.

భూమిపై ఉన్న మనుషులను అజ్ఞానులుగా తయారు చేసి ఈ భూమిని ఆక్రమించి వారి ఆధీనంలోకి తెచ్చుకున్నట్లైయితే... ఇలాంటి ఎన్నో విశ్వాలతో ఉన్న భూములు తమ ఆధీనంలోకి వస్తాయనీ.. తద్వారా మూలం పై (భగవంతునిపై) తిరుగుబాటు చేయవచ్చు అన్న ఆలోచనతో వారు భూమిని దురాక్రమించడం జరిగింది.

💫. భూమిని ఆక్రమించిన వెంటనే వాళ్ళు మొదట భూమిపైకి వస్తున్న ఇతర విశ్వాల సమాచార వ్యవస్థను ధ్వంసం చేశారు. దీని ద్వారా మానవునికి అందుతోన్న జ్ఞానం అందకుండాపోయి ..

కాంతి ద్వారాలు అన్నీ మూసివేయబడ్డాయి. 'కాంతి' అంటే 'జ్ఞానం'. ఈ జ్ఞాన ప్రసరణ భూమిపైకి మరి ఏ ఇతర దారుల గుండా రాకుండా భూమి యొక్క కాంతి గ్రిడ్ లను ఛేదించి.. చీకటి శక్తుల యొక్క పటిష్టమైన గ్రిడ్ లను తయారు చేశారు. వీటి వల్ల కాంతి భూమిపైకి రాకుండా కొన్ని వేల సంవత్సరాలపాటు చీకటిలో ఉండిపోయింది.

'చీకటి' అంటే 'అజ్ఞానం'. ఇలా వాళ్ళు భూమినీ మరి భూమిపై ఉన్న మనుషులనూ పూర్తి అజ్ఞానులుగా, ద్వంద్వత్వపు గేమ్ లోని పావులుగా తయారు చేశారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹



కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 29


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 29 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 18 🌻

అప్పుడేమౌతాడు వాడు? అదే మోహంలో మరింతగా కూరుకుపోతాడు. పైగా ఈసారి ఏమనుకుంటాడు. మా గురువుగారే చెప్పారు కదా అనుకుంటాడు. మా గురువుగారే చెప్పగా ఇంకేముంది సమస్య. ఏమండీ మా అబ్బాయిని విదేశాలకి పంపించమంటారా అని నన్ను అడిగారనుకోండి. నేను ఏమి చెప్పగలుగుతాను. మా అమ్మాయికి ఈ పెళ్ళి చెయ్యమంటారా, ఈ సంబంధం కుదర్చమంటారా అని నన్నడిగారు అడిగారనుకోండి. నేనేం చెప్పగలుగుతాను. ఏమండీ ఈ ఇల్లు కొనమటారా అని నన్ను అడిగారనుకోండి. నేనేం చెప్పగలుగుతాను.

కాబట్టి ఈ రకమైనటువంటి జగద్వ్యాపార లక్షణాలలో నీవు గనక గురువును ఉపయోగించుకోవడం ప్రారంభించావనుకో అప్పుడు ఆత్మోన్నతికి గురువును ఉపయోగించుకునేటటువంటి అవకాశాన్ని కోల్పోతావు.

ఎందువల్ల అంటే ఆ గురువు అప్పుడు నీకు ఎట్లా కనబడతాడు అంటే నీ కోర్కెలు, నీ సందేహాలు, నీ సంసారగత సంబంధ విషయములను తీర్చేటటువంటి సాధారణమైనటువంటి విద్వాంసుడు, పండితుడు, శాస్త్రజ్ఞుడు కామ్యకకర్మలయందు, ధర్మములయందు, శాస్త్రములయందు విశేషమైన పాండిత్యం కలిగి సలహాలిచ్చేటటువంటి సలహాదారుగా ఉపయోగపడతాడే తప్ప నీ అత్మోన్నతికి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, నువ్వు మోక్షాన్ని పొండానికి, నీవు విద్యావంతుడవు అవడానికి, నువ్వు శ్రేయోమార్గమున నడవడానికి సరియైనటువంటి సద్గురుమూర్తిగా నీకతను ఉపయోగపడలేడు.

కాబట్టి గురువుని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నామనేటటువంటి అధికారిత్వం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివాడిని ఆశ్రయించిన పద్ధతిగా వుండేది అవిద్యా పద్ధతి.

మోహపద్ధతి. ప్రేయోమార్గ పద్ధతి. ఇద్దరూ గ్రుడ్డివాళ్ళైతే పొందే ఫలం కూడా అంధకారమే. కాబట్టి పరలోక ప్రాప్తి సాధనమైనటువంటి ఆముష్మిక సాధనలైనటువంటి ఆధ్యాత్మికమార్గమైనటువంటి ఆత్మయే సర్వాధికమైనటువంటిది అనేటటువంటి మార్గంలో ప్రవేశించాలి అంటే మానవులందరూ తప్పక తపోనిష్ఠ కలిగివుండాలి.

తప్పక ఇంద్రియములను ఇంద్రియార్ధములందు, అవి కోరినటువంటి వాటియందు ప్రవేశింపనివ్వక, నిరోధించి నీ లక్ష్యమైనటువంటి ఆత్మవిచారణా జ్ఞానమున ప్రవేశింపజేసి, మనోబుద్ధులను ఆత్మయందు సంయమింపచేయాలి. మనోబుద్ధులను చైతన్యస్థితి యందు సంయమింపచేయాలి.

ఇంద్రియములను మనోబుద్ధులయందు, మనోబుద్ధులను చైతన్యమునందు, చైతన్యమును తనమూలమైనటువంటి పరమాత్మయందు ఎవరైతే ఉపశమింపచేస్తారో, ఉపరమింపచేస్తారో, విశ్రమింపచేస్తారో, సంయమింపచేస్తారో వారే ఆధ్యాత్మిక సాధనలో పురోగమించగలిగేటటు వంటివారు. అటువంటి ఆత్మవిద్యని గ్రహించవలసినటువంటి అవసరం వున్నది.

ఈ ఆత్మవిద్యకి అత్యంత ముఖ్యమైనటువంటి అధికారిత్వంలో వున్న లక్షణాలు చెప్తున్నారు. అహింస, సత్యం, శౌచం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం మొదలగువానిని యమనియమాదుల యొక్క లక్షణాలన్నిటినీ ఇక్కడ వివరిస్తున్నారు. ఈ అహింస, సత్యం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం ఈ లక్షణాలని తప్పక మానవులందరూ కూడా ఆచరించాలి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

గీతోపనిషత్తు - సాంఖ్య యోగము : 6. దివ్యజ్ఞానము - సూక్ష్మ లోకముల జ్ఞాన అవగాహన కలిగిన జీవుడు శాశ్వతుడే. సూక్ష్మస్థితుల అవగాహనము, దర్శనమే దివ్య జ్ఞానము


🌹 6. దివ్యజ్ఞానము - సూక్ష్మ లోకముల జ్ఞాన అవగాహన కలిగిన జీవుడు శాశ్వతుడే. సూక్ష్మస్థితుల అవగాహనము, దర్శనమే దివ్య జ్ఞానము. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 6 📚

ఈ సృష్టియందు ఏ వస్తువుగాని ఒకప్పుడు లేకుండ ఇప్పుడు వుండుట సంభవింపదు. అట్లే ఇప్పుడుండి ఇకముందు ఉండకపోవుట కూడ సంభవింపదు.

ఎప్పుడునూ అన్నియును వుండి యున్నవే కాని ఒకప్పుడు లేనివి కావు. ఒకే వస్తువు స్థితి మార్పులు చెందుచున్నప్పుడు ఆ వస్తువునకు అంతకు ముందు స్థితి లేకుండుట. క్రొత్త స్థితి ఏర్పడుట, అదియును మరల మారుట ఒక రసాయనికచర్యగ జరుగుచుండును. ఈ స్థితి మార్పు నిత్యము జరుగు చుండుటచే వుండుట, లేకుండుటగ వస్తువులు గాని, జీవులు గాని కనిపించు చుందురు.

న త్వేవాహం జాతు నాసం న త్వం నేమో జనాధిపాః |
నచైవ న భవిష్యామ స్వర్వే వయ మతó పరమ్‌ || 12

దేహినో-స్మిన్‌ యథా దేహే కౌమారం యøవనం జరా |
తథా దేహాంతరప్రాప్తిó ధీర స్తత్రన ముహ్యతి || 13

బాలకుడు యువకుడైనపుడు ఇట్టి మార్పే జరుగుచున్నది. బాలకుడు లేకుండుట యువకు డుండుటగ ఒకే జీవుడు ప్రస్తుతింపబడి యున్నాడు. అటులనే యువకుడు మధ్య వయస్కుడు, వృద్ధు అగుట, మరణించుట కూడ గమనించు చున్నాము. మరణించినవాడే మరల పుట్టుచున్నాడని తెలియుటకు సూక్ష్మలోకముల అవగాహనము, దర్శనము కలిగి యుండవలెను.

అది తెలిసినవాడు జీవుడు శాశ్వతుడనియు, సూక్ష్మ స్థూల స్థితులు పొందుచుండుననియు తెలియగలడు. కేవలము స్థూల స్థితులు మాత్రమే తెలిసిన వారికి పూర్ణజ్ఞానము లేక తికమక పడుచుందురు. సూక్ష్మ స్థితులు కూడ తెలిసినవాడే, తెలిసినవాడు.

సూక్ష్మస్థితి యందుండుట కూడ తెలిసినవాడు కావున శ్రీకృష్ణుడు స్థూలమున మరణించిన వాడిని సైతము సూక్ష్మ లోకములలో గుర్తించి కొనితెచ్చి తల్లికి, గురువునకు, బ్రాహ్మణునకు, జ్ఞానము నందించినాడు. సూక్ష్మస్థితుల అవగాహనము, దర్శనమే దివ్య జ్ఞానము. యోగము ఆ స్థితుల నందుటకు మార్గము. అట్టి యోగమునకు అధిషాసన దైవము శ్రీకృష్ణుడే. అందుచే అర్జునునకు స్థూల, సూక్ష్మ స్థితులను, జీవులకు జరుగు స్థితి మార్పులను బోధించి యోగమున ప్రవేశపెట్టెను.

శ్రీ లలితా సహస్ర నామములు - 65 / ᔕᖇI ᒪᗩᒪITᗩ ᔕᗩᕼᗩᔕᖇᗩᑎᗩᗰᗩᐯᗩᒪI - ᗰEᗩᑎIᑎG - 65



🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 65 / ᔕᖇI ᒪᗩᒪITᗩ ᔕᗩᕼᗩᔕᖇᗩᑎᗩᗰᗩᐯᗩᒪI - ᗰEᗩᑎIᑎG - 65 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

శ్లోకం 123

611. కళాత్మికా -
కళల యొక్క రూపమైనది.

612. కళానాథా -
కళలకు అధినాథురాలు.

613. కావ్యాలాపవినోదినీ -
కావ్యముల ఆలాపములో వినోదించునది.

614. సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా -
వింజామరలను కలిగియున్న ఎడమవైపున, కుడివైపున (వరుసగా) లక్ష్మీదేవి చేత, సరస్వతీదేవి చేత సేవింపబడునది.

శ్లోకం 124

615. ఆదిశక్తిః -
ప్రథమముగా నున్న శక్తి స్వరూపిణి.

616. అమేయా -
కొలుచుటకు, గణించుటకు గాని, నిర్వహించుటకు గాని అలవికానిది.

617. ఆత్మా -
ఆత్మ స్వరూపిణి.

618. పరమా -
సర్వీత్కృష్టమైనది.

619. పావనాకృతిః -
పవిత్రమైన స్వరూపము గలది.

620. అనేకకోటి బ్రహ్మాండజననీ -
అనంతమైన సమూహములుగా నుండు బ్రహ్మాండములకు తల్లి.

621. దివ్యవిగ్రహా -
వెలుగుచుండు రూపము గలది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. ᔕᖇI ᒪᗩᒪITᗩ ᔕᗩᕼᗩᔕᖇᗩᑎᗩᗰᗩᐯᗩᒪI - ᗰEᗩᑎIᑎG - 65 🌹
📚. Prasad Bharadwaj

🌻 Sahasra Namavali - 65 🌻

611) Kalathmika -
She who is the soul of arts

612) Kala nadha -
She who is the chief of arts

613) Kavya labha vimodhini -
She who enjoys being described in epics

614) Sachamara rama vani savya dhakshina sevitha -
She who is being fanned by Lakshmi the goddess of wealth and Saraswathi the goddess of knowledge

615) Adishakthi -
She who is the primeval force

616) Ameya -
She who cannot be measured

617) Atma -
She who is the soul

618) Parama -
She who is better than all others

619) Pavana krithi -
She who is personification of purity

620) Aneka koti Bramanda janani -
She who is the mother of several billions of universes

621) Divya Vigraha -
She who is beautifully made

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

నారద భక్తి సూత్రాలు - 68


🌹. నారద భక్తి సూత్రాలు - 68 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. చలాచలభోధ
తృతీయాధ్యాయము - సూత్రము - 39

🌻. 39. మహత్పంగస్తు దుర్లభోః_ గమ్యో_ అమోఘశ్చ ॥ 🌻

మహాత్ముల సాంగత్యం దొరకడమనెది దుర్లభం, అగమ్యం, అమోఘం కూడా. మహాత్ములను సాధారణ మానవులుగా భావించడం జరుగుతుంది. వారు దొరకడమే కష్టం. దొరికినా గుర్తించలేరు. ఎందుకంటే వారు నిరాడంబరంగా ఉంటారు. బాలురవలె క్రీడిస్తారు. పిచ్చివారివలె ప్రవర్తిస్తారు. పిశాచివలె సంచరిస్తారు. భక్తుల పుణ్య విశేషం చెతగాని దొరకరు,గుర్తించబడరు. కాని వారు కోరకనె అనుగ్రహిస్తారు, ఉపదేశిస్తారు. అయితే భక్తుడు దానికి అర్హుదై సంసిద్ధుడై ఉండాలి. వారి చేష్టలు అగమ్య గోచరంగా ఉంటాయి. వారు అనుగ్రహించి విధానం అమోఘం.

మహాత్ములకు న్వార్ధపూరిత మనసు ఉండదు. దైవ ప్రేరణతో పని చెసే మనసుంటుంది. ఆ దివ్యమైన మనసు అదృష్టవంతులైన భక్తులను అనుగ్రహించడం వంటి పవిత్ర కార్యాలకు వినియోగించబడుతుంది. మహాత్ముడు భగవంతుని నుండి ప్రసరించె అనుగ్రహాన్ని అర్హత కలిగిన భక్తులపైకి ప్రతిఫలింపచెస్తూ ఉంటాడు.

ఉదాహరణకు ఒక ఉపగ్రహం (శాటిలైట్‌ గా పనిచెస్తూ ఉంటాడు. కొందరు మహాత్ములు భక్తులకు పరీక్షలు పెట్టి తద్వారా పురోగమింపచేస్తారు. భక్తులను పరాభక్తికి సంసిద్దులను చేసారు. కాని వారి అనుగ్రహం భక్తులయెడ పక్షపాతంతో కూడి ఉండదు. భక్తులలో గౌణభక్తి స్థానంలో మఖ్యభక్తి కలిగే స్థాయిని బట్టీ మహాత్ముల సహాయం అందుతూ ఉంటుంది.

వారి కృపకు వాత్రులవక పోవడమనెది భక్తులలోనె లోపముండవచ్చును గాని, మహాత్ముల అనుగ్రహం ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటుంది. సంసిద్ధమైన భక్తులను మహాత్ములు వెతుక్కుంటూ వచ్చి వారిని పరాభక్తిలో నిలుపుతారు. ఈ సంఘటన అమోఘం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

శివగీత - 34 / 𝓣𝓱𝓮 𝓢𝓲𝓿𝓪-𝓖𝓲𝓽𝓪 - 34


🌹. శివగీత - 34 / 𝓣𝓱𝓮 𝓢𝓲𝓿𝓪-𝓖𝓲𝓽𝓪 - 34 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ
పంచామాధ్యాయము

🌻. రాముని యస్త్ర ప్రాప్తి - 4 🌻

అధః తుష్టః ప్రణమ్యేశం - రామో దశరదాత్మజః,
ప్రాంజలి: ప్రణతోభూత్వా - భక్తి యుక్తో వ్యజిజ్ఞ పత్ . 25

పిమ్మట శ్రీ రాముడు సంతృప్తి చెంది శివునకు ప్రణమిల్లి చేతులు జోడించి భక్తి మీర నిట్లు నివేదించు కొనెను.

భగవాన్! న్మాను షైరేవ - నోల్లంఘ్యో లవణాంబుధి:,
తత్ర లంకాభి ధం దుర్గం - దుర్జయం దేవదానవై: 26

అనేక కోట యస్తత్త్ర - రాక్షసా బలవత్తరా;,
సర్వే స్వాద్యాయ నిరతా -శ్శివ భక్తా జితేంద్రియా: 27

అనేక మాయా సంయుక్తా - బుద్ది మంతోగ్ని హొత్రిణః,
కధ మేకాకి నాజేయా - మయా భ్రాతాచ సంయుగే 28

ఓ పరమేశ్వరా! విశాలము మరియు అగాధమైన సాగరము మానవులచేత దాటశఖ్యము కానిది పోగా లంకా నగరము ప్రవేశింప సాధ్య పడనిది.

అంతేకాదు, దేవదానవులకు కూడా సాధించ రానిది, అక్కడ మహాశాలురు, స్వాద్యాయ నిరతులు, శివ భక్తులు (వీర శైవులు ) ఇంద్రియ నిగ్రహము కలవారు మాయాసహితులు బుద్ధిమంతులు, అగ్ని హొత్రము కల (బ్రాహ్మణులు ) వారును, మరి ఎందరో సుతులు ఉన్నారు.

కేవలము నా సోదరుడగు లక్ష్మణుని తో బాటు ఏకాకిగా నున్న నేను మాత్రము రావణుని యెట్లు జయించ గలను?

రావణస్య వధే రామ ! - రక్ష సామపి మారణే ,
విచారో నత్వయా కార్య -స్తస్య కాలోయ మాగతః 29

అధర్మే తు ప్రవృత్తాస్తే - దేవ బ్రాహ్మణ పీడనే,
తస్మా దాయు: క్షయం యాతం -తేషాం శ్రీ రపి సువ్రత ! 30

శివుడాదేశించు చున్నాడు: ఓయీ రామా! రావణుని వధించుట, మరియు రాక్షసులను పరిమార్చుటలోనీవెంత మాత్రము విచార పడకుము.

రావణునికి చావు దగ్గరలో నున్నది, రాక్షసులు అధర్మ నిరతులై, దేవతలు బ్రాహ్మణులను పీడించు చున్నారు. కావున వారి యాయువు ఐశ్వర్యములు తొలగి పోవనున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 𝓣𝓱𝓮 𝓢𝓲𝓿𝓪-𝓖𝓲𝓽𝓪 - 34 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 05 :
🌻 Ramaya Varapradanam - 4
🌻

Thereafter Sri Rama became satisfied and saluted Lord Shiva time and again. Furtehr, with full devotion

Rama spoke the following words.

O Parameshwara! The vast and deep ocean is impossible to be crossed by humans. Moreover, Lanka fort is impregnable for even Gods and demons. There many saints, Shiva devotees,Jitendriya (people who have conquered their senses), wise, illusionists, Brahmanas, and many other high profiled people exist. How would it be possible for me and my younger brother Lakshmana to defeat Ravana?

Lord Shiva said: O Rama! Do not worry on that front. Ravana's time has started nearing its end.

All those demons have become unrighteous, and have tormented Gods and Brahmanas, therefore their lifespan and all opulence are destined to come to an end.
🌹 🌹 🌹 🌹 🌹

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 1̼6̼


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 1̼6̼  🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 16 🌻

53.సంస్కారములు, చైతన్యములేని ఆత్మయొక్క అనంతమైన నిశ్చల ప్రశాంత స్థితిలో, తానెవరో తెలిసికొనవలె ననెడి ఆదిప్రేరణమ ప్రతిధ్వనించునట్లు ఘోషించెను.

54.ఈ ఆదిప్రేరణము పరమాత్మలోనే అంతర్నిహితమైయుండెను.

55.అనంతసాగరుడైన పరమాత్ముడు ప్రథమ ప్రేరణమును పొందెను.

56. ఈ ప్రథమ ప్రేరణము, అనంతము యొక్క ప్రేరణయే ఇది ప్రారంభములో పరమాణు ప్రమాణములో ఉండెను.

57. అనంతములో --- శాంతము, అనంతము రెండునూ ఇమిడియె ఉన్నవి.

భగవల్లీల  (లేక) భగవద్విలాసము.

58. సర్వం(పరాత్పరస్థితి) లో అంతర్నిహితమైయున్న పరిమిత అభావము అనంతమైన సృష్టిగా అభివ్యక్తమగుటకు మూలకారణము 'సర్వకారణమత్వమే'

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 26 / S͙r͙i͙ G͙a͙j͙a͙n͙a͙n͙ M͙a͙h͙a͙r͙a͙j͙ L͙i͙f͙e͙ H͙i͙s͙t͙o͙r͙y͙ - 2͙6

Image may contain: 1 person

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 2͙6 / S͙r͙i͙ G͙a͙j͙a͙n͙a͙n͙ M͙a͙h͙a͙r͙a͙j͙ L͙i͙f͙e͙ H͙i͙s͙t͙o͙r͙y͙ - 2͙6 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 6వ అధ్యాయము - 2 🌻

బనకటలాల్ అలా అనుకుంటూ శ్రీమహారాజును కాపాడేందుకు వెళదామనుకుంటూ ఉండగా, శ్రీగజానన్ తన దివ్యశక్తితో ఈవిషయం తెలుసుకొని, ఓ ప్రాణులారా మీపట్టుమీదకు వెనక్కు వెళ్ళండి, మరియు ఇక్కడ చేరిన వాళ్ళలో ఒకే ఒక నిజమయిన భక్తుడయిన నాప్రియమయిన బనకటరాల్ ను కష్టించకండి అని ఆయన ఆ ఈగలతో అంటారు. 

నిజంగానే ఆ ఈగలు తేనెపట్టు మీదకు వెళ్ళి పోయాయి. శ్రీమహారాజు నవ్వి ఈ ఈగలతో నువ్వు నాకు మంచి విందు ఇచ్చావు. ఆవిషపుటీగలు నన్ను ఎదుర్కున్నాయి, మిగిలిన లడ్డూ భక్తులూ అందరు పరిగెత్తి పోయారు. ఇది కొద్దిగా ఆలోచించు. అకాల పరిస్థితులలో భగవంతుడు తప్ప మరి ఎవరూ నీకు సహాయ పడరని గుర్తుంచుకో. 

ఈ స్వార్ధపరులు విందుకోసం చేరారు కానీ ఆ ఈగలు దాడి చేసేసరికి అందరూ పరిగెత్తి పారి పోయారు అని బనకటలాల్తో అన్నారు. ఓమహారాజ్ ! నేను మిమ్మలను ఇక్కడకు తెచ్చినందుకు చాలా చింతిస్తున్నాను. ఈతేనెటీగల కాట్లు మీకు కలగడానికి నేనే బాధ్యుడను. నేను గొప్పపాపిని. నేను ఏమిచేస్తే మీకుఈ ఈగల కాట్లనుండి ఉపశమనం కలుగుతుందో దయచేసి చెప్పండి. 

కంసాలిని తన శ్రవణంతో ముళ్ళు తీసేందుకు నేను పిలవనా ? అని బనకటలాల్ అన్నాడు. బనకట్ కుట్టడం అనేది ఈ ఈగల ప్రకృతి అవి అదేవిధంగా చేస్తాయి, ఏమీవింత విషయం జరగలేదు. ఈ ఈగల కుట్ల అసరు నాకు ఏమీ ఉండదు అనినీకు ఆస్వాసన ఇస్తున్నాను, ఎందుకంటే వాటిలోని సచ్చిదానందుడను నేను ఎరుగుదును. ఆయన వాటిలో ఉన్నారు, నేను ఆయన అవతారాన్ని. నీళ్ళవలన నీళ్ళకు ఎలా హాని కలుగుతుంది ? అని శ్రీమహారాజు సమాధానం చెపుతారు. 

ఈ దివ్యజ్ఞానం విన్న బనకటలాల్ నిశ్శబ్దంగా ఉండి, ఈ ఈగల ముళ్ళు శ్రీమహారాజు శరీరంనుండి వెలికి తీసేందుకు ఒక కంసాలిని తీసుకు వచ్చాడు. ఒక జత శ్రవణాలతో వచ్చిన కంసాలి ఆయన శరీరంమీద ముళ్ళను వెతకడం మొదలు పెట్టాడు. శ్రీమహారాజు నవ్వి, ఆముళ్ళు కళ్ళకు కనిపించవు మరియు ఈశ్రవణాలు వాటిని బయటకు తీసేందుకు పనికిరావు అని అన్నారు. 

అది నిరూపించడానికి, ఆయన శ్వాశ తీసుకుని అలాపట్టి ఉంచారు. వెంటనే ఆముళ్ళు అన్నీ ఆయన శరీరం బయటకు వచ్చాయి. ఈ చమత్కారం చూసిన ప్రజలు, శ్రీమహారాజు గొప్పతనాన్ని తెలుసుకొని సంతోషించారు. 

తరువాత అందరూ జొన్నపొత్తుల విందు ఆరగించి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చారు. కొటాషాఆలీ యొక్క శిష్యుడయిన, తన తోటి యోగి అయిన నరశింహజీని కలిసేందుకు, ఒకసారి శ్రీమహారాజు అకోట్ వెళ్ళారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 S͙r͙i͙ G͙a͙j͙a͙n͙a͙n͙ M͙a͙h͙a͙r͙a͙j͙ L͙i͙f͙e͙ H͙i͙s͙t͙o͙r͙y͙ - 2͙6 🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 6 - part 2 🌻

Thinking so, Bankatlal was about to rush to the rescue of Shri Gajanan Maharaj when by His divine power Shri Gajanan understood it and said to the bees, “Oh insects! Go back to the honey comb and don't harm my beloved Bankatlal, who is the only real devotee amongst all the people here”. 
Hearing this, the bees really flew back to the honeycomb. Shri Gajanan Maharaj laughes and said to Bankatlal, “You have given a good feast of these bees to Me. 

Those poisonous insects attacked and all the Laddu Bhakta ran away. Give a thought to it and remember that, in times of calamity, nobody, except God, helps you.” 

Bankatlal said, Oh Maharaj, I very much regret for having brought You here. I am responsible for causing You these bee bites today. I am a great sinner. Kindly tell me what I shall do to relieve You of these bee-bites; shall I call a goldsmith to pull out the bee thorns with his pincers? 
Shri Gajanan Maharaj replied Bankat, nothing extraordinary has happened, as it is the nature of bees to bite and they behaved accordingly. I assure you that these bites will not affect me as I know the Sachhidananda in those bees. 

He is in those bees and I am His incarnation. How can water hurt water? You have given a good feast of these bees to me. These poisonous insects attacked me and all the Laddu-Bhakta ran away. 

Give a thought to this and remember that in times of calamity nobody other than God helps you. These selfish people gathered here for a feast, and ran away when the bees attacked.
 
Hearing this divine knowledge, Bankatlal kept quiet and brought a gold smith to pull out the bee thorns from the body of Shri Gajanan Maharaj . The goldsmith came with a pair of pincers and started searching for the thorns in His body. 

Shri Gajanan Maharaj laughed and said that eyes would not see the thorns and the pincers are useless to pull them out. And in order to prove what he said, He inhaled the air and held His breath. The thorns immediately came out of the body. 

Looking at this miracle, people were glad to realise the greatness of Shri Gajanan Maharaj . After that, all the people enjoyed the feast of maize corns and returned home in the evening. 

Once, Shri Gajanan Maharaj went to Akot to meet his saint brother Narsinghji, who was a disciple of Kotasha. Although Maratha by caste, he had become dear to Shri Vithala by his Bhakti (devotion). Since I have narrated his detailed life in the Bhaktileelamrut, I don't repeat in here.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

⚛✮ మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 𝟣𝟤𝟫 ✮⚛


🌹. ⚛✮    మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 𝟣𝟤𝟫    ✮⚛ 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


బ్రహ్మజ్ఞానమనగా ఒక బాధ్యతయే గాని యొక పదవి కాదు. అది పొందిన వాడు బ్రహ్మవలె సృష్టిని చక్కబెట్టుచుండ వలయును.

అందందు సంచరించుచు మానవుల అజ్ఞానము తొలగు మార్గములలో విహరింపవలెను గాని, దాని ననుభవించుచు కూర్చుండుటకు వీలులేదు.

ఇట్టి బాధ్యతకు సిద్ధమైన వానికి మాత్రమే బ్రహ్మజ్ఞానము ప్రసాదింపబడునని భాగవతము ఉపదేశించుచున్నది.

✍🏼 మాస్టర్ ఇ.కె. 🌻

🌹 🌹 🌹 🌹 🌹

17-August-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 461 / Bhagavad-Gita - 461🌹
2) 🌹 Sripada Srivallabha Charithamrutham - 249 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 129🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 151 🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 65 / Sri Lalita Sahasranamavali - Meaning - 65 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 68 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 37🌹
8) 🌹. శివగీత - 34 / The Shiva-Gita - 34🌹
9) 🌹. సౌందర్య లహరి - 76 / Soundarya Lahari - 76 🌹
10) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 16 🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 375 / Bhagavad-Gita - 375🌹

12) 🌹. శివ మహా పురాణము - 199🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 75 🌹
14) 🌹.శ్రీ మదగ్ని మహాపురాణము - 70 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 86 🌹
16) 🌹 Twelve Stanzas From The Book Of Dzyan - 17 🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 35🌹
18) 🌹. అద్భుత సృష్టి - 7 🌹
19) 🌹 Seeds Of Consciousness - 151🌹 
20) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 29🌹
21) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 6 📚
22)


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 461 / Bhagavad-Gita - 461 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -20 🌴*

20. యే తు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే |
శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తే(తీవ మే ప్రియా: ||

🌷. తాత్పర్యం : 
నన్నే పరమగమ్యముగా చేసికొని భక్తియోగమను ఈ అమృతపథమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైనవారు నాకు అత్యంత ప్రియులు.

🌷. భాష్యము :
ఈ అధ్యాయపు రెండవ శ్లోకము “మయ్యావేశ్య మనో యే మాం” (మనస్సును నా యందే సంలగ్నము చేసి) నుండి చివరి ఈ శోకమైన “యే తు ధర్మామృతమిదం” (ఈ నిత్యసేవాధర్మము) వరకు శ్రీకృష్ణభగవానుడు తనను చేరుటకు గల దివ్య సేవాపద్ధతులను వివరించెను.

 ఈ భక్తియుక్తసేవా కార్యములు శ్రీకృష్ణునకు అత్యంత ప్రియములై యున్నవి. వాని యందు నియుక్తుడైన మనుజుని అతడు ప్రేమతో అనుగ్రహించును. 

నిరాకారబ్రహ్మమార్గము నందు నిమగ్నుడైనవాడు ఉత్తముడా లేక పూర్ణపురుషోత్తముడగు భగవానుని ప్రత్యక్షసేవలో నియుక్తుడైనవాడు ఉత్తముడా అను ప్రశ్నను అర్జునుడు లేవదీసియుండెను. అర్జునుని అట్టి ప్రశ్నకు శ్రీకృష్ణుడు తన భక్తియుతసేవయే ఆత్మానుభవమునకు గల వివిధపద్ధతులలో అత్యంత శ్రేష్టమైనదనుటలో ఎట్టి సందేహము లేదని స్పష్టముగా సమాధానమొసగినాడు. 

అనగా సత్సంగము ద్వారా మనుజుడు శుద్ధ భక్తియోగము నెడ అభిరుచిని వృద్ధిచేసికొనుననియు, తద్ద్వారా అతడు ఆధ్యాత్మికగురువును స్వీకరించి ఆయన నుండి శ్రవణ, కీర్తనములను చేయుటను ఆరంభించి శ్రద్ధ, అనురాగము, భక్తిభావములతో భక్తియోగమందలి నియమనిబంధనలను పాటించుచు శ్రీకృష్ణభగవానుని దివ్యసేవలో నియుక్తుడు కాగలడనియు ఈ అధ్యాయమున నిర్ణయింపబడినది. 

శ్రీమద్భగవద్గీత యందలి “భక్తియోగము” అను ద్వాదశాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 461 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 12 - Devotional Service - 20 🌴*

20. ye tu dharmāmṛtam idaṁ
yathoktaṁ paryupāsate
śraddadhānā mat-paramā
bhaktās te ’tīva me priyāḥ

🌷 Translation : 
Those who follow this imperishable path of devotional service and who completely engage themselves with faith, making Me the supreme goal, are very, very dear to Me.

🌹 Purport :
In this chapter, from verse 2 through the end – from mayy āveśya mano ye mām (“fixing the mind on Me”) through ye tu dharmāmṛtam idam (“this religion of eternal engagement”) – the Supreme Lord has explained the processes of transcendental service for approaching Him. Such processes are very dear to the Lord, and He accepts a person engaged in them. 

The question of who is better – one who is engaged in the path of impersonal Brahman or one who is engaged in the personal service of the Supreme Personality of Godhead – was raised by Arjuna, and the Lord replied to him so explicitly that there is no doubt that devotional service to the Personality of Godhead is the best of all processes of spiritual realization. 

In other words, in this chapter it is decided that through good association one develops attachment for pure devotional service and thereby accepts a bona fide spiritual master and from him begins to hear and chant and observe the regulative principles of devotional service with faith, attachment and devotion and thus becomes engaged in the transcendental service of the Lord. 

This path is recommended in this chapter; therefore there is no doubt that devotional service is the only absolute path for self-realization, for the attainment of the Supreme Personality of Godhead. 

Thus end the Bhaktivedanta Purports to the Twelfth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Devotional Service.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 249 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 28
*🌻 Sripada Himself is Sri Venkateswara - 4 🌻*

Ganapathi said, ‘My Dear clever uncle! I know your foul play. You are planning that the marriage of my mother and father should not happen. 

 While getting married, the bride groom should spend money liberally giving dakshinas and doing ‘anna danam’. You are ridiculing that my father has no money. I do not agree with your view point.  

Every human being has ‘kundalini power’. I am the one present in the ‘muladhara chakra’. At the time of marriage of Parvathi and Parameswara, they invited me as I was present in the ‘mooladhara chakra’ of Shankar Bhagawan.  

That marriage was performed with my acceptance only. So the marriage of Parvathi Parameswara was very much acceptable. At that time, my emergence in the physical world did not happen. But I was the one present in the mooladhara of all human beings and Gods.  

Labhada was born as my son. He was Labhada Maharshi in Kruta Yugam. The gothra of Labhada is among the 102 gothras. When the gems of Ganapakulam - Dhana Gupta and Dhana Laxmi couple, entered ‘agni’, their progeny ended. So, cleverly, I begot Labhada Maharshi as my son.  

So, our’s became ‘Labhadi’ gothram. Because my gothram is Labhadi gothram, my father Paramasiva’s also is Labhadi gothram. This Labhadi gothram is one of the 102 gothras. So Nagareswara is becoming an arya vysya.  

You say you are the brother of Vasavee Matha. At present, Labhadi Maharshi has come as Bapanarya. You take the permission of your grandfather and find out if Nagareswara can be considered as born in Labhadi gothram.  

Then it can be considered also a as Menarikam (cousin marriage). It is so because, Kusuma Shresti who was born in Prabhata gothram, has got relations with people born in Labhadi gothram.  

They are related as maternal uncles. I know that you will create such hurdles. So I allowed Dhana Laxmi, Dhana Gupta couple enter the ‘agni kundam’ and ended their gothram. Sri Nagareswara can be given this gothram. I am giving one more boon from today. 

 People are worshipping you for the grace of Laxmi as you are ‘Laxmi Pathi’ (husband of Laxmi). From now onwards, people who worship Siva and do abhishekam to Siva will have the grace of Laxmi. The saying ‘Iswaryam Eswaradhicchet’ will spread on all sides of the world.  

People doing Siva worship at Shani pradhosha time, will have happiness in this world as well as in other worlds.’

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

 *🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 129 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు  
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

బ్రహ్మజ్ఞానమనగా ఒక బాధ్యతయే గాని యొక పదవి కాదు. అది పొందిన వాడు బ్రహ్మవలె సృష్టిని చక్కబెట్టుచుండ వలయును. 

 అందందు సంచరించుచు మానవుల అజ్ఞానము తొలగు మార్గములలో విహరింపవలెను గాని, దాని ననుభవించుచు కూర్చుండుటకు వీలులేదు.  

ఇట్టి బాధ్యతకు సిద్ధమైన వానికి మాత్రమే బ్రహ్మజ్ఞానము ప్రసాదింపబడునని భాగవతము ఉపదేశించుచున్నది.

✍🏼 *మాస్టర్ ఇ.కె.* 🌻
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 149 🌹*
*🌴 The Wisdom of Waiting - 2 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 Patience - 2 🌻*

Impatience is an obstacle on the spiritual path, it brings irritation. We easily criticise and become annoyed. Overactive people cannot wait and just do what has to be done. Thus there is no receptivity for the soul. Even in meditation our mind remains busy and keeps on thinking. We don’t leave a door open for the Divine to come in. It is just as if we phone with a person and keep on talking and then we complain that the other hasn’t answered at all. Meditation means to wait until all thoughts have settled down.

When we are vigilant to let the thoughts pass by, we enter from the state of doing into the state of being. Thus meditation is not doing, but letting happen, a be-ness in order to be receptive for the divinity. 

We make a proposal to the be-ness that it may enter into us. If we lose the being in doing, we cling excessively to the mind.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 65 / Sri Lalita Sahasranamavali - Meaning - 65 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

శ్లోకం 123

611. కళాత్మికా -
 కళల యొక్క రూపమైనది.

612. కళానాథా - 
కళలకు అధినాథురాలు.

613. కావ్యాలాపవినోదినీ - 
కావ్యముల ఆలాపములో వినోదించునది.

614. సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా - 
వింజామరలను కలిగియున్న ఎడమవైపున, కుడివైపున (వరుసగా) లక్ష్మీదేవి చేత, సరస్వతీదేవి చేత సేవింపబడునది.

శ్లోకం 124

615. ఆదిశక్తిః - 
ప్రథమముగా నున్న శక్తి స్వరూపిణి.

616. అమేయా - 
కొలుచుటకు, గణించుటకు గాని, నిర్వహించుటకు గాని అలవికానిది.

617. ఆత్మా - 
ఆత్మ స్వరూపిణి.

618. పరమా - 
సర్వీత్కృష్టమైనది.

619. పావనాకృతిః -
 పవిత్రమైన స్వరూపము గలది.

620. అనేకకోటి బ్రహ్మాండజననీ - 
అనంతమైన సమూహములుగా నుండు బ్రహ్మాండములకు తల్లి.

621. దివ్యవిగ్రహా - 
వెలుగుచుండు రూపము గలది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 65 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 65 🌻*

611 ) Kalathmika -   
She who is the soul of arts

612 ) Kala nadha -   
She who is the chief of arts

613 ) Kavya labha  vimodhini -   
She who enjoys being described in epics

614 ) Sachamara rama vani savya dhakshina sevitha -   
She who is being fanned by Lakshmi the goddess of wealth and Saraswathi the goddess of knowledge

615 ) Adishakthi -   
She who is the primeval force

616 ) Ameya -   
She who cannot be measured

617 ) Atma -   
She who is the soul

618 ) Parama -   
She who is better than all others

619 ) Pavana krithi -   
She who is personification of purity

620 ) Aneka koti Bramanda janani -   
She who is the mother of several billions of universes

621 ) Divya Vigraha -   
She who is beautifully made

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 68 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
 తృతీయాధ్యాయము - సూత్రము - 39

*🌻. 39. మహత్పంగస్తు దుర్లభోః_ గమ్యో_ అమోఘశ్చ ॥ 🌻* 
 
మహాత్ముల సాంగత్యం దొరకడమనెది దుర్లభం, అగమ్యం, అమోఘం కూడా. మహాత్ములను సాధారణ మానవులుగా భావించడం జరుగుతుంది. వారు దొరకడమే కష్టం. దొరికినా గుర్తించలేరు. ఎందుకంటే వారు నిరాడంబరంగా ఉంటారు. బాలురవలె క్రీడిస్తారు. పిచ్చివారివలె ప్రవర్తిస్తారు. పిశాచివలె సంచరిస్తారు. భక్తుల పుణ్య విశేషం చెతగాని దొరకరు,గుర్తించబడరు. కాని వారు కోరకనె అనుగ్రహిస్తారు, ఉపదేశిస్తారు. అయితే భక్తుడు దానికి అర్హుదై సంసిద్ధుడై ఉండాలి. వారి చేష్టలు అగమ్య గోచరంగా ఉంటాయి. వారు అనుగ్రహించి విధానం అమోఘం. 
 
మహాత్ములకు న్వార్ధపూరిత మనసు ఉండదు. దైవ ప్రేరణతో పని చెసే మనసుంటుంది. ఆ దివ్యమైన మనసు అదృష్టవంతులైన భక్తులను అనుగ్రహించడం వంటి పవిత్ర కార్యాలకు వినియోగించబడుతుంది. మహాత్ముడు భగవంతుని నుండి ప్రసరించె అనుగ్రహాన్ని అర్హత కలిగిన భక్తులపైకి ప్రతిఫలింపచెస్తూ ఉంటాడు.  
 
ఉదాహరణకు ఒక ఉపగ్రహం (శాటిలైట్‌ గా పనిచెస్తూ ఉంటాడు. కొందరు మహాత్ములు భక్తులకు పరీక్షలు పెట్టి తద్వారా పురోగమింపచేస్తారు. భక్తులను పరాభక్తికి సంసిద్దులను చేసారు. కాని వారి అనుగ్రహం భక్తులయెడ పక్షపాతంతో కూడి ఉండదు. భక్తులలో గౌణభక్తి స్థానంలో మఖ్యభక్తి కలిగే స్థాయిని బట్టీ మహాత్ముల సహాయం అందుతూ ఉంటుంది. 

వారి కృపకు వాత్రులవక పోవడమనెది భక్తులలోనె లోపముండవచ్చును గాని, మహాత్ముల అనుగ్రహం ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటుంది. సంసిద్ధమైన భక్తులను మహాత్ములు వెతుక్కుంటూ వచ్చి వారిని పరాభక్తిలో నిలుపుతారు. ఈ సంఘటన అమోఘం. 

సశేషం....  
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 37 🌹*
✍️ Sri GS Swami ji Datta Vaakya
📚. Prasad Bharadwaj

*🌻 The real secret knowledge, the unknown principle, is God. That divine principle is fully explained in Guru Geeta. That is what is meant by its being secret. 🌻*

Some people visualize Guru by starting from the head and going down step by step towards the fe et. This is another method.

 However, it is not acceptable for the attention to hop from one part to another part of the form of Guru in a haphazard manner, like a monkey. 

One must not look at Guru in this manner (while in his direct presence either). Prior to commencing any worthy task, the proper complete visualization of the form of Guru should be performed. If it is done, impediments will not occur and the aim will be accomplished. 

For the study of Guru Gita there are prescribed hand gestures to be shown and different parts of the body to be touched (Anganyasa and Karanyasa) prior to commencement. The importance of this scripture and its essence may be assessed by us by considering the context in which it came into being. 

This Guru Gita, which explains th e essence of Guru Principle came into being in the form of a dialog between sages Suta and Saunaka as they discussed the conversation that took place between Siva and Parvati. 

The work begins with the interaction between Sage Suta and other rishis who were company of Sage Saunaka. 

Verse: Guhyad … in the Once upon a time, Saunaka and some other sages addressed Sage Suta with their plea: “O Sage Suta, Guru Gita is full of essence and is yet undisclosed. We are eager to hear it and we pray to you to kindly ini tiate us.” Why is this considered secret knowledge?  

Even the Bhagavad Gita is referred to as being undisclosed information. This is said to be top secret. Similarly, the one thousand names of Lalita are also referred to as a secret collection of divine des criptive names. 

Our sacred scriptures often use this term secret. Does it mean that it is the intention of our celestial seers to keep this information undisclosed? Is it something like a trade secret? No. Not at all. 

The real secret knowledge, the unknown principle, is God. That divine principle is fully explained here. That is what is meant by its being secret. 

Verse: Kailasa … 
Upon hearing the request of the sages, Sage Suta felt happy that he is being given an opportunity of sharing this precious inform ation with those sages who have the eligibility for hearing it. He spoke thus:
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 34 / The Siva-Gita - 34 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

పంచామాధ్యాయము

*🌻. రాముని యస్త్ర ప్రాప్తి - 4 🌻*

అధః తుష్టః ప్రణమ్యేశం - రామో దశరదాత్మజః,
ప్రాంజలి: ప్రణతోభూత్వా - భక్తి యుక్తో వ్యజిజ్ఞ పత్ . 25

పిమ్మట శ్రీ రాముడు సంతృప్తి చెంది శివునకు ప్రణమిల్లి చేతులు జోడించి భక్తి మీర నిట్లు నివేదించు కొనెను.

భగవాన్! న్మాను షైరేవ - నోల్లంఘ్యో లవణాంబుధి:,
తత్ర లంకాభి ధం దుర్గం - దుర్జయం దేవదానవై: 26
అనేక కోట యస్తత్త్ర - రాక్షసా బలవత్తరా;,
సర్వే స్వాద్యాయ నిరతా -శ్శివ భక్తా జితేంద్రియా: 27
అనేక మాయా సంయుక్తా - బుద్ది మంతోగ్ని హొత్రిణః,
కధ మేకాకి నాజేయా - మయా భ్రాతాచ సంయుగే 28

ఓ పరమేశ్వరా! విశాలము మరియు అగాధమైన సాగరము 
మానవులచేత దాటశఖ్యము కానిది పోగా లంకా నగరము
 ప్రవేశింప సాధ్య పడనిది.  

అంతేకాదు, దేవదానవులకు కూడా సాధించ రానిది, అక్కడ మహాశాలురు, స్వాద్యాయ నిరతులు, శివ భక్తులు (వీర శైవులు ) ఇంద్రియ నిగ్రహము కలవారు మాయాసహితులు బుద్ధిమంతులు, అగ్ని హొత్రము కల (బ్రాహ్మణులు ) వారును, మరి ఎందరో సుతులు ఉన్నారు.  

కేవలము నా సోదరుడగు లక్ష్మణుని తో బాటు ఏకాకిగా నున్న నేను మాత్రము రావణుని యెట్లు జయించ గలను?

రావణస్య వధే రామ ! - రక్ష సామపి మారణే ,
విచారో నత్వయా కార్య -స్తస్య కాలోయ మాగతః 29

అధర్మే తు ప్రవృత్తాస్తే - దేవ బ్రాహ్మణ పీడనే,
తస్మా దాయు: క్షయం యాతం -తేషాం శ్రీ రపి సువ్రత ! 30

శివుడాదేశించు చున్నాడు: ఓయీ రామా! రావణుని వధించుట, మరియు రాక్షసులను పరిమార్చుటలోనీవెంత మాత్రము విచార పడకుము.

 రావణునికి చావు దగ్గరలో నున్నది, రాక్షసులు అధర్మ నిరతులై, దేవతలు బ్రాహ్మణులను పీడించు చున్నారు. కావున వారి యాయువు ఐశ్వర్యములు తొలగి పోవనున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 34 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 05 :
*🌻 Ramaya Varapradanam - 4 🌻

Thereafter Sri Rama became satisfied and saluted Lord Shiva time and again. Furtehr, with full devotion
Rama spoke the following words.

O Parameshwara! The vast and deep ocean is impossible to be crossed by humans. Moreover, Lanka fort is impregnable for even Gods and demons. There many saints, Shiva devotees,Jitendriya (people who have conquered their senses), wise, illusionists, Brahmanas, and many other high profiled people exist. How would it be possible for me and my younger brother Lakshmana to defeat Ravana?

Lord Shiva said: O Rama! Do not worry on that front. Ravana's time has started nearing its end. 

All those demons have become unrighteous, and have tormented Gods and Brahmanas, therefore their lifespan and all opulence are destined to come to an end.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 26 / Sri Gajanan Maharaj Life History - 26 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. 6వ అధ్యాయము - 2 🌻*

బనకటలాల్ అలా అనుకుంటూ శ్రీమహారాజును కాపాడేందుకు వెళదామనుకుంటూ ఉండగా, శ్రీగజానన్ తన దివ్యశక్తితో ఈవిషయం తెలుసుకొని, ఓ ప్రాణులారా మీపట్టుమీదకు వెనక్కు వెళ్ళండి, మరియు ఇక్కడ చేరిన వాళ్ళలో ఒకే ఒక నిజమయిన భక్తుడయిన నాప్రియమయిన బనకటరాల్ ను కష్టించకండి అని ఆయన ఆ ఈగలతో అంటారు. 

నిజంగానే ఆ ఈగలు తేనెపట్టు మీదకు వెళ్ళి పోయాయి. శ్రీమహారాజు నవ్వి ఈ ఈగలతో నువ్వు నాకు మంచి విందు ఇచ్చావు. ఆవిషపుటీగలు నన్ను ఎదుర్కున్నాయి, మిగిలిన లడ్డూ భక్తులూ అందరు పరిగెత్తి పోయారు. ఇది కొద్దిగా ఆలోచించు. అకాల పరిస్థితులలో భగవంతుడు తప్ప మరి ఎవరూ నీకు సహాయ పడరని గుర్తుంచుకో. 

ఈ స్వార్ధపరులు విందుకోసం చేరారు కానీ ఆ ఈగలు దాడి చేసేసరికి అందరూ పరిగెత్తి పారి పోయారు అని బనకటలాల్తో అన్నారు. ఓమహారాజ్ ! నేను మిమ్మలను ఇక్కడకు తెచ్చినందుకు చాలా చింతిస్తున్నాను. ఈతేనెటీగల కాట్లు మీకు కలగడానికి నేనే బాధ్యుడను. నేను గొప్పపాపిని. నేను ఏమిచేస్తే మీకుఈ ఈగల కాట్లనుండి ఉపశమనం కలుగుతుందో దయచేసి చెప్పండి. 

కంసాలిని తన శ్రవణంతో ముళ్ళు తీసేందుకు నేను పిలవనా ? అని బనకటలాల్ అన్నాడు. బనకట్ కుట్టడం అనేది ఈ ఈగల ప్రకృతి అవి అదేవిధంగా చేస్తాయి, ఏమీవింత విషయం జరగలేదు. ఈ ఈగల కుట్ల అసరు నాకు ఏమీ ఉండదు అనినీకు ఆస్వాసన ఇస్తున్నాను, ఎందుకంటే వాటిలోని సచ్చిదానందుడను నేను ఎరుగుదును. ఆయన వాటిలో ఉన్నారు, నేను ఆయన అవతారాన్ని. నీళ్ళవలన నీళ్ళకు ఎలా హాని కలుగుతుంది ? అని శ్రీమహారాజు సమాధానం చెపుతారు. 

ఈ దివ్యజ్ఞానం విన్న బనకటలాల్ నిశ్శబ్దంగా ఉండి, ఈ ఈగల ముళ్ళు శ్రీమహారాజు శరీరంనుండి వెలికి తీసేందుకు ఒక కంసాలిని తీసుకు వచ్చాడు. ఒక జత శ్రవణాలతో వచ్చిన కంసాలి ఆయన శరీరంమీద ముళ్ళను వెతకడం మొదలు పెట్టాడు. శ్రీమహారాజు నవ్వి, ఆముళ్ళు కళ్ళకు కనిపించవు మరియు ఈశ్రవణాలు వాటిని బయటకు తీసేందుకు పనికిరావు అని అన్నారు. 

అది నిరూపించడానికి, ఆయన శ్వాశ తీసుకుని అలాపట్టి ఉంచారు. వెంటనే ఆముళ్ళు అన్నీ ఆయన శరీరం బయటకు వచ్చాయి. ఈ చమత్కారం చూసిన ప్రజలు, శ్రీమహారాజు గొప్పతనాన్ని తెలుసుకొని సంతోషించారు. 

తరువాత అందరూ జొన్నపొత్తుల విందు ఆరగించి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చారు. కొటాషాఆలీ యొక్క శిష్యుడయిన, తన తోటి యోగి అయిన నరశింహజీని కలిసేందుకు, ఒకసారి శ్రీమహారాజు అకోట్ వెళ్ళారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 26 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 6 - part 2 🌻*

Thinking so, Bankatlal was about to rush to the rescue of Shri Gajanan Maharaj when by His divine power Shri Gajanan understood it and said to the bees, “Oh insects! Go back to the honey comb and don't harm my beloved Bankatlal, who is the only real devotee amongst all the people here”. 

Hearing this, the bees really flew back to the honeycomb. Shri Gajanan Maharaj laughes and said to Bankatlal, “You have given a good feast of these bees to Me. 

Those poisonous insects attacked and all the Laddu Bhakta ran away. Give a thought to it and remember that, in times of calamity, nobody, except God, helps you.” 

Bankatlal said, Oh Maharaj, I very much regret for having brought You here. I am responsible for causing You these bee bites today. I am a great sinner. Kindly tell me what I shall do to relieve You of these bee-bites; shall I call a goldsmith to pull out the bee thorns with his pincers? 

Shri Gajanan Maharaj replied Bankat, nothing extraordinary has happened, as it is the nature of bees to bite and they behaved accordingly. I assure you that these bites will not affect me as I know the Sachhidananda in those bees. 

He is in those bees and I am His incarnation. How can water hurt water? You have given a good feast of these bees to me. These poisonous insects attacked me and all the Laddu-Bhakta ran away. 

Give a thought to this and remember that in times of calamity nobody other than God helps you. These selfish people gathered here for a feast, and ran away when the bees attacked. 

Hearing this divine knowledge, Bankatlal kept quiet and brought a gold smith to pull out the bee thorns from the body of Shri Gajanan Maharaj . The goldsmith came with a pair of pincers and started searching for the thorns in His body. 

Shri Gajanan Maharaj laughed and said that eyes would not see the thorns and the pincers are useless to pull them out. And in order to prove what he said, He inhaled the air and held His breath. The thorns immediately came out of the body. 

Looking at this miracle, people were glad to realise the greatness of Shri Gajanan Maharaj . After that, all the people enjoyed the feast of maize corns and returned home in the evening. 

Once, Shri Gajanan Maharaj went to Akot to meet his saint brother Narsinghji, who was a disciple of Kotasha. Although Maratha by caste, he had become dear to Shri Vithala by his Bhakti (devotion). Since I have narrated his detailed life in the Bhaktileelamrut, I don't repeat in here.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 16 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 16 🌻*

53.సంస్కారములు, చైతన్యములేని ఆత్మయొక్క అనంతమైన నిశ్చల ప్రశాంత స్థితిలో, తానెవరో తెలిసికొనవలె ననెడి ఆదిప్రేరణమ ప్రతిధ్వనించునట్లు ఘోషించెను.

54.ఈ ఆదిప్రేరణము పరమాత్మలోనే అంతర్నిహితమైయుండెను.

55.అనంతసాగరుడైన పరమాత్ముడు ప్రథమ ప్రేరణమును పొందెను.

56. ఈ ప్రథమ ప్రేరణము, అనంతము యొక్క ప్రేరణయే ఇది ప్రారంభములో పరమాణు ప్రమాణములో ఉండెను.

57. అనంతములో --- శాంతము, అనంతము రెండునూ ఇమిడియె ఉన్నవి.
భగవల్లీల
(లేక)
భగవద్విలాసము.

58. సర్వం(పరాత్పరస్థితి) లో అంతర్నిహితమైయున్న పరిమిత అభావము అనంతమైన సృష్టిగా అభివ్యక్తమగుటకు మూలకారణము 'సర్వకారణమత్వమే'
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 76 / Soundarya Lahari - 76 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

76 వ శ్లోకము

*🌴. శక్తి, బలము సంపాదించుటకు, వైరాగ్యము, ప్రేమ యందు జయం 🌴*

శ్లో: 76. హరక్రోధ జ్వాలా వళిభి రవళీఢేన వపుషా గభీరే తే నాభీసరసి కృతసజ్గో మనసిజః సముత్తస్థౌ తస్మాద చలతనయే ధూమలతికా జనస్తాం జానీతే తవ జనని రోమావళిరితిll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా! పర్వతరాజ కుమారీ ! మన్మధుడు పరమ శివుని కోపాగ్ని కీలలతో దహింప బడిన శరీరముతో నీ యొక్క లోతయిన నాభి మడువున దూకి తనను తాను కాపాడుకొనెను. కాలుచున్న వాని శరీరము చల్లారుట చేత వెడలిన పొగ తీగ బయల్పడగా , దానిని నీ యొక్క నూగారు ప్రాంతముగా కనబడుచున్నది కదా! 

🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 10 రోజులు జపం చేస్తూ, తేనె, అరటి పండ్లు, పెరుగున్నము నివేదించినచో అధికారము, శక్తి, బలము, తేజము, వైరాగ్యము లభించును అని చెప్పబడింది
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Soundarya Lahari - 76 🌹*
📚 Prasad Bharadwaj

SLOKA - 76

*🌴 power, energy, gloriy, Complete Renunciation and Victory in Love 🌴*

76. Hara krodha jwalaavalibhir avaleedena vapusha Gabhire thee nabhisarasi kruthasangho manasija Samuthasthou thasmath achalathanaye dhoomalathika Janastham janithe thava janani romaavalirithi 
 
🌻 Translation : 
Oh daughter of the mountain,the god of love who is the king of the mind,being lit bytheflame of anger of shiva,immersed himself in the deep pond of thine navel.the tendril like smoke emanated from there,and mother, people think,that this is the line of hair,that climbs from your navel upwards.

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : 
If one chants this verse 1000 times a day for 10 days, offering curd rice, coconut and fruits, curd rice as prasadam, it is believed that they can achieve success in life. 
 
🌻 BENEFICIAL RESULTS: 
Success in financial and legal affairs and knowledge of Self, if so intended. 
 
🌻 Literal Results: 
Activation of manipoorka chakram and anaahatha chakram, benefits due to the same.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 375 / Bhagavad-Gita - 375 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 24 🌴

24. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ |
సేనానీనామహం స్కన్ద: సరసామస్మి సాగర: ||

🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిగా నన్నెరుగుము. నేను సేనానాయకులలో కార్తికేయుడను, జలనిధులలో సముద్రమునై యున్నాను. 

🌷. భాష్యము :
స్వర్గలోకదేవతలలో ఇంద్రుడు ముఖ్యదేవత. అతడే స్వర్గాధిపతియనియు తెలియబడును. అతడు పాలించు లోకము ఇంద్రలోకము మరియు బృహస్పతి అతని పురోహితుడు. 

ఇంద్రుడు రాజులందరిలో ముఖ్యుడగుట వలన బృహస్పతి పురోహితులందరిలో ముఖ్యుడయ్యెను. రాజులందరిలో ఇంద్రుడు ప్రధానుడైనట్లుగా పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన కార్తికేయుడు సేనానాయకులలో ప్రధానుడు. 

అదే విధముగ జలనిధులలో సముద్రము ఘనమైనది. ఈ ప్రాతినిధ్యములన్నియును శ్రీకృష్ణుని ఘనతకు సూచనలు మాత్రమే ఒసగును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 375 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 24 🌴

24. purodhasāṁ ca mukhyaṁ māṁ
viddhi pārtha bṛhaspatim
senānīnām ahaṁ skandaḥ
sarasām asmi sāgaraḥ

🌷 Translation : 
Of priests, O Arjuna, know Me to be the chief, Bṛhaspati. Of generals I am Kārttikeya, and of bodies of water I am the ocean.

🌹 Purport 
Indra is the chief demigod of the heavenly planets and is known as the king of the heavens. 

The planet on which he reigns is called Indraloka. Bṛhaspati is Indra’s priest, and since Indra is the chief of all kings, Bṛhaspati is the chief of all priests. 

And as Indra is the chief of all kings, similarly Skanda, or Kārttikeya, the son of Pārvatī and Lord Śiva, is the chief of all military commanders. 

And of all bodies of water, the ocean is the greatest. These representations of Kṛṣṇa only give hints of His greatness.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

𝐅𝐨𝐫 𝐚𝐥𝐥 𝐦𝐲 𝐃𝐚𝐢𝐥𝐲 𝐌𝐞𝐬𝐬𝐚𝐠𝐞𝐬 𝐚𝐧𝐝 𝐌𝐮𝐜𝐡 𝐦𝐨𝐫𝐞... 
𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐦𝐲 𝐆𝐨𝐨𝐠𝐥𝐞 𝐚𝐧𝐝 𝐖𝐨𝐫𝐝𝐩𝐫𝐞𝐬𝐬 𝐛𝐥𝐨𝐠.... 
🌹. 𝐏𝐫𝐚𝐬𝐚𝐝 𝐁𝐡𝐚𝐫𝐚𝐝𝐰𝐚𝐣  

https://dailybhakthimessages.blogspot.com/

https://incarnation14.wordpress.com/

చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Group 

https://t.me/joinchat/Aug7plAHj-F_kRa17B6xzg


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 199 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
44. అధ్యాయము - 19

*🌻. శివునితో కుబేరుని మైత్రి - 1 🌻*

బ్రహ్మోవాచ |
పాద్మే కల్పే మమ పురా బ్రహ్మణో మానసాత్సుతాత్‌ | పులస్త్యాద్విశ్రవా జజ్ఞే తస్య వైశ్రవణస్సుతః || 1

తేనేయ మలకా భుక్తా పురీ విశ్వకృతా కృతా | ఆరాధ్య త్ర్యంబకం దేవషుత్యుగ్ర తపసా పురా || 2

వ్యతీతే తత్ర కల్పేవై ప్రవృత్తే మేఘ వాహనే | యాజ్ఞ దత్తి రసౌ శ్రీ దస్తపస్తేపే సుదుస్సహమ్‌ || 3

భక్తి ప్రభావం విజ్ఞాయ శంభోస్తద్దీపమాత్రతః | పురా పురారేస్సం ప్రాప్య కాశికాం చిత్ర్ప కాశికామ్‌ || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

పూర్వము పాద్మకల్పమునందు బ్రహ్మనగు నా యొక్క మానసపుత్రుడైన పులస్త్యునకు విశ్రవసుడు అను కుమారుడు కలిగెను| అతనికి వైశ్రవణుడు (కుబేరుడు) అను కుమారుడు కలిగెను (1).

 ఆతడు పూర్వము ముక్కంటి దేవుని అతిఘోరమగు తపస్సుతో నారాధించి విశ్వకర్మచే నిర్మింపబడిన ఈ అలకాపురిని పాలించెను (2). 

పాద్మకల్పము గడిచి, మేఘ వాహన కల్పము రాగా, యజ్ఞదత్తుని కుమారుడుగా నున్న ఈ కుబేరుడు ఘోరమగు తపస్సును చేసెను (3). 

దీపమును వెలిగించుట మాత్రము చేత తనకు లభించిన మహా ఫలముచే భక్తియొక్క ప్రభావమును ఎరింగి, ఆతడు పూర్వము పురారియగు శివుని చైతన్య స్వరూపమును ప్రకాశింపజేయు కాశీనగరమును చేరుకొనెను (4).

శివైకాదశముద్బోధ్య చిత్తరత్నప్రదీపకైః | అనన్య భక్తిస్నేహాఢ్య స్తన్మయో ధ్యాననిశ్చలః || 5

శివైక్యం సుమహాపాత్రం తపోsగ్ని పరిబృంహితమ్‌ | కామక్రోధమహావిఘ్న పతంగాఘాతవర్జితమ్‌ || 6

ప్రాణసంరోధనిర్వాతం నిర్మలం నిర్మలేక్షణాత్‌ | సంస్థాప్య శాంభవం లింగం సద్భావకుసుమార్చితమ్‌ || 7

తావత్తతాప స తపస్త్వగస్థిపరిశేషితమ్‌ | యావద్బభూవ తద్వర్ష్మ వర్షాణామయుతం శతమ్‌ || 8

ఆతడు చిత్తము అనే రత్న దీపముచే ఏకాదశ రుద్రులను మేల్కొలిపి, అనన్యమగు భక్తితో, ప్రేమతో నిండిన హృదయము గలవాడై. ధ్యానమునందు అచంచలుడై యుండెను (5). 

ఆతడు మహాత్ములకు మాత్రమే లభ్యమగునట్టియు, తపస్సు అనే అగ్నిచే వృద్ధి పొందింపబడునట్టియు, కామక్రోధరూపములో నుండే మహావిఘ్నములను పక్షుల దెబ్బలు తగులనట్టి శివైక్యమును భావనచే పొందెను (6).

 ఆతడు ప్రాణాయామములో వాయువును స్తంభింపజేయుటచే వాయు సంచారము లేనట్టియు, దోషరహితమగు అంతర్ముఖత్వముచే కాలుష్యములు లేనట్టి మనో దేశమునందు శంభులింగమును స్ధాపించి పవిత్రమగు చిత్త వృత్తులనే పుష్పములచే నారాధించెను (7). 

ఆతడు శరీరములో చర్మము, ఎముకలు మాత్రమే మిగులునంత వరకు పదివేల వంద సంవత్సరముల కాలము తపస్సు చేసెను (8).

తతస్సహ విశాలక్ష్యా దేవో విశ్వేశ్వరస్స్వయమ్‌ | అలకాపతి మాలోక్య ప్రసన్నేనాంతరాత్మనా || 9

లింగే మనస్స మాధాయ స్థితం స్థాణుస్వరూపిణమ్‌ | ఉవాచ వరదోSస్మీతి తదాచక్ష్వాలకాపతే || 10

ఉన్మీల్య నయనే యావత్స పశ్యతి తపోధనః | తావదుద్యత్స హస్రాంశు సహస్రాధికతేజసమ్‌ || 11

పురో దదర్శ శ్రీ కంఠం చంద్రచూడము మాధవమ్‌ | తత్తేజః పరిభూతాక్షితేజాః సంమీల్య లోచనే || 12

ఉవాచ దేవదేవేశం మనోరథపదాతిగమ్‌ | నిజాం ఘ్రిదర్శనే నాత దృక్సామర్థ్యం ప్రయచ్ఛమే || 13

అపుడు విశ్వేశ్వర దేవుడు నిడివికన్నుల అర్ధాంగితో కూడి ప్రసన్నమగు మనస్సుతో స్వయముగా ప్రత్యక్షమై అలకాపతియగు కుబేరుని చూచెను (9). 

ఆతడు మనస్సును లింగమునందు లగ్నము చేసి స్థాణువు వలె నిశ్చలుడై యుండెను. అపుడు ఆయన 'హే అలకాపతే! వరము నిచ్చెదను కోరుకొనుము' అని పలికెను (10). 

తపస్సే ధనముగా గల ఆ కుబేరుడు కన్నులను తెరచి, ఉదయించే కోటి సూర్యుల కన్న అధికమగు తేజస్సు కలిగినట్టియు (11), 

విషమును కంఠమునందు ధరించినట్టియు, చంద్రుని శిరస్సుపై అలంకరించుకొనియున్న పార్వతీ పతిని ఎదురుగా చూచెను. ఆ తేజస్సును కన్నులతో చూడజాలక, ఆతడు వెంటనే కన్నులను మూసుకొనెను (12). 

మనోగోచరము కాని ఆ దేవదేవునితో ఆతడిట్లనెను. నాథా! నీ పాదములను చూడగలిగే శక్తిని నా కన్నులకు ఇమ్ము (13).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 75 🌹*
Chapter 22
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 How Mreciful He Is - 1 🌻*

The First One who became God-Realized is known as the Ancient One, because it is he who returns to creation again and again as a man, age after countless age. 

The universe is the responsibility of the Ancient One for all time, so he has to appear on earth age after age to fulfill his responsibility to each and all. He is the One who is eternally free, and he is the One eternally bound—bound by his responsibility to free others from the bindings of cosmic illusion, and in order to achieve their liberation he is bound by coming on earth as a man age after age.  

When God incarnates on earth as the Avatar, he becomes everyone and everything! The Avataric incarnation is thus universal. 

This Avataric universal incarnation means that for all stones, he incarnates as a stone; for all roses, he incarnates as a rose; for all  
cobras, he incarnates as a cobra; for all parrots, he incarnates as a parrot; for all lions, he incarnates as a lion; for all the beggars, he becomes a beggar; and for all kings, he becomes a king. 

Thus he incarnates on a universal scale for each and every type of species in the seven levels of evolution, and he simultaneously becomes each and every thing. So whatever each individual passes through in evolution or involution, he also passes through it all!  

The Avatar's work is universal; it includes each and every thing and every stage of development. He is the Lord, and as the Lord he has responsibility for the whole  
universe. To fulfill his responsibility he himself must pass through what each and every being must pass through in the universe! 

He passes through all that everyone and everything passes through because he becomes this and that. So when he becomes, he becomes everything! He becomes beggars and kings, sinful prostitutes and righteous  
preachers, idiots and philosophers, and verily everyone and everything that everyone is. And, when he becomes everyone he passes through what everyone passes through. 

The Avatar has to become everyone and everything, because he must come down to each level of consciousness in order to give his push to every level of consciousness.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 70 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 29
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. సర్వతో భద్ర మండల విధి - 3 🌻*

ఇన్దీవరదలాకారానథవా మాతులుఙ్గవత్‌ | పద్మపత్రాయతాన్వాపి లిఖేదిచ్ఛానురూపతః. 24

భ్రామయిత్వా బహిర్నే మావరసన్ధ్యరే స్థితః | భ్రామయేదరమూలం తు సన్ధిమధ్యే వ్యవస్థితః. 25

అరమధ్యే స్థితో మధ్యమరణిం భ్రామయేత్సమమ్‌ | ఏవం సన్ధ్యన్తరాః సమ్యఙ్మాతులుఙ్గనిభాః సమాః. 26

క్షేత్రమును మూడు భాగములుగ విభజించి, మరల లోపలినుండి ఒక్కొక్కదానిని రెండేసి భాగములు చేయవలెను. లోపల నున్న ఐదు కోష్ఠములను తుడిచివేసి వాటిపై ఆకులు నిర్మింపవలెను. ఈ ఆకులు ఇందీవర దళాకారములో గాని, మాతులింగ ఫలాకారములో గాని, కమలదళాకారమలో గాని ఉండవచ్చును.

 లేదా వాటి ఆకారమును తమ ఇచ్ఛ ప్రకారము చేయవచ్చును. ఆకుల సంధుల మధ్యదారముంచి, దానిని వెలుపల నున్న నేమి (చక్రాంతము) వరకు లాగి, నాలుగు వైపుల త్రిప్పవలెను.

 ఆకుయొక్క సంధియందు దారమునుంచి దాని మూలభాగమును త్రిప్పవలెను. ఆకు మధ్యస్థానము నందు దారము ఉంచి ఆ మధ్యభాగము నలువైపులకును సమముగా దారము త్రిప్పవలెను. ఈ విధముగా త్రిప్పగా మాతులుంగాకారము గల ఆకు లేర్పడును.

విభజ్య సప్తధా క్షేత్రం చతుర్దశకరం సమమ్‌ | ద్విధా కృతే శతం హ్యత్ర షణ్ణవత్యధికాని తు. 27

కోష్ఠకాని చతుర్భిసై#్తర్మధ్యే భద్రం సమాలిఖేత్‌ | పరితో విసృజేద్వీథ్యై తథా దిక్షు సమాలిఖేత్‌. 28

కమలాని పునర్వీథ్యై పరితః పరిమృజ్య తు | ద్వే ద్వే మధ్యమకోష్ఠే తు గ్రీవార్థం దిక్షు లోపయేత్‌. 29

చత్వారి బాహ్యతః పశ్చాత్త్రీణి త్రీణి తు తోపయత్‌ | గ్రీవా పార్శ్వే బహిస్త్వే కా శోభా సా పరికీర్తితా. 30

విసృజ్య బాహ్యకోణషు సప్తాన్తస్త్రీణి మార్జయేత్‌ | మణ్డలం నవభాగం స్యాన్న వవ్యూహం హరిం యజేత్‌. 31

పఞ్చవింశతికవ్యూహం మణ్డలం విశ్వరూపకమ్‌ | ద్వాత్రింశద్ధస్తకం క్షేత్రం భక్తం ద్వాత్రింవతాసమమ్‌. 32

ఏవం కృతే చతుర్వింశత్యధికం తు సహస్రకమ్‌ | కోష్ఠకానాం సముద్దిష్టం మధ్యే షోడశకోష్ఠకైః. 33

భద్రకం పరిలిఖ్యాథ పార్శ్వే పఙ్త్కిం విమృజ్య తు | తతః షోడవభిః కోష్ఠైర్దిక్షు భద్రాష్టకం లిఖేత్‌. 34

పదునాలుగు హస్తముల క్షేత్రమును ఏడు భాగములుగ విభజించి, మరల రెండేసి భాగములుగ విభజింపవలెను. 

లేదా - తూర్పునుండి పశ్చిమము వరకును, ఉత్తరమునుండి దక్షిణము వరకును పదునైదేసి సమానరేఖలు గీయవలెను. ఇట్లు చేయుటచే నూటతొంబదియారు కోష్ఠము లేర్పడును. వీటిలో మధ్య నున్న నాలుగు కోష్ఠములచే భద్రమండలము ఏర్పరుపవలెను. దాని నాలుగు వైపుల వీథికొరకై స్థానము విడువవలెను.

 మరల అన్ని దిక్కులందును కమలములు గీయవలెను. ఆ కమలములు నాల్గు వైపులందును వీథికొరకై ఒక్కొక్క కోష్ఠమును తుడిచివేయవలెను. పిమ్మట, మధ్య నున్న రెండేసి కోష్ఠములను కంఠభాగముకొరకై తుడిచివేయవలెను. 

పిమ్మట వెలుపల నున్న నాలుగేసికోష్టమలలో మూడు మూడు కోష్ఠములను తుడిచివేయవలెను. వెలుపల నున్న ఒక్కొక్క కోష్ఠమును కంఠస్థానపార్శ్వమునందు మిగల్చవలెను. దానికి ద్వారశోభ యనిపేరు.

వెలుపల నున్న కోణములలో ఏడింటిని మినహాయించి లోపల నున్న మూడేసి కోష్ఠములను తుడిచివేయవలెను. దానికి 'నవనాలము' లేదా ''నవనాభమండలము'' అని పేరు. 

దాని తొమ్మిది నాభులయందు, నవవ్యూహరూపుడైన శ్రీహరిని పూజింపవలెను. ఇరువదియైదు వ్యూహముల మండలము విశ్వవ్యాపి యైనది. ముప్పదిరెండు హస్తముల క్షేత్రమును, ముప్పదిరెండుచేతనే సమముగా విభజింపవలెను. 

అనగా పైనుంచి క్రిందికి ముప్పదిమూడు రేఖలు గీసి, అడ్డముగా కూడ ముప్పదిమూడు రేఖలు గీయవలెను. ఈ విధముగ ఒక వెయ్యి ఇరువదినాలుగు కోష్ఠములు ఏర్పడును. వాటిలో మధ్య నున్న పదునారు కోష్ఠకములతో ''భద్రమండలము''ను నిర్మింపవలెను. 

మరల నాలుగు ప్రక్కల నున్న ఒక్కొక్క పంక్తిని విడువలెను. పిమ్మట ఎనిమిది దిక్కులందును పదునారు కోష్ఠకములచే ఎనిమిది భద్రమండలములు ఏర్పరుపవలెను. దీనికి ''భద్రాష్టకము'' అని పేరు.

తతో7పి పఙ్త్కిం సంమృజ్య తద్వత్‌ షోడశభద్రకమ్‌ |
లిఖిత్వా పరితః పఙ్త్కిం విమృజ్యాథ ప్రకల్పయేత్‌. 35

ద్వారద్వాదశకం దిక్షు త్రీణి త్రీణి యథాక్రమాత్‌ | షడ్భిశ్చ పరిలుప్యాన్తర్మధ్యే చత్వారి పార్శ్వయోః. 36

దాని తరువాత నున్న ఒక పంక్తి చెరిపి వేసి మరల వెనుకటి వలె పదునారు భద్రమండలములు వ్రాయవలెను. పిమ్మట అన్ని ప్రక్కలను ఉన్న ఒక్కొక్క పంక్తి చెరిపివేసి ఒక్కొక్క దిక్కున మూడేసి చొప్పున పండ్రెండు ద్వారములు నిర్మింపవలెను. వెలుపల నున్న ఆరు కోష్ఠములు తుడిచివేసి మధ్యభాగముయొక్క పార్శ్వభాగములందలి నాలిగింటిని తుడిచివేయవలెను. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 86 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. పరాశర మహర్షి - 5 🌻*

20. ఒకసారి జనకమహారాజు (అదే వంశంలో మరొక జనకుడు) పరాసరమహర్షి దగ్గరికి వెళ్ళి, “ధర్మాన్ని తెలుస్కుందామని నీ దగ్గరికి వచ్చాను, నాకు ధర్మాన్ని గురించి చెప్పు” అని అడిగాడు. అందుకు ఆయన రాజుతో, “ఫలం కావాలంటే వృక్షం కావాలి. వృక్షం కావాలంటే బీజం కావాలి కదా! అలాగే సౌఖ్యం కోరేవాడు ధర్మాన్ని ఆశ్రయిస్తాడు. ఎప్పుడో భవిష్యత్తులో సుఖం కావాలంటే ఇప్పుడు ధర్మాచరణచేయడమే కర్తవ్యం. 

21. “సత్కృత్యమైనా, దుష్కృత్యమైనా ఆ పాపపుణ్యములు ఫలాన్ని ఇవ్వకుండా మనుష్యులను వదిలిపెట్టవు. కాబట్టి మనస్సు, వాక్కు, దృష్టి వీటన్నిటిటొటీ సత్యం, శమము మొదలైన వాటితో కూడిన సత్పథాన్ని ఆశ్రయించాలి. సమదర్శియై, న్యాయధర్మములలో ఉండేవాడికి దేవతలు నమస్కరిస్తారు. 

22. మనుష్యుడు బంధ విముక్తుడు కావాలి. వేదాధ్యనం చేయటంచేత ఋషిఋణం తీర్చుకుంటాడు. యజ్ఞయాగాదుల చేత దేవతల ఋణం తీర్చుకుంటాడు. అతిథి పూజచేసి ఆతిథ్యం ఇచ్చి, అతిథిఋణం తీర్చుకుంటాడు. దానధర్మములుచేసి ప్రజలఋణం తీర్చుకుంటాడు. ఈ ప్రకారంగా మనిషి అన్ని ఋణాలూ తీర్చుకును పవిత్రుడవుతాడు. ధర్మమార్గం ఇంతే! ఈ జీవితం అనిత్యమని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి సుమా! సుఖ దుఃఖాలు కలిగినప్పుడుకూడా ధర్మవిషయం మరచిపోకుండా ఉండటం శ్రేయస్సుకు మార్గం” అని చెప్పాడు.

23. “తపోధిక్యత అంటారుకదా! తపస్సు అనేది ఎలాగ ఉంటుంది? దానికి ఉత్కృష్టత ఎలా ఏర్పడింది?” అని జనకుడు అడిగాడు. “మహారాజా! విద్యాధరులున్నారు. ఋషులున్నారు. దేవతా గనములున్నవి. వాళ్ళందరూ అట్టిస్థితికి ఎలాగ వెళ్ళరనుకుంటున్నావు? తపస్సు చేతనే! తపస్సు ఆ ఉత్తమలొఖాలకు మార్గం. బ్రహ్మదేవుడికి ఈ సృష్టించే శక్తి తపస్సువల్లనే వచ్చింది.

 24. ఐహికాముష్మికమయిన ఏ కోరికైనాకూడా తీర్చుకోవాలంటే తపస్సే కారణం. ఇంకొక మార్గమే లేదు. దారాపుత్రులు, సంసారము, ధనము, దుఃఖము – వీటిలో పడ్డవాడిక్కూడా, ఈ సంఘాన్ని తప్పించుకునేందుకు, చిత్తము పరిశుద్ధతపొంది శాంతి కావాలంటే కూడా దానికి తపస్సే మార్గం. 

25. తపస్సు లేని వాడిని లోభమోహాలు వశపరుచుకుంటాయి. తపస్సులో ఉన్నవాళ్ళను లోభము, మోహము, కామము ఏమీ చెయ్యవు. ధర్మార్థకామమోక్షాలన్నిటికీ ప్రారంభమ్నుంచీ చివరిదాకా ఉండే మార్గం, గమ్యస్థానం, ఉపాయం అంతాకూడా తపస్సే.

26. పరమపుణ్యపురుషులు, యోగులు, మహర్షులు మొదలైనవాళ్ళు అంతవారుకావటానికి కారణం తపస్సే అని తెలుసుకో!తపస్సు యొక్క ఫలం తెలుసుకోవాలంటే వాళ్ళచరిత్రలు తెలుసుకుంటే చాలు. “వాళ్ళకు కోరికలు లేవు, దుఃఖం లేదు. వాళ్ళు పరమ శాంతచిత్తులు. లోకంలో మానసికమయిన ఎట్టివికారములూ లేవు. సృష్టిలోనూ, దేనియందూ సంగబుద్ధి వారికిలేదు. 

27. వారి దగ్గరికి వెళ్ళగానే ఇతరులకు కూడా శాంతి, అనుగ్రహము ప్రసాదించగలిగిన శక్తి వారికి తపస్సు వల్లనే వచ్చింది. వాళ్ళను చూస్తే తపస్సు యొక్క శక్తి తెలుస్తుంది” అని బోధించాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 17 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴* 

STANZA IV
*🌻 The Gift of Mind - 5 🌻*

32. The time had come. People began to talk about the Periods. They started to rise above the concept of Time and break away from the ground. Man understood that he was the nexus of the decaying temporal and the undecaying eternal. 

He was the possessor of two opposite poles, on one of which was the epicentre of death, and the other one — the centre of Immortality. He was, at one and the same time, the son of ashes and the Son of God. 

It was indeed a challenge to understand himself, since he had been woven entirely of contradictions, which had taken up a firm position inside him, unwilling to change their own polarity. 

He was being torn apart: on the one hand, the mortal was luring him with all its might, while on the other, the immortal was attracting and charming him with the marvellous Fires of Spirit. Man kept swinging from one extreme to another. 

Decaying, earthly treasures held no importance for the Light, but decay could not recognize the Divine Gifts of Eternity. A fierce internal struggle was underway: man was in conflict with himself. 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 35 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం - 5 🌻*

నంద్యాలలో విశ్వబ్రాహ్మణులలో సంపన్నులను 'పాంచాననం 'అని పిలిచేవారు. వీరు చాలా అహంకారంతో ప్రవర్తించేవారు. సహాయం కోరి వచ్చిన వారితోనూ, ఇతరులతోనూ, వయసులో పెద్దవారు అని కూడా చూడకుండా తలబిరుసుతనంతో కించపరుస్తూ మాట్లాడేవారు.

ఒకసారి బ్రహ్మంగారు ఆ ఊరికి వచ్చారు. ఆ ఊరిలోని కొందరు భక్తులు స్వామి వారికి భోజనాది వసతులు కల్పించారు. కానీ,పాంచాననం వారు మాత్రం తమకేమీ పట్టనట్టు వున్నారు.

ఇదంతా గమనించిన బ్రహ్మేంద్రస్వామి తానే వారి వద్దకు వెళ్లి "నాయనలారా నా తప్పేముంది? అతి పేదలమైన మేము క్షుద్భాదని ఓర్వలేక మా ఆకలి తీర్చగలరని మీ వద్దకు వచ్చాము. మాకు భోజన సదుపాయములు కల్పించి మా ఆకలి తీర్చగలవారు మీరొక్కరే అని భావిస్తున్నాను. అందువల్ల మీ దగ్గరికి వచ్చాం" అని పలికారు.

వారిలో ఒక వృద్ధుడు 'తినేందుకు ఎంత అన్నం అవసరం అవుతుందో చెప్పమని 'పరిహాస పూర్వకంగా అన్నాడు.

“మాకు ఎంత అవసరం అవుతుంది నాయనా?! ఏదో మా కడుపు నిండితే చాలు" అని బ్రహ్మంగారు జవాబిచ్చారు.

బ్రహ్మంగారిని ఏదో విధంగా అవమానపరచాలని అనుకున్నవారిలో ఒక వ్యక్తి "అబ్బే... మీరు మరీ అంత తక్కువ తింటే మాకు సంతృప్తి వుండదు స్వామిగారూ! మీరు మా అతిథి. మేం మీ కోసం పుట్టి బియ్యం వండి నైవేద్యం అందిస్తాం. మీరు ఏమీ మిగలకుండా తింటేనే మాకు ఆనందం కలుగుతుంది'' అని ఎగతాళిగా అన్నాడు.

“మీరు అంత అడిగినప్పుడు నేను కాదు అని ఎలా అనగలను నాయనా! అలాగే చేయండి ” అన్నారు బ్రహ్మంగారు.

ఆ విశ్వబ్రాహ్మణులు పుట్టి బియ్యం వండించారు. దానిని ఆరగించమని స్వామి వారిని, శిష్యులను భోజనానికి పిలిచారు.

వీరికి తగిన జవాబివ్వాల్సిందేనని నిశ్చయించుకున్న స్వామివారు తన శిష్యుడయిన సిద్ధయ్యను పిలిచి "ఈ అన్నం మొత్తం నువ్వొక్కడివే స్వీకరించి, మనకు అన్నం దానమిచ్చిన వారిని సంతుష్టులను చేయి" అని ఆజ్ఞాపించారు. తర్వాత ఆ అన్నపు రాశి నుంచి ఒక ముద్దను తీసుకుని పక్కకు నిలబడ్డాడు. గురుదేవుని ఆజ్ఞ ప్రకారం ఆ పుట్టి అన్నాన్ని కూడా వేగంగా ఆరగించేశాడు.

వెంటనే జీర్ణం చేసుకుని, తనకు మరింత అన్నం కావాలని సంజ్ఞ చేశాడు. దీన్ని చూసి నిర్ఘాంతపోయిన ఆ విశ్వబ్రాహ్మణులు బ్రహ్మంగారు కావాలని ఈ విధంగా చేశారని గ్రహించారు. వారి శక్తిని గ్రహించి, తమ అహంకారాన్ని, అజ్ఞానాన్నిక్షమించమని కోరారు.

బ్రహ్మంగారు చిరునవ్వు నవ్వి, తన చేతిలో వున్నఅన్నపు ముద్దను సిద్ధయ్యకు తినిపించాడు. అప్పటికి గానీ అతనికి కడుపు నిండలేదు. తర్వాత ఆ విశ్వ బ్రాహ్మణులు స్వామికి పూజలు చేసి, తమకు తత్వోపదేశం చేయమని అభ్యర్థించారు. బ్రహ్మంగారు వారందరికీ జ్ఞానోపదేశం చేశారు.

తర్వాత స్వామివారు అక్కడి నుంచి బయల్దేరి అహోబిలం చేరి అక్కడ వున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అక్కడ నుంచీ మళ్ళీ బయలుదేరి కడపకు చేరారు. కడప నవాబుకు తమ రాక గురించి తెలిపారు.

వెంటనే నవాబు తన పరివారంతో సహా బ్రహ్మంగారి దగ్గరకు వెళ్లి , ఆయనకు సకల గౌరవ సత్కారాలు చేసి, తమతో పాటు తోడ్కొని వెళ్లాడు.

బ్రహ్మంగారి మహిమలు గురించి విన్ననవాబు, ఏదో విధంగా స్వామి వారి మహిమలను చూడాలని నిర్ణయించుకుని, స్వామి దగ్గరకు వచ్చి, మరుసటి రోజు కచేరీ ముందు వున్న మైదానంలో జరిగే సభకు రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చిరునవ్వుతో "నీ మనస్సులో వున్న కోరిక తెలిసింది.నువ్వు అనుకున్నదానిని నేను చేసి చూపించగలను'' అని చెప్పి పంపించారు.

తన మనస్సులో బ్రహ్మంగారి మహిమను పరీక్షించాలి అనుకున్నట్టు ఈయన ఎలా కనిపెట్టారో అర్థంకాక నవాబు విస్మయంలో మునిగిపోయాడు. తాను ఏర్పాటు చేస్తున్న సభ గురించి అందరికీ తెలిసేలా చాటింపు వేయించాడు నవాబు.

మరుసటి రోజు సాయంత్రం ప్రజలందరూ సభా స్థలం వద్దకు చేరుకున్నారు. వీర బ్రహ్మేంద్రస్వామి తన శిష్యులతో సభకు వచ్చి ఆశీనులయ్యారు. నవాబు లేచి నిలబడి "స్వామీ! నా వద్ద ఒక చూడి గుర్రం వుంది. అది ఆడ గుర్రాన్ని కంటుందో లేక మగ గుర్రాన్ని కంటుందో తెలియజేయండి" అని కోరాడు.

స్వామి చిరునవ్వుతో ఆ గుర్రాన్ని సభకు తీసుకురమ్మని కోరగా , నవాబు స్వామివారి ఎదుటకు గుర్రాన్ని తెప్పించాడు. స్వామి ఆ గుర్రాన్ని చూసి "దీని గర్భంలో నాలుగు తెలుపురంగు కాళ్ళు, నొసట చుక్క, పువ్వుల తోక కలిగిన మగ గుర్రం ఉంది. అలాంటి వింత గుర్రమే జన్మిస్తుంది" అని చెప్పారు.

ఆ మాట విన్న తర్వాత కూడా నవాబుకి వున్న సందేహం దూరం కాలేదు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. అద్భుత సృష్టి - 7 🌹*
 ✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
          
*🌟 2. భూమి - మానవ సృష్టి - 2 🌟*
*
          
🌟. ఈ భూమిని సమాచార ప్రసరణ కేంద్రంగా మలచిన వారు *"కాంతి శరీరధారులు"!* *'కాంతి'* అంటే *'చైతన్యం'.* కాంతే సమాచారం. ఈ సమాచారాన్ని విభిన్న ప్రకంపనల రూపంలో.. DNA లోని జన్యువులలో పదిలపరచి ఈ భూమిని ప్రయోగశాలగా మార్చారు. 

ఇక్కడ కొన్ని కోట్ల సంవత్సరాలు (అనేక యుగాలు) ఎన్నో జన్యుపరిజ్ఞాన పరిశోధనలు జరిగాయి. మన పుస్తకాలలో చదువుకున్న చరిత్రకు పూర్వమే భూమి ఎంతో గొప్ప నాగరికతను సంతరించుకుంది. ఇప్పుడు modern science చేస్తున్న కొత్త కొత్త ప్రయోగాలు అన్నీ ఈ భూమిపై ఎప్పుడో జరిగిపోయాయి!

 💫. ఇంతటి జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకున్న ఈ భూమి అనే సజీవ గ్రంథాలయాన్ని సొంతం చేసుకోవడానికి ఎన్నో విశ్వాలవాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి యుద్ధాలు కూడా చేసుకున్నారు.

💫. ఇప్పటి కాలమానం ప్రకారం మూడు లక్షల సంవత్సరాలకు పూర్వం ఈ భూమి దురాక్రమణకు గురి అయింది. ఈ ఆక్రమణదారులకు భూమి, భూలోకవాసులు విజ్ఞానులుగా, స్వతంత్రులుగా ఉండటం ఇష్టం లేదు. 

భూమిపై ఉన్న మనుషులను అజ్ఞానులుగా తయారు చేసి ఈ భూమిని ఆక్రమించి వారి ఆధీనంలోకి తెచ్చుకున్నట్లైయితే... ఇలాంటి ఎన్నో విశ్వాలతో ఉన్న భూములు తమ ఆధీనంలోకి వస్తాయనీ.. తద్వారా మూలం పై (భగవంతునిపై) తిరుగుబాటు చేయవచ్చు అన్న ఆలోచనతో వారు భూమిని దురాక్రమించడం జరిగింది.

💫. భూమిని ఆక్రమించిన వెంటనే వాళ్ళు మొదట భూమిపైకి వస్తున్న ఇతర విశ్వాల సమాచార వ్యవస్థను ధ్వంసం చేశారు. దీని ద్వారా మానవునికి అందుతోన్న జ్ఞానం అందకుండాపోయి .. 

కాంతి ద్వారాలు అన్నీ మూసివేయబడ్డాయి. *'కాంతి'* అంటే *'జ్ఞానం'.* ఈ జ్ఞాన ప్రసరణ భూమిపైకి మరి ఏ ఇతర దారుల గుండా రాకుండా భూమి యొక్క కాంతి గ్రిడ్ లను ఛేదించి.. చీకటి శక్తుల యొక్క పటిష్టమైన గ్రిడ్ లను తయారు చేశారు. వీటి వల్ల కాంతి భూమిపైకి రాకుండా కొన్ని వేల సంవత్సరాలపాటు చీకటిలో ఉండిపోయింది.

*'చీకటి'* అంటే *'అజ్ఞానం'*. ఇలా వాళ్ళు భూమినీ మరి భూమిపై ఉన్న మనుషులనూ పూర్తి అజ్ఞానులుగా, ద్వంద్వత్వపు గేమ్ లోని పావులుగా తయారు చేశారు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 151 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

*🌻 What you seek is so near you, that there is no place for 'a way.' 🌻*

The name and form of the spiritually enlightened saint experiences the pangs and sorrows of life, but not their sting. 

He is neither moved nor perturbed by the pleasures and pains, nor the profits and losses of the world. He is thus in a position to direct others. His behaviour is guided exclusively by the sense of justice.

Don't look for quick results, there may be none within your noticing.

Unknown to you, your psyche will undergo a change, there will be more clarity in your thinking and feeling, purity in your behaviour. You need not aim at these - you will witness the change all the same.

To know that you are neither body nor mind, watch yourself steadily and live unaffected by your body and mind, completely aloof, as if you were dead.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 29 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 18 🌻*

అప్పుడేమౌతాడు వాడు? అదే మోహంలో మరింతగా కూరుకుపోతాడు. పైగా ఈసారి ఏమనుకుంటాడు. మా గురువుగారే చెప్పారు కదా అనుకుంటాడు. మా గురువుగారే చెప్పగా ఇంకేముంది సమస్య. ఏమండీ మా అబ్బాయిని విదేశాలకి పంపించమంటారా అని నన్ను అడిగారనుకోండి. నేను ఏమి చెప్పగలుగుతాను. మా అమ్మాయికి ఈ పెళ్ళి చెయ్యమంటారా, ఈ సంబంధం కుదర్చమంటారా అని నన్నడిగారు అడిగారనుకోండి. నేనేం చెప్పగలుగుతాను. ఏమండీ ఈ ఇల్లు కొనమటారా అని నన్ను అడిగారనుకోండి. నేనేం చెప్పగలుగుతాను.

         కాబట్టి ఈ రకమైనటువంటి జగద్వ్యాపార లక్షణాలలో నీవు గనక గురువును ఉపయోగించుకోవడం ప్రారంభించావనుకో అప్పుడు ఆత్మోన్నతికి గురువును ఉపయోగించుకునేటటువంటి అవకాశాన్ని కోల్పోతావు. 

ఎందువల్ల అంటే ఆ గురువు అప్పుడు నీకు ఎట్లా కనబడతాడు అంటే నీ కోర్కెలు, నీ సందేహాలు, నీ సంసారగత సంబంధ విషయములను తీర్చేటటువంటి సాధారణమైనటువంటి విద్వాంసుడు, పండితుడు, శాస్త్రజ్ఞుడు కామ్యకకర్మలయందు, ధర్మములయందు, శాస్త్రములయందు విశేషమైన పాండిత్యం కలిగి సలహాలిచ్చేటటువంటి సలహాదారుగా ఉపయోగపడతాడే తప్ప నీ అత్మోన్నతికి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, నువ్వు మోక్షాన్ని పొండానికి, నీవు విద్యావంతుడవు అవడానికి, నువ్వు శ్రేయోమార్గమున నడవడానికి సరియైనటువంటి సద్గురుమూర్తిగా నీకతను ఉపయోగపడలేడు.

         కాబట్టి గురువుని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నామనేటటువంటి అధికారిత్వం కూడా చాలా ముఖ్యమైనటు వంటిది. ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివాడిని ఆశ్రయించిన పద్ధతిగా వుండేది అవిద్యా పద్ధతి. 

మోహపద్ధతి. ప్రేయోమార్గ పద్ధతి. ఇద్దరూ గ్రుడ్డివాళ్ళైతే పొందే ఫలం కూడా అంధకారమే. కాబట్టి పరలోక ప్రాప్తి సాధనమైనటువంటి ఆముష్మిక సాధనలైనటువంటి ఆధ్యాత్మిక మార్గమైనటువంటి ఆత్మయే సర్వాధికమైనటువంటిది అనేటటువంటి మార్గంలో ప్రవేశించాలి అంటే మానవులందరూ తప్పక తపోనిష్ఠ కలిగివుండాలి.

 తప్పక ఇంద్రియములను ఇంద్రియార్ధములందు, అవి కోరినటువంటి వాటియందు ప్రవేశింపనివ్వక, నిరోధించి నీ లక్ష్యమైనటువంటి ఆత్మవిచారణా జ్ఞానమున ప్రవేశింపజేసి, మనోబుద్ధులను ఆత్మయందు సంయమింపచేయాలి. మనోబుద్ధులను చైతన్యస్థితి యందు సంయమింపచేయాలి.

 ఇంద్రియములను మనోబుద్ధులయందు, మనోబుద్ధులను చైతన్యమునందు, చైతన్యమును తనమూలమైనటువంటి పరమాత్మయందు ఎవరైతే ఉపశమింపచేస్తారో, ఉపరమింపచేస్తారో, విశ్రమింపచేస్తారో, సంయమింపచేస్తారో వారే ఆధ్యాత్మిక సాధనలో పురోగమించగలిగేటటు వంటివారు. అటువంటి ఆత్మవిద్యని గ్రహించవలసినటువంటి అవసరం వున్నది.

ఈ ఆత్మవిద్యకి అత్యంత ముఖ్యమైనటువంటి అధికారిత్వంలో వున్న లక్షణాలు చెప్తున్నారు. అహింస, సత్యం, శౌచం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం మొదలగువానిని యమనియమాదుల యొక్క లక్షణాలన్నిటినీ ఇక్కడ వివరిస్తున్నారు. ఈ అహింస, సత్యం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం ఈ లక్షణాలని తప్పక మానవులందరూ కూడా ఆచరించాలి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 6. దివ్యజ్ఞానము - సూక్ష్మ లోకముల జ్ఞాన అవగాహన కలిగిన జీవుడు శాశ్వతుడే. సూక్ష్మస్థితుల అవగాహనము, దర్శనమే దివ్య జ్ఞానము. 🌹*

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 6 📚*

*ఈ సృష్టియందు ఏ వస్తువుగాని ఒకప్పుడు లేకుండ ఇప్పుడు వుండుట సంభవింపదు. అట్లే ఇప్పుడుండి ఇకముందు ఉండకపోవుట కూడ సంభవింపదు.*

 ఎప్పుడునూ అన్నియును వుండి యున్నవే కాని ఒకప్పుడు లేనివి కావు. ఒకే వస్తువు స్థితి మార్పులు చెందుచున్నప్పుడు ఆ వస్తువునకు అంతకు ముందు స్థితి లేకుండుట. క్రొత్త స్థితి ఏర్పడుట, అదియును మరల మారుట ఒక రసాయనికచర్యగ జరుగుచుండును. ఈ స్థితి మార్పు నిత్యము జరుగు చుండుటచే వుండుట, లేకుండుటగ వస్తువులు గాని, జీవులు గాని కనిపించు చుందురు. 

న త్వేవాహం జాతు నాసం న త్వం నేమో జనాధిపాః |
నచైవ న భవిష్యామ స్వర్వే వయ మతó పరమ్‌ || 12
దేహినో-స్మిన్‌ యథా దేహే కౌమారం యøవనం జరా |
తథా దేహాంతరప్రాప్తిó ధీర స్తత్రన ముహ్యతి || 13

బాలకుడు యువకుడైనపుడు ఇట్టి మార్పే జరుగుచున్నది. బాలకుడు లేకుండుట యువకు డుండుటగ ఒకే జీవుడు ప్రస్తుతింపబడి యున్నాడు. అటులనే యువకుడు మధ్య వయస్కుడు, వృద్ధు అగుట, మరణించుట కూడ గమనించు చున్నాము. మరణించినవాడే మరల పుట్టుచున్నాడని తెలియుటకు సూక్ష్మలోకముల అవగాహనము, దర్శనము కలిగి యుండవలెను.

అది తెలిసినవాడు జీవుడు శాశ్వతుడనియు, సూక్ష్మ స్థూల స్థితులు పొందుచుండుననియు తెలియగలడు. కేవలము స్థూల స్థితులు మాత్రమే తెలిసిన వారికి పూర్ణజ్ఞానము లేక తికమక పడుచుందురు. సూక్ష్మ స్థితులు కూడ తెలిసినవాడే, తెలిసినవాడు.

సూక్ష్మస్థితి యందుండుట కూడ తెలిసినవాడు కావున శ్రీకృష్ణుడు స్థూలమున మరణించిన వాడిని సైతము సూక్ష్మ లోకములలో గుర్తించి కొనితెచ్చి తల్లికి, గురువునకు, బ్రాహ్మణునకు, జ్ఞానము నందించినాడు. సూక్ష్మస్థితుల అవగాహనము, దర్శనమే దివ్య జ్ఞానము. యోగము ఆ స్థితుల నందుటకు మార్గము. అట్టి యోగమునకు అధిషాసన దైవము శ్రీకృష్ణుడే. అందుచే అర్జునునకు స్థూల, సూక్ష్మ స్థితులను, జీవులకు జరుగు స్థితి మార్పులను బోధించి యోగమున ప్రవేశపెట్టెను.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram whatsapp Group, Blogs 

https://t.me/joinchat/Aug7plAHj-F_kRa17B6xzg

Follow 
https://dailybhakthimessages.blogspot.com/
https://incarnation14.wordpress.com/


https://chat.whatsapp.com/CSst9CVco6GDNGaIEQISi4


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹