సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 30


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 30 🌹
30 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 చత్తము ఒక మాయా చక్రము 2 🍃

201. చిత్తము ఉన్నచో మూడు లోకములు ఉండును. చిత్తము నశించిన జగత్తు నశించును. రాగద్వేషములే చిత్త సంస్కారములు. ఆ సంస్కారములే సంసారము. లోకములు, లోకేశులు, లోకస్థులు, అన్నీ చిత్తభ్రాంతియే. వీటి మిథ్యాభావమే చిత్త శాంతి.

202. శరీరాభిమానము గల యోగి ఇతరుల అభిప్రాయములను గ్రహించలేడు. అందుకు యోగ సాధన అవసరము.

203. యోగాగ్నిలో పూర్వ సంస్కారములను భస్మం గావించుచూ, చిత్త శుద్ధి ద్వారా నూతన సంస్కారములు ఏర్పడకుండా చూడాలి. చిత్తములో విషయాకార వృత్తులు నశించి, ఆత్మాకార వృత్తులేర్పడవలెను. అద్వైత సిద్ధిలో అన్ని వృత్తులు నశించును.

204. కర్మ రాహిత్యము పొందినప్పుడు చిత్తము సమాధి స్థితి నొందుచున్నది. దానినే చిత్తలయము అంటారు.

205. అనేక వాంఛలు, విషయాల, కోరికల సంయోగమైన చిత్తము పురుషుని (ఆత్మ) కొరకు ఏర్పడినది. పురుషుడు లేనిచో చిత్తము లేదు. చిత్తము లేనిచో పురుషుడుండడు. ఇంద్రియాలు చిత్తానికి ప్రేరణ కలిగిస్తాయి. బుద్ధిని ఉపయోగించి ఇంద్రియాలను జయించాలి. చిత్త శాంతి కలిగితే పురుషుడే బ్రహ్మము.

206. చిత్తము శుద్ధ సాత్వికమైనప్పటికి దాని చుట్టూ రజోగుణములు, తమోగుణములు కప్పి ఉంటాయి.

207. ప్రకృతిలో గల అనేక శక్తులను గ్రహించే శక్తి చిత్తానికి మాత్రమే ఉంది.

208. చిత్త స్త్థెర్యము లభించాలంటే ఆత్మ జ్యోతిని ధ్యానించాలి. విషయ వాసనలు త్యజించాలి.

209. అనన్య చిత్తుడైనవాడు చిత్తమునందు నిరంతర బ్రహ్మ చింతన, సంకల్పములు లేకుండా అనంత భావంతో నిరంతరం ఆత్మ చింతన చేసిన అనన్యత సిద్ధించును.

210. మనస్సు కేవలము విషయములను సేకరించిన, బుద్ధి వాటిని గ్రహించి విశ్లేషణ చేయగా, చిత్తము ఆ విషయములను తనలో నిక్షిప్తము చేస్తుంది. అదే చిత్రగుప్తుని ఖాతా. దాన్ని బట్టి మనం తిరిగి కర్మలు చేస్తుంటాము. సంఘటనలన్నీ విషయాలుకాదు. విషయీకరించుకొన్నవి మాత్రమే విషయాలు. ఉదాసీన చిత్తము నిర్విషయ మగును.
🌹 🌹 🌹 🌹 🌹

గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) 29

🌹 *గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌)* 🌹
*29 వ భాగము*
✍ రచన : *పేర్నేటి గంగాధరరావు*

🍃 *చిత్తము ఒక మాయా చక్రము 1* 🍃 

*194. అంతఃకరణ చతుష్టయములో చిత్తము ఒకటి.ఇది జడమైనది. దేహముపై ఆసక్తి, కుటుంబముపై ఆసక్తి, ఆశల చేత ఇది స్థూలత్వమును పొందుచున్నది. సమస్త ఇంద్రియములకు నాయకుడు చిత్తము. మాయా చక్రము యొక్క మాహానాభి (బొడ్డు) యే చిత్తము. ఇది శరీరము యొక్క కేంద్ర భాగము. చిత్తము మానవుని నాభి స్థానము నుండి పనిచేయును. ఇది నిరంతరము పరిభ్రమించుచుండును. విషయాసక్తియే చిత్త వృత్తి.*

*195. జీవికి గల అంతఃకరణ వృత్తియే చిత్తము. సమస్త దుఃఖములకు, సుఖాలకు, చిత్తమే కారణము. దేహము నేను అనెడి చిత్త వృత్తి నశించవలెను. యోగులు చిత్త క్షయానికి సాధన చేస్తుంటారు. దేహము చిత్తముచే చలింపబడుచున్నది.*

*196. అంతఃకరణము, బుద్ధి, మహత్తు, అహంకారము, ప్రాణము, జీవుడు ఇవన్నియూ చిత్తము యొక్క వృత్తి రూపములు.*

*197. చిత్తము ఒక విష వృక్షము. ఇంద్రియ విషయ భోగములు దాని శాఖలు, కొమ్మలు. ధ్యానమునకు చిత్తము యొక్క నిశ్చలత్వము చాలా అవసరము. చిత్తమందు వాసనారహితము కావలెను. ఇది చిత్త వృత్తి నిరోధము వలన జరుగును.*

*198. కర్మానుసారము ఏర్పడిన దేహమె చిత్తము. చిత్తమె జీవుడు. సంసార రాహిత్యమునకు, సంసార బంధనాలకు చిత్తమె కారణము.*

*199. మనస్సు అతి శీఘ్రముగా వివిధ ప్రదేశములు సంచరించి సేకరించిన అనేక ప్రాపంచిక విషయముల సమూహమే చిత్తము. చైతన్యము పై వాసనలు ముద్రించబడితే అతి చిత్తము. చిత్తములో వాసనాక్షయమైతే అది చిత్‌, అనగా పరమాత్మ.*

*200. చిత్తము శుద్ధమైన అనగా విషయములు నశించిన, చైతన్యము నిర్మలమైన స్థితి ఏది కలదో అదే సత్యము. ఈ చిత్తమును విచారణ ద్వారా, పరిశీలన ద్వారా ప్రయత్న పూర్వకముగా శుద్ధము చేయవలెను. సత్కర్మాచరణ, సత్సంగము ద్వారా చిత్త శుద్ధి కలుగును. అపుడు కర్మలు నశించును, తద్వారా బ్రహ్మానుభూతి కలుగును.*
🌹 🌹 🌹 🌹 🌹
🙏 *ప్రసాద్*

వివేక చూడామణి 30

🌹 *వివేక చూడామణి* 🌹
*30 వ భాగము*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
🍃  *కోరికలు, కర్మలు - 3* 🍃

*330. ఎపుడైతే వ్యక్తి ఏ కొంచము బ్రహ్మము నుండి విడిపోయిన, వెంటనే అతడు తాను చేసిన పొరపాటు గమనించి భయానికి లోనవుతాడు.*

*331. ఎవరైతే తాను విశ్వములోని బాహ్య వస్తు విశేషములకు అనుగుణముగా నడుచుకుంటాడో అతడు దుఃఖాలకు ఒకటి తరువాత ఇంకొకటి ఎదుర్కొంటూ, దొంగ తాను చేసిన తప్పుకు భయపడినట్లు, చిక్కుల్లో పడతాడు. ఈ విషయాలు సృతులలోనూ, అనుభవాల ద్వారా గ్రహించగలరు.*

*332. ఎవరైతే ధ్యానవిధానమునకు విధేయులై ఉంటారో వారు మాయకు అతీతులవుతారు. మరియు ఉన్నతమైన ఆత్మోన్నతిని పొందగలరు. అయితే ఎవరైతే అశాశ్వతమైన విశ్వ పదార్థములకు, కోరికలకు లోనవుతారో వారు నాశనం అవుతారు. అందుకు ఉదాహరణగా దొంగతనము చేసినవాడు భయపడుతూ ఉంటే చేయని వాడు నిర్భయముగా సంచరించగలడు.*

*333. సన్యాసులు తాము అసత్య వ్యవహారములలో పాల్గోనరాదు. అలా జరిగిన అతడు బంధనాలలో చిక్కుకొనును. అందువలన అతడు తన మనస్సును ఎల్లప్పుడు నేనే బ్రహ్మాన్నని, అంత బ్రహ్మమేనని భావిస్తూ ఎల్లప్పుడు బ్రహ్మానంద స్థితిలో ఉంటూ, పాపాలకు, దుఃఖాలకు, మాయకు వ్యతిరేఖముగా జీవిస్తాడు. ఎందువలనంటే అవన్ని అతడు ముందే అజ్ఞానములో ఉన్నప్పుడు అనుభవించాడు.*

*334. బాహ్య వస్తు సముధాయముపై ఆధారపడి జీవించిన, వాటి చెడు ఫలితాలు ఇంకా ఇంకా పెరిగిపోతుంటాయి. ఈ విషయాన్ని గ్రహించి బాహ్య వస్తువులపై వ్యామోహమును తొలగించి, స్థిరముగా వ్యక్తి బ్రహ్మమును గూర్చి ధ్యానములో నిమగ్నుడై ఉండవలెను.*

*335. ఎపుడైతే బాహ్య ప్రపంచము మూసి వేయబడుతుందో, మనస్సు ఆనందముతో నిండి ఉంటుంది. ఆ ఆనంద స్థితిలో మనస్సుకు బ్రహ్మానంద స్థితి లేక పరమాత్మ స్థితి అనుభవమవుతుంది. ఎపుడైతే ఖచ్చితముగా అట్టి అనుభవమవుతుందో అపుడు చావు పుట్టుకల గొలుసు తెగిపోతుంది. అందువలన విముక్తికి మొదటి మెట్టు బాహ్య ప్రపంచము వైపు తెరచి ఉన్న తలుపులను మూసివేయుట.*

*336. విద్యావంతడైన వ్యక్తి ఎచ్చట ఉంటే అచ్చట ఆ వ్యక్తి సత్యాసత్యముల విచక్షణా జ్ఞానముతో వేదాలను నమ్మి తన దృష్టిని అతని వైపు మళ్ళించగలుగుతాడు. అదే అత్యున్నతమైన సత్యము. సాధకుడు అట్టి స్థితిని పొందిన తరువాత చిన్న పిల్లల వలె కాక జాగ్రత్తగా అసత్యమైన విశ్వానికి దూరముగా ఉంటాడు. లేనిచో అది అతని పతనానికి కారణమవుతుంది.*

*337. శరీరానికి కట్టుబడి ఉన్న వ్యక్తికి విముక్తి లేదు. అలానే విముక్తి పొందిన వ్యక్తికి శరీరముతో ఏవిధమైన గుర్తింపు ఉండదు. నిద్రించు వ్యక్తి మెలుకవలో ఉండడు. మెలుకవలో ఉన్న వ్యక్తి నిద్రించడు. ఈ రెండు వ్యతిరేక ప్రభావము కలిగి ఉన్నవి.*

*338. ఎవడైతే తన మనస్సుతో తన ఆత్మను తెలుసుకొంటాడో అతడు స్వేచ్ఛను పొందుతాడు. అలా కాక కదులుచున్న, స్థిరముగా ఉన్న వస్తు సముదాయముపై దృష్టిని ఉంచి గమనిస్తుంటాడో, అది అతని పతనము. అందువలన అన్ని మోసాలను అధికమించి వ్యక్తి తన యొక్క ఆత్మిక స్థితిలో స్థిరపడాలి.*
🌹🌹🌹🌹🌹
🙏 *ప్రసాద్*

గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) 30

🌹 గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) 🌹
30 వ భాగము
✍ రచన : పేర్నేటి గంగాధరరావు

🍃 చిత్తము ఒక మాయా చక్రము 2 🍃 

201. చిత్తము ఉన్నచో మూడు లోకములు ఉండును. చిత్తము నశించిన జగత్తు నశించును. రాగద్వేషములే చిత్త సంస్కారములు. ఆ సంస్కారములే సంసారము. లోకములు, లోకేశులు, లోకస్థులు, అన్నీ చిత్తభ్రాంతియే. వీటి మిథ్యాభావమే చిత్త శాంతి.

202. శరీరాభిమానము గల యోగి ఇతరుల అభిప్రాయములను గ్రహించలేడు. అందుకు యోగ సాధన అవసరము.

203. యోగాగ్నిలో పూర్వ సంస్కారములను భస్మం గావించుచూ, చిత్త శుద్ధి ద్వారా నూతన సంస్కారములు ఏర్పడకుండా చూడాలి. చిత్తములో విషయాకార వృత్తులు నశించి, ఆత్మాకార వృత్తులేర్పడవలెను. అద్వైత సిద్ధిలో అన్ని వృత్తులు నశించును.

204. కర్మ రాహిత్యము పొందినప్పుడు చిత్తము సమాధి స్థితి నొందుచున్నది. దానినే చిత్తలయము అంటారు.

205. అనేక వాంఛలు, విషయాల, కోరికల సంయోగమైన చిత్తము పురుషుని (ఆత్మ) కొరకు ఏర్పడినది. పురుషుడు లేనిచో చిత్తము లేదు. చిత్తము లేనిచో పురుషుడుండడు. ఇంద్రియాలు చిత్తానికి ప్రేరణ కలిగిస్తాయి. బుద్ధిని ఉపయోగించి ఇంద్రియాలను జయించాలి. చిత్త శాంతి కలిగితే పురుషుడే బ్రహ్మము.

206. చిత్తము శుద్ధ సాత్వికమైనప్పటికి దాని చుట్టూ రజోగుణములు, తమోగుణములు కప్పి ఉంటాయి.

207. ప్రకృతిలో గల అనేక శక్తులను గ్రహించే శక్తి చిత్తానికి మాత్రమే ఉంది.

208. చిత్త స్త్థెర్యము లభించాలంటే ఆత్మ జ్యోతిని ధ్యానించాలి. విషయ వాసనలు త్యజించాలి.

209. అనన్య చిత్తుడైనవాడు చిత్తమునందు నిరంతర బ్రహ్మ చింతన, సంకల్పములు లేకుండా అనంత భావంతో నిరంతరం ఆత్మ చింతన చేసిన అనన్యత సిద్ధించును.

210. మనస్సు కేవలము విషయములను సేకరించిన, బుద్ధి వాటిని గ్రహించి విశ్లేషణ చేయగా, చిత్తము ఆ విషయములను తనలో నిక్షిప్తము చేస్తుంది. అదే చిత్రగుప్తుని ఖాతా. దాన్ని బట్టి మనం తిరిగి కర్మలు చేస్తుంటాము. సంఘటనలన్నీ విషయాలుకాదు. విషయీకరించుకొన్నవి మాత్రమే విషయాలు. ఉదాసీన చిత్తము నిర్విషయ మగును.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్
30 వ భాగము
✍ రచన : పేర్నేటి గంగాధరరావు

🍃 చిత్తము ఒక మాయా చక్రము 2 🍃 

201. చిత్తము ఉన్నచో మూడు లోకములు ఉండును. చిత్తము నశించిన జగత్తు నశించును. రాగద్వేషములే చిత్త సంస్కారములు. ఆ సంస్కారములే సంసారము. లోకములు, లోకేశులు, లోకస్థులు, అన్నీ చిత్తభ్రాంతియే. వీటి మిథ్యాభావమే చిత్త శాంతి.

202. శరీరాభిమానము గల యోగి ఇతరుల అభిప్రాయములను గ్రహించలేడు. అందుకు యోగ సాధన అవసరము.

203. యోగాగ్నిలో పూర్వ సంస్కారములను భస్మం గావించుచూ, చిత్త శుద్ధి ద్వారా నూతన సంస్కారములు ఏర్పడకుండా చూడాలి. చిత్తములో విషయాకార వృత్తులు నశించి, ఆత్మాకార వృత్తులేర్పడవలెను. అద్వైత సిద్ధిలో అన్ని వృత్తులు నశించును.

204. కర్మ రాహిత్యము పొందినప్పుడు చిత్తము సమాధి స్థితి నొందుచున్నది. దానినే చిత్తలయము అంటారు.

205. అనేక వాంఛలు, విషయాల, కోరికల సంయోగమైన చిత్తము పురుషుని (ఆత్మ) కొరకు ఏర్పడినది. పురుషుడు లేనిచో చిత్తము లేదు. చిత్తము లేనిచో పురుషుడుండడు. ఇంద్రియాలు చిత్తానికి ప్రేరణ కలిగిస్తాయి. బుద్ధిని ఉపయోగించి ఇంద్రియాలను జయించాలి. చిత్త శాంతి కలిగితే పురుషుడే బ్రహ్మము.

206. చిత్తము శుద్ధ సాత్వికమైనప్పటికి దాని చుట్టూ రజోగుణములు, తమోగుణములు కప్పి ఉంటాయి.

207. ప్రకృతిలో గల అనేక శక్తులను గ్రహించే శక్తి చిత్తానికి మాత్రమే ఉంది.

208. చిత్త స్త్థెర్యము లభించాలంటే ఆత్మ జ్యోతిని ధ్యానించాలి. విషయ వాసనలు త్యజించాలి.

209. అనన్య చిత్తుడైనవాడు చిత్తమునందు నిరంతర బ్రహ్మ చింతన, సంకల్పములు లేకుండా అనంత భావంతో నిరంతరం ఆత్మ చింతన చేసిన అనన్యత సిద్ధించును.

210. మనస్సు కేవలము విషయములను సేకరించిన, బుద్ధి వాటిని గ్రహించి విశ్లేషణ చేయగా, చిత్తము ఆ విషయములను తనలో నిక్షిప్తము చేస్తుంది. అదే చిత్రగుప్తుని ఖాతా. దాన్ని బట్టి మనం తిరిగి కర్మలు చేస్తుంటాము. సంఘటనలన్నీ విషయాలుకాదు. విషయీకరించుకొన్నవి మాత్రమే విషయాలు. ఉదాసీన చిత్తము నిర్విషయ మగును.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

వివేక చూడామణి 31

🌹 వివేక చూడామణి 🌹
31 వ భాగము
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
🍃  ఆత్మ స్థితిని చేరుట 🍃

339. విశ్వమంతా ఒకే ఆత్మ అని తెలుసుకొనుటయే బంధనాల నుండి విముక్తిని పొందుటకు మార్గము. విశ్వాన్ని ఆత్మతో సమానమని గుర్తించుట కంటే ఉన్నతమైనది ఏదీ లేదు. ఎవడైతే ఈ వస్తు ప్రపంచాన్ని వదలివేసి ఆత్మను గుర్తిస్తాడో, అందుకు శాశ్వతమైన ఆత్మవైపు స్థిరముగా మరలాలి. అతని కంటే ఉన్నతుడు ఎవడు ఉండడు.

340. ఎవడైతే తాను శరీరముగా భావిస్తారో అతడు ఈ వస్తు ప్రపంచానికి దూరముగా ఉండుట ఎలా సాధ్యమవుతుంది. అతని మనస్సు ఎల్లపుడు ఈ బాహ్య వస్తు సముదాయముపై లగ్నమై ఉంటుంది. తత్‌ఫలితముగా అతడు వాటిని పొందుటకు అనేక కార్యములు కొనసాగిస్తుంటాడు. సాధువు ఈ విధమైన వస్తు సముదాయముపై వ్యామోహము జాగ్రత్తగా గమనిస్తూ వాటికి దూరముగా ఉంటూ అలాంటి పనులను, విధులను, వస్తువులను వదలివేసి, ఉన్నతముగా ఆత్మ యందు నిమగ్నమై ఉంటారు. అపుడే వారికి నిరంతర ఆత్మానందము చేకూరుతుంది.

341. సాధువులు ఎవరైతే తమ గురువుల బోధనలు, సృతులను వింటారో వారు నిశ్చబ్దముగా, శాంతముగా, స్థితప్రజ్ఞతలో ఉంటూ సమాధి స్థితిలో ఉండి పరిపూర్ణానంద స్థితిలో నిమగ్నమై ఉంటారు.

342. జ్ఞానులు సహితము అకస్మాత్తుగా తమ యొక్క అహంకారమును నాశనం చేయలేరు. ఒక పర్యాయము స్థిరముగా బలపడిన తరువాత అడ్డంకులన్ని పూర్తిగా తొలగిపోయి, శాంతిని పొంది, నిర్వికల్ప సమాధి స్థితిలోకి చేరగల్గుతారు. కోరికలే అనంతమైన పుట్టుక, చావులకు కారణమవుతాయి.

343. అంతర్గత శక్తి వ్యక్తమై అది ప్రస్ఫుటమైనప్పడు, అహం యొక్క భావనలు పెంపొంది దాని ప్రభావముతో వ్యక్తిని చెడు మార్గము వైపు మళ్ళించి నేనే అన్నింటికి కారణమను భావన కలిగి పతనమవుతాడు.

344. వ్యక్తమవుతున్న అంతర్గత శక్తిని జయించుట చాలా కష్టము. అట్టి శక్తిని సంమూలముగా నాశనం చేయాలి. అపుడు అది ఆత్మను ఆవరించుట మాని ఖచ్చితముగా మంచి, చెడుల వస్తు వివేకములను గ్రహించి అతన్ని చెడు మార్గము నుండి మారునట్లు చేస్తుంది. అపుడు విజయము ఏమాత్రము అనుమానము లేకుండా లభించి, వస్తు విశేషముల నుండి దృష్టి మరల్చి ఊగిసరాట లేకుండా మనస్సును అసత్యమైన వస్తు సముదాయము నుండి మరల్చుతుంది.

345. ఖచ్చితమైన మంచి, చెడుల విచక్షణ వలన నేరుగా విషయము యొక్క సత్య స్వభావమును గ్రహించగలము. అపుడే బంధాలు తొలగి మాయ వలన ఏర్పడిన భ్రమలు వీడిపోయి మరల ఏ మార్పు లేకుండా, అతడు స్వేచ్ఛను పొందుతాడు.

346. జీవ బ్రహ్మముల ఏకత్వమును తెలిసిన జ్ఞానము వలన పూర్తిగా దట్టమైన అజ్ఞానమనే అడవిని ఛేదించి మాయను గుర్తించగలుగుతాడు. ఎవరైతే రెండింటి ఏకత్వమును తెలుసుకొంటాడో అతనిలోని అజ్ఞానము సమూలముగా తొలగి మార్పులకు లోనుకాకుండా ఉంటాడు.

347. సత్యాన్ని కప్పివేసిన తెర తొలగిపోవాలంటే కేవలము సత్యాన్ని గూర్చిన పూర్తి జ్ఞానము తెలుసుకోవాలి. అపుడు అజ్ఞానము నాశనం అవుతుంది. జ్ఞానము వ్యక్తమవుతుంది. అపుడే దారి తప్పినందువలన కలిగే దుఃఖాలు తొలగిపోతాయి.

348. మనం బంధనాలను గమనించినపుడు అవి తాడు వలె చుట్టుకొని, పెనవేసి, ముడి వేయుట తెలుస్తుంది. అందువలన జ్ఞాని తప్పక గ్రహించాలి, సత్యమైన బాహ్య వస్తు స్వభావమును తాను వాటి బంధనాల నుండి ఎలా బయటపడాలో.

349, 350. ఇనుము అగ్నితో సంబంధము ఏర్పచుకున్నపుడు అది అగ్ని కణాలను విడుదల చేస్తుంది. అలానే బుద్ది సాక్షిని, వస్తువును అందులోని బ్రహ్మము యొక్క వ్యక్తీకరణను గ్రహించినపుడు, తెలుసుకొనేది, తెలుసుకొనబడేది బుద్ది యొక్క ఫలితమని గ్రహించి, అది అసత్యమని, భ్రమ అని, కల అని, అలంకారమని అదే విధముగా అవన్నీ ప్రకృతిలోని మార్పులని మరియు అహంకారము కారణముగా శరీరము మొదలుకొని అన్ని బాహ్య వస్తువులు అసత్యాలని, అవి ఎల్లప్పుడు క్షణ క్షణము మారుతుంటవని గ్రహించాలి. ఆత్మ ఒక్కటియే ఎప్పటికి మారదు.

351. మన యొక్క ఉన్నతమైన ఆత్మ ఎల్లపుడు విడదీయుటకు వీలులేని ఏకైక విజ్ఞానము. రెండవది లేనిది. బుద్ధి దర్శించే వివిధ వస్తు సముదాయాలన్ని స్థూల, సూక్ష్మమైన భావము 'నేను' అనే శాశ్వతమైన అంతర్గత ఆనందాన్ని ఇచ్చే ఉన్నతమైన ఆత్మయే.

352. జ్ఞాని సత్యా సత్యములను విభజించి సత్యాన్ని ఆత్మ అనాత్మల ఏకత్వాన్ని గ్రహించి అంతర్‌ దృష్టితో సత్యాన్ని గ్రహించి, తన ఆత్మను తెలుసుకొని అది ఉన్నత జ్ఞానమని తనకు ఉన్న అడ్డంకులను తొలగించుకొని నేరుగా శాంతిని పొందును.
🌹🌹🌹🌹🌹
🙏 *ప్రసాద్*