Showing posts with label Karthik Pournami. Show all posts
Showing posts with label Karthik Pournami. Show all posts

కార్తిక పురాణం - 17 :- 17వ అధ్యాయము - అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము Kartika Purana - 17 :- Chapter 17 - Angirasa's philosophical advice to the greedy man

🌹. కార్తిక పురాణం - 17 🌹
🌻. 17వ అధ్యాయము - అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము 🌻
📚. ప్రసాద్ భరద్వాజ



ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.

కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున, శరీరోత్పతికి కర్మ కారణముగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక, కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సుక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించు చున్నాను. 'ఆత్మ'యనగా యీ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించు చున్నది - అని అంగీరసుడు చెప్పగా

"ఓ మునీఒద్రా! నేనింత వరకు యీ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక, యింకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పాదార్దజ్ఞానము కారణమగుచుండును. కాన, 'అహంబ్రహ్మ' యను వ్యక్యార్ధమును గురించి నాకు తెలియజెయండి"యని ధనలోభుడు కోరెను.

అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె - ఈ దేహము అంత:కరణవృత్తికి సాక్షియే, 'నేను - నాది' అని చెప్పబడు జీవత్మాయే 'అహం' అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా 'న:' అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరిరమునకు లేదు. ఆ యాత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునుందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా వున్నదై యెల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే "ఆత్మ" యనబడను. "నేను" అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియే గాక, యిట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందునూ "నేను", "నాది" అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించు కొనుము.

ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర, ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే, అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరే౦ద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి, మేల్కొన్న తర్వాత 'నేను సుఖనిద్ర పోతిని, సుఖింగా వుంది' అనుకోను నదియే ఆత్మ.

దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును, ప్రకాశింప జేయు నటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పతమాత్మ స్వరూపమగుట వలన, దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే 'పరమాత్మ' యని గ్రహింపుము. 'తత్వమసి' మొదలైన వాక్యములందలి 'త్వం' అను పదమునుకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం 'తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము "తత్త్వమసి" అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే "ఆత్మ దేహలక్షణములుండుట - జన్మించుట - పెరుగుట - క్షీణి౦చుట - చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరుపించ బడి యున్నదో అదియే "ఆత్మ". ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే యని యే విధముగా గ్రహింతుమో, అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము.

జీవులచే కర్మ ఫలమను అభవింప జేసేవాడు పరమేశ్వరుడనియు, జీవులా కర్మ ఫలమును అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచిపనులు తలచిన చిత్తశుద్దియు, దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు - అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనెను.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి సప్తదశాధ్యాయము - పదిహేడవ రోజు పారాయణ సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹కార్తీక మాసం 17వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు

దానములు:- ఔషధాలు, ధనం

పూజించాల్సిన దైవము:- అశ్వినీ దేవతలు

జపించాల్సిన మంత్రము:- ఓం అశ్విన్యౌవైద్యౌ తే నమః స్వాహా

🌹 🌹 🌹 🌹 🌹

కార్తీక మాసం 17వ రోజు చేయవలసినవి. Things to do on 17th day of Kartika month (a YT Short)



https://youtube.com/shorts/8B_GSIz9GY0



🌹 కార్తీక మాసం 17వ రోజు చేయవలసినవి. Things to do on 17th day of Kartika month. 🌹

ప్రసాద్ భరద్వాజ


(a YT Short)


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


కార్తీక మాసం 16వ రోజు చేయవలసినవి. Things to do on 16th day of Kartika month.



https://youtube.com/shorts/yvYOLeGEimI


🌹 కార్తీక మాసం 16వ రోజు చేయవలసినవి.
Things to do on 16th day of Kartika month. 🌹


ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


కార్తిక పురాణం - 16 :- 16వ అధ్యాయము - స్తంభ దీప ప్రశంస - దీప స్తంభము విప్రుడగుట Kartika Purana - 16 :- Chapter 16 - Praise of the Pillar of Light - The Pillar of Light is Extinct


🌹. కార్తిక పురాణం - 16 🌹
🌻. 16వ అధ్యాయము -
స్తంభ దీప ప్రశంస - దీప స్తంభము విప్రుడగుట 🌻
📚. ప్రసాద్ భరద్వాజ



🌹. Kartika Purana - 16 🌹
🌻. Chapter 16 -
Praise of the Pillar of Light - The Pillar of Light is Extinct 🌻
📚. Prasad Bharadwaja



వశిష్టుడు చెబుతున్నాడు -

"ఓ రాజా! కార్తీకమాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసముందు స్నాన, దాన, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీకమాసమందు తనకు శక్తి వున్నా దానము చేయరో, అట్టి వారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆవిధముగానే నెలరోజులలో ఏ ఒక్కరోజూ విడువకుండ, తులసి కోటవద్దగాని - భగవంతుని సన్నిధినిగాని దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీకశుద్ద పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి, భగవంతుని సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు, నారికేళ ఫలదానము జేసిన యెడల - చిరకాలమునుండి సంతతి లేనివారికి పుత్ర సంతానము కలుగును.

సంతానము వున్న వారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై యు౦దురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపముగాని, స్తంభ దీపాము గాని వుంచి నమస్కరించిన స్త్రీపురుషులకు సకలైశర్యములు కలిగి, వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టు వారు శాలిధాన్యం గాని, నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీప ముంచవలమును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారును, లేక దీపం పెట్టువారి పరిహాసమాడువారును చుంచు జన్మ మెత్తుదురు ఇందులకొక కథ కలదు. చెప్పెదను వినుము.


🌻. దీప స్తంభము విప్రుడగుట 🌻

ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతగ మహాముని ఒక చోట అశ్రమాన్ని ఏర్పరచుకొని, దానికి దగ్గరలో నొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని, నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీకమాసములో ఆ యాశ్రమము చుట్టు ప్రక్కల మునులు కూడ వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము అలయద్వారాల పై దీపములు వెలిగించి, కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్లుచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్దడు తక్కిన మునులను జూచి "ఓ సిద్దులారా! కార్తీకమాసములో హరిహరాదుల ప్రీతికోరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకూ తెలిసిన విషయమే కదా! రేపు కార్తీకశుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్త౦భముపాతి, దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభము తోడ్కునివత్తము, రండు" అని పలుకగా అందరు పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి కెదురుగా పాతిరి. దానిపై శాలి ధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపఠనము చేయుచుండగా ఫెళ ఫెళమను శబ్దము వినిపించి, అటుచూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి, దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడియుండెను. ఆ దృశ్యము చూచి వారందరు ఆశ్చర్యముతో నిలబడియుండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని జూచి "ఓయీ నీ వేవడవు? నీవీ స్తంభమునుండి యేలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి" అని ప్రశించిరి. అంత, ఆ పురుషుడు వారందరకు నమస్కరించి "పుణ్యాత్ములారా! నేను క్రిందటి జన్మమందు బ్రహ్మణుడను. ఒక జమిందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా యైశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయా విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్భుద్దులలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక, దానధర్మాలు చేయక మెలగితిని. నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయముననే విప్రుడయినా వచ్చినన్ను ఆశ్రయించినను అతనిచె నా కాళ్ళు కడిగించి, ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకోమని చెప్పి, నానా దుర్భాషలాడి పంపుచుండెవాడను. నేను వున్నతాసనముపై కూర్చుండి అతిధులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను. స్త్రీలను, పసిపిల్లలను హీనముగా చూచుచుండెడి వాడెను. అందరును నా చేష్టలకు భయపడువారే కాని, నన్నెవరును మందలింపలేక పోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దులేక పోయెడిది. దానధర్మములు యెట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గడనై, పాపినై అవసానదశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి, లక్ష జన్మలముందు కుక్కనై, పదివేల జన్మలు కాకినై, ఐదువేల జన్మలు తొండనై, ఐదు వేల జన్మలు పేడపురుగునై, తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను జేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నాకర్మలన్నియు మీకు తెలియచేసితిని, నన్ను మన్ని౦పు" డని వేడుకొనెను.


🌹 🌹. కార్తిక పురాణం - 16

ఆ మాటలాలకించిన, మునులందరు నమితాశ్చర్యమొంది "ఆహా! కార్తీకమాసమహిమ మెంత గొప్పది అదియునుగాక, కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కఱ్ఱలు, రాళ్లు, స్త౦భములు కూడా మన కండ్ల యెదుట ముక్తి నొందుచున్నవి. వీటన్ని౦టి కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే యీ స్త౦భమునకు ముక్తికలిగిన" దని మునులు అనుకోనుచుండగా, ఆ పురుషుడా మాటలాలకించి "మునిపుంగవులారా! నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా? ఈ జగంబున నెల్లరుకు నెటుల కర్మ బంధము కలుగును? అది నశి౦చుటెట్లు? నాయీ సంశయము బాపు"డని ప్రార్ధించెను. అక్కడ వున్న మునిశ్వరుల౦దరును తమలో నోకడగు అంగీరసమునితో "స్వామి! మీరే అతని సంశయమును తీర్చగల సమర్ధులు గాన, వివరించు"డని కోరిరి. అంత నా౦గీరసుడిట్లు చెప్పుచున్నాడు.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి షోడశాధ్యాయము - పదహారో రోజు పారాయణము సమాప్తం.

🌹 🌹 🌹 🌹 🌹




🌹కార్తీక మాసం 16వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల

దానములు:- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము:- స్వాహా అగ్ని

జపించాల్సిన మంత్రము:- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః

🌹 🌹 🌹 🌹 🌹

సంపద మరియు పదవుల కోసం కార్తీక మాసంలో ఈరోజు (నవంబర్, 06) ఇలా చేయండి. Do this today (Nov,06) during Kartik month for wealth and positions.




🌹 కార్తీక మాసం.. నవంబర్ 6.. ఈ చిన్న పని చేస్తే చాలు..! అంతులేని సంపదలు, పదవులు ఖాయం..! 🌹

ప్రసాద్ భరద్వాజ



🌹 Karthika month.. November 6.. Just do this small task..! Endless wealth and positions are guaranteed..! 🌹

Prasad Bharadwaja



కార్తీక మాసంలో 16వ రోజు ఎలాంటి శక్తిమంతమైన విధివిధానాలు పాటిస్తే సంపదలు, అధికార పదవులు అద్భుతంగా కలుగుతాయో తెలుసుకుందాం. కార్తీక మాసంలో శుక్ల పక్షానికి ఎంత శక్తి ఉందో బహుళ పక్షానికి కూడా అంతే శక్తి ఉంది.

పౌర్ణమికి ముందు చేసే పూజలకు ఎంత శక్తి ఉందో పౌర్ణమి తర్వాత కూడా చేసే పూజలకు అంతే శక్తి ఉంది. కార్తీక బహుళ పాడ్యమి తిథి.. కార్తీక మాసంలో 16వ రోజు.. నవంబర్ 6వ తేదీ.. గురువారం.. కొన్ని ప్రత్యేక విధివిధానాలు పాటిస్తే సంపదలు, పదవులు రెండూ సిద్ధింపజేసుకోవచ్చు.

కార్తీక మాసంలో 16వ రోజున ప్రతి ఒక్కరు చేయాల్సిన పని.. ఆలయంలో సమ్మార్జన (సమార్జనం) చేయాలి. అంటే ఆలయం దగ్గర చీపురుతో చిమ్మటం, తుడవటం, అక్కడ ముగ్గులు పెట్టటం. మీ దగ్గరలో ఉన్న శివాలయం లేదా విష్ణువు ఆలయానికి వెళ్లి చీపురుతో చిమ్మి, తడబట్ట పెట్టి తర్వాత ముగ్గులు వేయాలి. ఇలా శివాలయంలో చేస్తే సమస్త సంపదలు కలుగుతాయి. విష్ణువు ఆలయంలో చేస్తే అధికార పదవులు కలుగుతాయని కార్తిక మహత్యం తెలుపుతుంది. ప్రమోషన్లు రావాలన్నా, రాజకీయాల్లో మంచి పదవులు రావాలన్నా, సంఘంలో మంచి పదవులు రావాలన్నా విష్ణువు ఆలయంలో ఈ పని చేయాలి. ధన పరంగా బ్రహ్మాండంగా కలిసి రావాలంటే విపరీతంగా ధనం రావాలంటే శివాలయంలో ఈ పని చేయాలి.

శివాలయంలో కనిపించే ఆకాశ దీపానికి చాలా శక్తి ఉంటుంది. ఆకాశ దీపాన్ని చూడగానే నమస్కారం చేసుకుని, ప్రార్ధన చేస్తే అంతులేని సంపదలు కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పారు. దేవాలయంలో ఆకాశ దీపం వెలిగించే నిమిత్తం నూనె కానీ నెయ్యి కానీ దేవాలయానికి ఇవ్వాలి. అలా ఇచ్చిన వారు సాక్ష్యాత్తు నందీశ్వరుడితో సమానం అవుతారని కార్తీక మహత్యం తెలుపుతుంది. కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే పాడ్యమి అంటే కార్తీక మాసంలో 16వ రోజున శివాలయంలో ఆకాశ దీపం వెలిగించే నిమిత్తం నూనె కానీ నెయ్యి కానీ ఇస్తారు వారు నాతో సమానమైపోయిన వాళ్లు అవుతారని, శివుడు నన్ను ఎంతగా అనుగ్రహిస్తాడో వారిని కూడా అంతగానే అనుగ్రహిస్తాడని నందీశ్వరుడు స్వయంగా సెలవిచ్చాడు.

🌹🌹🌹🌹🌹

కోటి దీపోత్సవం కార్తీక మాసం స్పెషల్ Koti Deepotsav Karthika Masam (a YT Short)



https://youtube.com/shorts/_dnQ4ISnSyg



🌹🪔 కోటి దీపోత్సవం కార్తీక మాసం స్పెషల్ Koti Deepotsav Karthika Masam 🪔🌹

ప్రసాద్ భరద్వాజ




Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🪔🪔🪔🪔🪔


త్రిపురా పౌర్ణమి - దేవ దీపావళి విశిష్టత కధ - Story of Dev Deepavali (a YT Short)



https://youtube.com/shorts/3_qkEi6PmwE



🌹🪔 త్రిపురా పౌర్ణమి - దేవ దీపావళి విశిష్టత కధ - Story of Dev Deepavali 🪔🌹

ప్రసాద్ భరద్వాజ
Prasad Bharadwaj




Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



కార్తీక_పౌర్ణమి - ''త్రిపురి పూర్ణిమ'', ''దేవ దీపావళి'' - Karthika Pournami - ''Tripuri Purnima'', ''Deva Diwali''

🌹 కార్తీక_పౌర్ణమి - ''త్రిపురి పూర్ణిమ'', ''దేవ దీపావళి'' 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Karthika Pournami - ''Tripuri Purnima'', ''Deva Diwali'' 🌹
Prasad Bharadwaja


కార్తీక పౌర్ణమి మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం.

పరమ శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని కార్తీక పౌర్ణమి నాడు సంహరించి జగతిని కాపాడడం జరిగింది.

మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి.

ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు.

వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి.

కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు.

ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించు కు పోతాయి.

ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం.

ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం.

నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం. గురునానక్ జయంతి కూడా ఈరోజే.

ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.

పౌర్ణమినాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం, సాయంత్రం శుచిగా ఉసిరికాయపై దీపాలు వెలిగించాలి.

పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేరుకున్నట్లే మనసు కూడా జ్ఞాన పూర్ణం కావాలనేదే ఈ కార్తీక పౌర్ణమి పండుగ యొక్క ఆంతర్యం.

ఈ రోజన దీప దానం చేస్తే సకల పాపలు తొలగి, మోక్షం కలుగుతుందని చెబుతారు.

దీనివల్ల సమస్త జ్ఞానం కలుగుతుందని, సకల సంపదలు సిద్ధిస్తాయని ప్రతీతి.

కార్తీక మాసంలో చేసే దీప దానం వలన స్వర్గ ప్రాప్తి కలుగుతుంది.

కార్తీక పౌర్ణమి నాడు చేసే సాలగ్రామ దానం, ఉసిరి కాయల దానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి.

ఏడాదంతా దీపం పెట్టని పాపం ఇవాళ దీపం పెడితే ఆ పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు.

గంగా, గోదావరి మొదలైన పుణ్య నదుల్లో కార్తీక దీపాలను వదలడం కన్నుల పండుగగా జరుపుతారు.

కార్తీక పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు.

రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు.

కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు.

ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు.

కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే.

సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. ఈ పవిత్ర దినాన విష్ణు ఆలయంలో స్తంభ దీపం పెట్టినవారు శ్రీమహా విష్ణువుకి ప్రీతివంతులవుతారు.

ఈ దీపాన్ని చూసినవారి పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తారు.

జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా ఇవాళ జరుపుతారు.

శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసం లోని కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయి.

జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూతప్రేత పిశాచ బాధలన్ని నివారణవుతాయి.

కార్తీక జ్వాలాదర్శనం వలన మానవులకు, పశుపక్ష్యాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి.

ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి.

అట్లే మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే,కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం.

అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది.

మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది.

ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.

కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధన ఎంతో ప్రాముఖ్యమైనది.

ఏకతస్సర్వదానాని దీపదానం తథైకత అని శాస్త్రవచనం.

అంటే అన్ని దానాలు ఒక ఎత్తు దీపదానం ఒక ఎత్తు అని అర్ధం.

దీపదానం చేసేవారు పైడి పత్తిని తీసి వారే స్వయంగా ఒత్తులను తయారుచేయాలి.

వరిపిండి, గోధుమ పిండితో ప్రమిదను తయారుచేసి అందులో ఒత్తిడిని ఉంచి ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించి పూజింజి దానికి నమస్కరించి కార్తీక సోమవారం లేదా పౌర్ణమి రోజున కార్తీక మాసంలో ఏ రోజునైనా, శైవ వైష్ణవాలయాల్లో ఉత్తముడైన బ్రాహ్మణుడికి దానం చేయాలి.

కార్తీక మాసమంతా ప్రతీ ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా తులసీ బృందావనం దగ్గర దీపాలను వెలిగించడం మన సంప్రదాయం. దీపం వెలిగించిన తర్వాత “దీపంజ్యోతి పరబ్రహ్మః దీపం సర్వతమో పహమ్ దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యాదీప నమోస్తుతే” శ్లోకం ద్వారా స్తుతించడం మన ఆచారం.

కార్తీక పౌర్ణమి రోజున సాయం సమయంలో ప్రమిదల్లో నూనె పోసి దీపాలను వెలిగించాలి.

వాకిలి ముందు ప్రమిదలను వెలిగించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.

దీపాన్ని ఆవాహన చేసిన మూర్తిని స్మరిస్తూ దీపదర్శనం చేస్తారో ఆ దీపజ్యోతి ఎవరిపై ప్రసరిస్తుందో వారు పాప విముక్తులై పునర్జన్మ లేని స్థితిని పొందుతారని నమ్మకం.

ఇతరుల వెలిగించిన దీపాన్ని ఎవరైతే ఆరిపోకుండా చూస్తారో వారు ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు.

🌹🌹🌹🌹🌹


శాంతాకారం భుజగశయనం సురేశం పద్మనాభం Prayer of Lord Vishnu



https://youtube.com/shorts/WnoQPKY14-w


🌹 శాంతాకారం భుజగశయనం సురేశం పద్మనాభం Prayer of Lord Vishnu 🌹
ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹




కార్తీక పున్నమి వ్రత కథ (ప్రసిద్ధ వ్రత కథనం) / Kartika Punnami Vrata Katha (Famous Vrata Story)



🌹 కార్తీక పున్నమి వ్రత కథ (ప్రసిద్ధ వ్రత కథనం) 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Kartika Punnami Vrata Katha (Famous Vrata Story) 🌹

Prasad Bharadwaja


పూర్వకాలంలో ఒక పేదరాలు ఉండేది. ఆమెకు భగవంతునిపై అపారమైన భక్తి. అయితే ఆమె అజ్ఞానం కారణంగా, తెలియకుండా కొన్ని తప్పులు చేసేది. ముఖ్యంగా కార్తీక మాసంలో నియమనిష్ఠలు పాటించడంలో లోపం ఉండేది.

ఆమె ఎప్పుడూ కార్తీక పున్నమి రోజున దీపం పెట్టకుండా, దోసకాయలు, వంకాయలు వంటివి తిని వ్రతాన్ని ఉల్లంఘించేది.

కాలక్రమేణా ఆ పేదరాలు మరణించింది. కార్తీక మాసంలో చేసిన దోషాల కారణంగా, ఆమెకు మరుజన్మలో కుక్కగా జన్మ లభించింది.

ఆ కుక్క ఒక ధనవంతుడి ఇంట్లో పెరిగింది. ఆ ధనవంతుడు పరమ శివభక్తుడు. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం శివారాధన, దీపారాధన, దానధర్మాలు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసేవాడు.

ఒక కార్తీక పున్నమి రోజున, ఆ ధనవంతుడు గంగా స్నానం చేసి, తడి బట్టలతో ఉన్నాడు. శివార్చన కోసం దీపాలు వెలిగించి, తాను తీసుకువెళ్తున్న శివలింగాన్ని ఆ ఇంటి కుక్క తెలియక తన తోకతో తాకింది.

కుక్క తోక తాకడం వల్ల శివలింగం అపవిత్రం అయిందని భావించిన యజమాని, కోపంతో ఆ కుక్కను కర్రతో బలంగా కొట్టాడు.

యజమాని కోపం చూసి భయపడిన ఆ కుక్క, వెంటనే పక్కనే వెలుగుతున్న దీపాల మధ్య నుండి పారిపోయింది. అలా పారిపోయేటప్పుడు, ఆ దీపాల్లోని నూనె కుక్క తోకకు, శరీరానికి అంటింది.

ఆ నూనె అంటిన కుక్క వెలుగుతున్న దీపాలలో పడకపోయినా, నూనెతో తడిసిన తోకను అడ్డదిడ్డంగా తిప్పడం వల్ల, కొన్ని దీపాలు ఆరిపోయాయి, కొన్ని దీపాలు వెలిగాయి.

ఆ క్షణంలో ఆశ్చర్యకరంగా, ఆ కుక్కకు తాను గత జన్మలో చేసిన తప్పులు (పున్నమి వ్రతం భంగం) గుర్తొచ్చాయి. అలాగే, కార్తీక దీపాలను అంటించడం, ఆర్పడం అనే రెండు క్రియలు తెలియకుండానే తన చేతిలో జరిగాయి.

ఆ రాత్రే యమధర్మరాజు ఆ ధనవంతుడి కలలోకి వచ్చి ఇలా చెప్పాడు.

"నీవు కార్తీక మాసంలో అపారమైన భక్తితో దీపాలు వెలిగించినా, నీ ఇంటి కుక్క గత జన్మలో కార్తీక పున్నమి వ్రతాలు చెడగొట్టింది. కానీ, ఈ రోజు తెలియకుండానే అది దీపారాధనను కొంతవరకు (నూనె అంటడం ద్వారా, కొన్ని వెలిగించడం ద్వారా) నిర్వహించింది. ఈ చర్య కారణంగా, దాని గత జన్మ దోషాలు తొలగి పోయాయి. ముఖ్యంగా, దానికి శివుని ప్రసాదం (గంగా స్నానం చేసిన నీటి తుంపరలు) తగిలింది. దాని పూర్వ పాపాలు పోయాయి, దానికి విముక్తి లభించింది.

ఈ మాటలు విని ఆశ్చర్యపోయిన ధనవంతుడు మరుసటి రోజు కుక్కను చూడగా, ఆ కుక్క తన దేహాన్ని చాలించి ఉంది. దానికి మోక్షం లభించింది.


🌹 కథనం యొక్క విశిష్టత 🌹

కార్తీక దీపారాధన మహిమ: తెలియక చేసిన చిన్న దీప సంబంధిత కార్యమైనా, కార్తీక పున్నమి రోజున గొప్ప ఫలితాన్ని ఇస్తుందని ఈ కథ తెలియజేస్తుంది.

వ్రతభంగ దోషం: గత జన్మలో వ్రతం భంగం చేస్తే ఎంత కష్టం వస్తుందో, ఆ దోషం ఎలా వెంటాడుతుందో తెలుపుతుంది.

నియమం: ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దీపారాధన చేయాలని, నిష్ఠను పాటించాలని చెప్పడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం.

ఈ కథను కార్తీక పౌర్ణమి రోజున భక్తులు తప్పకుండా వింటారు. దీనిని విన్న వారికి సకల పాపాలు తొలగి, మోక్షం లభిస్తుందని నమ్మకం.

🌹 🌹 🌹 🌹 🌹


కార్తీక పౌర్ణమి రాత్రి జాగరణ - దాని వెనుకున్న నిజమైన ఆధ్యాత్మిక భావం Karthika Pournami Night Vigil Holds Deep Spiritual Meaning



🌹  కార్తీక పౌర్ణమి రాత్రి జాగరణ - దాని వెనుకున్న నిజమైన ఆధ్యాత్మిక భావం Karthika Pournami Night Vigil Holds Deep Spiritual Meaning  🌹

ప్రసాద్ భరద్వాజ


ఏడాదిలో అత్యంత పవిత్రమైన మాసం కార్తీకం. ఇందులో పౌర్ణమి మరింత విశేషం. ఈ పర్వదినాన చాలా మంది రాత్రంతా జాగరణ చేస్తారు. అసలు ఈ 'జాగరణ' వెనుక ఉన్న నిజమైన ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి?

కేవలం భౌతికమైన నిద్రను త్యాగం చేయడమేనా? మన జీవితాన్ని వెలిగించే ఈ ఆచారంలో దాగి ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుందాం రండి.

దీపం వెలిగించడం, జ్ఞానాన్ని పెంచడం: కార్తీక పౌర్ణమిని ‘త్రిపురారి పూర్ణిమ’ అని కూడా పిలుస్తారు. ఈ రోజున పరమేశ్వరుడు త్రిపురాసురుడిని సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించాడు. ఈ విజయానికి చిహ్నంగా చేసే జాగరణకు ప్రత్యేక అర్థం ఉంది. చీకటిని పోగొట్టి వెలుగునిచ్చే దీపంలాగే, మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించుకోవడమే ఈ జాగరణ యొక్క ముఖ్యోద్దేశం. రాత్రంతా మేల్కొని భగవంతుని నామస్మరణ చేయడం అంటే మనసును లౌకిక విషయాల నుండి మళ్ళించి, ఆత్మ పరిశీలనకు సమయం కేటాయించడం.

అంతర్ముఖ జాగరణకు ప్రాధాన్యత: ఈ పవిత్ర రాత్రిలో కేవలం కూర్చుని గడపడం మాత్రమే కాదు, దైవచింతనతో గడపాలి. పురాణ పఠనం (ముఖ్యంగా కార్తీక పురాణం), భజనలు, స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మనసు ఏకాగ్రత చెందుతుంది. దీనినే ‘ఆంతరంగిక జాగరణ’ అంటారు. అంటే, శరీరం మేల్కొని ఉన్నట్టుగానే, మన అంతరాత్మను కూడా దైవం వైపు మళ్ళించి, మన లక్ష్యమైన మోక్షం గురించి ఆలోచించడం. ఈ సమయంలో చేసే జపం, దానం, దీపారాధన సాధారణ రోజుల్లో చేసే వాటి కంటే కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

సంకల్పంతో కొత్త వెలుగు: కార్తీక పౌర్ణమి జాగరణ అనేది కేవలం ఒక రోజు ఆచారం కాదు, అది ఒక సంకల్పం. జీవితంలో దైవ భక్తి, ధర్మం అనే వెలుగును నిత్యం మన హృదయంలో నిలుపుకోవాలి అనే సందేశాన్నిస్తుంది. ఈ పవిత్ర దినాన శివకేశవులను ఆరాధించడం ద్వారా మనం జీవితంలో ఎదురయ్యే అజ్ఞానపు అడ్డంకులను తొలగించుకుని, జ్ఞానం, సంపద మరియు మోక్షం వైపు పయనించడానికి సిద్ధమవుతాము.

గమనిక: ఆధ్యాత్మిక ఆచరణలో నమ్మకం మరియు ఏకాగ్రత చాలా ముఖ్యం. జాగరణ చేసే సమయంలో శక్తి మేరకు ఉపవాసం ఉండి, బలవంతం లేకుండా భక్తితో గడపడం ఉత్తమం. ఆరోగ్యం సహకరించని వారు కేవలం దైవస్మరణతో కొంత సమయం మేల్కొని ఉన్నా సరిపోతుంది.

🌹 🌹 🌹 🌹 🌹

కార్తీక పౌర్ణమి ప్రత్యేకం - మహామృత్యుంజయ భస్మ అభిషేకం Karthika Pournami Special Bhasma Abhishek of Siva (a YT Short)



https://youtube.com/shorts/0ucV-7HuK_8


🌹 కార్తీక పౌర్ణమి ప్రత్యేకం - మహామృత్యుంజయ భస్మ అభిషేకం

Karthika Pournami Special Bhasma Abhishek 🌹




ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹


కార్తీక పౌర్ణమి రోజున శివలింగం అభిషేకం యొక్క ప్రాముఖ్యత! Importance of Abhishekam of Shiva Lingam on Karthik Pournami Day!



🌹🪔 కార్తీక పౌర్ణమి రోజున.. శివ లింగానికి అభిషేకం చేస్తే.. మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటుండదు..! 🪔🌹

ప్రసాద్ భరద్వాజ


🌹🪔 On the day of Kartik Purnima.. if you perform Abhishekam on Shiva Linga.. your house will never lack wealth..! 🪔🌹

Prasad Bharadwaja



కార్తీక పౌర్ణమి.. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే దారిద్ర్య బాధలు తొలగి ధన లాభం కలుగుతుందో, అప్పుల సమస్య నుంచి బయటపడచ్చో, సర్వ సంపదలు ఎలా సిద్ధిస్తాయో తెలుసుకుందాం.

కార్తీక పౌర్ణమి రోజున అందరూ సూర్యదయానికి ముందే చన్నీళ్లతో స్నానం చేయాలి. అలా చేయలేని వాళ్లు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి వీలుకాని ఎవరైనా సరే.. కార్తీ పౌర్ణమి రోజున.. స్నానం చేసేటప్పుడు గంగ యుమన సరస్వతి అని మూడుసార్లు అనుకుంటూ స్నానం చేయాలి. ఆ స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైనా సరే ఆవు పాలతో శివాభిషేకం చేసినట్లైతే.. జీవితంలో వారికి బంగారానికి, వెండికి లోటు ఉండదు. కావాల్సినంత బంగారం, కావాల్సినంత వెండి జీవితంలో కొనుక్కునే యోగం రావాలంటే కార్తీక పౌర్ణమి రోజున కచ్చితంగా ఆవు పాలతో శివ లింగానికి అభిషేకం చేయాలి.

కార్తీక పౌర్ణమి రోజున శివుడిని, లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజించినట్లైతే జన్మజన్మల దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, గొడవలు ఎక్కువగా ఉన్న వారు కార్తీక పౌర్ణమి రోజున ఆవు పాలతో చేసిన పాయం లక్ష్మీ నారాయణులకు నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో లక్ష్మీ నారాయణుల ఫోటో దగ్గర నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదా ఆలయంలో లక్ష్మీ నారాయణులకైనా నైవేద్యంగా సమర్పించొచ్చు. దాన్ని ప్రసాదంగా స్వీకరించడం, ఇతరులకు పంచి పెట్టడం ద్వారా కుటుంబకలహాలన్నీ తొలగిపోతాయి.

అష్ట దరిద్రాలు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల దరిద్ర్యం తొలగిపోవడంతో పాటు తొందరలోనే గృహ యోగం కలుగుతుంది. అరటి ఆకులో ఆవు పాల ప్యాకెట్, ఆవు పెరుగు ప్యాకెట్, ఆవు నెయ్యి ప్యాకెట్ దేవాలయంలో పంతులుకి దానం ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. సమస్త శుభాలు చేకూరతాయి. కార్తీక పౌర్ణమి రోజున అన్నదాం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి.


🪔 దీన్ని దానం చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం..! 🪔

కుబేరుడి దగ్గర ఉన్న నవ నిధులు మనం దానం చేసిన ఫలితం రావాలంటే కార్తీక పౌర్ణమి రోజున శివాలయ ప్రాంగణంలో మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించి, ఆ దీపాన్ని దానం ఇవ్వాలి. కార్తీక పౌర్ణమి రోజున దీప దానం చేస్తే కుబేరుడి దగ్గర నవ నిధులు దానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ దీప దానం వల్ల కోటి యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. కార్తిక పౌర్ణమి రోజున శివాలయంలో కొండెక్కిన దీపాన్ని వెలిగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.

కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించినా, దానం చేసినా కోటి యజ్ఞాలు చేసిన ఫలితం కలిగి సమస్యలన్నీ తొలగిపోతాయి. కార్తిక పౌర్ణమి రోజున తులసికోట దగ్గర ఉసిరక దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఉసిరికాయపైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో తడిపిన ఒత్తి వేసి కార్తీక పౌర్ణమి రోజున తులసి కోట దగ్గర ఉసిరిక దీపాలు వీలైనన్ని వెలిగించాలి. బియ్యం పిండితో చేసిన పిండి దీపాలు ఉసిరిక చెట్టు దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ వెలిగించాలి. తులసి కోటలో ఉసిరిక కొమ్మ ఉంచి లేదా తులసి కోట పక్కనే ఉసిరిక చెట్టు పెట్టుకుని.. ఉసిరిక లేదా పిండి దీపాలు ఇంటి ఆవరణలో వెలిగించుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీనారాయణులు ఆనంద తాండవం చేస్తారు.


🪔 జ్వాలా తోరణం దర్శనం చేసుకోవాలి..🪔

అలాగే సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం రావాలంటే 365 వత్తుల దీపాన్ని ఆవు నెయ్యిలో ముంచి వెలిగించాలి. అలాగే కార్తీక పౌర్ణమి రోజున దేవాలయంలో జ్వాలా తోరణం దర్శనం చేసుకోవాలి. శివాలయాల్లో జ్వాలా తోరణం నిర్వహిస్తారు. గడ్డిని తోరణాల్లా ఏర్పాటు చేసి నువ్వుల నూనెలో ముంచిన వస్త్రాలను ఆ గడ్డికి చుట్టి నిప్పంటించి పార్వతి పరమేశ్వరుల విగ్రహాలు అటు ఇటు మూడుసార్లు తిప్పుతారు. దీన్నే జ్వాలా తోరణం అంటారు. దీన్ని చూస్తేనే సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి.

🌹🌹🌹🌹🌹

కార్తీక పౌర్ణమి రోజున మీ రాశి ప్రకారం దానం చేయండి! Donation according to your zodiac sign on Kartik Purnima day!


🌹 కార్తీక పౌర్ణమి రోజు మీ రాశి ప్రకారం ఇవి దానం చేయడం మర్చిపోవద్దు! 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 Don't forget to donate these according to your zodiac sign on Kartik Purnima day! 🌹
Prasad Bharadwaj


కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం.

అంతే కాకుండా కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. అలాగే దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చన జరిపించిన సర్వశుభాలు ప్రాప్తిస్తాయని శాస్త్ర వచనం. ఈ క్రమంలో కార్తీక పౌర్ణమి రోజు ఆయా రాశుల వాళ్లు రాశి ప్రకారం దానం చేయాల్సినవి ఏమిటో తెలుసుకుందాం..

ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమిని జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈరోజున శివుడు, విష్ణు దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. శ్రీమహావిష్ణువు ఆలయాల్లో ధ్వజస్తంభం ఎదుట, తులసి కోట దగ్గర, దేవుడి సన్నిధిలో ప్రమిదల్లో, ఉసిరికాయల మీద, బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను పసుపు, కుంకుమ, పూలతో అంకరించి వెలిగించాలి. ఇక శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందా దీపం పేరుతో అఖండదీపాన్ని అలాగే ఆకాశదీపం పేరుతో ఎత్తయిన ప్రదేశంలో వేలాడదీస్తారు. అంతే కాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున పవిత్ర నదిలో స్నానం ఆచరించి కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల శుభఫలితాలను పొందొచ్చు. అయితే ఏ రాశి వారు ఎలాంటి వస్తువులు దానం చేయాలో తెలుసుకుందాం..


మేష రాశి - వృషభ రాశి

మేష రాశి వారు కార్తీక పౌర్ణమి రోజు బెల్లం, ఎర్రటి వస్త్రాలు, పప్పులు, ఎర్రటి పండ్లు దానం చేస్తే శుభఫలితాలు కలుగుతాయి. అలాగే శివకేశవుల అనుగ్రహం కూడా పొందొచ్చు. ఇక వృషభ రాశి వాళ్లు కార్తీక పౌర్ణమి రోజు దుప్పట్లు, పాలతో చేసిన స్వీట్లు, బియ్యం, నెయ్యి వంటివి దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్మకం.


మిథున రాశి - కర్కాటక రాశి

కార్తీక పౌర్ణమి రోజు మిథున రాశి వాళ్లు పెసలు, ఆకుపచ్చని కూరగాయలు, ఉసిరికాయలు, పచ్చ రంగు వస్త్రాలు దానం చేయడం చాలా మంచిది. అలాగే.. పిల్లలకు చదువుకు సంబంధించిన వస్తువులను దానం చేయడం కూడా శుభప్రదం. ఇక కర్కాటక రాశి వాళ్లు పాలు, బియ్యం, పంచదార, తెల్లని స్వీట్లు వంటి వాటిని దానం చేస్తే విశేష ఫలితాలను పొందడమే కాకుండా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.


సింహ రాశి - కన్యా రాశి

కార్తీక పౌర్ణమి రోజు సింహ రాశి వాళ్లు గోధుమలు, రాగి వస్తువులు, బెల్లం, నూతన వస్త్రాలు వంటి వాటిని దానం చేయడం శుభప్రదం. ఇక కన్యా రాశి వాళ్లు ఆకుపచ్చని వస్త్రాలు, పెసలు, ఆకుపచ్చ కూరగాయలు, నెయ్యి వంటివి దానం చేయడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు బట్టలు, బియ్యం, పంచదార వంటివి దానం చేయడం వల్ల అన్నీ విధాల శుభ ఫలితాలు కలుగుతాయి.


తుల రాశి - వృశ్చిక రాశి

కార్తీక పౌర్ణమి రోజు తులా రాశి వాళ్లు మినుములు, ఉలవలు, శనగలు, అరటి పండ్లు, పసుపు రంగు వస్తువులు వంటివి దానం చేయడం శుభప్రదం. వృశ్చిక రాశి వాళ్లు బెల్లం, ఎరుపు రంగు వస్త్రాలు, పప్పులు, ఎర్రటి పండ్లు వంటివి కార్తీక పౌర్ణమి రోజు దానం చేయడం మంచిది.


ధనుస్సు రాశి - మకర రాశి

కార్తీక పౌర్ణమి రోజు ధనుస్సు రాశి వాళ్లు కార్తీక పౌర్ణమి రోజు అరటిపండ్లు, పసుపు రంగు వస్త్రాలు, కుంకుమ పువ్వు, పసుపు వంటివి దానం చేయడం శుభప్రదం. ఇక మకర రాశి వాళ్లు నల్ల నువ్వులు, ఆవాల నూనె, మినప పప్పు, దుప్పట్లు, స్టీల్ సామాన్లు వంటివి దానం చేయడం శుభప్రదం.


కుంభ రాశి - మీన రాశి

కార్తీక పౌర్ణమి రోజు కుంభ రాశి వాళ్లు దుప్పట్లు, దుస్తులు, నువ్వులు వంటి వాటిని కార్తీక పౌర్ణమి రోజు దానం చేయడం మంచిది. ఇక మీన రాశి వాళ్లు పసుపు రంగు వస్త్రాలు, శనగపిండితో చేసిన లడ్డూలు, పసుపు వంటివి దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.


🌹🌹🌹🌹🌹

కార్తీక పౌర్ణమి : అప్పుల బాధలు తీర్చే ఉసిరి దీపం.. Karthika Pournami: The Basil lamp that alleviates debts..



🌹🪔 కార్తీక పౌర్ణమి : అప్పుల బాధలు తీర్చే ఉసిరి దీపం.. పౌర్ణమి నాడు ఈ ఒక్క పని చేయండి.. 🪔🌹
ప్రసాద్ భరద్వాజ


🌹🪔 Karthika Pournami: The Basil lamp that alleviates debts.. On Pournami day, just do this one thing.. 🪔🌹
Prasad Bharadwaj


కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. ఉసిరి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం, దీపం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనది. అందుకే ఈ దీపారాధన ధనం, ఆరోగ్యం ఇస్తుంది.

ఈ దీపం వెలిగించటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ధన స్థిరత్వం ఉంటుంది. దీర్ఘకాలంగా వెంటాడుతున్న అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ఉసిరి దీపం ఆయుష్షు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే, జాతకంలోని గ్రహ దోషాలు, పితృ దోషాలు తొలగిపోతాయి. సకల పాపాలు హరిస్తాయి.


🪔 ఉసిరి దీపం విధానం 🪔

పౌర్ణమి రోజు సాయంకాలం ఈ దీపాన్ని వెలిగించాలి.

ఉసిరి సిద్ధం: పూజకు రెండు తాజా ఉసిరికాయలు తీసుకోండి. వాటిని శుభ్రంగా కడగాలి. వాటిని మధ్యలో కోసి, లోపలి గుజ్జును తీసేసి, గిన్నెలా తయారుచేయాలి.

దీపారాధన: ఈ ఉసిరి గిన్నెల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి. కొత్త దూది వత్తిని ఆ నూనెలో ముంచి, ఉసిరి గిన్నెల్లో వేసి దీపం వెలిగించండి.

స్థానం: ఈ దీపాన్ని పూజా మందిరం ముందు లేదా తులసికోట దగ్గర పెట్టి పూజ చేయాలి. తులసికోట ముందు దీపం పెడితే విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి.

దీపం ఆరిపోయే వరకు దానిని కదపకుండా చూడండి. పూజ తర్వాత నైవేద్యం సమర్పించి, హారతి ఇవ్వండి.


🌻 చేయకూడని పొరపాట్లు 🌻

ఉసిరి దీపం వెలిగించేటప్పుడు ఈ తప్పులు చేయకూడదు.

పగిలిన ఉసిరి: పొరపాటున కూడా పగిలిన, దెబ్బతిన్న లేదా పురుగులు పట్టిన ఉసిరికాయలు వాడకూడదు. తాజా ఉసిరిని మాత్రమే ఉపయోగించాలి. పువ్వొత్తిని నిలబెట్టేందుకు ఉసిరికాయను పైన కట్ చేయడం వంటివి చేయడం అపరాధం అని గుర్తించగలరు.

దీపాన్ని కదపడం: దీపం వెలిగించాక, అది పూర్తిగా ఆరిపోయే వరకు దానిని ఎట్టి పరిస్థితుల్లో కదపవద్దు. మధ్యలో ఆర్పకూడదు.

విసర్జన: దీపం పెట్టిన తర్వాత ఉసిరిని చెత్తబుట్టలో వేయకూడదు. మరుసటి రోజు ఉదయమే దానిని తీసుకుని, శుభ్రమైన నదిలో, పారే నీటిలో లేదా మట్టిలో విసర్జించండి.

🌹🌹🌹🌹🌹

కార్తీక మాసం 15వ రోజు చేయవలసినవి. Things to do on 15th day of Kartika month



https://www.youtube.com/shorts/I-WleMqKKpY


🌹 కార్తీక మాసం 15వ రోజు చేయవలసినవి. Things to do on 15th day of Kartika month. 🌹

ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు Happy Kartika Purnima




🌹 కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి 🌹

🍀🪔 కార్తీక పౌర్ణమి విశిష్టత - ఈ రోజున 365 వత్తులతో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే 🪔🍀

ప్రసాద్ భరద్వాజ



🌹 Happy Kartika Purnima to everyone 🌹

🍀🪔 Significance of Kartika Purnima - On this day, performing lamp worship 365 times is equivalent to worshiping three crore (30 million) deities 🪔🍀

Prasad Bharadwaj



కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి. ఈ మాసంలో శివకేశవులను ఆరాధిస్తారు. ఈ పవిత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజుకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. దీనిని త్రిపురారి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు శివుడు త్రిపురాసురులను సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించినట్లు పురాణాలు చెబుతాయి. అందుకే ఈ రోజు చేసే పూజలు, దీపారాధనలు అనంతకోటి పుణ్యఫలాన్ని ఇస్తాయి.

కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజున చేసే ఒక్క దీపారాధన ఏడాది మొత్తం నిత్యం దీపం వెలిగించినంత పుణ్యాన్ని, శుభాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు ఈ రోజున 365 వత్తులతో దీపారాధన చేసి శివకేశవుల అనుగ్రహం పొందుతారు.


🪔 365 వత్తులు వెలిగించడానికి కారణం ఏమిటి? 🪔

సాధారణంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సంధ్యా దీపాన్ని వెలిగించడం హిందూ సంప్రదాయంలో భాగం. అయితే, ప్రస్తుత కలియుగ జీవనశైలిలో ప్రతి ఒక్కరూ నిత్యం దీపారాధన చేయడం సాధ్యపడదు. ఒకరోజు దీపం పెట్టి, మరోరోజు పెట్టకపోవడం వల్ల దోషాలు ఏర్పడతాయి.

నిత్య దీపారాధన ఫలితం: సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. రోజుకు ఒక వత్తి చొప్పున 365 వత్తులను కలిపి కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేస్తే, ఆ ఒక్కరోజు దీపం వెలిగించినా ఏడాది పొడవునా నిత్య దీపారాధన చేసిన ఫలం దక్కుతుంది.


🪔 దేవతల ఆహ్వానం: పురాణాల ప్రకారం, కార్తీక పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు దీపాలను వెలిగిస్తే భూమి పైకి వస్తారు. 365 వత్తులతో దీపారాధన చేసి వారిని ఆహ్వానించి, పూజలు చేయడం ద్వారా వారి ఆశీస్సులు లభిస్తాయి.


🪔 ఏం దోషాలు పరిహారమవుతాయి? 🪔

కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన, ముఖ్యంగా 365 వత్తుల దీపం వెలిగించడం వల్ల ఈ కింది దోషాలు, లోపాలు పరిహారం అవుతాయి:


🪔 నిత్య దీపారాధన లోపం: సంవత్సరం మొత్తం ఇంట్లో లేదా ఆలయంలో దీపాలు వెలిగించడంలో వచ్చిన లోపాలు, కుదరకపోయిన రోజులు ఉంటే, ఆ లోపం మొత్తం 365 వత్తుల దీపంతో పరిహారం అవుతుంది.


🪔 పాప క్షయం: కార్తీక పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనది. ఈ రోజున దీపారాధన చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది.


🪔 లక్ష్మీ కటాక్షం: దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. 365 వత్తులతో దీపం వెలిగించి, దానధర్మాలు చేయడం వలన లక్ష్మీదేవి సంతోషించి, భక్తులకు అష్ట ఐశ్వర్యాలు, సంపద కలుగుతాయి.


🪔 ముక్తి ప్రాప్తి: ఈ పవిత్ర దినాన శివాలయంలో దీపారాధన చేయడం ముక్కోటి దేవతలను పూజించినట్లే. ఈ దీపాలను చూసినవారి పాపాలు పటాపంచలై, జీవితానంతరం వారికి ముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.


🪔 ఎక్కడ, ఎలా వెలిగించాలని? 🪔

365 వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి, కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించడం శ్రేష్ఠం. ఈ దీపాన్ని


తులసి కోట వద్ద.

ఉసిరి చెట్టు కింద.

శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో వెలిగించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.


🪔 కార్తీక పౌర్ణమి దీపారాధన విధానం: 🪔


365 వత్తులు తయారుచేయడం: దారంతో లేదా దూదితో 365 చిన్న వత్తులను సిద్ధం చేసుకోవాలి.

దీపాన్ని సిద్ధం చేయడం: సాధారణంగా ఈ విశేష దీపారాధన కోసం ఉసిరికాయపై లేదా బియ్యప్పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించడం శ్రేష్ఠం.

దీపం వెలిగించడం: దీపంలో ఆవు నెయ్యి (శ్రేష్ఠం) లేదా నువ్వుల నూనె పోసి.. 365 వత్తులను ఒకే దీపంలో లేదా అనేక దీపాలలో ఉంచి భక్తిశ్రద్ధలతో వెలిగించాలి.


మంత్ర పఠనం:

365 వత్తులు అగరబత్తితో మాత్రమే వెలిగించాలి. ఇంటి యజమాని స్వయంగా వెలిగిస్తే అత్యుత్తమ ఫలితాలు… మంత్రం: వత్తులు వెలిగించిన తర్వాత అక్షింతలు చల్లుతూ "దామోదరం ఆవాహయామి" లేదా "త్రయంబకం ఆవాహయామి" అని ఉచ్చరించాలి. ఈ విధంగా కార్తీక పౌర్ణమిని ఆచరిస్తే శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం పొంది సర్వసౌఖ్యాలు కలుగుతాయి.


ఇతర విశేషాలు

కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తుల దీపారాధనతో పాటు.. ఈ కింద తెలిపిన ఆచారాలను పాటించడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.

జ్వాలాతోరణ దర్శనం: సాయంత్రం దేవాలయంలో వెలిగించే జ్వాలాతోరణాన్ని దర్శించడం వల్ల సకల పాపాలు హరించి.. పుణ్యం లభిస్తుందని నమ్మకం.

సత్యనారాయణ స్వామి వ్రతం: కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తేజజ మామూలు రోజుల కంటే కోటి రెట్లు ఎక్కువ ఫలం లభిస్తుంది.

నదీ స్నానం, దానం: ఈ రోజు పవిత్ర నదులలో స్నానం చేసి, పేదవారికి వస్త్ర దానం, ఆహార దానం లేదా బెల్లం దానం (లక్ష్మీ దేవికి సమర్పించడం) శుభప్రదం.


నదీ స్నానం, పూజా ముహూర్తాలు -

నదీ స్నానం: నవంబర్ 5 ఉదయం 4:52 నుంచి 5:44 వరకు (బ్రహ్మ ముహూర్తం)

పూజా ముహూర్తం: ఉదయం 7:58 నుంచి 9:00 వరకు

సాయంత్ర దీపారాధన: సాయంత్రం 5:15 నుంచి 7:05 వరకు.

🌹🌹🌹🌹🌹

కార్తిక పురాణం - 15 :- 15వ అధ్యాయము - దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపమందుట Kartika Purana - 15 :- Chapter 15 - By lighting the lamp ....


🌹. కార్తిక పురాణం - 15 🌹
🌻 15వ అధ్యాయము - దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపమందుట 🌻
📚. ప్రసాద్ భరద్వాజ


🌹 Kartika Purana - 15 🌹
🌻 Chapter 15 - By lighting the lamp, one attains a human form with the memory of being a mouse in a previous birth 🌻
📚 Prasad Bharadwaj


అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని - జనకా! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని, మరియొక యితిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను.

ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవులవద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, లేక, వినుట, సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును.

శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చిన యెడల, విశేషఫలము పొందగలరు. ఈ విధముగా నెలరోజులు విదువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీకశుద్ద త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము నుంచ వలెను.

ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసినయెడలను, లేక, ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు.

సరస్వతీ నదీతీరమున శిధిలమైన దేవాలయ మొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము జేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లుపెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులుజేసి, పండ్రెండు దీపములుంచి, స్వామిని పూజించుచు, నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుమూలలు వెదకి, తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నొట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీకమాస మగుటవలనను, శివాలయములో ఆరిపోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను.

ధ్యాన నిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచి చూడగా, ప్రక్కనొక మానవుదు నిలబడి యుండుటను గమనించి "ఓయీ! నీవెవ్వడవు? ఎందుకిట్లు నిలబడి యుంటివి?" అని ప్రశ్నించగా, "ఆర్యా! నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెదుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి యిక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో నుంది ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నొటకరచి ప్రక్కనున్న దీపంచెంత నిలబడి వుండగ, నా అదృష్టము కొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కాని, ఓ మహానుభావా! నేను యెందుకీ మూషికజన్మ మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు"మని కోరెను.

అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని, "ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ, ధనాశపరుడై దేవపూజలు, నిత్యకర్మలు మరచి, నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు, మంచివారలను, యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృత్తిచేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు, సమస్త తిను బండారములను కడుచౌకగా కొని, తిరిగి వాతిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక యితరులకు యివ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత యెలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించు చుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన, నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్తిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షముపొందు"మని అతనికి నీతులు చెప్పి పంపించెను.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి పంచదశాధ్యాయము - పదిహేనోరోజు పారాయణము సమాప్తము.


🌹కార్తీక మాసం 15వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- తరగబడిన వస్తువులు

దానములు:- కలువపూలు, నూనె, ఉప్పు

జపించవలసిన మంత్రం:-

'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'

🌹 🌹 🌹 🌹 🌹


కార్తీక మాసం 15వ రోజు పూజించ వలసిన దైవం Deity to be worshipped on the 15th day of Karthika month




🌹  కార్తీక మాసం 15వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



నిషిద్ధములు:- తరగబడిన వస్తువులు

దానములు:- కలువపూలు, నూనె, ఉప్పు

జపించవలసిన మంత్రం:-

'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'

🌹 🌹 🌹 🌹 🌹



🌹  Deity to be worshipped on the 15th day of Karthika month - Mantra to be recited - Donation - Offering 🌹

Prasad Bharadhwaja



Prohibited things:- Broken objects

Donations:- Lotus flowers, oil, salt

Mantra to be chanted:-

'Om Sri Tulasithathri Sametha Karthika Damodaraya Namah'

🌹 🌹 🌹 🌹 🌹

కార్తీక పౌర్ణమి, గురునానక్‌ జయంతి శుభాకాంక్షలు, Happy Kartika Pournami and Guru Nanak Jayanti


🌹. కార్తీక పౌర్ణమి, గురునానక్‌ జయంతి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యలకు, Happy Kartika Pournami to All 🌹

ప్రసాద్ భరద్వాజ