సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌)



🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 1 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃  బ్లావెట్‌స్కీ జీవితము 🍃


1. జీవుడు వ్యష్టి ఆత్మ. ప్రకృతి సమష్టి ఆత్మ. ఈ రెంటికి మూలం, కారణం పరమాత్మ.

2. లోకంలో ఆకర్షణీయమైనవి (ప్రేయస్సు). హితమైనవి (శ్రేయస్సు). ఈరెండు మానవుని దగ్గరకు వచ్చినప్పుడు తెలివిగల వాడు హితమైన వాటిని ఎన్నుకుంటాడు. మూర్ఖుడు ఆకర్షణీయమైన జలతారు వలలో పడి చిక్కులు అనుభవిస్తాడు.

3. స్థూల, సూక్ష్మ కారణ శరీరాల కన్నా 'ఆత్మ' వేరైనది.

4. ఆత్మను పొందటానికి తీవ్ర సాధన తప్ప వేరు మార్గము లేదు.

5. ఒకరు మరొకరిని ప్రేమించటానికి కారణము ఇతరుల రూపంలో ఉన్న తన ఆత్మను తాను ప్రేమించటమే.

6. రహస్య సిద్ధాంతములను ప్రకటించిన బ్లావెట్‌స్కీని గూర్చి తెలుసుకోవలసి ఉంటుంది.

7. బ్లావెట్‌స్కీ తన ఆధ్యాత్మిక గురువుల యొక్క ఆదేశానుసారము 1875లో మూడు ప్రధాన విషయములతో (ఊనీలి ఊనీలిళిరీళిచీనీరిబీబిజి ఐళిబీరిలిశిగి) దివ్య జ్ఞాన సమాజమును కల్నల్‌ ఆల్కాట్‌ సహకారముతో స్థాపించింది.

8. బ్లావెట్‌స్కీ అసలు పేరు హెలెనా పెట్రోవ్‌నా. భర్త పేరు బ్లావెట్‌స్కీ. తాను 1831 లో 30/31 అర్థరాత్రి జులై నెలలో జన్మించింది.

9. హెలెనా 19వ శతాబ్దంలో పుట్టిన అద్భుత వ్యక్తులలో ఒకరు. ఈమె విజ్ఞానములో కాని, దర్శన మనో శాస్త్రములలో కాని చూపిన అసమానధైర్య సాహసాలు ఆనాటి సమాజానికి రుచించలేదు. కాని క్రమక్రమంగా తన రచనలలోని సత్యమును గ్రహించగలిగారు.

10. బ్లావెట్‌స్కీ 1879లో తన రహస్య సిద్ధాంతములతో (ఊనీలి ఐలిబీజీలిశి ఈళిబీశిజీరిదీరీ) అను గ్రంథము వ్రాయుట మొదలుపెట్టింది.

11. బ్లావెట్‌స్కీ రహస్య సిద్ధాంతములను తయారు చేస్తుంటే, కల్నల్‌ ఆల్కాట్‌ దివ్య జ్ఞాన సమాజపు అభివృద్ధికై కృషి కొనసాగించాడు.

12. హెలెనా బాల్యము రష్యాలోని నరాట్‌ సరాట్‌వా గ్రామానికి చెందిన తన బామ్మ తాతల సంరక్షణలలో జరిగింది. ఫదీఫ్‌ అను పేరు గల ఆమె తాత ఆ ప్రదేశానికి గవర్నర్‌గా పనిచేశారు.

13. హెలెనా చిన్నప్పటి నుండి అదృశ్య శరీర ధారులతో మాట్లాడుతూ ఉండటము జరుగుతుండేది.

14. హెలెనా తన 17 ఏళ్ళ వయస్సులో తన కంటే అధిక వయస్సు గల జనరల్‌ బ్లావెట్‌స్కీ, ఇరివాన్‌ ప్రాంతపు గవర్నర్‌తో వివాహం జరిగింది. ఈ వివాహము ఆమెకు ఇష్టము లేదు. అందువలన మూడు నెలల తరువాత భర్త గృహము నుండి తప్పించుకొని తన ఇంటికి తిరిగి వచ్చింది. తన భర్త నుండి దూరముగా ఉండుటకు ఆమె అనేక సంవత్సరాలు అనేక క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటూ దేశ సంచారము చేసింది. ఆమె తండ్రి తనకు ఆర్థిక సహాయము చేసేవారు.

15. వివాహము తరువాత ఆమె బ్లావెట్‌స్కీగా పిలువబడింది.

16. 1851లో బ్లావెట్‌స్కీ మొదటిసారిగా తన ఆధ్యాత్మిక గురువును భౌతికంగా కలుసుకుంది. అప్పటి నుండి ఆయన బ్లావెట్‌స్కీని అనేక ప్రమాదకర పరిస్థితుల నుండి రక్షిస్తు, ఆమెకు అనేక ప్రాకృతిక, రహస్యవాద, ఆధ్యాత్మిక సిద్ధులను పొందుటకు తోడ్పడినాడు.

17. బ్లావెట్‌స్కీ హిమాలయములలో అత్యధిక భాగము గడిపి అచటి గుహలలో అతి ప్రాచీన గురువుల గ్రంథములు చదివి, సాధనలు చేసి అనేక అంతర్‌తలాల (అంతరిక్ష) రహస్యాలను అవగతము చేసుకుంది. అపుడే ఆవిడ ''దివాయిస్‌ ఆఫ్‌ సైలెన్సు'' అనే పుస్తకములో ఆ విషయాలు తెలిపింది.

18. 1873లో బ్లావెట్‌స్కీ అమెరికా చేరి తాను చేసిన కృషిని అచటి ప్రజలకు అవగాహన కలిగించుటకై ఆధ్యాత్మిక ప్రచారము కొనసాగించింది.

19. ప్రజలకు ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రచారం చేయుటకు రెండు విధానాలు అవలంబించింది.
1. తన ఆధ్యాత్మిక శక్తులను ప్రదర్శించుట.
2. అతి ప్రాచీన జీవితపు లోతులను తరచి విప్పిచెప్పగలిగిన జ్ఞానము, పరమ గురువుల చేత రక్షింపబడుతుందని, అది పరమార్థ ప్రయోజనాలకు ఉపయోగించగల సత్పాత్రులకు మాత్రమే ఇవ్వబడుతుందని, ఆ గురువులనే సిద్ధపురుషులని మాష్టర్సు అని చోహాన్సు అని వారిని గూర్చి తెల్పింది అది నిరూపించుటకు 1877లో  ఐసిస్‌ అన్‌వీల్‌డు అను గ్రంథములో, 1888లో లోను తెలియబర్చింది.

20. 1875లో స్థాపింపబడిన దివ్య జ్ఞాన సమాజము యొక్క మూడు ముఖ్యమైన లక్ష్యములు.
1. జాతి, మత, లింగ, వర్ణ భేదము లేకుండా సంపూర్ణ మానవ జాతి యొక్క విశ్వ సౌభ్రాతృత్వ భావనకు కృషి చేయుట.
2.  మతము లేక దర్మము-  - దర్శనము వేదాంతము - మరియు  విజ్ఞానము ఈ మూడింటి మధ్య సమన్వయము సాధించుట. 3. ప్రకృతిలోను, మనిషిలోను అంతర్గతంగా దాగి వున్న శక్తులన్ని బహిర్గత మొనర్చుట.

21. 1979లో బ్లావెట్‌స్కీ మరియు కల్నల్‌ ఆల్కాట్‌ భారతదేశం వచ్చి దివ్య జ్ఞాన సమాజం యొక్క రహస్య సమావేశాలు జరిపి 1000 మందికి పైగా సభ్యులచే విశిష్ఠ సాధనలు చేయించి, వారు తరువాత కార్యక్రమములను కొనసాగించుటకు కృషి చేశారు.

22. బ్లావెట్‌స్కీ తన రహస్య సిద్ధాంతాలలో 1) విశ్వనిర్మాణ ప్రక్రియను 2) మానవ జాతి నిజమైన చరిత్ర 3) ప్రపంచ ఇతిహాసములలోని రహస్యాలను తెలుసుకొనే విధానము, 4) తీవ్రసాధకులకు ప్రకృతిలోని ఆధ్యాత్మిక వైజ్ఞానిక రహస్యాలను తెలుసుకొనే మార్గములు తెలియబర్చారు. వీటిని అనుభూతిలోకి పొందలేనంత వరకు అవి రహస్యాలే.

23. బ్లావెట్‌స్కీ తన 61వ సంవత్సరములో 1891లో తన శరీరమును వదలి వెళ్ళినప్పటికి, ప్రజానీకానికి అనేక వేల సంవత్సరాల నుండి మూసి ఉన్న రహస్యాలను బహిరంగపర్చి, మానవునికి, ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని తెలియబర్చారు.

24.   Spiritualaity (విజ్ఞానం) ఈనాడు చాలా ప్రముఖ పాత్ర వహించినప్పటికి, వైజ్ఞానిక (హేతువాద) దృష్టి కోణములేని ఏ విషయము స్వీకరించలేని స్థితికి వచ్చింది.

25. ఆధ్యాత్మికత అలా కాక కేవలము నమ్మకము మీద ఆధారపడుటచే తన అస్తిత్వమును కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆధ్యాత్మికత తిరిగి తన పూర్వ ప్రతిష్ఠను పొందాలంటే అది తన విలువలను గౌరవాన్ని పెంచుకోవాలి.

26. ఆధ్యాత్మికత ప్రకారంగా ప్రకృతిలో రెండు శక్తులు పనిచేస్తున్నాయి.
1) జీవితము 2) పదార్థము.

27. జీవితములో తన పరిధిని పరిమితము చేసుకున్న చివరి దశలో పదార్థము అవుతుంది. పదార్థము చేతనత్వ వికాసము (ఎఱుక) పొందినప్పుడు జీవితము ప్రకటించబడుతుంది.

28. జీవితము యొక్క చేతన ద్వారా వికాసము చెందే మార్గములో 10 దశలున్నాయి. వీటిలో 7వ మెట్టు వరకు చేతనత్వము మీద పదార్థము తన అధికారమును నెరుపుచూ ఉంటుంది. ఆ స్థితిలో చేతనత్వము సంతులనమొంది, వికాసము సమతాస్థితినొందుతుంది.

29. సమతాస్థితి అనంత కాలము కొనసాగుతుంటుంది. ఈ స్థితిలో జన్మ, మృత్యు చక్రము కొనసాగుతుంది.

30. జీవితము పదార్థ స్థితిలోకి మారిన తరువాత, పదార్థానికి జీవితము తొలగిపోయింది. కృష్ణావతార స్థితిలో మొదటి సారి తన నుండి తాను ప్రేరణ పొందుతుంది. తత్ఫలితముగా ప్రకృతిని జీవితము స్వాధీన పర్చుకొని, ప్రకృతిలోని చీకటిని దూరం చేసుకొవడానికి ప్రయత్నాలు మొదలుపెడుతుంది.

31. ప్రకృతిని అదుపులోకి తెచ్చుకొన్న మానవుడు అస్త్రవిద్య ద్వారా వాక్‌ శక్తిని ఉపయోగించి, ఈనాడు యంత్రాలు చేసే పనిని అప్పుడు వాక్‌ శక్తి ద్వారా చేయటం జరిగింది.
 
32. వాక్‌ శక్తి యొక్క అస్త్ర ప్రయోగాన్ని అరికట్టక పోయిన, జీవితము అవ్యక్త మనోమయ పరిధి నుండి స్థూల జగత్తుకు దిగలేదు. అందువలన అస్త్ర విద్యను అవ్యక్తము చేయవలసిన అవసరం ఏర్పడింది. కాని నాశనం జరగలేదు. తిరిగి అస్త్రవిద్యను పునరుద్ధరించే మార్గములు ఆధ్యాత్మిక శాస్త్రాలలో స్పష్టంగా నిర్దేసింపబడలేదు.

33. అస్త్రవిద్యను తిరిగి పొందాలంటే కర్మ, భక్తి, జ్ఞాన యోగాల సమన్వయమే మార్గమని చెప్పి వదలివేశారు.

34. అవ్యక్త మనోమయ స్థితిలో ఉన్న ఆదిశక్తి భూమిమీదకు దిగి వచ్చి ప్రకృతిని, దైవీప్రకృతిగా మార్చుటకు ఆధ్యాత్మిక గురువులు చేతనత్వాన్ని ఉద్దీప్యం చేయుటకు భక్తి, కర్మ, జ్ఞాన యోగాలను సమన్వయపర్చే మార్గాలను చెప్పటం జరిగింది.

35. ప్రకృతిని దైవీప్రకృతిగా మార్చుటకు మూడు అంచెలను రూపొందించారు. 1) 'తమసోమా జోతిర్గమయ' 2) 'అసతోమా సద్గమయ' 3) 'మృత్యోర్మా అమృతంగమయ'.

36. తమసోమా జోతిర్గమయ: అంధకారము నుండి వెలుగులోకి తీసుకొని వెళ్ళుట. క్రీ.శ.17వ శతాబ్దంలో శాస్త్రజ్ఞులు కాంతి యొక్క అధ్యయనం చేసి, దాని స్వభావాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేసినారు. అగ్ని యొక్క వివిధ ఉపయోగాలు, అగ్నిని ఉపయోగించి ధాతువులను శుద్ధి చేయుట, క్రొత్త క్రొత్త పదార్థములు తయారుచేయుట. ఇవన్నీ ఆత్మ శక్తి యొక్క వెలుగు అభివ్యక్తీకరణలే. అందువలన మనమందరము గుప్తవిద్య యొక్క విభిన్న వెలుగులుగా గుర్తించాలి. ప్రతిరోజు రాత్రి వెలుగుతున్న అనేక విద్యుత్‌ దీపాలే ఇందుకు నిదర్శనము.

37. మహాభారతములో అగ్ని గుండము నుండి ఉత్పన్నమైన దృష్టద్యుమ్న, ద్రౌపదిలు పంచతత్త్వములలో ఉన్న సంస్కారములను వెలికి తీయుటకు చేసే ప్రయత్నములే. ఈ ప్రక్రియ యజ్ఞవిద్య, అగ్ని విద్య. అన్నీ కూడా అంధకారములోనుండి ప్రకృతిలోనికి తీసుకొనివచ్చే సామూహిక ప్రయత్నాలు.

38. అసతోమా సద్గమయ: ప్రకృతిలోని అనేక పదార్థాలు, భిన్న భిన్న గుణాలు, ధర్మాలు కలిగినట్లు అనిపించిన ఇవన్నీ కూడా ధన, రుణ విద్యుదావేశాల కలయిక మాత్రమే అని ఆధునిక విజ్ఞానము నొక్కి చెబుతుంది.

39. ఈ విరాట్‌ విద్యుత్‌ చేతనత్వపు అతి సూక్ష్మ కణమని తెలుపుతోంది. అందువల్ల విద్యుత్‌ శాస్త్ర చమత్కారాలన్నీ ఆత్మ శక్తి యొక్క అవతరణ ప్రకృతిలో జరుగుటవలన, ఈ శక్తిధార 'అసతోమాసద్గమయ' అను సూత్రము ప్రకారమే జరుగుచున్నది. అవాస్తవం నుండి వాస్తవం వైపు ప్రయాణించినపుడే ప్రకృతి దైవ ప్రకృతిగా మారుతుంది.

40. 'మృత్యోర్మా అమృతంగమయ':నిస్త్రాణంగా, శక్తిహీనంగా ఉన్న అతి సూక్ష్మ కణములోనుండి, స్వచ్ఛందంగా ఉన్న ఏ బాహ్య పరికరము యొక్క సహాయము లేకుండా నిరంతరము వెదజల్లబడుతున్న రేడియో ధార్మిక కిరణాలు ప్రతి పరమాణువులోనున్న అనంత శక్తి సామర్ధ్యాలు 20వ శతాబ్దములో ప్రకటితమయ్యాయి.

41. భక్తి, జ్ఞాన, కర్మల సమన్వయ సాధనల ద్వారా వ్యక్తి తనలోని అంతర్గత శక్తిని వెలికితీయుట ద్వారా నవయుగ నిర్మాణానికి బాటలు వేయగలడు.

42. భౌతిక స్థాయిలో ఉన్న వ్యక్తి తన ఆత్మిక శక్తిని అవతార స్థాయికి, కోరుకున్న దిశలో ప్రేరణ కల్పించుటకు ఏమి చేయాలో ఎలా ప్రకృతి శక్తులను వినియోగించాలో, తీసుకోవల్సిన జాగ్రత్తలేమిటో, ఫలితాలేమిటో విశదంగా తన గుప్తవిద్యలో తెలియజేసిన వ్యక్తి బ్లావెట్‌స్కీ.

43. బ్వావెట్‌స్కీ తన 'ఐసీస్‌ అన్‌వీల్డు' అను పుస్తకము ద్వారా ఆనాటి ఆధ్యాత్మికతను గూర్చి ప్రపంచములోనున్న దురభిప్రాయాలను తొలగించుటకు కృషి చేసింది. అది చదివిన వారు అది చాలా బాగుందని, కాని అర్థంకావటంలేదని తెలిపినారు.

44. అందుకు సమాధానంగా గుప్తవిద్య ద్వారా 'ఐసీస్‌ అన్‌వీల్డు' గ్రంథములోని విషయములను వ్యాఖ్యానిస్తూ మానవ జీవితాన్ని సమగ్రంగా విశదపర్చే అద్భుత గ్రంథంగా తెలియజేయుట జరిగింది.

45. గుప్తవిద్యను అర్థము చేసుకోవటానికి ముందు మూడు పదాలను గూర్చి సంపూర్ణంగా తెలుసుకోవాలి. 1) జీవితము 2) జడత్వము 3) చేతనత్వము లేక మనస్సు.

46. మొదటిదైన జీవితము మీద కాలప్రభావము ఉండదు. ఇది దేని ప్రభావము వలన మారదు.

47. రెండవదైన జడత్వము. ఇది పదార్థము ద్వారా వ్యక్తీకరించబడుతుంది. ఇది జీవితానికి వాహకముగా పనిచేస్తుంది. అందువలన కాల ప్రవాహములో ఇవి జీవితంలోని అనేక కోణాలను అభివ్యక్తీకరించే స్థాయికి పరిణతి చెందింది.

48. మన వర్తమానానికి మన గతానుభవమే నాంది. అలాగే మన భవిష్యత్తు మన వర్తమానం మీద ఆధారపడి ఉంది. గతాన్ని మార్చలేము. అందువలన ప్రస్తుతం మన చేతిలో నున్న వర్తమానాన్ని సంపన్నం చేసుకుందాం.

49. శాస్త్రజ్ఞులు; పరమాణువులు, అణువులు, జీవకణాలు వాటి ప్రత్యేక లక్షణాలు గల ప్రాణి సముదాయాలు, గ్రహాలు, పాలపుంతలను గూర్చి అనేక విషయాలు తెలియజేసారు.

50. జీవ పరిణామ సిద్ధాంతము ప్రకారము మానవజాతి ఏర్పడి, విజ్ఞానములో అతి త్వరితముగా అనేక మార్పులు చెందగల్గుతుంది.

51. విశ్వములోని అనేక జాతుల సామూహిక గుప్తవిద్యలు అనగా ఖనిజ, వృక్ష, జంతు, మానవ, అతిమానవ జాతులలో కేవలము మానవ జాతికి మాత్రమే మనస్సు అనే అతిజటిల స్థితి ఏర్పడి, త్వరలో అత్యద్భుత లక్షణాలను వ్యక్తపరచే స్థితికి చేరుకున్నాడు.

52. ఈ మనస్సునే చేతనత్వమని ఎఱుక అని పిల్చి, అనేక బోధనా పద్ధతుల ద్వారా జీవితము యొక్క అభివ్యక్తీకరణకు ప్రయత్నాలు జరుగుచున్నవి.

53. ఈ జీవితపు 'గుప్తవిద్య'ను తెలుసుకొనుటకు అనేక త్రిపుటులను తెలుసుకోవలసి ఉంటుంది.
 
1. జీవితము, మనస్సు, పదార్థము.
2. బ్రహ్మ (సృష్టి), విష్ణు (స్థితి), మహేశ్వరుడు (లయము).
3. చీకటి, సంధ్య, వెలుతురు.
4. సుషుప్తి, స్వప్నము, జాగ్రత్తు
5. రజోగుణము, సత్వగుణము, తమోగుణము.
6. స్వర్గలోకము, భువర్‌లోకము, భూలోకము
7. ఆగామి, ప్రారబ్దము, సంచితము
8. ఆత్మికము, దైవికము, భౌతికము
9. దైవము, సూర్యుడు, పవిత్రాత్మ
10. మనసా, వాచా, కర్మణా
11. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి
12. కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము
13. సాలోక్య, సాయుజ్య, సారూప్య
14. చూసేవాడు, చూసే ప్రక్రియ, చూడబడే పదార్థము.
15. వేదాంతము, మతము, విజ్ఞానము మొదలుగునవి.

54. పైవాటన్నింటిలో మూడవదైన అవస్థాత్రయము చాలా కనిష్ట స్థాయికి చెందినది. మొదటిది అతి ఉచ్ఛస్థాయికి చెందినది.

55. జాగ్రదావస్థ మనకి ప్రముఖమైనదిగా అనిపిస్తుంది. ఈ స్థితిలో అన్నియూ మనకు అవగాహనలో అదుపులో ఉన్నట్లు తోచుచున్నది. ఇదే స్వప్నావస్థలో క్షణక్షణానికి మారే పరిస్థితులు, ఒకదానికొకటి సంబంధములేని సంఘటనలుగా గోచరిస్తున్నాయి. సుషుప్తి లేక నిద్రావస్థలో ఏ సంఘటనలు లేకపోవుటయె గాక కాలము, ప్రపంచము కూడా అంతరించిపోయాయి. మొత్తము ఘనీభవించిన అంధకారమే మిగులుతుంది.

56. మనము జాగ్రదావస్థకే అధిక ప్రాధాన్య మిస్తాము. స్వప్నావస్థలో అనేక మంది ప్రేరణను పొంది, ఆధునిక విజ్ఞానమును సృష్టించినప్పటికి, అందుకు కారణమైన సుషుప్తి స్థితిలోని అనగా నిద్రావస్థలోనే ఆ ప్రేరణనకు తగిన సూచన లభిస్తున్నదని గ్రహించాలి.

57. సామాన్యులకు రాత్రి చీకటిగా ఉంటుంది. కాని జ్ఞాని రాత్రి యందు మెలుకువతో ఉండి ఎఱుకతో ఉంటాడు. పగలు స్థిత ప్రజ్ఞులకు రాత్రితో సమానము. 'ఎఱుకే బ్రహ్మము' కావున స్థిత ప్రజ్ఞులు రాత్రి యందు సంయమనముతో కూడిన ఆత్మిక స్థితిలో ఉంటారు.

58. సంయమన స్థితిలో ఉన్న వ్యక్తి ఎఱుకతో ఉండి మనస్సును స్థిరపర్చి సమగ్రంగా విషయాన్ని గ్రహించగలుగుతాడు.

59. సాధారణ స్థితిలోని వ్యక్తుల మనస్సులు స్థిరముగా లేక వారు వర్తమానములో చేస్తున్న పనిని వదలి, వేరే విషయాలను గూర్చి ఆలోచిస్తుంటారు.

60. జాగ్రత్‌, స్వప్న, సుషుప్తావస్థలో మనము ఉపయోగించుకోవలసిన వాహనాలు, స్థూల, సూక్ష్మ కారణ శరీరాలు.

61. స్థూల శరీరానికి జాగ్రదావస్థలో 11 ఇంద్రియాలు (5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు 1 మనస్సు) పనిచేస్తుంటాయి.

62. ఈ 11 ఇంద్రియములపై ఆధిపత్యము సాధించాలంటే కనీసం 5 సంవత్సరాలు వ్యక్తి నిరంతర శ్రమ చేయాలి. అందుకు క్రమశిక్షణతో కూడిన జీవితము అవసరము.

63. అందుకు ఉపాసనా విధానాల ద్వారా ఈ 11 ఇంద్రియాలను స్వాధీనం చేసుకొన్నప్పుడు సూక్ష్మ శరీరము చైతన్యవంతమవుతుంది.

64. కారణ శరీరం కారణ జగత్తులో శరీరాన్ని ఆ ప్రపంచానికి అనుగుణంగా మలుచుకోవాలంటే చిత్తవృత్తుల నిరోధము విశిష్ఠ పాత్ర వహిస్తుంది.

65. చిత్త వృత్తుల నిరోధము వలన వసుధైక కుటుంబము, సంఘశక్తి, కారణ జగత్తులో ఆత్మ శక్తి వికాసానికి తోడ్పడుతుంది.

66. గుప్తవిద్యలోని మొదటి మూడు స్థితులలో పూర్వ సృష్టి లయంచెంది నిద్రావస్థలో ఉన్నప్పుడు నూతన సృష్టికి ముందు కారణ జగత్తులో జరిగే ప్రక్రియ వర్ణన ఉంటుంది.

67. గుప్త విద్యను అర్ధం చేసుకొనుటకు కావలసిన రెండు షరతులు:
1) జాగరూకత - అనగా వ్యక్తి తనకు అలవాటైన లేక అభ్యాసంలో ఉన్న పనిని జాగరూకతతో చేయుట. మెలుకువగా ఉన్న క్షణాలలో ఒక్క క్షణం కూడా ఏమరుపాటుతో ఉండకూడదు.
2) అలవాటు: చేస్తున్న పనిలోని ఔచిత్యాన్ని గుర్తించాలి. మనిషి జీవితంలో అనేక పనులు చేయవల్సి ఉంటుంది. అందు ఏది ముందు, ఏది వాయిదా వేయవచ్చు అనే విషయాన్ని బుద్ధిని ఉపయోగించి తెలుసుకొని ఏది తక్షణం చేయవలయునో అది చేయుట. అందుకు వ్యక్తి తన దివ్య చక్షువులను ఉపయోగించాలి.

68. దివ్య చక్షువులు లభించాలంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహము ఉండాలి.

69. పరమేశ్వరుని అనుగ్రహము పొందాలంటే జ్ఞాని తన ప్రాణ మనస్సులను పరమేశ్వరుని యందే ఉంచి, ఇంద్రియ నిగ్రహులై ఎల్లప్పుడూ అతనిని భావిస్తూ, అతని విషయాలనే ముచ్చటించుకుంటూ, నిత్యసంతోషులై ఉండాలి. అట్టివారికి పరమాత్మ ఎల్లప్పుడు వెంట వుండి అంతఃస్పూర్తి కలిగిస్తూ అవసరానికి అనుగుణ్యమైన పనులను మనచేత చేయిస్తుంటాడు. అజ్ఞానమనే చీకటిని తొలగించి వివేకము కలిగిస్తాడు.

70. అభ్యాస లక్షణాలు:- 1) ఇంద్రియ నిగ్రహము 2) ఏకాగ్రత 3) నిరంతర దైవ భావన 4) దైవాన్ని గూర్చిన చర్చ 5) వివాద రహితంగా సంతోషంగా వుండుట.

71. అహంకారాన్ని వదలివేసిన వాడు, అణకువ కలిగినవాడే పరమాత్మ కృపను పొందగలడు.

72. బ్లావెట్‌స్కీకి ఈ గుప్తవిద్యను వ్రాస్తున్నపుడు ఆమె కళ్ళ ముందు ఒక తాళపత్ర గ్రంథము ఉందని, అది హిమాలాయాలలో అతి రహస్య ప్రదేశంలో దేని వలన కూడా నశింపబడని విధంగా ఉందని, దానిని బుక్ ఆఫ్ డ్ఙ్యాన్ అని అంటారని, అందులోని 7 శ్లోకాలకు మాత్రమే గుప్తవిద్య మొదటి భాగములో వివరించబడినదని తెలుస్తుంది.

73. గుప్తవిద్యే కాక ఆధ్యాత్మిక స్తోత్ర, పురాణాలు, ఉపనిషత్తులు, యోగుల వాక్యాలు చదవాలంటే దివ్య దృష్టిని ఉపయోగించే చదవాలి.

 74. ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న సంఘటన దైవ సంకల్పమని స్పష్టంగా గుర్తించాలి.

75. ఏకాగ్రత, లక్ష్య శుద్ధితో ఒక కార్యమును చేపట్టీ, మిగతా విషయాలలో విరక్తి వైరాగ్యం కలిగి ఉండాలి.

76. మన శరీరాలను ప్రయోగశాలగా ఉపయోగించుకొని సాధన చేసిన మానవ శరీరంలో చేతనత్వ ప్రభావాలు సమతా స్థితికి చేరుకుంటాయి. ఆ స్థితిలో వ్యక్తి తన సూక్ష్మ, స్థూల, కారణ శరీరములను ఉపయోగించి పిండాండము, బ్రహ్మాండములతో సంబంధము స్థాపించుకొనగలిగే పరిశోధనా శాలగా మలచుకొని ఉపయోగించుకొనుట జరుగుతుంది.

77. శరీరాన్ని వుపయోగించే ప్రక్రియలో
ఎ) నిద్రాస్థితి అనగా కారణ జగత్తు, కారణ శరీరము, విత్తనము నాటే స్థలముగా.
బి) స్వప్నావస్థ సూక్ష్మ జగత్తు, కలుపు మొక్కలు తీసివేసే స్థలముగా.
సి) జాగ్రదావస్థ; స్థూల జగత్తు, స్థూల శరీరము చేసిన ఫలితాలు పొందే క్షేత్రంగా గుర్తించాలి.
ఈ మొత్తం ప్రక్రియ విత్తనం నాటుకో, పంటకోసుకో. ఇదే కర్మ సిద్ధాంతము.

78. నేడు మనం జాగ్రత్‌ స్థితిలో సర్వం ఇదే అనుకొని దానిలో మాత్రమే మార్పు తెచ్చుటకు ప్రయత్నిస్తున్నాము. జాగ్రత్‌ స్థితికి మూలకారణమైన స్వప్న, సుషుప్తి స్థితులను గూర్చి ఆలోచించుటలేదు.

79. బ్లావెట్‌స్కీ యొక్క 'గుప్తవిద్య'లో స్వప్న, సుషుప్తి స్థితులను అర్థం చేసుకొని అచట గల అలౌకిక శక్తులను ఉపయోగించి వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆనందమయం చేసుకొని, భౌతిక ప్రపంచాన్ని స్వర్గంవలె తీర్చిదిద్దే స్థితులను, పృథ్విని నియంత్రించే స్థితికి తీసుకువస్తుంది.

80. వివిధ ప్రాచీన గ్రంథాల ఆధారంగా దేవతల నుండి ఋషుల వరకు జరిగే అనేక పరిణామాల వివరాలు ఇవ్వబడ్డాయి. భవిష్యత్‌ వాణిని గూర్చి, మానవ జాతుల గూర్చి, జంతువులు, ఖనిజ, వృక్ష సంపదలు, మానవులు, దేవతలు, పరమగురువుల మధ్య ఇచ్చిపుచ్చుకోవటాలను గూర్చి వివరించబడినాయి.

81. సూక్ష్మ దృష్టితో పరిశీలించిన ఖనిజ జగత్తులో రేడియో దార్మికత, పరమాణు శక్తిని కనుగొనుట, వృక్ష జగత్తుకు కూడా ప్రాణుల వలె స్పందన కలదని, పుష్పముల ద్వారా వ్యాధి నివారణ, సంకర జాతి రకముల తయారీ, వాటికి కావలిసిన ఖనిజములు, ఎరువులు, మందులు ఉపయోగించుట తెలుసుకొనబడింది.

82. క్రమముగా ఎద్దు, గుఱ్ఱములు, మేకలు మరి కొన్ని విశిష్ఠ జాతుల సముదాయము మానవ జాతికి దగ్గరగుట, ప్రపంచ యుద్ధములు, అనేక మంది గురువుల ద్వారా దేవతల నిజస్వరూపములను గ్రహించుట, భవిష్యత్తులో అతి మానవ (గురువులు), దేవతలు, పరమ గురువుల మధ్య జరిగే కర్మ సంబంధమైన ఇచ్చిపుచ్చుకొనుటలు మనము చూడబోతున్నాము.

83. 20వ శతాబ్దము తరువాత ఇంకా ఎక్కువ తెలుసుకొన్న శిష్యులు, గురువులు గుప్త విద్యను గూర్చి విస్తృత ప్రచారము చేసినచో, బ్లావెట్‌స్కీ యొక్క కృషి సఫలమవుతుంది.

84. గుప్త విద్యను మనం తెలుసుకొని ఆధ్యాత్మిక సంస్థల ద్వారా సూక్ష్మ జగత్తులో జరుగుచున్న అనేక దివ్య ప్రణాళికలు అమలు జరుగుటకు తోడ్పడవలసి ఉన్నది. లేనిచో గుప్తవిద్య మరుగునపడే అవకాశమున్నది.

85. గుప్త విద్య గురించి చెప్పే అతి ప్రాచీన గ్రంథములో ఇలా ఉన్నది.

1. ప్రశ్న:- ఎల్లప్పుడు ఉన్నది ఏది?
జవాబు:- ఆకాశం. అదే శాశ్వత ఆనుపాదక తత్త్వము.

2. ప్రశ్న:- ఎప్పుడూ ఉండేది ఏది?
జవాబు:- వేరులోని గింజ.

3. ప్రశ్న:- ఎప్పుడూ వస్తూ పోతూ ఉండేది ఏది?
జవాబు:- మహా శ్వాస.

4. ప్రశ్న:- అంటే మూడు శాశ్వతాలు ఉన్నాయా?

జవాబు:- కాదు. మూడూ ఒక్కటే. ఈ మూడూ చేతనత్వ భాషలో సుషుప్తి, స్వప్న, జాగ్రదావస్థలు. గుప్తవిద్యలో శ్లోకాలలో సృష్టి ఎలా మొదలైంది, ప్రళయ స్థితిలోకి ఎలా వెళతుంది, మధ్యలోనే క్రమపరిమాణము ఎలా జరిగిందో తెలుసుకుందాము. తరువాత వ్యక్తిగతంగా దీనిని ఎలా ఉపయోగించుకోవాలో గ్రహిస్తాము.
🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹

09/Mar/2019

---------------------------------------- x ----------------------------------------



🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 2 🌹
✍️ సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

🌹 గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) 🌹 
🌹 భాగము 2 🌹

🍃 మొదటి స్థితి  🍃

86. ఈ సృష్టి ప్రారంభము కాకముందు పూర్వ సృష్టి, ప్రళయ స్థితిలో ఎలా లయమైందో తెలుసుకుందాము.

87. మనము నిద్రస్థితిలోకి వెళ్ళే ప్రక్రియ ప్రకారము మనము ప్రతిరోజూ జాగ్రత్‌ నుండి స్వప్న, సుషుప్తిలోకి ఎలా వెలుతున్నామో గ్రహించాలి.

88. శాశ్వత జగత్‌ పితరులు 7 అనంతముల వరకు సుషుప్తిలోకి వెళ్ళారు. అదే ప్రళయకాల స్థితి.

89. శాశ్వత జగత్‌ అయిన ఆకాశము పితరుల నివాసమని గ్రహించాలి.

90. ప్రతి దృగ్గోచర పరిస్థితికి ఇది అగోచరము. ఉపాధిగా ఉన్న ఆకాశము నుండి వికిరణము చెందిన పంచతన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంథాలు మొదట రూపొందినవి.

91. వ్యక్తి లయ స్థితిలో తన ఆత్మ, చిత్తము, బుద్ధి, మనస్సు, అహంకారములు అను దుస్తులను వదలి దృగ్గోచరము కాని బట్టలను చుట్టబెట్టుకొని ఉంటాడు.

92. ఆ సమయంలో కాలము అనంతము యొక్క హృదయములో నిద్రిస్తూ లేనిదై ఉంటుంది. 

93. కాలమనేది ఒక చేతనత్వము నుండి (స్థితి) మరొక చేతనత్వములోనికి అనంతములో ప్రయాణిస్తున్నప్పుడు కలుగుతుంది. భ్రాంతి కలుగజేయు చేతనత్వము లేకపోయిన కాలము తెలియదు. కాలము నిద్రలేచినపుడే తెలుస్తుంది. 

94. వర్తమానము (జాగ్రత్‌) నిజానికి భూత భవిష్యత్తులను వేరుచేసే ఒక భ్రమ మాత్రమే.

95. వర్తమానమనగా గతం యొక్క జ్ఞాపకాల పునాది మీద నిర్మింపబడి భవిష్యత్తుకు బాటవేసేది.

96. ఈ ప్రపంచంలో కనబడే సర్వభూతాలు ఇంతకు ముందు లేవు. ఇప్పుడు కనబడుతున్నాయి. చనిపోయిన తరువాత ఏ రూపం పొందునో తెలియదు.

97. నిద్రలోకి వెళుతున్న వ్యక్తి ముందు తన 7 కోశములను క్రమంగా తాకుతూ చివరికి బీజరూపములోనికి వెళ్ళి చైతన్యం నిద్రించగా కాల విస్మృతి కలుగుతుంది. అపుడు మనస్సు లేనిదవుతుంది.

98. సంకల్పము, ఆలోచన, కోరికల సమన్వయ చేతనత్వమే మనస్సు.

99. సాధకుడు నిద్రా స్థితిలో, బాహ్య, దేశ, కాల స్థితిని దాటి తన అంతరంగములో ప్రవేశించి, సాధన యొక్క పరిణతితో ఆ మానసిక శక్తులను ఉపయోగిస్తాడు. నిద్రకు ముందు సాధకుడు దివ్య జ్యోతిని దర్శిస్తాడు. కాని సాధారణ వ్యక్తి లౌకిక ఊహాగానాలు చేసి నిద్రలేని స్థితికి లోనవుతాడు. 

100. నిద్రకు ముందు శ్వాసలోని మార్పులను గమనిస్తూ వుండాలి. అది సాధనలోని ఒక భాగము.

101. ఆనందానికి, దుఃఖానికి ప్రత్యేకకారణాలు ఏవీలేవు. అవి వాటివాటి బంధనాలలో వున్న వారికి మాత్రమే.

102. సత్‌, చిత్‌, ఆనందము కేవలము లయ స్థితిలోనే కలుగుతుంది. కావున అవి లేనట్లే.

103. ద్వాదశ రాశులు వాటి ఫలితాలు కూడా కేవలము లయ స్థితిలోనే ఉంటాయి. కాని అనగా నిజానికి ఏమీలేవు. బాహ్య దృష్టిలో అయితే దోషాలను గమనించి వాటికి తగిన ప్రాయశ్చిత్తము చేసుకోవాలి.

104. చీకటి స్థితిలో తల్లి, తండ్రి, కొడుకు లేరు. అంతా ఒక్కటే. వెలుగులోకి వచ్చినప్పుడే పుత్రుడు తన యాత్ర మొదలుపెడతాడు. 

105. చీకటి అనగా ఇంద్రియాతీత స్థితి. వెలుగులోకి వచ్చినప్పుడే కాలము, ఇంద్రియాలు గోచరమవుతాయి.

106. గుప్త విద్య ప్రకారం బ్రహ్మమే తల్లి, తండ్రి, కొడుకు, జీవితము, చేతనత్వము. ఇవన్నీ ఆత్మ పదార్థముల కలయిక వలన ఏర్పడినవే.

107. బ్రహ్మము నుండి విడివడిన పంచభూతాలు, మనస్సు, బుద్ధి మరల కలుస్తూ, విడిపోతూ చివరికి బ్రహ్మములో విలీనం కావలసినదే. ఇవన్నీ సత్యమైన ఆత్మ యొక్క సత్యములు(విభూతులు).

108. ఏదైతే ఉండియూ లేకుండా ఉన్నదో (బ్రహ్మము) దాని నుండి ఉత్పత్తి అయ్యేది ఏదీలేదు, దానలోకి మరొకటి లయమయ్యేదీ ఏదీలేదు.

109. పంచభూతములలోని భూమి, నీరు, అగ్ని, వాయువులను దర్శించటం సులభమే. 5వది అయిన ఆకాశ తత్వం, పై నాలుగింటిలో అంతర్లీనమై ఉంది, మరియు ఆ నాలుగింటితో సంబంధం లేకుండా ఉంది. అవి లేకపోయీ ఆకాశ తత్త్వం ఉంటూనే ఉంది.

110. లయ స్థితిలో నుండి వికాస స్థితిలోకి కావలసిన పనిముట్లు తయారు చేసుకొనుటకు, ప్రస్తుత స్థితి నుండి ఇంకను వికాసం చెందుటకు, పరిపూర్ణత సాధించుటకు కావలసిన ముడి పదార్థములను, పరిస్థితులను లయస్థితిలోనే తయారుచేసుకుంటుంది, ఇది ప్రణాళికా రూపంలో ఉండి, సరిగా అలాగే క్రమముగా వ్యక్తమవుతుంది.

111. సృష్టి స్థితిలో లయ స్థితి యొక్క ప్రణాళిక ప్రకారము మార్పులు వాటంతట అవె ప్రణాళికా బద్ధంగా జరుగుతాయి. 

112. ఉనికికి కారణమైన దృగ్గోచర ప్రపంచం, లయ కాలములో ఉనికి రహిత స్థితిలో విశ్రాంతి తీసుకుంటున్నాయి.

113. ఉనికికి లక్షణాలైన 'ఉండాలి' అనే కోరిక 'జీవించాలి' అనే కోరిక పరమాణువు నుండి సూర్యుని వరకు కనిపిస్తుంది.

114. కాని ఉనికికి కారణాలేవి కనిపించవు. మనస్సుకు కూడా కారణాలు తెలియవు. వాటిని తెలుసుకోవాలంటే విజ్ఞానము, ఆధ్యాత్మిక స్థితికి చెరుకోవలసి ఉంటుంది.

115. నిద్ర స్థితిలోకి వెళ్ళినప్పుడు ఎఱుక నుండి మరుపు స్థితికి ఎప్పుడు ఎలా వెలుచున్నామో గమనించుటయే సాధన యొక్క ముఖ్య భాగము.

116. ఆ గమన స్థితిలో విశ్వాంతరాళములలో జీవితము మూర్ఛ స్థితిలో ఉన్నప్పటికి స్పందిస్తూనే ఉంటుంది. ఆ స్పందనను తెలుసుకోవటమే సాధన యొక్క ముఖ్య పని. 

117. మూర్ఛ స్థితిలో విశ్వమంత ఒకే స్థితిలో బ్రహ్మములో లీనమై ఉంటుంది. అపుడే మార్పుతో కూడిన కలయికలు, విడిపోవటాలు జరుగుతుంటవి. వైజ్ఞానికులు ఆ మూల స్థితికి (హైడ్రోజన్‌ ఆటమ్‌) చేరుటకు కృషి చేస్తున్నారు.

118. నిద్ర యొక్క స్వప్న రహిత స్థితిలో మనస్సు యొక్క కొంత భాగము ఎఱుక స్థితినే, శివుని యొక్క మూడవ నేత్రం అన్నారు. ఇదే జీవన్ముక్తుని ఆధ్యాత్మిక కేంద్రము.

119. వ్యక్తిగత సాధనలో శ్వాసను గమనిస్తూ నిద్రకుపక్రమించిన సాధకుడు తన గడిచిన రోజును గుర్తుచేసుకుంటూ, జరిగిన తప్పులను అతీత శక్తులనుపయోగించి సవరించుకుంటూ, స్వప్న రహిత స్థితికి చేరుకుంటాడు.

120. మనస్సుకు ఆలయము శరీరము. సూక్ష్మమైన మనస్సు యొక్క వ్యక్తీకరణ స్థూల శరీరము ద్వారానే జరుగుతుంది. మనోవ్యాపారము శరీరమనే పనిముట్లు ద్వారా జరుగుతుంది. ఆధ్యాత్మిక స్థితిలో మనస్సు ఆత్మకు నిలయముగా మారుతుంది. అప్పుడు మనస్సుతో కూడిన ఆత్మ తనను తాను లీలగా వ్యక్తపరచుకొంటుంది. మనో వ్యాపారాన్ని విలక్షణముగా ఉండి సాక్షిగా గమనిస్తూ ఉంటుంది.

121. దేవతా గణాలు స్వయం ఉత్పత్తులు అగుటచే, స్వప్న రహిత స్థితిలో, అనుత్పాదక స్థితిలో సృష్టి క్రమం దాగి ఉంటుంది.

122. సాధారణముగా సాధకుడు అనుత్పాదక స్థితిలో సాక్షిగా ఉండుటచే గాఢ నిద్రలో ఎఱుకతో ఉండగలడు. ఇది తురీయము.
🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹

Date: 10/Mar/2019

---------------------------------------- x ----------------------------------------


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 3 🌹
🌹 గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) 🌹
3 వ భాగము
✍️ సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 3. రెండవ స్థితి 🍃

123. రెండవ స్థితిలో, జాగ్రత్తగా గమనించక పోయిన, మొదటి స్థితిలో చెప్పిన విషయాలే రెండవ స్థితిలో చెప్పినట్లు అనిపిస్తుంది. కాని ఈ రెంటికి తేడా తెలుసుకోవడానికి చాలా సాధన అవసరమవుతుంది. అందువలన ఈ తేడాను గమనించే బాధ్యత చదివేవారి యొక్క బుద్ధి, ఇంద్రియములకు మాత్రమే వదలివేయబడినది. ఇచట భౌతిక స్థితిని గాక ఆధ్యాత్మిక స్థితిని ఉపయోగించాలి.

124. మొదటి స్థితిలో సుషుప్తి (లయ) స్థితిని తెలుపుతుంది. రెండవ స్థితిలో ఆత్మ పరిధి చేరుకున్న తరువాత జరిగే మార్పులను వివరిస్తుంది.

125. సుషుప్తి యొక్క లయ స్థితిలో సృష్టి నిర్మాణ కర్తలు, అరూప స్థితిలోనూ ఆనందములో విశ్రాంతి తీసుకుంటున్నారు.

126. ఈ సృష్టి నిర్మాణ కర్తలు వ్యక్తిగత ఒక రోజు ప్రళయము (సుషుప్తి) నుండి కల్పాంతములో మహాప్రళయము వరకు ఒకే అర్థములో తీసుకొనవచ్చు. వీరు ఏడు గ్రహాలకు నిర్మాణకర్తలుగా గ్రహించవచ్చు.

127. ఎఱుక లేని లయ స్థితి ఆనందాన్ని ఇవ్వదు. కేవలము లయ స్థితినే తెలుపుతుంది. ఆధ్యాత్మిక లయ స్థితిలో వ్యక్తిగత విషయములను వదలి అనేక జన్మల, సామూహిక జన్మల సంస్కారముల యొక్క అనుభూతుల యొక్క పారమార్థిక అనుభూతికి చేరుతుంది.

128. ఆధ్యాత్మిక అనుభూతి స్థితిలో చెవులు లేవు శబ్దము లేదు, నిశ్శబ్దము లేదు. అచట నిరంతర శాశ్వత శ్వాస తప్ప ఏమియూ లేదు. అది తనను తాను తెలుసుకోలేదు.

129. లయ స్థితిలో భౌతిక ఉనికిని కోల్పోయినప్పటికీ వస్తువులు తమ అస్తిత్వమును కోల్పోవు అనేది భారతీయ మనో శాస్త్రానికి పునాది. లయ స్థితిలో ఉనికిని కోల్పోయినను, జాగృతిలోనూ మహా ప్రళయానంతర సృష్టిలోనూ అవి ప్రకటితమవుతాయి.

130. శ్వాస, సంస్కారాలను నిర్మించటానికి చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. గాఢ నిద్రలో కూడా శ్వాస నిరంతరము శ్రమిస్తూ తనపని తాను చేసుకుంటూ పోతుంది. వ్యక్తిగత సాధనలో ఈ స్థితిలో జరిగే మనోమయ కోశ మార్పులు, శ్వాసలోని మార్పులుగా గుర్తించాలి.

131. లయము చెందిన విత్తనములన్ని కూడా ఒకప్పుడు నిద్రాణమయి ఉన్న గ్రహ గోళములు. కాలము ఆసన్నమైనపుడు అవి తమతమ లక్షణాలన్నింటిని వ్యక్తపరచుకొనుటకు విత్తన రూపములోనే నిగూఢముగా ఉన్నవి.

132. వ్యక్తిగత జీవనములో, ఆ ముందు రోజు జరిగిన సంఘటనల స్వరూప స్వభావములను, నిద్రా స్థితిలో దైవ శక్తులకు అందజేసిన తరువాత, అదే దైవ శక్తులు రెండవ రోజు రూపుదాల్చబోయే సంఘటనలకు ఈ ముడి సరుకు ఉపయోగించి కావలసిన తగిన స్వరూపాన్ని ఇస్తున్నప్పటికి, ఆ పరిణామము అందరు గుర్తించ లేక పోతున్నారు. అందువలననే సమస్యలకు పరిష్కారములు లభించనపుడు కొంచం సేపు విశ్రాంతి (నిద్రా స్థితి) తీసుకోవాలని అనుకుంటారు.

133. వ్యక్తిగత సాధనలో లయ స్థితిలో ఉన్న సృష్టి మెల్లగా నూతన సృష్టి కార్యక్రమానికి సంసిద్ధత తెలుపుతుంది. ముందు జరగబోయే సంఘటనలు నిద్రా స్థితిలో ఆభాసగా కనిపిస్తాయి.
 
134. నిద్రా స్థితిలోనే తనకు అవసరమైన కామ, మనోమయ భావనలతో బాహ్య ప్రపంచములోని వాతావరణము మార్చటానికి కావలసిన పరిస్థితులు నిర్మించుకోవటానికి ఉపయోగించాలి.

135. లయ స్థితిలో, బీజ రూపంలో, కారణరూపంలోని దాని ఉనికి ఉంది. ఆ కిరణం బహిర్గతమైనపుడు తల్లి, తండ్రి, కొడుకు లేక జీవితము - మనస్సు, శరీరము, బుద్ధి, కామ, స్థూల శరీరములుగా మారుతుంది. ఆ విధముగా మాయ యొక్క బడిలో తమ పరిణామ క్రమాన్ని కొనసాగిస్తాయి.

136. గాఢ నిద్రలోని అతి ప్రగాఢ స్థితి, వ్యక్తిగతంగా సుషుప్తిలోని ఈ స్థాయిలో భవిష్యత్తు దర్శనం అనగా జీర్ణించుకున్న సంస్కారాన్ని, నూతన ప్రక్రియ క్రమానికి కావలసిన అగ్ని, జలము పొంది క్రొత్త బీజాలుగా రూపొందబోతున్నాయి. మార్పులు, చేర్పులు ఇక్కడే జరగాలి. ఆ స్థితిలో ఆ సంఘటన జరిగితీరవలసిందే దానిని ఎవరూ ఆపలేరు.

137. సృష్టి కర్త అయిన బ్రహ్మము నుండి వెలువడిన మొదటి సంతానం, సంతానోత్పత్తికి నిరాకరించింది. అది ఏవిధమైన కోరికలు లేని స్థితిలో ఉన్నది. అపుడు బ్రహ్మ తన మనస్సు నుండి సప్త ప్రజా పతులను ఉత్పన్నం చేస్తాడు. వారు మరీచి, అత్రి, అంగీరస, పోలస్త్య, పులహ, క్రతు, వసిష్ట అనువారలు. వారి భార్యల పేర్లు. అంబా, మాలా, నిలాన్ని, అభ్రయంతి, మాఘయంతి, వర్షయంతి, చుపునిక.

138. వ్యక్తిగత సాధనలో చీకటి సహాస్రారముగా, తల్లి ఆజ్ఞాచక్రముగా, సప్త ప్రజాపతులు శిరస్సులోని ఏడు శక్తి కేంద్రాలుగా అనగా పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధిగాను; ఇవి మధ్య బిందువును దాటి మెల్లమెల్లగా స్పందించటం మొదలుపెడతాయి. వ్యక్తి సుషుప్తి నుండి స్వప్న జాగ్రత్‌ స్థితులకు రావటం మొదలవుతుంది.
 
139. ఆత్మ అనుత్పాదక స్థితి నుండి అనగా సత్‌, చిత్‌, ఆనంద స్థాయి నుండి, చేతనత్వము అనగా ఉత్పాదక స్థాయికి దిగుచున్నది.

140. నిద్రా స్థితిని మూడు స్థాయిలుగా వివరించినపుడు, అన్నింటి కంటే పై పొర సత్‌, ఇంకాస్త లోపలికి వెళ్ళిన (ఎఱుక) చిత్‌, చివరి స్థితి ఆనందము. చిదానందములు ఇంకా సత్‌ అనగా ఉనికి స్థాయికి తయారుగా లేదు అని తెలుస్తుంది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Date: 11/Mar/2019

---------------------------------------- x ----------------------------------------

Image result for madame blavatsky secret doctrine
🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 4 🌹
✍️ సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

🌹 గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) 🌹
4 వ భాగము

🍃 మూడవ స్థితి 🍃

141. మూడవ స్థితిలో సృష్టి ప్రళయ స్థితిలోంచి మేల్కొనబోతున్న స్థితిని తెలుపుతుంది. ఒక చేతనత్వములో లయమై ఉన్న గ్రహములు చేతనత్వపు వివిధ కేంద్రములు, అతి ఉచ్ఛ తలములలో అనగా ఇంద్రియాతీత స్థాయిలో, ప్రపంచ నిర్మాణం గూర్చి ఇందు తెల్పబడింది.

142. చివరిదైన 7వ అనంతములో చేతన ప్రకంపనలు వ్యాపించి, పద్మము యొక్క మొగ్గవలె తల్లి లోపలి నుండి బయటకు వచ్చినది.

143. అనంతకాల చక్రములో క్రమగతిన ఏర్పడిన ఖండ కాలములను చివరి 7 ప్రకంపనాలు మరల మానవ సృష్టి మేల్కొనుటకు కారణమవుతుంది. 

144. వ్యక్తిగత స్థాయిలో ఈ ప్రకంపనలు శ్వాసను సూచిస్తాయి. నిజానికి శ్వాస వాయువు కాదు. ఆకాశము యొక్క స్పందన వలన ఏర్పడిన ప్రభావము.

145. మరణ సమయమున (నిద్రకు ముందు) దేనిని తలచుకుంటూ శరీరమును వదులునో (మేల్కొనునో) అదే స్వరూపాన్ని పొందును.

146. అంత్య కాలములో ఎవరు ఏ భావములతో హృదయమందు స్పందనలు కలిగి ఉంటాడో, అవే కారణ బీజాలుగా మారి, ఆ భావాన్ని అనుసరించి అట్టి స్థితిని పొందుతారు. మేల్కొన్నపుడు ఆ మార్పును చూడగల్గాలి.

147. నిరంతర ''నామ జపం'' యొక్క స్పందనలు అభ్యసిస్తూ వుండిన ఆ చేతనత్వమే సిద్ధిస్తుంది.

148. సాధకుడు బ్రహ్మాండములో ఏ లోకములోనైనా చేతనత్వముతోనైనా, స్పందనలో (శ్వాస) మార్పు తెచ్చుకొని సంపర్కము సాధించవచ్చు.

149. కాలతత్త్వమంతా సంవత్సరాల (యుగాల) సంఖ్యలలో నిబిడీ కృతమైన శక్తులలో ఉన్నది.

150. శ్వాస యొక్క కాలమును బట్టి జీవ జంతువుల ఆయుః ప్రమాణము (చేతనత్వము) ఎలా మారుతుందో యోగులు క్రియా యోగము ద్వారా తెలియబర్చారు.

151. ఈ శ్వాస ప్రకంపనలు అగ్ని, జల తత్త్వములతో (మనస్సు, ప్రాణము) తన ప్రభావము చూపినపుడు, నిద్రాణమై ఉన్న సంస్కారములు 'ఉబ్బటం' మొదలవుతుంది. ఇదంతా నిద్రాస్థితిలోనే జరుగుచున్నదని మనం గమనించాలి.

152. ఈ శ్వాస స్పందనలు కొనసాగిన కొలది, తన శ్వాస యొక్క తీవ్ర వేగముతో ప్రపంచాన్ని చుట్టుకుంటూ, విత్తనం చీకటిలో నివసిస్తూ, శ్వాస ప్రకంపనలచే ఆవరింపబడి, నిద్రాణమైయున్న ప్రాణ జలముల విత్తనాన్ని ఉబ్బిస్తూ ఉంటాయి.

153. ఈ నిద్రాణమైన ప్రాణ జలములను నారాయణ తత్వముగా గుర్తించాలి. ఇంకను బ్రహ్మ విష్ణు నాభి నుండి ఉత్పత్తి కాలేదు. అందువలన చీకటి అతీంద్రియ స్థాయిలో ప్రాణ జలముల మీద నూతన సృష్టికి, ఆత్మ స్థాయిలో ఉన్న మూల ప్రకృతి మీద స్పందనలు కల్గిస్తుంటాయి. వ్యక్తిగత స్థాయిలో ఈ ప్రాణ జలాలను శ్రద్ధగా ఉపయోగించాలి.

154. చీకటి అనే తల్లి గర్భములో కాంతి తన ఒంటరి కిరణాన్ని దింపినపుడు, ఆ కిరణము చీకటిలోని (తల్లి) అండమును ఛేదించి పులకింపజేస్తుంది. అపుడు శాశ్వత విత్తనము బ్రహ్మాండముగా (ఘనీభవిస్తుంది) రూపొందుతుంది.

155. విష్ణువు నాభి నుండి ఒంటరి కిరణము 'బ్రహ్మ' బహిర్గతము అయింది. అది అండము (చీకటి) లోతులలో పడటం అనగా దివ్య ఆలోచన, లేక బుద్ధి మూల ప్రకృతిని స్పందింపజేస్తుంది.

156. అండము కన్య లక్షణములతో తపించుట చేత లేక వేడి చేయుట చేత అది పొదుగుట మొదలవుతుంది.

157. బ్రహ్మకు ఆ అనంత జలరాశిలో (చీకటి) ఎలా సృష్టి మొదలుపెట్టాలో తెలియక పోవుటచే జలముల (స్పందనల) కదలిక వల్ల శబ్దము వికసించింది. తపతప అని రెండు సార్లు వినిపించింది. ఈ నిరంతర స్పందన వలన వేడి పుట్టి మెల్లగా అందున్న విత్తనము ఆకాశ తత్త్వమగు లోకాలలోకి పయనిస్తుంది. అదే బ్రహ్మాండముగా ఏర్పడుతుంది.

158. గుడ్డు ఏ విధముగా లోపల ఉన్న జీవితము యొక్క స్పందనల వలన పగిలి, అశాశ్వత భౌతిక రూపము వేడి వలన ఏర్పడుతుందో. సృష్టి కూడా అదే పద్ధతిని అనుసరిస్తుంది.

159. గ్రుడ్డు ప్రపంచము యొక్క సంకేతముగా ఏర్పడి శక్తిగా ఉపయోగపడి, అంతము లేని వృత్తముగా అనంతములో గుర్తుగా ఉపయోగపడుతుంది.

160. ఈ గుర్తు పరమాణువు నుండి గ్రహము వరకు, మనిషి నుండి దేవతల వరకు వృత్తాకారముగా ఉంటుంది. దానినే తోకను నోటితో పట్టుకున్న సర్పము యొక్క సంకేతముగా అందరు సూచిస్తారు.

161. బ్రహ్మాండము ఎక్కడెక్కడ ఏర్పడుతుందో అక్కడక్కడ శాశ్వతత్వము, అనంత తత్వము, పునరుజ్జీవింపబడుట, పునర్మించబడుట జరుగుతుంది.

162. స్వీయశక్తితో స్వయం ఉత్పత్తి యొక్క రహస్యం ఏవిధంగా అండములో వేడి మరియు తేమ కనిపించని సృజనాత్మకత శక్తి వల్ల జరుగుతుందో, అదేవిధానం బ్రహ్మాండములో జరుగుతుంది. కనుక అండమును సృష్టికి సంకేతముగా ఉపయోగించుట జరుగుతుంది.

163. హిరణ్య గర్భుడు 7 సహజ భూతముల ద్వారా ఆవరింపబడి ఉంటాడు. అందులో మనస్సు, బుద్ధి, చిత్తము వీటిలో అహంకారము కూడా చేర్చబడింది. ఇవి రహస్యమయ స్థితిలో ఉంటాయి. భౌతిక స్థితిలో పృథ్వి, జలము, అగ్ని, వాయువు ఉంటాయి.

164. అండమును పక్వ స్థితిలోకి తేవాలంటే దానికి తగిన వేడి (ఆలోచన), తేమ(వనరులు, ప్రాణశక్తులు) సమీకరించి దానిని ఉపయోగించి అభివృద్ధి చేసుకొని కార్యసిద్ధి అయ్యేవరకు నిరంతర సంకల్పములతో ప్రేరణ ఇస్తుండాలి.

165. నిద్ర మత్తు వీడక ముందే, ప్రక్కమీద కూర్చొని ముందు తన శరీర ప్రకంపనలు తెల్లని, చల్లని, ధవళ కాంతిలో ప్రతి అణువు స్పందిస్తుందని భావించాలి.

166. మన శరీరము నుండి మూడు అంగుళముల వరకు అన్నమయ కోశము గులాబీ రంగులో వ్యాపించి ఉన్నట్లు గుర్తించాలి; ప్రాణమయ కోశము తదుపరి మూడు అడుగుల వరకు పసుపు రంగులో శరీరము చుట్టూ వ్యాపించి ఉన్నట్లు; శిరస్సు పై మూడు అడుగుల చుట్టూరా పై నుండి క్రింది వరకు మనోమయ కోశము పసుపు రంగులో ఉన్నట్లు; తదుపరి సుమారు 18 అడుగుల వృత్తాకార పరిధి స్థూల, ప్రాణ, మనోమయ కోశము; ధవళ, గులాబి, పసుపు ఆవరణల మీదుగా ఆకుపచ్చ రంగులో విజ్ఞానమయ కోశము ఆవరించి ఉందని భావించాలి. అటు తరువాత సుదూర అనంతము వరకు ఆకాశము తనని ఆవరించి ఉందని అది నీలాకాశము ఒక గ్రుడ్డుగా తనను ఆనందమయకోశం ఆవరించి ఉందని భావించాలి.

167. ఈ విధమైన రంగుల భావన నిరంతరము ఉంచుకుంటూ, వెన్నుపూస మీద గల చక్రములో, మూలధారం వద్ద గంధం (వాసన) స్వాధిష్ఠానము వద్ద రుచి, మణిపూరకము వద్ద 'రూపము', అనాహతము వద్ద స్పర్శ, విశుద్ధము వద్ద శబ్దము, ఆజ్ఞా సహస్రారములలో సంకల్పము యొక్క భావనలు చేసుకోవాలి.

168. ఆయా రంగుల తన్మాత్రల భావనలు కొనసాగగా లోపల 7, బయట 7 గా మారుతుంది. కాంతిమయ మండలము అజ్ఞాచక్రములో గడ్డకట్టి పాలవలె తెల్లని పెరుగుగా వ్యాపిస్తుంది. జీవితపు సముద్ర లోయలలో వేరు పెరుగుతుంది.

169. వ్యక్తి జీవితములో ఆజ్ఞాచక్రము కాంతి వలయముగానూ, ఖగోళములో దీనిని పాలపుంత గాను తెలుపుతారు.

170. గుప్త విద్యలో వ్యక్తి యొక్క ఆజ్ఞాచక్రములోను, ఖగోళము యొక్క పాలపుంతలోను అనంత రహస్యాలు నిబిడీకృతమై ఉన్నాయి. భారతీయ ఋషులు దీనిని క్షీరసాగర మథనముగా వర్ణించారు. అందులోనుండి బయటపడిన రత్నాలు లోపల 7 గాను, బయట 7 గాను వర్ణించబడినాయి.

171. వ్యక్తిగత సాధనలో సముద్రమథనం అనగా సంస్కారాలను మార్చుట. తాను చేయుచున్న సాధనల ద్వారా, విశిష్ఠ ధ్యాన పద్ధతుల ద్వారా అరూప స్థితి నుండి రూప స్థాయికి మార్చే విధానమే ఈ మథనము. పెరుగులో ఘనీభవించిన ఆలోచన స్వరూపములను వివిధ ధ్యాన పద్ధతుల ద్వారా వికసింపచేయాలి.

172. క్షీర సాగరములోని ప్రతి చుక్కలో జీవితపు మూలమున్నది. ఆ సముద్రము అగ్ని మరియు వేడి మరియు చీకటి మయమైన తన ఉనికిని కొల్పోయి తానైన సత్యములో విలీనమవుతుంది.

173. చీకటి నుండి వెలుతురు ఉద్భవిస్తుంది. మెల్లమెల్లగా నూతన సృష్టి కాంతిని సంతరించుకొని నిర్దుష్టమైన ఆకృతిని ఏర్పరుస్తుంది.

174. వ్యక్తిగతంగా ఆ రోజు తీసుకున్న సంకల్పము అగ్ని, దానికి కావలసిన ఆలోచనా సరళి వేడి. ఈ ఆలోచనలే నిత్యాగ్నిహోత్రము. ఈ మూడింటి కలయిక ధ్వని. అనగా సంకల్పము, ఆలోచనలు, కర్మలకు మూలము.

175. మనోమయ భూమికి సంబంధించిన అగ్ని తత్వము నుండి ప్రాణమయ జీవితానికి సంబంధించిన జల తత్త్వపు మూల ప్రకృతి ఏర్పడుతుంది. దానిని సూపర్‌ ఆస్ట్రల్‌ లైట్‌ అంటారు. 176. మహా శక్తి బీజాలైన 'క' వర్ణము పృధ్వితత్వము. 'చ' వర్ణము జలతత్వము. 'త' వర్ణము వాయుతత్వము. 'వ' వర్ణము ఆకాశతత్త్వమని గ్రహించాలి.

177. విత్తనము, చీకటి, కాంతి, ఆత్మ ఇవన్నీ కూడా ఒక్కటే. అందులోంచే మిరుమిట్లుగొలిపే కొడుకు కూడా పుట్టింది. అదే బ్రహ్మం, చీకటి సుడిగుండము కాలహంసము.

178. చీకటి నుండి సరూప స్థితిలో పుత్రునిగా ధవళాకృతిలో జన్మంచినపుడే మొదటిసారి శబ్దోత్పత్తికి తగిన వాతావరణము ఏర్పడుతుంది.

179. సాధకుడు మెల్లమెల్లగా నిద్రాస్థితి నుండి జాగ్రదావస్థ వైపు ప్రయాణిస్తున్నాడు.

180. కాంతి చల్లని జ్వాల. జ్వాలయె అగ్ని. అగ్ని వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఆ వేడి జలమును ఇస్తుంది. ఆ జలమే మహామాత యొక్క ప్రాణము.

181. కాంతి, జ్వాల, అగ్ని, వేడి, జలము, ప్రాణము ఇవన్నీ విద్యుత్తుకు సంబంధించిన పదములు. అగ్నికి సృజనాత్మకత, పరిపాలన, నాశక శక్తులున్నాయి. వెలుతురు మన దివ్య పితరుల యొక్క తత్త్వము. జ్యోతి పదార్ధము యొక్క మనస్సు.

182. వ్యక్తిగత సాధనలో వ్యక్తి తన ''బ్రెయిన్‌ వేవ్సు'' యొక్క విద్యుత్‌ స్వభావము అధ్యయనం చేయాలి.

183. చల్లదనము వేడి అనేవి సాపేక్ష పదాలు. మంత్రాన్ని మననం చేయుట ద్వారా విద్యుత్‌ ఉత్పత్తికి కారణమవుతాయి. మస్తిష్కం ద్వారా మనం పొందే స్పందనలు ఆజ్ఞలు విద్యుత్‌ పరమైనవే అని గ్రహించాలి. 184. జలము అనేది ఒక పదార్థమునకు లావణ్యం ఇచ్చుటయె కాక, జలమే శాపాలు, వరదానాలు, దక్షిణలు, దానాలు ఇవ్వాలన్నా ముఖ్యమైన అవసరము.

185. ఆధ్యాత్మిక సాధనలో ఉచ్ఛ స్థితికి చేరుకోవాలంటే ప్రాయశ్చిత్తం ముఖ్యమైన సాధన అని కర్మ సిద్ధాంతము వలన అవగాహనం అవుతుంది.

186. ఆత్మ పదార్థములకు తల్లి, తండ్రి సంబంధమును కలుగజేసి, చీకటిని, కాంతిని ఏకం చేయడమైంది. ఈ విధముగా పునర్జన్మలు ఏర్పడతాయి.

187. విద్యుత్‌ శక్తికి లంబ దిశలో అయిస్కాంత శక్తి పనిచేస్తుంది. ఉత్తర దిశ నుండి బ్రహ్మాండీయ శక్తులు ప్రవేశించి దక్షణ ధృవము నుండి బయటకు వెళిపోతాయి. ఈ మధ్య కాలంలో పృథ్వి తనకు కావలసిన వనరులను సమీకరించుకుంటుంది. ఈ విధంగా విద్యుత్‌ శక్తిని 'రామ్‌' అని, అయస్కాంత శక్తిని 'కృష్ణ' చైతన్యముగా చెప్పవచ్చు.

188. ఇడ, పింగళ నాడులు:- ఇడ భూమి, తల్లి. పింగళ పురుషుడు, అగ్ని. పింగళ శ్వాస, అగ్ని ఇడ శ్వాస భూమిపై పడినపుడు ప

దార్థము వేడెక్కి వ్యాకోచము చెందుతుంది. తల్లి శ్వాస 'ఇళ' సంకోచము చెందుతుంది. ఈ శ్వాస కోశ వ్యాకోచ సంకోచాల ఫలితముగా శ్వాస వాయువు ద్వారా పుత్రులు జన్మింస్తారు. అనగా క్రొత్త జన్మ జరుగుతుంది.

189. శ్వాస మానసిక స్థితిని నియంత్రణ చేయును. వ్యక్తిగత సాధనలో అనులోమ విలోమ ప్రాణాయామములో సృష్టి జరుగుతుంది.

190. పింగళ నాడి ద్వారా ఉష్ణము మనోమయ కోశపు అణువుల స్వరూపాన్ని వ్యాకోచింపజేసి, ఇడనాడి ద్వారా సంకోచింపజేసి, అవసరమైన రూపాన్ని సిద్ధపురుషులు రూపొందిస్తుంటారు. 191. సృష్టి బీజరూపంలో ఉన్న, కాలము తనలోని విశ్వ ప్రాణ శక్తి ద్వారా బీజములను పక్వపరచి సరూప స్థాయికి దింపుతుంది. ఈవిధముగా పై స్థాయి ప్రతిబింబాలుగా ప్రపంచాలు కాలపరిధిలో వాటివాటి వంతు వచ్చినపుడు ఏర్పడతాయి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Date: 12/Mar/2019

---------------------------------------- x ----------------------------------------

Image result for madame blavatsky secret doctrine
🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 5 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

🍃 నాల్గవ స్థితి 🍃

192. విశ్వం యొక్క బీజం దైవీ శక్తులుగా విడిపోవటం 'గుప్తవిద్య' ద్వారా తెలుపబడింది. వీరందరూ ఒకే శక్తి యొక్క అభివృద్ధి చెందుతున్న శక్తులు. వీరు ప్రకటింపబడిన విశ్వములకు మార్గములు తెలిపినారు. నిర్మాణ కర్తలు, మార్గదర్శకులు. ప్రకృతి యొక్క పరిమాణ క్రమమును సమన్వయ పరుస్తూ ఒకే నియమాన్ని, ప్రకృతిలోని విభిన్న నియమాలుగా అభివృద్ధి చెందిస్తారు. వీరికి గుప్తవిద్యలో విశిష్ఠ పేర్లు ఇవ్వబడ్డాయి. భారతీయులు వీరినే దేవతలుగా పేర్కొంటారు.

193. మానవులందరు ఈ దేవతల యొక్క శిక్షణకు అనుగుణంగా నడుచుకుంటూ, మొదలు చివర అనేది లేని సృష్టిని, సంఖ్యలేని స్థితి నుండి ఒకే సంఖ్య స్థితికి చేరుటను గమనించాలి.

194. అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము అనే సవ్యమార్గాలలో చనిపోయిన వారు దివ్య లోకాలు చేరి తిరిగి భూమిపై జన్మిస్తారు.

195. కామం, రాత్రి, కృష్ణపక్షం, దక్షణాయనములో చనిపోయిన వారు అధో లోకాలు చేరి తదుపరి భూమిపై స్థావర జంగమాలుగా జన్మిస్తారు.

196. శుక్లపక్షంలో మరణించినవారు, ఊర్ధ్వలోకాలు చేరి తదుపరి జన్మరాహిత్య స్థితికి చేరిన, కృష్ణపక్షము లోని వారు పునర్జన్మ పొందుతారు.

197. గుప్త విద్యలో అగ్నిని 2 రకాలుగా వర్ణిస్తారు. మొదటిది ఆకార రహిత అగ్ని. ఇది ఆధ్యాత్మిక సూర్యునిలో అంతర్గతంగా దాగి ఉంటుంది. రెండవ అగ్ని 7 రకములుగా విశ్వము మరియు సూర్య మండలములలో వ్యాపించివుంది.

198. జ్ఞానాగ్ని వలన ఈ మాయామయ జగత్తులోని కర్మలన్ని దగ్ధమై పోతాయి. అందువల్ల వాటిని పొందిన వారిని 'అగ్నిపునీతులు' అంటారు.

199. దేవతలు, పితరులు, ఋషులు, సురులు, అసురులు, దైత్యులు, ఆదిత్యులు, దానవులు, గంధర్వులు మొదలగు వారు అనేకత్వములతో నిర్మాణ కర్తలుగా ఏర్పడతారు. వీటన్నింటిని ప్రాకృత శక్తులుగా గమనించాలి. మానవులు ఇందులో చేరరు.

200. పవిత్ర జంతువులు, గుప్తవిద్యలు జీవిత పరిణామ క్రమములో ప్రముఖ పాత్ర వహిస్తాయి. సాధారణముగా ఇవి దేవతాశక్తులకు వాహనములుగా లేక ప్రకృతిలోని గుణాలు, ధర్మాలు, సిద్ధాంతములకు గుర్తుగా వ్యవహరిస్తాయి.
ఉదా: కుక్క : కాలము, వేదములు, విశ్వాసము.
నక్క: జిత్తుల మారి తనము.
ఆవు: పవిత్రత
ఎద్దు: ధర్మము
కాకి: పితరులు
ఖగోళ శాస్త్రంలో ఈ పవిత్ర జంతువులు రాశి చక్రము యొక్క సంకేతాలుగా మారుతాయి.

201. ప్రకృతిలోని తెలివిగల శక్తుల వర్ణన మానవ జాతి విభజనకు వీలుగా ఉన్నది.

202. వాక్కు, శబ్దము యొక్క రహస్య స్వభావాలను తెల్పుతుంది. ఇది దైవాలోచన యొక్క పరిణామము. మన ఆలోచనలు, మన వాక్కులు నిత్యం మనం ఉన్న పరిస్థితులను నిర్మిస్తూ ఉంటాయి.

203. ఒక శబ్దం ఉచ్ఛరించినపుడు ఒక ఆలోచన మేల్కొనబడి, వర్తమానంలోకి తీసుకొని రాబడుతుంది. మానవ వాక్కు, ఆకర్షణ శక్తి, రహస్య ప్రపంచంలో జరిగే ప్రతి దానికి మూలము.

204. ఒక నామాన్ని ఉచ్ఛరించుట వలన, ఒక ప్రాణాన్ని నిర్వచించుటయె గాక తద్వారా ఒకటి లేక అనేక రహస్య మయ శక్తులకు లోనుకావటం జరుగుతుంది.

205. ప్రతి వ్యక్తి మాట అతనికి తెలియకుండానే, వరముగానో శాపముగానో పరిణమిస్తుంది. అందువలన ఈనాటి ఆలోచన, మాటల యొక్క శక్తుల అవగాహన లేకపోవుట మనకు చాలా చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

206. మనస్సు, శ్వాస, వాక్కు 7 ఇంద్రియముల సంయోగమే, సప్త విధములైన శబ్ద సైన్యములు.

207. సాధారణముగా వ్యక్తి మనస్సు భోగలాలసతో ఉంటుంది. కాని ఆధ్యాత్మిక మనస్సు లేక సామాజిక మనస్సు ఇంద్రియాలకు అతీతంగా ఉంటుంది.

208. సృష్టి నిర్మాణ క్రమంలో దైవీ శక్తులు ఏర్పడిన తరువాత, అరూప స్థితి నుండి మెల్లమెల్లగా స్వరూప స్థితికి నిర్మాణ కార్యక్రమములు మొదలవుతాయి. 209. ప్రకృతిలో నిరంతరము విశ్వధూళి ఆకాశములో నాలుగు భూతములుగా; భూమి, నీరు, అగ్ని, వాయువులుగా ఏర్పడి చుక్కలు, రేఖలు, త్రిభుజములు, ఘనములు, వృత్తములుగా చివరికి గోళములుగా ఏర్పడి వివిధ ఆకృతులను సమీకరించుకుంటున్నది. దీనికి విరామము లేదు.

210. ప్రకృతిలో అన్ని రకములుగా మార్పు చెందగలిగే రహస్యమయ తత్త్వము ''స్వభావాత్‌'' అని పిలువబడినది. ఈ రహస్య తత్త్వము మారుతూ మారుతూ చివరికి అంతులేని '0' గా ఏర్పడుచున్నది. అదే శూన్యము. సంఖ్యలకు '0' చేర్చినపుడు ఆ సంఖ్య యొక్క విలువ వ్యక్తమవుతుంది.

211. 9 అంకెల తరువాత 10వ అంకెలో '1' ఏకత్వము '0' శూన్యముగా సర్వస్వానికి ప్రతీక అయినది.

212. '10' లో '1' లేకపోయిన శూన్యము.
'10' లో '0' లేకపోయిన ఏకత్వము. అంతా ఒకటే. అదే 'సనాత్‌'.

213. అనంతాకాశమును 'అదితి' లేక చీకటి అని పిలిచారు. ఆ 'అదితి' కి 8 మంది కుమారులు జన్మించారు. అందులోని 7 తో 'అదితి' దేవతల దగ్గరకు వచ్చింది. కాని 8 వది అయిన సూర్యుని వదలివేసింది. ఆ 7గురు పుత్రులను 'ఆదిత్యులు' అంటారు. ఆ 7 మానవులకు నివాస స్థానములయి 7 గ్రహాలుగా పిలువబడుచున్నవి.

214. ఈ 7 గ్రహములు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఒక సమతా స్థితిలో ఏర్పడినపుడు జరిగే దివ్య శక్తుల ప్రభావము ఆయా వ్యక్తుల జన్మ స్థితిపై ఉంటుంది.

215. మానసిక ఉచ్ఛ స్థితిలో విశ్వమానవులు కక్ష్యలోవున్న ఆదర్శ ప్రపంచాన్ని ప్రళయ కాలం తరువాత, ఈ గ్రహాలు ఇతర దేవతా శక్తుల సహాయముతో క్రమ పద్ధతిలో క్రింది తలానికి (భూమి) దించటానికి ప్రయత్నిస్తారు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Date: 13/Mar/2019

---------------------------------------- x ----------------------------------------

Image result for madame blavatsky secret doctrine
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 6 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

 🍃. ఐదవ స్థితి 🍃

216. 5వ స్థితి ప్రపంచ నిర్మాణము ముఖ్యముగా సౌర కుటుంబ నిర్మాణమును గూర్చి తెలియజేస్తుంది. మొదట కేవలం మూల పదార్థం  స్పందన రహితముగా, నిష్క్రియగా వుండి తరువాత అగ్ని దుమారం తరువాత సౌర కుటుంబం, ఒక్కొక్క గ్రహము ఇంకా ఇతర నిర్మాణాలు కావింపబడినవి.

217. మానవ స్థాయి కేవలం భౌతిక స్థాయికే పరిమితం కాకుండా, ఏలోకములోనైన ఉంటూ, పదార్థము ఆత్మ మధ్య కావలసిన సంతులత సాధించగల్గాలి. ప్రతి వ్యక్తి దివ్యత్వాన్ని పొందే హక్కు స్వానుభవం ద్వారానే పొందగల్గాలి. దేవతలు, ఋషులు, నిర్మాణ కర్తలు ఏ రూపంలో ఉన్నా ఒకప్పుడు మానవులేనని గుర్తించాలి.

218. దేవ పుత్రులు, వారివారి సంతానములు వివిధ ఊర్ధ్వ లోకములలో సంచరించగలరు. వారి సంకల్పములు వార్తాహరులుగా, అగ్ని సుడిగుండాలుగా ఏర్పడతాయి.

219. జ్ఞాని బుద్ధులు మొత్తం 7 గురు ఉంటారు. వారిలో 5గురు ప్రకటితమయ్యారు. వారు రహస్య జ్ఞానము, ప్రజ్ఞ కలిగి ఉంటారు. మిగిలిన ఇద్దరు బుద్దులు భూమి మరి కొంత వికాసం చెందినపుడు ఆ కాలములో అవతరిస్తారు.

220. ఒకసారి నిద్రిస్తున్న తల్లి, తండ్రి నుండి దివ్య పుత్రులు బయటపడిన వారు ప్రేరణా శక్తులుగా మారి, అనేక స్వరూపాలు పొందుటకు కారణమవుతారు. ఇవన్నీ ఏకమై సమూహ స్వరూపాలు రూపొందుతాయి.

221. విశ్వ స్థాయిలో సౌర కుటుంబము నుండి మిణుగురు పురుగుల వరకు, సృజనాత్మకత నాడులలో భగవంతుని ఇచ్ఛానుసారము ఆధ్యాత్మిక వేత్తలు మార్పు చేస్తుంటారు.

222. విశ్వములో ఉన్న సార్వత్రిక మనస్సు యొక్క ఊహలకు అనుగుణంగా సౌర కుటుంబములో విభిన్న వ్యవస్థల స్థితులు ఏర్పడతాయి.

223. వ్యక్తి సాధనలో ఆధ్యాత్మిక వేత్తలను గుర్తించి, వారి ఆలోచనలపై సాధన చేసి, కల్కి అవతారం ఉద్దేశ్యాలను గమనించి వాటికి తోడ్పడాలి.

224. విష్ణువు యొక్క వామనావతారములో 3 అడుగుల రహస్య కథ, జ్యోతి శ్చాస్త్ర పరంగా ఈ 3 అడుగులు సూర్యుని యొక్క పగలు, మధ్యాహ్నము, సాయంత్రాలుగా గ్రహించాలి.

225. సుడిగుండములు సృష్టిలోని ఒక నియమము. ఇది నక్షత్రములకు గ్రహాలకు, విశ్వాంతారాళములో జరిగే గమనములో గల నియమమును గూర్చి చర్చిస్తాయి.

226. సూర్య, అగ్ని, ఉపాసనములో చాలా గంభీరమైన ఆధ్యాత్మిక సత్యాలు నిండి ఉన్నాయి. భౌతిక పదార్థములన్నింటిలో అగ్నిని విశ్లేషించుట కష్టము. గాలి: ఆక్సిజన్‌, నైట్రోజన్‌ మరియు ఇతర వాయువుల మిశ్రమమని ఖచ్చితంగా చెప్పగలము. భూపదార్థములు కూడా నిశ్చిత రసాయనానికి, నిశ్చిత పదార్థముల సంయోగముగా చెబుతారు. కాని అగ్ని దహన క్రియ వల్ల ఏర్పడినది. ఇది వేడి, కాంతిగతి మరియు రసాయనిక శక్తుల సమ్మేళనము.

227. అగ్ని వల్ల అరూప, రూప ప్రపంచములు ఏర్పడ్డాయి. ఒక జ్యోతిలో ఏడు జ్యోతులు అలా ప్రతిదాని నుండి 7x7 చొప్పున వెలుగులతో ప్రపంచాలు రూపొందాయి.

228. ఉత్తర, దక్షణ, తూర్పు, పడమర దిక్కులను పాలించే దిక్పాలకులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టమైన రహస్య లక్షణాలు ఉన్నాయి. వారు కర్మతో కూడా సంబంధము కలిగి ఉంటారు. ఆ నల్గురు మానవ జాతి రక్షకులు. వీరిని గంధర్వ, అసుర, కిన్నెర, నాగులుగా పురాణాలలో పేర్కొన్నారు.

229. నిర్మాణాత్మక కార్యక్రమములు చేపట్టే మూడు ముఖ్యమైన సమూహాలు ఉన్నాయి. ప్రతి సమూహము ఏడు ఉపసమూహములుగా ఏర్పడతాయి.

230. మొదటి సమూహము బ్రహ్మ మానస పుత్రులు. ఆది ఋషి ప్రజాపతులు, వీరు మండలములను నిర్మిస్తూ, పునర్నిస్తూంటారు. రెండవ సమూహము గ్రహ మాలికలను నిర్మించే వారు. మూడవ సమూహము మానవజాతి, ఆదిశక్తులు, తూర్పున ఇంద్రుడు, పడమర వరుణడు, దక్షిణమున యముడు, ఉత్తరమున కుబేరుడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Date: 14/Mar/2019

-------------------------------------- x --------------------------------------

Image result for madame blavatsky secret doctrine
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 7 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 


🍃. ఆరవ స్థితి 🍃

231. ఆరవ స్థితి ప్రపంచ నిర్మాణము యొక్క తదుపరి స్థాయిలను పరిణామ క్రమములో ప్రపంచం తన నాల్గవ కాలానికి ఎలా వచ్చిందో తెలుపును. మనము ప్రస్తుతమున్న కాలాన్ని ఇది వివరిస్తుంది.

232. కరుణ, జ్ఞానము అనే తల్లి యొక్క శక్తి వల్ల బ్రహ్మ శక్తి ఉద్భవిస్తుంది. అనగా తల్లి, తండ్రి, కూతురు వారి వంశాంకురముల యొక్క శ్వాస, వారి పుత్రులను అనంత లోయలలో నుండి బయటకు పిలిచి, మన ప్రపంచపు భౌతిక స్వరూపాన్ని తయారుచేస్తారు. ప్రపంచపు మాయను, స్వరూపాన్ని, 7 భూతములను తయారు చేస్తారు.

233. వాక్‌ శక్తి పేరుతో వాక్‌ వైఖరీ, మధ్యమ, పశ్యంతి, పరా స్థితిలో ఉంటుంది. ఈ నాలుగు తత్త్వాలు విశ్వములోని నాలుగు తత్త్వాలతో సరిపోతాయి.

234. దృశ్యమాన విశ్వము పరబ్రహ్మము యొక్క వైఖరి వాక్కు. సూక్ష్మ జాగత్తులో ఇది పరబ్రహ్మం యొక్క కాంతిలో ఉంటుంది. ఇది ప్రపంచము యొక్క మధ్యమ వాక్కు, శబ్ధ రూపము. పరబ్రహ్మం పశ్యంతి అయితే పరబ్రహ్మం విశ్వం యొక్క పరిస్థితి. 'Cosmos' అనే పదానికి అర్థం దివ్య చేతనత్వము గల శక్తి అని గుర్తించాలి (అదే విష్ణువు).

235. వేగంగా చలించే కాంతి గలవాడు 7 లయ కేంద్రాలను ఉత్పత్తి చేస్తాడు. 7 లయ కేంద్రాలు, 7 శూన్య బిందువులుగా అనుకోవచ్చు. 'Cosmos' అనేక అర్థాలు వున్న రహస్య వాదుల ప్రకారము జీవితము నియమము అను రెండు కూడా 'Cosmos' యొక్క దిశా నిర్దేశములో ఉంటాయి.

236. మౌలిక విత్తనాలు సృష్ట్యారంభములో లయ స్థితిలో ఉన్నపుడు, తాను గతించిన భౌతిక జగత్తులో ఉన్నపుడు జీవాత్మ యొక్క అనేక జన్మల అతి తీవ్ర విషయములను విమర్శనాత్మక దృష్టితో పరిశీలిస్తుంది. ప్రపంచములో తనకున్న అనేక సంబంధ బాంధవ్యాలను, విశ్వ ప్రణాళికకు ఎలా ఉపయోగించుకోవాలో గమనిస్తుంది.

237. మొదట లయ స్థితి నుండి శక్తి బహిర్గతమైనపుడు అది అరూప స్థితిలో ఉండును. అనగా 'ం' స్థితిలో ఉంటుంది.  తరువాత ఆ అరూప స్థితి రెండుగా విడిపోయి శక్తి బహిర్గతమవుతుంది.

238. అటు తరువాత మూడవ శక్తి '2' నుండి '4' గా విడిపోయి క్రమముగా '8' '16' ఈ విధంగా శివత్వము నుండి శక్తి ప్రవాహము వ్యాపించి క్రమముగా 7 లోకాలలో అక్కడ అవసరమైన మూల కణాలు నిర్మితమవుతాయి. ముడి సరుకు తయారవుతుంది. అపుడు ఆత్మ మరుగున పడుతుంది.

239. ఈ విధముగా భూతములు సృష్టింపబడి వాటికి నాయకుడిగా భూతనాధుడు ఉపాసింపబడతాడు.

240. పై విధముగా నిర్మింపబడిన ముడి పదార్థాలతో రెండవ శక్తి ప్రవాహమైన మనస్సు ఏర్పడి మాయను కలుగజేస్తుంది.

241. విష్ణు తత్వము మూడవ శక్తిగా అన్ని తత్వాలలో నిర్మాణ దేవతలకు తోడ్పడి సృష్టికి దోహదము చేస్తుంది. అపుడే మత్య, కూర్మ, వరాహ అవతారములు, సముద్ర మదనము జరుగుతుంది. తదుపరి శివ శక్తి రూపొంది, ఖనిజములు భూమిగా వ్యక్తమవుతుంది. ఖనిజములు వాటి సంయోగ వియోగము ద్వారా 'క2ం' హైడ్రోజన్‌, ఆక్సిజను సంయోగము ద్వారా నీరు, అలానే ఆ కలయికలు విడిపోవుట ద్వారా వృక్ష జగత్తు రూపొందింది. ఈ వృక్షములలో ప్రాణము

242. వృక్ష జగత్తు నుండి ఇంకొక మెట్టు ఎదిగి జంతు జగత్తు ఏర్పడింది. వృక్షములు స్థావరములు. అనగా ఉన్న చోట నుండి కదలని స్థితి. జంతువులు అలా కాక భౌతిక శరీరము అదుపులోనికి వచ్చి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలిగిన స్థితి. మానసిక అభివృద్ధి కొంచెం కొంచెము నేర్చుకొంటుంది. ఎఱుక స్థితి. అభివృద్ధి పర్చుకొంటుంది.

243. మానవ జగత్తులో అన్నమయ కోశము ఏర్పడి ఉచ్చ స్థితి నుండి నీచ స్థితిలోనికి స్పందనలకు మరియు మనోమయ జగత్తులో కూడా స్పందనలు రూపొంది, ఆ స్థితిలో కారణ శరీరములతో పునర్జన్మము తీసుకోగలిగే స్థాయిలో అహంకారము ఏర్పడుతుంది. క్రమముగా మానవ జన్మలో శక్తి ధార దిగువ స్థాయికి, అచటి నుండి పై స్థాయికి కూడా ఎదగగల బుద్ధితో కూడిన మనస్సు రూపొందింది.

244. కోరికలతో(కామ) కూడిన మానవుడు దిగువ స్థాయిలోను; ఆలోచనలు కోరికలు లేని స్థితిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంశాలతో కూడిన పుత్రుడు దత్తాత్రేయ అవతారము ఈ స్థితి వల్ల ఏర్పడింది. అందుకు ప్రతి రూపముగా 'సాయి' తత్వము ప్రచారములోకి వచ్చింది. శ్రీ శంకరులు, సక్రియ సాధన ద్వారా; శ్రీ అరవిందులు నిష్ట్రియ సాధన ద్వారా, రామకృష్ణ పరమ హంస సకల దేవతా శక్తులను సాధన చేసి అతి సమీపముగా అందుబాటులో ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చాడు. 

245. వివేకానంద ఇంకా ఉన్నత స్థాయికి చేరి అద్వైత ప్రతిపాదన చేస్తూ, కర్మ యోగానికి ప్రాధాన్యత నిచ్చి 'మానవ సేవే మాధవ సేవ' అనే మార్గము తెలియజేసాడు.

246. అటు తరువాత స్వామి దయానంద సరస్వతి గాయత్రి తరంగాల ద్వారా అగ్నిని ఉపయోగించి సంపూర్ణ మానసిక స్థలాన్ని మార్చే ప్రయత్నాలు చేసారు.

247. గాయత్రి మంత్రోపాసకులు గాయత్రి ఉపాసన ద్వారా విశ్వ కుండలి జాగృత పర్చి క్రిందికి దింపారు. తదుపరి 'సాయి' పద్దతిలోని 'ధుని', 'భస్మం' కూడా అదే విధముగా అగ్ని స్పర్శ పొందిన పదార్థములు. కనుకనే 'సాయి' విభూది రోగ నివారణకు ఉపయోగపడుతుంది.

248. ఈ విధముగా గురువులందరు వారి వారి స్థాయిలలో, ఆ నాటి దేశ కాల పరిస్థితులకు అనుగుణముగా మిగిలిన వారి ప్రయత్నాలకు తోడ్పడినారు.

249. శిష్యులు వారివారి గురువుల స్వభావమునకు అనుగుణముగా నడుచుకుంటూ, ఏ కార్యాన్ని చేపట్టినా గుడ్డిగా అనుసరించకుండా తమ సాధనలో ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నారో లేదో గమనిస్తుండాలి.

250. నేడు 'human race' అందరి గురువుల పనిని అర్థం చేసుకొని శక్తిని పొంది, గురువుల కార్యక్రమములకు చేయూత నివ్వగలిగే స్థాయికి చేరింది.

251. సృష్టిలో గడ్డిపోచలో జీవిస్తున్న మిణుగురు పురుగైన, సూర్యునికైన పుట్టటము, పెరగటము, గిట్టడము ఒకే నియమము ప్రకారము జరుగుతాయి. పదార్థము శక్తులు మారవు. పరిపూర్ణత వైపుకు సాగే ప్రయత్నము ప్రతి కొత్త అవతారము లోనూ జరుగుతుంది.

252. మహా ప్రళయములో విభజన వున్న ప్రతిదీ గడ్డిపోచ నుండి దేవతల వరకు పూర్తిగా కొట్టుకు పోయారు. ఒకటే మిగిలింది. ఒక రాబోయే స్థితిలో మన పృధ్వి యొక్క పరిణామ క్రమము, మన 'గుప్త విద్యలో ' తెలుపబడుతుంది. ఇది ఆధునికులకు విచిత్రంగా అనిపించినా తెలుసుకొవలసినదే
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Date: 15/Mar/2019

------------------------------------ x ------------------------------------

Image result for madame blavatsky secret doctrine
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 8 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 


🍃. సౌర మండలము 🍃

253. 'విశ్వం' మొత్తం అనేక సౌర మండలాలతో నిర్మించబడింది. ఒక సౌర మండలాన్ని గూర్చి తెలుసుకొంటే, పెరుగుదల తరుగుదలలో తప్ప మిగిలిన వాటిలో పెద్ద మార్పు ఉండదు. అపుడు విశ్వం మొత్తాన్ని గురించి తెలుసుకొన్నట్లే అవుతుంది.

254. సౌర కుటుంబ పరిమాణ క్రమము ప్రకృతి యొక్క ఏడు తలాలలో జరుగుతుంది. 1) ఆది స్పందనలు 2)అనుపాదక 3) ఆత్మ 4) బుద్ది 5) మనస్సు 6) కామము 7) స్థూల ప్రపంచము అందలి ప్రాణులు.

255. 1) సత్యలోకము:- ఆది అనగా 'సత్‌'
2) తపోలోకము:- అనుపాదకత - 'చిత్‌'
3) జనాలోకము:- ఆనంద స్థితి - 'ఆత్మ'
4) మహర్‌లోకము:- వివేకము - 'బుద్ది'
5) స్వర్గ లోకము:- రూపరహితము - 'మనస్సు'
6) భువర్లోకము:- కోరికలు - 'కామము'
7) భూలోకము:- 'అతి స్థూల స్థితి'

256. పంచభూతములు:-
1. ఆకాశము - ఆనందమయ కోశము
2. వాయువు - విజ్ఞానమయ కోశము
3. అగ్ని - మనోమయ కోశము
4. జలము - ప్రాణమయ కోశము
5. భూమి - అన్నమయ కోశము.

257. 7 గ్రహాలతో కూడిన లెక్కలేనన్ని ప్రపంచ గోళాలు విశ్వములో రూపొందినవి.

258. ప్రపంచ నిర్మాణములో క్రింది తలాలలోని 4 లోకాలు స్థూల, కామ, మనో, బుద్ది స్థితులలో వికాసము చెందాయి.

259. పై మూడు స్థాయిలు అనగా ఆత్మ, అనుపాదకత, ఆదిలోకాల వికాసము మనకు తెలియని స్థితిలో ఉంటుంది.

260. 7 గ్రహాములలో మనము నివసించే భూమి అత్యధిక భౌతిక తత్వము కలిగి ఇంద్రియాలకు కనిపించేటట్లు ఉండగా మిగిలిన 6 గ్రహాలు దృగ్గోచరము కాని దూర తలాలలో ఉంటాయి.

261. మనకు 'భూమి' వలె బుదుడు, శుక్రుడు, కుజుడు, గురువు, శని మొదలగు గ్రహాలు కంటికి కనిపిస్తున్నాయి. కారణము ఇవి ఒకే తలములో అనగా ఇదే సూర్య కుటుంబములోని గ్రహాలు. మిగిలినవి ఉచ్చస్థాయిలోని ఇతర గ్రహాలు, మన భౌతిక ఇంద్రియాలకు అందుబాటులో లేవు. కాని వాటి ప్రభావము మనలోని ఏడు స్వభావాలపై ఉంటుంది.

262. ప్రతి గ్రహ కుటుంబములోనూ ఉన్న ఒక గ్రహము దాని కంటే సూక్ష్మ కణాలు గల సహచర గ్రహము, దాని పై లోకాలలో ఉంటుంది.

263. ఈ సహచర గ్రహాలు వేరే చోట్లో స్థలమును ఆక్రమించవు. ఒక గ్రహాము ఆకాశములో ఏ స్థలాన్ని ఆక్రమిస్తుందో అదే స్థలములో తక్కిన సహచర గ్రహములు వాటి స్పందన, అవధిని బట్టి విస్తరించి ఉంటాయి. ప్రతి ఉచ్చ స్థాయిలో ఉన్న గ్రహము క్రింది స్థాయిలోని గ్రహములను తనలో ఇముడ్చుకుంటుంది. ఉదాహరణకు:- సూక్ష్మలోకములోని ఆత్మలు (దయ్యాలు) భూలోకములో స్వేచ్చగా సరచరించగలుగుతాయి. భూమి మీద పదార్థము వాటి చలనానికి అడ్డంకి కాదు. అవి మన ఇంటి గోడలు, తలుపులోంచి కూడా ప్రయాణించగలవు. కారణము పదార్థము పంచభూతాలతో నిర్మించబడగా సూక్షలోక జీవులు (దయ్యాలు) 3 భూతములే కలిగి ఉంటాయి. (అగ్ని, వాయువు, ఆకాశము). అలానే గ్రహాలు ఒకే ప్రదేశములో తమ క్రింది తలాలలో సంచరించగలుగుతాయి. మనం కలలుకనే టపుడు మన శరీరము స్థూల స్థితిలో అచటనే ఉంటుంది. కాని మన సూక్ష్మ శరీరము సూక్ష్మలోకములో విహరించగల్గుతుంది.

264. మన శరీరములో 5 భూతాలు వున్నాయి. భౌతికముగా కనిపిస్తున్న ఈ శరీరములో నీరు, అగ్ని, వాయువు, ఆకాశము కూడా ఉన్నవి కదా! అలానే ఆకాశములో అణువులు, పరిమాణువులు కలాపములు, అష్టకలాపములు, ఆత్మ, పరమాత్మ కూడా ఈ శరీరములోనే ఉన్నవి కదా! అనగా ఈ శరీరము మొత్తములో 26 తత్వాలు ఇమిడి ఉన్నాయి.

265. ఊర్ధ్వలోకాలున్నట్లే, మన శరీరములో అధో లోకాలు కూడా ఉన్నాయి.

ఊర్ధ్వలోకాలు అధో లోకాలు
1. సత్యలోకము పాతాళలోకము
2. తపోలోకము మహాతలము
3. జనలోకము తలాతలము
4. మహర్లోకము రసాతలము
5. సువర్లోకము సుతలము
6. భువర్లోకము వితలము
7. భూలోకము అతలము

266. భూగోళములో గల పాతాళ లోకములో శేషుడు చుట్టలు చుట్టుకొని వ్యాపించి ఉండును. అదే క్షీరసాగరములో నారాయణుడు శేష తల్పముపై యోగ నిద్రలో ఉండి లోకపాలన చేస్తుంటాడు. అలానే ఉప్పు సముద్రము, సురా సముద్రము, నేతి సముద్రము మొదలగునవి. 

267. సాధారణముగా ఒక సూర్య కుటుంబములో 7 గ్రహములు వున్నా, వాటిలో ఒకటి మాత్రమే సక్రియగా ఉండి మిగిలినవి నిద్రాణ స్థితిలో ఉంటాయి. మొదట ఒక గ్రహము జాగృతమైన తన పరిధిలో జీవిత పరిణామానికి తన వంతు పని పూర్తి చేస్తుంది. అది లయమవుతుంది. తరువాత రెండవ గ్రహానికి తన చైతన్యాన్ని అందజేసి అది చైతన్యమగుటకు తోడ్పడుతుంది. అలానే రెండవది తన పని పూర్తిచేసి మూడవ గ్రహానికి ఇలా ఒక్కొక్కపుడు ఒక్కొక్క గ్రహము మాత్రమే చైతన్య వంతమై మిగిలినవి నిద్రాణ స్థితిలో ఉంటాయి.

268. మనం యోగ సాధన చేసేటపుడు మొదట మన భౌతిక శరీరము చైతన్యవంతమై అది మనలోని జలతత్వాన్ని మేల్కొపుతుంది. అపుడు జలతత్వము చైతన్యవంతమై అగ్నితత్వాన్ని అలాగే వాయువు ఆకాశ తత్వాలు ఒకదాని తరువాత ఒకటి చైతన్య మవుతాయి. ఆకాశములోని అణువులు చైతన్యవంతమైన తరువాత అవి పరమాణువులను, క్రమముగా కలాపములు, అష్ట కలాపములను చైతన్యవంతము చేసి చివరికి తమతమ చైతన్యములను బ్రహ్మములో విలీనము చేయును. అదియే మోక్షము.

269. మొదటి మూడు స్థాయిలు ఆత్మ స్థాయి శృంఖలాలలో పూర్తి భౌతిక స్థాయిని సాధించి తదుపరి ఆత్మ స్థాయికి చేరుకుంటుంది

270. ఆత్మ '0' '0'
బుద్ది '1' 7
అరూప '2' '6'
సరూప '3' '5'
కామ '4'
స్థూల శరీరము

271. పైవాటిలో '1', '7' ఆత్మ పదార్థము.
|| '2', '6' బుద్ది పదార్థము.
|| '3', '5' అరూప మనోపదార్థము
|| '4' సరూప పదార్థము
ఈవిధముగా 7 గ్రహాలు ఏర్పడతాయి.

272. ఆత్మ స్థితిలో మొదలై శృంఖలాలు క్రమముగా మార్పు చెందుతూ చివరికి ఆత్మ స్థితిలోకి చేరవలసిందే. అని గ్రహించాలి.

273. ఒకటి నుండి ఐదు తలములలో బుద్ధి, మనస్సు, కామ, స్థూల మొత్తం 49 గ్రహకాలములలో 24 గ్రహములలో మానసిక స్థాయిలో వికాసము క్రమముగా జరుగుతుంది. ఈ మనోమయ తలము రెండు భాగములుగా విభజింపబడింది.

274. 7 గ్రహాల కాలము ఒక పరిభ్రమణము. 49 గ్రహాల కాలము 49 పరిభ్రమణములు.

275. మొదటి మూడు శృంఖలలో ఆత్మ లేక జీవితము పదార్థములోని క్రిందికి దిగుతుంది. ఈ కాలములో పదార్థము మీద తన ఆధిక్యతను చూపిస్తుంది.

276. నాల్గవ శృంఖలలో ఆత్మ - పదార్థము సంతులనము చెంది అనేక రకాలుగా విభిన్న రూపాలు ధరిస్తుంది. ప్రతి మానవ శరీరములో ఇది జరుగుట గమనించాలి.

277. చివరి మూడు శృంఖలాలలో 5, 6, 7 ఆత్మ ఆరోహణ మార్గములో తన ఆధిక్యతను పదార్థము మీద స్థాపించుకుంటుంది.

278. ఇటువంటి 10 పరిణామ క్రమ పధకాలు ఒక సౌరకుటుంబాన్ని నిర్మిస్తాయి.

279. ఒక పరిణామ క్రమములో 49 గ్రహాలు ఉన్న 7 గ్రహాలు మాత్రమే సక్రియగా ఉంటాయి.

280. మన ప్రస్తుత సౌరకుటుంబములో 10 పరిణామ క్రమ పధకాలు వాటికి భౌతిక స్థాయిలో ఉన్న గ్రహాలు.
1. వల్కస్‌ 2. శుక్ర 3. పృధ్వీ 4. గురు 5. శని 6. యురేనస్‌ 7. నెఫ్టూన్‌
మొత్తం సౌరకుటుంబమును తన పరిణామ క్రమములో 70 గ్రహాలతో కలిపి చూస్తే ఒక విచ్చుకున్న పద్మము వలె కనిపిస్తుంది.

281. ప్రకృతిలో నాల్గవ స్థాయిలో నాగరికత, జ్ఞానము అతి ఉచ్ఛస్థితిలో ఉన్నది. మానవ జాతి రెండు విపరీత దిశలలో విభజింపబడింది. 1) సవ్యమార్గము, 2) అపసవ్య మార్గము.

282. అధోస్థితిలో ఉన్న గ్రహాలు ఉచ్ఛస్థితికి, ఉచ్ఛస్థితిలోని గ్రహాలు అధోస్థితికి మారుతూనే ఉన్నాయి.

283. శబ్దము ఆకాశము యొక్క లక్షణము. అది వాయువును సృష్టిస్తుంది. దాని లక్షణము స్పర్శ. అది ఘర్షణ వల్ల కాంతిని, రంగును సృష్టిస్తుంది. అదే అగ్ని. అగ్ని చల్లబడి నీరుగా నీరు ఇంకా చల్లబడి పదార్థముగా, అలా పంచభూతాలు ఏర్పడినాయి.

284. మనము ప్రస్తుతము నాల్గవ స్థితిలో నాల్గవ పరిభ్రమణములో ఉన్నాము. తరువాత ఇంకా మూడు పరిభ్రమణలు సాధించాలి. ఆ స్థితిలో భూత, భవిషత్తు, వర్తమాన కాలాలను తెలుసుకొంటారు. 5వ స్థితిలో అచట గల యోగికి 6,7వ స్థితిల్లోకి చేరగల స్థితి లభిస్తుంది. అప్పటికి ఈ మన్వంతరము పూర్తవుతుంది.

285. ఒకే మహా గురువు యొక్క ఆధ్వర్యములో అనేక మంది గురువులు, శిక్షకులు మానవ జాతికి మార్గదర్శకులయ్యారు. మహాగురువు స్వయముగా పొందవలసినది ఏమీలేదు. అయినప్పటికి తాను ఎన్నుకోబడ్డ కొందరికి సహాయపడుటకు 'మహాయజ్ఞము' ఈ మన్వంతరము వరకు కొనసాగించవలసి ఉంటుంది. మహా గురువుకు ఈ మూడు లోకాలలో చేయవలసింది, తనకు చెందినది, ఆసించునది ఏదీలేదు. అయినప్పటికి తాను ఎల్లప్పడు కర్మ ఆచరిస్తూనే ఉంటాడు.

286. ఈ విశ్వములో మానవ శరీరం కంటే పవిత్రమైన, సాధన పూర్వకమైన స్వరూపము ఇంకొకటి లేదు. దీనిని సద్వినియోగం చేసుకోవాలి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Date: 16/Mar/2019

------------------------------------ x ------------------------------------

🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 9 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 


🍃. ఏడవ స్థితి 🍃
 
287. గుప్తవిద్యలో దైవ శక్తులు 12 ఎళిఖిరిబిది (రాసులు) 12 గుర్తులుగా నమోదుకాబడినాయి. ఈ 12 రాసులు 7 గ్రహాలకు సంయోగము చెంది ఉన్నాయి. అవన్ని అసంఖ్యాకమైన దివ్య, అర్థ, విద్య, భౌతిక శక్తులుగా విభజింపబడతాయి.

288. దివ్య శక్తులు మొదటి స్థాయిలో 'పరబ్రహ్మ' నుండి ఆత్మ విడిపోయి 'బ్రహ్మ'గా మొదటి శ్రేణి శక్తులు కలిగి ఉంటుంది. రెండవ శ్రేణికి చెందినవారు ఆకాశ, అగ్ని తత్వములు కలిగి; ఆత్మ, బుద్ధికి సంబంధించినవారు. మూడవ శ్రేణికి చెందినవారు ఆత్మ, బుద్ధి, మనస్సుకు చెంది త్రిపుటిగా వర్ణింపబడిన శక్తులు. ఈ మూడు శ్రేణులు అరూప స్థితికి చెందినవి.
 
289. రూప స్థితిలో నాల్గవ స్థాయి చేతనత్వములో అగ్ని, నీరు, వాయువులు; ఈ మూడు పృధ్వీ తత్వమునకు చెందినవి కావు. కాని వాటి యొక్క తన్మాత్రలు.

290. 5వ శ్రేణి చేతనత్వములో చాలా రహస్యమైన మానవుని వ్యక్తపరుస్తుంది. ఇది మనస్సు యొక్క చేతనత్వము.
 
291. 6వ శ్రేణిలో మనిషికి, కింద శ్రేణికి చెందిన ప్రకృతి దేవతలు, భూతములు మొదలగునవి. ఈ విధముగా జీవన ప్రవాహాము వివిధ స్థాయిలలో క్రిందికి దిగుతుంది.
 
292. ఒకే ఆత్మ అనేక జన్మలు తీసుకొని వ్యవహరించుట జరుగుతుంది.

293. పరిణామ క్రమములో మొదటిది ఖనిజము, రెండవది వృక్షజాతి, మూడవది జంతువులు, నాల్గవది మనిషి. మనస్సు మనిషికి ప్రత్యేకముగా ఇయ్యబడుతుంది. మనస్సు తరువాత బుద్ధి, మనిషికి కలిగి ఆత్మను తెలుసుకొనుటకు మార్గము ఏర్పడుతుంది. ఇవన్నీ గుప్త విద్య యొక్క రెండవ భాగములో వివరంగా తెలుపబడినాయి.

294. ఏవిధంగా ఒకే చంద్రుడు అనేక తరంగాలలో ప్రతిబింబిస్తాడో అలానే ఒకే పరమాత్మ అన్ని శరీరాలలో ప్రతిబింభిస్తుంది.

295. ప్రస్తుత పరిణామ దిశకు వస్తే 7 పరిభ్రమణాలలో మొదటిదైన ఖనిజ జగత్తు, రెండవదైన వృక్షజగత్తు, మూడవదైన జంతుజగత్తు, నాల్గవదైన మానవుడు అనగా పురుషుడు ప్రకృతి మీద అధికారం సంపాదిస్తున్నాడు.
 
296. భూమి పరిణామ క్రమములో పృధ్వీ సూక్ష్మ కణాలతో నిర్మింపబడి ఉన్నత మార్గములోకి వెలుతుంది.

297. భూమి మొదటి పరిభ్రమణములో ఆకాశభూతాన్ని తయారు చేసింది. రెండవ పరిభ్రమణములో అగ్ని, భూమి కలసి పరిస్థితులకు తగిన జీవులను తయారు చేసింది. అలా క్రమముగా పంచేంద్రియాలు అభివృద్ధి పర్చుకొని సహజ దివ్య దృష్టివైపు మనిషి ఎదుగుచున్నాడు.

298. మొదటి ఈ పరిణామ దిశలో దివ్య శక్తులు, జంతువులు మొదలగునవి ఏర్పడినవి. రెండవ స్థాయిలో భౌతికత పెంపొందింది. మూడవ పరిభ్రమణములో మానవ జాతి రూపొందింది. అపుడే జలమును దాని తత్వమును గూర్చి మానవుడు గ్రహించగలిగాడు. ఈ తత్వము మొదట అతి సూక్ష్మ కణాలతో, లక్షణాలతో ఉండేది.

299. నాల్గవ పరిణామ దశలో అరూప స్థితిలో ఉన్న మానవుడు క్రింది స్థాయికి స్వరూప స్థాయికి దిగినపుడు అప్పటి వరకు అతనికున్న అతీంద్రియ శక్తులు కొల్పోయాడు.

300. నిశ్శబ్దం అనగా కన్ను చూడలేనిది, చెవి వినలేనిది.

301. 5వ పరిణామములో ఆకాశము ఒక తత్వము లాగా రూపొందింది. దానికి శరీరము ఒక వాహనముగా మారింది.

302. వైజ్ఞానికుల పరిశోధన ప్రకారము మనము అనేక జీవరాశుల మధ్య జీవిస్తున్నాము. ప్రకృతిలోని ప్రతి కణము రెండు లక్షణాలు కలిగి ఉంది. 1) జీవాన్నిఇచ్చేది. 2) జీవాన్ని తీసుకొనేది. ఈ రెండింటి మధ్య ఏర్పడిన అనేక సంఘటనలు, విఘటనలు (ఇచ్చేవి, తీసుకొనేవి) వలన సృష్టి నిర్మించబడుతుంది. ప్రాణశక్తులు తమ పనులను నియమబద్దముగా కొనసాగించుటకు తోడ్పడుతుంది.
 
303. చంద్రుడు ఈ పరిణామాలకు ముఖ్యకారకుడు. చంద్రుడు ఔషధపదార్థములలో రస కారకుడు. మరియు చంద్రుడు స్త్రీల మీద తన ప్రభావము చూపి సృష్టికి కారణమగుచున్నాడు. 

304. పరమాత్మ (సాక్షి) పైలోకాల్లో ఉండి అతని నీడ, క్రింది లోకాలకు వ్యాపించి సాక్షిగా ఉన్నాడు. సాక్షి ఒకడే అయినా అతనికి పునర్జన్మలు అనేకము.

305. పరమాత్మ ఒకడే అయినా దాని వాహనమైన బుద్ధి ధ్యానిలోకములో సంబంధం కలిగి ఉంది.
 
306. జీవి ప్రతి జన్మకు నిరంతర పరిణామ క్రమములో ఒత్తిడికి లోనై అత్యున్నత స్థాయిని చేరుకుంటుంది.

307. ఏ రోజు వ్యక్తి 'ధ్యానీచోహాన్‌'లో కలుస్తాడో, నిర్మాణ స్థాయికి చేరుకుంటాడో అపుడు నిప్పురవ్వ జ్వాలలో కలిసినట్లు, వ్యక్తి బ్రహ్మములో కలుస్తాడు. కాని అతని వ్యక్తిత్వము అతనికుంటుంది. గాఢ నిద్రలో స్పురణం అంతాపోయి, సుషిప్తిలో ఉన్నపుడు, ఆత్మిక స్థితిలో లీనమై ఉన్నప్పటికి, మెలుకువ వచ్చిన తరువాత వ్యక్తి మామూలు స్థాయికి వస్తాడు. ఈ విధముగా సప్త విధ పరిణామ క్రమము, సప్తవిధ ప్రకృతిలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది.

సర్వం బ్రహ్మ మయమే కదా!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Date: 17/Mar/2019

------------------------------------ x ------------------------------------

Image result for secret doctrine by Madame Blavatsky
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 10 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 


🍃 . అంతరంగము 🍃

2. 84 లక్షల జీవరాశులలో మానవుడొక్కడే మనస్సు కలిగి బుద్ధి ద్వారా విచక్షణా జ్ఞానము కలిగి, ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఎందుకు చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, తెలిసిన, తెలుసుకొనగల్గిన జీవి.

3. అన్ని పనుల్లో ముఖ్యమైనది, ప్రతి మనిషి తన జీవితములో సాధించవల్సింది యోగము. అనగా జీవాత్మ పరమాత్మను పొందే మార్గము. అందుకే సర్వశ్రేష్ఠమైన యోగజ్ఞానమనే మహ సాగరమును మధించి వెలికి తీసిన సారాంశములను సాధకులకు సామాన్య పాఠకులకు అందించుటకే ఈ పుస్తకమును తయారు చేయుట జరిగింది.

4. అతి జఠిలమైన యోగసాధనను సులువుగా అర్థం చేసుకొనుటకు, ఆచరించుటకు అనువుగా స్వయం అనుభవాలను, అనుభూతులను ఇందులో చొప్పించుట జరిగినది.

5. యోగ విషయాలు అనేకం ఒకేచోట ఒకే గ్రంథములో లభించుట చాలా అరుదు. అందుచే ఈ గ్రంథము సాధారణ సాధకులకు అందుబాటులో, సాధకులకు మార్గదర్శిగా ఉపయోగపడగలదు. అనేక మంది యోగుల, మహర్షుల బోధనలు, సాధనా విశేషములను, యోగ ఫలితములు ఇందు నిక్షేపింపబడినవి. ప్రాచీన యోగ సాధనలు, ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము, క్రియా విధానాలు, సాధకులు ఎదుర్నొనే సమస్యలు, సమాధి స్థితి, క్రియా స్థితులు ఇందు తెలియజేయబడినవి. యోగము నిరంతర సాధన ద్వారా అనుభవ పూర్వకముగా తెలుసుకొనవలసి ఉంటుంది.

6. ఈ అనంత కాలంలో మానవ జీవితము ఒక బుడగ లాంటిది. దీనిని సద్వినియోగము చేసుకున్న, మానవ జీవిత ధ్యేయము సఫలమౌతుంది. సాధన చేయాలంటే మానవ భౌతిక శరీరం మాత్రమే అనువైనది. మిగిలిన దివ్యాత్మలకు, ఇతర జీవరాశులకు ఇంతటి మహత్తర జన్మ, గొప్ప అవకాశము లేదు. దేవతలైనా ముక్తి పొందాలంటే మానవ జన్మ ఎత్తవలసిందే.

7. భగవంతుని పొందుటకు భక్తి, జ్ఞాన, కర్మ, ధ్యాన, క్రియా యోగములు అత్యంత ఆవశ్యకములు. మోక్ష స్థితికి అనేక మార్గములు ఇందు సూచించ బడినవి. ముముక్షువులకు ఇది అత్యంత ఆవశ్యకము.

సర్వయోగ సమన్వయమే ఈ పుస్తకము యొక్క ప్రధాన ధ్యేయము. నిరంతరం సాధన చేయుచు ఇలాంటి అధ్యాత్మిక గ్రంథ పఠనమును కొనసాగిస్తూ, మనస్సును ఎల్లప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నము చేయుట అత్యవసరము. మనస్సు ఒక దయ్యాల కార్ఖాన అని పలుకుటచే దానిని సరైన మార్గములో నడిపించుట మన విధి.

8. జీవితములో అనేక ఒడిదుడుకులను, సమస్యలు, సంఘటనలను యోగ సాధన ద్వారా అధిగమించవచ్చును. యోగ సాధన వలన అనేక శారీరక మానసిక అధ్యాత్మిక శక్తులు లభించగలవు. నిరాశ, నిస్పృహ, అశాంతి, సంశయము ఉన్న వారికి యోగసాధన మార్గదర్శి. అజ్ఞానమును పోగొట్టి ఆరోగ్యమును పొందుట, ఈతి బాధలు, రోగముల నివారణకు యోగసాధన అత్యంత ఆవశ్యకము.

9. అనేక కోట్ల విలువ గల మాణిక్యములు, పచ్చలు, నవరత్నముల కన్నా విలువైన ఆధ్యాత్మిక, యోగ రత్నములను వజ్రాయుధము వంటి యోగ సూత్రములు ఈ గ్రంథము ద్వారా అందించబడుచున్నాయి. ఇట్టి మహా రత్నములను పొంది అభ్యాసం చేయువారికి మోక్ష సామ్రాజ్యము కరతలామలకము.
🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 

Date: 18/Mar/2019

------------------------------------ x ------------------------------------

Image result for secret doctrine by Madame Blavatsky
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 11 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 


🍃. అనేక జన్మల సాధనా ఫలితమే యోగము 🍃
 
10. అనాదిలో సత్య యుగమునందు అవతరించిన యోగము నాశరహితమైన పరమార్థ లక్ష్యమునకు సాధన. భారత దేశం యోగ భూమి. యోగాలకు పుట్టినిల్లు. అనేక మంది యోగులకు జ్ఞానులకు భారతదేశం పుట్టినిల్లు. శ్రీకృష్ణుడు గీత యందు యోగాన్ని గూర్చి తెలుపుతూ తాను యోగ రహస్యమును మొదట సూర్యునికి తెలిపినట్లు, సూర్యుడు తన కొడుకు మనువుకు, మనువు తన కొడుకు ఇక్ష్వాకునకు తరువాత వంశాను గతంగా ఇతర రాజులకు తెలిపినట్లు చెప్పియున్నాడు.

11. యోగాన్ని గూర్చి వేదములు ఉపనిషత్తులు, గీత, శ్రీయోగవాసిష్ఠము, పతంజలి యోగ సూత్రములు, స్మృతులు, పురాణములు ఇతిహాసముల ద్వారా తెలియుచున్నది. సత్యము అనగా బ్రహ్మము. అట్టి బ్రహ్మమును పొందు మార్గమే సత్యయోగము. అప్పటి కృత యుగమే సత్య యుగము. సత్య యోగమునకు మూలము సత్యము, ధర్మము. యోగము అనగా కలియుట లేదా ఐక్య మొందుట.

12. యోగమును గూర్చి అర్థము కావాలంటే యోగ సాధన అత్యావశ్యకము. జీవాత్మ పరమాత్మలో ఐక్యమగుటయే యోగము. కార్యము ఫలించినను ఫలించకుండినను సమత్వ స్థితిలో ఉండుటయే యోగము. కర్మలయందు నేర్పరి తనము, అనాసక్తిగా కర్మలను ఆచరించుట, చిత్త వృత్తులను నిరోధించుట యోగము. నిశ్చల సమాధిస్థితి, ఆత్మ దర్శనం పొందుటయే యోగము. సర్వత్ర వ్యాపించి యున్న పరమాత్మ యందు ఐక్యమై తానే సర్వము, అను స్థితిని పొందుటయే యోగము.

13. జ్ఞానేంద్రియములను కర్మేంద్రియాలను అంతః కరణ చతుష్టయము ద్వారా జరుగు క్రియలందు ఆసక్తిని నిరోధించుటయే యోగము. షట్చచక్రాల ప్రభావం వలన కలిగిన గుణాలను, తత్త్వాలను చివరిదైన సహస్రారములో లయింప చేయుటయే యోగ సాధన.

14. ఖగోళములో జరిగే క్రియలను, మార్పులను, దివ్య దృష్టిచే అంతరమున గమనించుటయే యోగ గమనము.

15. ప్రాపంచిక దృశ్య విషయ వృత్తులను విచారణ, విషయములనుండి మరల్చుట, హృదయస్తమగు ఆత్మ యందు, స్వ స్వరూపమునందు మనస్సును బంధించుటయే యోగ క్రియ.

16. ఏకాగ్రత అన్నా, ధ్యానమన్నా, సమాధిస్థితి అన్నా, శూన్య స్థితి అన్నా, యోగములోని అంగము.

17. యోగమనగా ప్రాణాయామము, ప్రాణక్రియ అని చెప్పబడినది. శ్వాసను 'ఓం' అను ప్రణవ మంత్రముతో అనుసంధించుట వలన బ్రహ్మ భావన పొందుచున్నాడు. మోక్షమునకు ప్రాణాయామము కూడా ఒక సాధనము.

18. పరమాత్మ తత్త్వమైన ఆత్మ దేహమునందు ఉంచబడి బ్రహ్మమే అగుచున్నది. అంతరాత్మ, పరమాణువు, క్షేత్రజ్ఞుడు అయిన ఆత్మ తత్త్వమును తెలుసుకొను మార్గమే యోగము. ఆత్మానుభూతులను గూర్చి అన్వేషణ చేయుటయే యోగము. భగవంతుని వద్దకు చేర్చు ఏకైక మార్గమే యోగము.

19. ఆనంద పారవశ్యకమంతా రహస్య యోగములోనే యున్నది. మానవ స్థితులనుండి మానవాతీత స్థితికి చేరుటయే యోగము. 

20. పురుష, బ్రహ్మత్వముల కలయికయే యోగము. ఇదియే అర్థనారీశ్వర విధానం.
 
21. యోగమును పొందుటకు గృహాన్ని వదిలి అరణ్యాలకు, ఆశ్రమాలకు పోవలసిన అవసరం లేదు. ఎవరి ఇంటిలో వారు కుటుంబ సభ్యులతోనే ఉంటూ యోగ సాధన చేయవచ్చు. దేహమే దేవాలయము. అంతటా ఉన్న సాక్షాత్‌ పరబ్రహ్మం శరీరంలో కూడా వున్నాడు.

22. ఎవరికి ఏది అవసరమో, ఎంత అవసరమో వారు యోగాభ్యాసము వలన పొందవచ్చు. భిన్న భిన్న తత్వములను సమన్వయ పరచి ఒకే లక్ష్యమైన పరబ్రహ్మతత్వమును అందించునదే, జ్ఞానయోగము.

23. గత జన్మల కర్మలను నశింపజేసి కర్మవిముక్తులను చేయునది యోగము. మోక్షము పొందాలంటే కర్మ బంధాలు రద్దు కావాలి. లేనిచో తిరిగి తిరిగి జన్మలు తీసుకోకతప్పదు.

24. యోగమును అనుభవము పొందుట ద్వారానే సాధించవలెను. కేవలము అవగాహన జ్ఞానము, జ్ఞానానుభూతి పొందుట చాలదు.

25. యోగాంగములైన గ్రంథపఠనము, సత్‌ సంగము, విచారణ, మననము, చింతన, నిరంతర అభ్యాసము, ధ్యానము, ఏకాగ్రత, అనుభూతి అనునవన్నియు సాధించినపుడే ఆత్మదర్శనము ప్రాప్తించును.
🌹 🌹 🌹 🌹 🌹 

Date: 19/Mar/2020

------------------------------------ x ------------------------------------

🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 12 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃. యోగి అనగా ఎవరు 🍃

26. యోగి అయిన వాడే యోగిని గూర్చి అర్థము చేసుకొనగలడు. ఆత్మ జ్ఞానము కొరకు నిరంతర సాధన చేయువాడే యోగి. 

27. 'అహం బ్రహ్మాస్మి' అను భావముతో యోగ స్థితిలో అభ్యాసకుడు పరమాత్మను అనుభవంలోనికి తెచ్చుకొనును. అనాసక్తముగా అభ్యాసం చేయుచు జీవాత్మను పరమాత్మ యందు ఐక్యము చేయు సామార్థ్యము కలిగినవాడే యోగాభ్యాసకుడు.

28. ధైర్యంతో కూడిన బుద్ధిచే, మనస్సును మెల్లమెల్లగా, అంచలంచెలుగా, ప్రాపంచిక విషయ వస్తు, పదార్థ, భోగ విషయముల నుండి మరలించువాడు యోగి.

29. ఇంద్రియ పదార్థములపై అసక్తిలేని వాడై, కర్మల యందు త్యాగబుద్ధి కలవాడై, సంకల్ప, వికల్ప రహితుడైన వాడు యోగారూఢుడని పిలువబడును.

30. యోగభ్రష్టుడైనప్పటికి, ఇహపరములందు వినాశమును పొందక, మరణానంతర జన్మయందు ఉత్తమ కుటుంబమునందు జన్మించి యోగారూఢుడై జీవన్ముక్తిని పొందును. అతనికి గతజన్మల యోగ సాధన తోడ్పడును.

31. యోగి అయిన వాడు తపస్వుల కంటెను, శాస్త్రజ్ఞుల కంటెను, కర్మలు చేయువారి కంటెను సర్వ శ్రేష్టుడని గీతావాక్యము.

32. ఆత్మ ప్రాప్తిని పొందిన యోగి జ్ఞానియై, వికార రహితుడై, ఇంద్రియములను వశపర్చు కొన్న వాడై, మట్టి బంగారము లందు సమ భావన కలవాడై ఉండును.

33. యోగి జీవించి యుండగనే కామక్రోధాదులను అదుపులో ఉంచుకొని, భోగక్షయము కలిగి నిజమైన సుఖవంతుడుగా ఉండును.

34. ఆత్మ ప్రాప్తికై కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తి యోగము లను అనుష్ఠించువారందరు యోగులే.

35. యోగి చిణీ ఛిణీ, కింకిణీ, శంఖు, వేణు, వీణా, తాళ, ఘంట, భేరి, మృదంగ, మేఘనాదములను దశ విధ శబ్దములను ఆనందముగా వినుచూ అమృతపానము చేయుచుండును. నాభియందు యోగాగ్ని పుట్టి సంచితకర్మలను భస్మం చేయును.
 
36. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనునట్లు, యోగి ఇంద్రియములను నిరంతరము మరలించుకొని యుండును. అతని స్థితి గాలి వీచని చోట దీపము వలె నిశ్చలముగా ఉండునట్లు ఉండును.
 
37. వేద శాస్త్ర పఠనాభ్యాసములు, పూజలు, హోమములు, తపస్సు, వ్రతములు, ఉపవాసములు, దానములు, ఇంద్రియ సంయమముల వలన కలుగు పుణ్య సంపద అంతయు యోగి అప్రయత్నముగనే పొందును.

38. సత్కర్మల ద్వారా పొందు స్వల్ప పుణ్యము తాత్కాలికములు. అది అంతరించిపోవును. ఆత్మ ప్రాప్తి వలన కలుగు పుణ్యము అనంతము, శాశ్వతము. కావున బ్రహ్మ తత్త్వములను తెలిసిన యోగి బ్రహ్మమునే పొందును.

39. యోగమును శరణు వేడిన యోగి మాయను దాటుటయే గాక అతని యోగ క్షేమములు భగవంతుడే చూచుకొనును.
🌹 🌹 🌹 🌹 🌹 

Date: 20/Mar/2019

------------------------------------ x ------------------------------------

Image result for blavatsky
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 13 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

🍃. యోగి లక్షణములు 🍃

40. బ్రహ్మ జ్ఞాని అయిన యోగి భౌతిక సాధనలు, పూజ సామాగ్రిని వాడడు. తాంత్రిక సాధనలు చేయడు. దేవతారాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడు.

41. ఆసనములు, ప్రాణాయామము, భూచరి, ఖేచరి, సాంభవి ముద్రలను అభ్యసించడు.

42. యోగి అయిన వాడు ఇడ, పింగళ, సుషుమ్న, నాడుల మార్గములు అన్వేషించడు.

43. ఆత్మ నిగ్రహమునకు, ఇంద్రియ నిగ్రహమునకు అతీతముగా యోగి వుండును.

44. సకామ, నిష్కామ కర్మలకు అతీతుడుగా ఉండును. ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడై ఆత్మానందుడై ఉండును.

45. బ్రహ్మ జ్ఞాని అయిన యోగి తాను మనస్సు, బుద్ధి, శరీరము, ఇంద్రియములు, అహంకారము పంచతన్మాత్రలు పంచభూతములు కాదని తెలిసియుండును.

46. శాస్త్ర జ్ఞానములందు, శుద్ధ అశుద్ధులందు అతీతుడుగా ఉంటూ కేవలం ఆత్మ యందే రమించి ఉండును.

47. యోగి శరీరపరముగా ఏ స్థితిలో మరణించినను, ఎచ్చట మరణించినను, తాను పరమాత్మ యందే ఐక్యమైయుండును.

48. యోగులు భౌతికముగా చతుర్విద ధర్మములను ఆచరిస్తూ ప్రేమ, వైరాగ్యములను అలవర్చుకుని నిర్గుణుగా యుండును.

49. యోగికి వేదాధ్యయనము, దీక్షలు, విగ్రహారాధనతో పనిలేదు. 

50. యోగి సదా బ్రహ్మ భావనలో లీనమై ఉండుటచే అంత్య కాలమందు కూడా అదే నిష్ఠ కల్గి పునర్జన్మ పొందడు.

51. యోగి సంకల్ప రహితుడు, జన్మ రహితుడు అగుటచే అతనికి పిత్రుయానము, దేవయానము లుండవు.

52. యోగి జీవన్ముక్తుడగుటచే మానసికముగా అంతరముగా పవిత్రుడై ఉండును.

53. యోగి కర్మలను నిష్కామముగా ఆచరించుటచే, అతడు కర్మలను చేసినను త్యజించినవాడే అగును. 

54. యోగి జ్ఞానికంటెను, తపస్వుల కంటెను పండితులకంటెను, శ్రేష్ఠుడు. నిరంతర కృషి, ధ్యానాభ్యాసము, కఠోర సాధన వలన యోగి అగుచున్నాడు.

55. యోగులలో మహా యోగియైనవాడు పంచ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములను, మనసును నిగ్రహించి భగవంతుని యందు వాటిని ఐక్యము చేయు నేర్పరియైయుండును.

56. యోగియైన వాడు విషయ, వస్తు, శబ్ధ, భోగ రాహిత్యముతో సాధన యందు అనాసక్తుడై వుండి కర్మలను కూడా అనాసక్తితో ఆచరించును. అపుడు కర్మ అంటదు.

57. యోగికి యోగాభ్యాస కాలములో అనారోగ్యము, భోగాదులపై ఆసక్తి, ఇతర వ్యక్తిగత, బాహ్యకారణముల వలన యోగాభ్యాసమునకు భంగము కలిగినపుడు అతడు యోగభ్రష్టుడగు చున్నాడు.

58. యోగభ్రష్టుడు మరణానంతరము పుణ్యలోకములు పొంది, తిరిగి శ్రీమంతుల సదాచారపరుల ఇండ్లలో జన్మించి జ్ఞానియై మరల యోగాభ్యాసము కొనసాగించి చివరికి ముక్తుడగును. గత జన్మ సంస్కారములు ఇతనికి తోడ్పడును. అందువలన యోగి ముక్తి నందువరకు యోగిగానే జీవించి ఉండును.
🌹🌹🌹🌹🌹🌹🌹

Date: 21/Mar/2019

------------------------------------ x ------------------------------------

Image result for blavatsky
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 14 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

🍃.  మన పూర్వీక గురువులు 🍃

59. యోగులలో పరబ్రహ్మమే ప్రథమ యోగి. ఇతడు సర్వజ్ఞుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు యోగ నిద్రలో ఉండి యోగమాయతో ఈ సృష్టిని నిర్వహించుచున్నారు. వేద విజ్ఞానము ముందుగా అగ్ని, వాయువు, ఆదిత్యుడు, అంగీరస లనువారిలో ప్రకాశించెను.

60. సృష్టి ప్రారంభమున ఋషి వర్గ మంతయు స్వయంగా ఉద్భవించి జ్ఞానము, శ్రవణము, తపస్సు అను నిశ్చిత రూపములో ఉండియున్నారు. వీరినే బ్రహ్మవేత్తలు అనియు, ఇంద్రియములను జయించి బ్రహ్మనిష్ఠను పొందినవారనియు పిలిచిరి.

61. మునులు అనగా మనన శీలులై ఎల్లపుడు పరమాత్మయందు లీనమై, పరమాత్మనే స్వస్వరూపముగా ధ్యానించువారు. వీరు ఆత్మ సర్వవ్యాప్తము, సర్వ శ్రేష్ఠమని ఆరూఢమై యుందురు.

62. దేవలోకమున నివసించువారిని దేవర్షులనిరి. వీరు త్రికాలజ్ఞులు, మంత్ర ప్రవక్తలు, సత్యవాదులు, గొప్ప తపశ్శక్తితో సర్వలోకములలో నిరంతరము సంచరించుచూ, దేవతలను కూడా తమ అధీనములో ఉంచుకొనువారు. ఇట్టి లక్షణములు కల దేవతలు, బ్రహ్మణులు, రాజర్షులు, శూద్రులు కూడా దేవర్షులనబడుదురు. ఉదాహరణ:- నరనారాయణులు, నారదుడు, వ్యాసుడు మొదలగువారు.

63. సనకసనందనాదులు కూడా బ్రహ్మ మానస పుత్రులే. వీరు బ్రహ్మ మనస్సు నుండి పుట్టినవారు. వీరు అందరకు జ్ఞానము ప్రసాదించిన ఆచార్యులు.

64. మనువులు పదునాల్గురు. ప్రతి మన్వంతరమునకు మనువులు మారుచుందురు. వారితోపాటు సప్త ఋషులు, దేవతలు, ఇంద్రుడు, మనుపుత్రులు కూడా మారిపోదురు.

65. సప్త ఋషులు, బ్రహ్మ మానస పుత్రులు భగవత్‌ కార్యములను ఆచరించుచుందురు. వీరు మరీచి, ఆత్రి, పులహుడు, వసిష్టుడు, అంగీరసుడు, పులస్త్యుడు, క్రతువు. వీరు ధర్మరక్షకులు, లోకరక్షకులు. 

66. విశ్వామిత్రుడు జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, కశ్యపుడు మొదలగువారు బ్రహ్మ మానస పుత్రులు కాదు. పిదప బ్రహ్మర్షి అయినవారు.

67. వసిష్టుడు సప్త ఋషులలో శ్రేష్ఠుడు. శ్రీరామచంద్రుని గురువు. వీరి ధర్మ పత్ని అరుంధతి. అష్ట సిద్ధులు కలవారు. వీరి నూర్గురు కుమారులను విశ్వామిత్రుడు వధించినను ప్రతీకారము తీర్చుకొనలేదు. తపస్సు కంటెను సత్‌సాంగత్యము గొప్పదని విశ్వామిత్రునితో వాదించి రుజువుచేసెను. శ్రీయోగ వాసిష్టి గ్రంథ�ము, శ్రీవసిష్టునికి, శ్రీరామచంద్రునికి జరిగిన సంవాదమే. ఇది వసిష్ట గీత అని పిలువబడినది.

68. సప్త ఋషులలో ఒకడైన మరీచికి అనేక మంది భార్యలు కుమారులు కలరు. కశ్యప మహర్షి ఈయన కుమారుడే. బ్రహ్మ పురాణమును మొదట బ్రహ్మదేవుడు మరీచికి వినిపించెను.

69. అత్రి మహర్షి గొప్పతపస్సంపన్నుడు. మహా పతివ్రత అయిన అనసూయ ఈయన ధర్మపత్నియే. అనసూయ కపిల మహర్షి యొక్క చెల్లెలు. వీరికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమై, వీరి అంశతో దత్తాత్రేయులు విష్ణు అంశతో జన్మించెను. అలాగే చంద్రుడు బ్రహ్మ అంశతోనూ, దుర్వాసుడు శివుని అంశతోనూ జన్మించిరి.

70. పులస్త్యుడు సమస్త యోగ శాస్త్ర పారంగుతుడు. మహా తపస్వి. ధర్మ పరాయణుడు. వీరికి ముగ్గురు భార్యలు కలరు. పెక్కు మంది కుమారులు కలరు. విశ్వవసువు వీరికుమారులు. కుబేరుడు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణులు విశ్వవసువు కుమారులే.

71. పులహుడు మహజ్ఞాని. వీరు సనందన మహర్షి నుండి జ్ఞానమును పొందిరి. వీరికి ఇద్దరు భార్యలు ఒకరు దక్షప్రజాపతి కుమారై అయిన 'క్షమ', రెండవ వారు కర్దమ పుత్రిక అయిన 'గతి' అనువారు. వీరికి అనేక మంది పుత్రులు, పుత్రికలు కలరు.

72. క్రతువు మహాతేజస్సంపన్నుడు. ఇతనికి ఇద్దరు భార్యలు. ఒకరు కర్దమ మహార్షి పుత్రిక 'క్రియ' ఇంకొకరు దక్ష కుమార్తె 'సన్నతి' వీరి వలన వాలఖిల్యులు అను పేరు గల్గిన అరవై వేల మంది ఋషులు జన్మించారు.

73. అంగీరసుడు అసాధారణ ఋషి. అధ్యాత్మిక తేజోసంపన్నుడు ఇతనికి పెక్కుమంది భార్యలు కలరు.

74. సప్త ఋషులు బ్రహ్మ ద్వారా సృష్టించబడి సంతాన ఉత్పత్తికి తద్వారా భూలోక ప్రజా జీవనమునకు, ప్రధాన కారకులైరి.

75. సప్త ఋషుల లక్షణములు: బ్రహ్మ మానస పుత్రులు, తేజోమూర్తులు, ధర్మాచరణ ప్రవక్తలు, ప్రజాపతులు, దీర్ఘాయువులు, వేదమంత్రప్రవక్తలు, దివ్యశక్తి, సంకల్ప శక్తి గల్గి దివ్య దృష్టి కలవారు, సర్వ ధర్మమర్మజ్ఞులు యజ్ఞములు చేయుట, చేయించుటలో ప్రవీణులు, గురుకులముల ద్వారా విద్యాభివృద్ధికి తోడ్పడతారు. సంతాన ప్రాప్తికి గృహస్తాశ్రమములు స్వీకరించిరి. సంతానము, గోధన సంపన్నులు. ప్రాపంచిక భోగములందు ఆసక్తి లేని వారు. మనస్సును జయించినవారు. వాక్‌ శుద్ధి కలిగిన వారు.

76. ఇతర మహా ఋషులలో ముఖ్యులు:

1. కాక భుషుండి మహర్షి: ఇతని చే రచింపబడిన 'కాక భుజందర్‌ నాడీ'. అను గ్రంథము చాలా ప్రసిద్ధి చెందినది. ఈ గ్రంథములో అనేక ఆశ్చర్యకర విశేషములతో పాటు ఎన్నో రహస్యాలు వర్ణింపబడినవి. కేవలము కారణజన్ములు. అవతారముర్తులను గూర్చి వారి రహస్యములను ఇందు తెలుపబడినవి.

2. పరాశరమహర్షి: వీరు రచించిన ''హోరానాడి'' అను గ్రంథము అద్భుతము, ఆశ్చర్యకరమైనది. అందు యోగజ్ఞానము, సత్యజ్ఞానము, లోకజ్ఞానము, సృష్టి రహస్యములు తెలుపబడినవి. భూతభవిష్యత్‌ విషయములు వర్ణింపబడినవి.

3. కపిల మహర్షి: అణువులో బ్రహ్మశక్తిని ధర్శించిన వారిలో కణ్వ, గౌతమ మహర్షుల తర్వాత కపిల మహర్షిని పేర్కొనబడిరి. అణువు నందు గల శక్తియే బ్రహ్మము అను అణు సిద్ధాంతాన్నీ మొదట కపిల మహర్షి రూపొందించారు.

4. విశ్వా మిత్రుడు: ఇతడు పదివేల సంవత్సరములు తపస్సు చేసిన క్షత్రియుడు బ్రహ్మర్షి అయ్యెను. దశరధుని కుమారుడైన రామచంద్రుని తన యాగ రక్షణుకు తీసుకొని వెళ్ళి అతనికి అనేక అస్త్ర శస్త్రములను బోధించినవాడు.
వీరు కాక వాల్మికి, కర్దముడు, భృగువు, చ్యవనుడు, ఉద్దాలకుడు, ఉశీలుడు, వామదేవుడు, దుర్వాసుడు, భరద్వాజుడు, బుచీకుడు మొదలైన అనేక మంది వేదవేదాంగపారంగతులైరి.

77. ఈ ప్రపంచమున నివశించు ప్రజలందరు ఎవరికి సంతతి అయినారో అట్టి పూర్వీకులైన సప్తఋషులకు కూడా సనకసనందనాదులు, వసువులు, దేవర్షులు మొదలగువారు చాలా పూర్వీకులు. వీరందరినుండియె ఈ ప్రపంచములోని జనులందరు పుట్టిరి. అందుకే వారి గోత్రనామాలను మనము ఇప్పటికి వంశానుసారముగా కలిగి యున్నాము.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 22/Mar/2019

------------------------------------ x ------------------------------------

See the source image
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 15 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

🍃. తపస్సు 🍃

78. తపస్సు మనస్సుకు సంబంధించినది. మనస్సుతో చేయు సాధనయె తపస్సు దీని లక్షణములు:

1. మనస్సును ధ్యాన విషయమునందు లగ్నం చేయుట.
2. మనస్సు శుద్ధి కలిగి నిశ్చలంగా ఉండుట.
3. శారీరక, పరిసరముల పరిశుద్ధత.
4. కామ, క్రోధాదులు లేకుండుట.
5. సంకల్పరహితముగా ఉండుట.
6. మనోనిగ్రహము.

79. తపస్వులు ఆహారమును వర్జించి సాధన చేయగల శక్తి కల్గి ఉండవలెను. ఎపుడైతే సాధకుడు పైన తెల్పిన తపస్వి లక్షణములు కల్గి సాధన చేయునో, అప్పుడు అతనికి ఆహార ఆవశ్యకత లేక మానసిక శక్తితో తపస్సులో నిమగ్నమవగలడు. వారికి శ్వాస ద్వారానే విశ్వము నుండి శక్తి లభించును. శరీరము మనస్సు నిశ్చలమైనప్పుడు శక్తిని పొందే ఆవశ్యకత ఉండదు.

మామూలుగా శక్తి ఆహారం ద్వారా లభించును. కానీ తపస్సులకు అవసరమైన శక్తి కేవలం శ్వాస ద్వారానే లభించగలదు.

త్రివిధ తపస్సులు: 
1. ఆత్మానాత్మ వివేకముచే మనస్సును ప్రత్యగాత్మ యందు విలీనము చేయుట జ్ఞాన తపస్సు. ఇది ఉత్తమ తపస్సు.
2. ధ్యానధారణాదులచే మనస్సు నిలువరించి, సమాధిలోనుంచుట మధ్యమ తపస్సు.
3. కృచ్ఛంద్రాయణాదుల చేతను, ఉపవాసములచేతను, దేహేంద్రియములను కృశింపజేయుట కనిష్ఠ తపస్సు.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 23/Mar/2019

------------------------------------ x ------------------------------------

Image result for madam blavatsky
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 16 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

🍃. అనన్యయోగము 🍃

80. దృఢమైన యోగ సాధనను అనన్య యోగము అందురు. ఒక వ్రతము మాదిరిగా నిత్యము నిరంతరం ఆటంకము లేకుండా పురుష ప్రయత్నంతో చేయు సాధననే అనన్య యోగం అంటారు.

81. అనేకమైన అంతులేని ఆపదలు, అష్టకష్టములు, విఘ్నములు ఏర్పడినను యోగులు తమ సాధన యందు ఏ మాత్రము చలించక నిరంతర అభ్యాసము చేయుచుందురు. దానినే అనన్యయోగమందురు.

82. కర్మ, జ్ఞాన, భక్తి, ధ్యాన యోగములలో అనన్య యోగమును ఏదో ఒక దాని యందు జోడించిన, ఆ యోగమునకు అనంత శక్తి చేకూరి త్వరిత ఫలితము లభించును. అనన్య యోగము ఒక ప్రత్యేకమైన యోగపద్ధతి కాదు.

83. ఏదో కొంత కాలము కొన్ని రోజుల సాధన కాకుండా నిరంతరము ఆత్మ యందు చిత్తమును, మనస్సును లగ్నం చేయుట వలన క్రమముగా అనన్య యోగము సిద్ధించును.

84. ఇతర ప్రాపంచిక పదార్థములపై ఆసక్తి చూపక నిరంతరము పరమాత్మ యందే ధ్యాస కలిగి సాధన చేయుటయె అనన్య యోగము.
🌹 🌹 🌹 🌹 🌹

24/Mar/2019

------------------------------------ x ------------------------------------

See the source image
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 17 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 


🍃. యోగము, అనుష్ఠానము 🍃 

85. యోగము ఒక గ్రంథము కాదు. ఇది అనుష్ఠాన ప్రధానమైనది. అనుభవ పూర్వకమైనది. పాండిత్యమునకు, గ్రంథస్థమునకు, ఉపన్యాసములకు అతీతమైనది. అందుకు క్రమశిక్షణ, గురుశుశ్రూష, సాధుసాంగత్యము అవసరము.

86. ఆత్మ అనాత్మల భేదములను మొదట గ్రహించవలెను. సిద్ధాంతములపై పోరాడువారికి ఆధ్యాత్మ రహస్యములు ఎప్పటికీ అందుబాటులోకి రావు. సాధన లేనిదే ఆత్మ ప్రాప్తిని పొందలేడు.

87. నిరంతరం సూత్రప్రాయంగా పురుష ప్రయత్నంతో యోగము అభ్యాసము చేసిన సిద్ధి లభించగలదు.

88. గురువులు వేదాంతమును తక్కువగా చెప్పి సాధన, యోగ ప్రక్రియలను గూర్చి ఎక్కువగా బోధించవలెను. లక్ష్యమును అతి స్వల్పముగా చెప్పి సాధనను నొక్కి చెప్పాలి.
 
89. యోగము ఆచరణాత్మక దివ్య సాధనలను ఎల్లరు గుర్తించి ఆచరించి తరించవలెను. ఇది వాచావేదాంతము కారాదు. అనుష్ఠాన వేదాంతము. ఆచరణ వలనె యోగ ఫలితము శరీరములో పనిచేయుటను గ్రహించవలెను.

90. యోగపరిపూర్ణత, ఆత్మ పరిపూర్ణత పొందిన తరువాతే మోక్షము. పైపైన ఎన్ని పూజలు చేసినను, స్తోత్రములు వల్లించినను, నామ జపములు చేసినను, మూలాక్షరముల సహస్రనామోచ్చరణ చేసినను, ధ్యానము లాచరించినను, పుణ్య క్షేత్రములు దర్శించినను, ఎన్ని పవిత్ర నదీ స్నానములు చేసినను మోక్షము చేకూరదు. ప్రతి మానవుడు ఆచరణలో పెట్టి అనుభవములతో ఫలితములు చూచుకొనవలెను.
🌹 🌹 🌹 🌹 🌹

25/Mar/2019

------------------------------------ x ------------------------------------
Image result for Blavatsky Theosophy
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 18 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

🍃 యోగము, గృహస్థాశ్రమము 🍃 

91. సాధారణముగా ఆశ్రమములలో నాలుగు రకములు ఉన్నవి.
1. గృహస్థాశ్రమము
2. బ్రహ్మచర్యము
3. వానప్రస్థము
4. సన్యాసాశ్రమము. యోగసాధన ద్వారా మోక్షము పొందాలంటే ఏ ఆశ్రమము పాటించవలెనన్నది ప్రశ్నార్థకము.

92. ఏ ఆశ్రమము వారైనను యోగ ధ్యేయమును సాధనా సిద్థాంతములను శాస్త్ర ప్రమాణముగా అభ్యాసం చేయుచు ఏ ఆశ్రమమైనను పాటించవచ్చును. కానీ అన్నింటిలో గృహస్ధాశ్రమము శ్రేష్ఠమైనదని పెద్దలు చెప్పుదురు. అందుకు కారణము మిగిలిన మూడు ఆశ్రమముల వారు వారి కనీస అవసరములకై గృహస్థులమీదే ఆధారపడవలసి యుందును.

93. గృహస్థుని ధర్మములు: దొంగతనము చేయకుండుట, ధైర్యము, సుచిత్వము, ఇంద్రియ నిగ్రహము, వేదాంత విచారణ, సత్యము, క్రోధము లేకుండుట, బుద్ధిమంతుడై ఉండుట అతిధిని గౌరవించుట, లోకజ్ఞానము ముఖ్యమైనవి. అప్పుడే అతడు యోగాభ్యాసానికి యోగ్యుడు.
🌹 🌹 🌹 🌹 🌹

26/Mar/2019

------------------------------------ x ------------------------------------
See the source image
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 19 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

🍃.  సాధనా చతుష్టయము - 1 🍃 

94. యోగ విద్య యందు సాధకునికి నాలుగు రకములైన సాధన సంపత్తులు అవసరము.
1. నిత్యానిత్య వస్తు వివేకము.
2. ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము. 
3. శమ దమాది షట్‌ సంపత్తి.
4. ముముక్షత్వము

95. నిత్యానిత్య వస్తు వివేకమనగా ప్రపంచమంతయు మాయయని, నశ్వరమని, ఆత్మ ఒక్కటె నిత్యమని, నాశరహితమని భావించుట.

96. ఇహా ముత్రార్థ ఫల భోగ విరాగము అనగా ఇహలోక, స్వర్గలోక సుఖములందు వైరాగ్యము.

97. శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, భక్తి అను ఆరింటిని షట్‌ సంపత్తి అంటారు.
1. శమమనగా: అంతరింద్రియ నిగ్రహము, నిశ్చల సమాధి.
2. దమమనగా: బాహ్యేంద్రియ నిగ్రహము, విరక్తి వైరాగ్యములు.
3. ఉపరతి అనగా అరిషడ్వర్గములను జయించుట, విషయాసక్తి వీడుట. 
4. తితీక్ష అనగా సుఖఃదుఃఖములను ఓర్చుకొనుట, విషయ సమత్వము.
5. శ్రద్ధ అనగా గురువు యందు వేదాంత వాక్యములందు నమ్మకము కలిగి శ్రవణము, విచారణ చేయుట.
6. భక్తి అనగా గురువులను పూజించుట. శుశ్రూష చేయుట.

98. ముముక్షత్వము అనగా మోక్షము పొందుట యందు అభిలాష కలిగి అందుకు తగిన సాధన, యోగాభ్యాసము చేయుట, గురువులను ఆశ్రయించుట, శ్రవణాదులు చేయుట.

99. దివ్య దృష్టి గురువు ద్వారానూ, భగవంతుని అనుగ్రహము ద్వారాను పొందవచ్చు. అభ్యాసంతో దివ్యదృష్టిని అనగా జ్ఞాన నేత్రములను(మూడవ కన్ను) పొందవచ్చు. దీని వలన ఆత్మానుభూతి పొందవచ్చు. వ్యాసుడు సంజయునకు, శ్రీకృష్ణుడు అర్జునునకు, బ్రహ్మంగారు సిద్థయ్యకు దివ్య దృష్టిని ప్రసాదించిరి.

జ్ఞానంతో పాటు దివ్య దృష్టి ఉన్నప్పుడు సుదూర ప్రాంతపు దృశ్యములను కూడా దర్శించవచ్చు. బ్రహ్మాండములోని దృశ్యములలో, భవిష్యత్తు సంఘటనలు దివ్య దృష్టి ద్వారా తెలుసుకోవచ్చు. ఈ శక్తిని నిరంతర యోగ సాధన ద్వారా పొందవచ్చు. జనుల మనస్సులోని విషయములు గ్రహించవచ్చు. ఉత్తమమైన అనన్య యోగులు ఈ శక్తిని పొందగలరు. కాని ఇవన్నీ మోక్షమునకు ప్రతిబంధకము.

100. యోగసిద్ధి: ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేక శాశ్వతమైన పరబ్రహ్మరూపములోనే లయించి యుండును. అట్టి వారే యోగసిద్ధిని పొందినట్లు.

అందుకు కోరికలు త్యజించవలెను. మనస్సును నిగ్రహించవలెను. ఆత్మ స్థితి యందు సర్వమును లయించవలెను. అట్టి యోగికి పునర్జన్మలేదు. సంకల్పరహితుడు మనస్సును ఆత్మ యందు లయించి యుండును. శాంతిని పొందును. సమదృష్టి కల్గి సర్వ జీవరాశులు పరబ్రహ్మ స్వరూపమే అని జీవాత్మ పరమాత్మ ఒక్కటేనని గ్రహించును.

101. యోగము సిద్ధించాలంటే దృఢ సంకల్పము, సాధన, వైరాగ్యము, సాధనాఫలితముల కొరకు చూడకుండా సాధన నిరంతరము కొనసాగించుట. భౌతిక తాపత్రయములు వదలివేయుట. సుఖ దుఃఖములకు అతీతుడై ఉండుట. ఇంద్రియ నిగ్రహము, వాసనాక్షయము, భోగరాహిత్యము కలిగి ఉండుట. అట్టి వారే యోగసిద్ధిని పొందగలరు. వారినే యోగారూఢులందురు.

102. ఉత్తమ యోగి అయినవాడు నిరంతరము భగవంతుని యందు ఆత్మను లయింపజేయుట, శ్రద్ధ, దైవచింతన కల్గి ఉండును.
🌹 🌹 🌹 🌹 🌹

27/Mar/2019

------------------------------------ x ------------------------------------
Image result for Blavatsky Theosophy
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 20 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

🍃. సాధనా చతుష్టయము - 2 🍃 

103. ప్రాణవాయువును బ్రహ్మరంద్రమున నిల్పుటయే యోగధారణ. మనస్సును ఆత్మ స్థానమైన హృదయమున నిల్పి ఏకాగ్రతతో ధ్యానం చేయుటయే యోగధారణ. ఇందుకు ఈశ్వరానుగ్రహము లభించవలెను.

104. యోగులలో డంబాచారులు, ముముక్షువులను రెండు రకములు ఉందురు. డంబాచారులు వస్తువులపై, విషయముపై, ఆసక్తి కలిగి యుందురు. ముముక్షువులు ఇట్టి ప్రయత్నములు విడనాడి ఎల్లప్పుడు ఆత్మ చింతనలో ఉందురు. డాంబిక యోగులు కొందరు, వేషధారులు కొందరు, ఉపన్యాసకులు, తమగొప్పలు చెప్పుకొనేవారు; వీరు రుద్రాక్షలు ధరించి గంజాయి త్రాగుచు, కాషాయాంబరములు ధరించి యుందురు.

105. నిరంతర సాధన వలన యోగులకు యోగశక్తి లభించును. ఆ శక్తితో ప్రాణవాయువును భ్రూమధ్యమందు నిల్పి మనస్సుతో పరమాత్మను ధ్యానించవలెను.

106. యోగము యొక్క పరాకాష్ఠ యోగసిద్ధి పొందుటయే. సిద్ధిపొందిన వారు ఇక సాధన చెయవల్సిన అవసరము లేదు. వీరు జీవన్ముక్తులు. లోక కళ్యాణం కొరకు కార్యములు చేయుచుందురు. వీరికి పునర్జన్మలుండవు.

107. ఆధ్యాత్మికం అనగా భౌతిక విషయములలో మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, జీవుడు, పరమాత్మ, అనువిషయములను గూర్చి విశ్లేషించి, సాక్షియగుట. దీనినే ప్రత్యగాత్మ అందురు. ఇదే జీవుని యొక్క వాస్తవ రూపము. భోగములు, వాసనలు నశించేవే. అనగా క్షరములు. శాశ్వతము, శ్రేష్ఠము, నిర్మలము, నాశరహితమైన ఆత్మయే అక్షరము. అనగా నాశనము లేనిది.

108. యోగవిశిష్ఠతను గూర్చి పురాణ ఇతిహాసములు, ఉపనిషత్తులు, గీత, శ్రీయోగవాసిష్ఠము, పతంజలి యోగము, వ్యాసుని జ్ఞాన సిద్ధాంతములు, నారద భక్తి సూత్రములు, స్మృతులు, శ్రుతులు, మార్కండేయ, విష్ణుపురాణములు, భారత, రామాయణ, భాగవతములందు వివరింపబడినది.

109. యోగవిశిష్ఠత: ఇది పురుషార్థమగు మోక్షమును పొందుటకు మార్గము. బుద్ధి నిర్మలమగుటకు యోగాభ్యాసము అవసరము. ఇది శాశ్వతమైన జ్ఞాన భాండాగారము. సృష్టి ఆరంభమునుండి గంగా ప్రవాహము వలె నిరంతరము ప్రవహించుచున్నది. యోగజ్ఞానము జ్ఞానములన్నింటికి శ్రేష్ఠమైనవి. యోగి మానవులందరిలో గొప్పవాడు. సాధనలన్నింటిలో యోగసాధన గొప్పది. ఇది సాక్షాత్‌ భగవంతునిచే ప్రత్యక్షముగా ప్రకటింపబడినది. ఇది మోక్షప్రదాయిని. నొసటి వ్రాతను జాతకమును చెరిపివేయునది యోగము.

యోగము కుల, మత, జాతి, కాలము, దేశము మొదలగు వాటికి అతీతమై సర్వజనామోదమైనది. సాధన, నిష్ఠ, అనుష్ఠానము, సమన్వయ దృష్టి, ఆహార నియమములు, క్రమ శిక్షణ, సర్వులకు ఆచరణ యోగ్యము.
🌹 🌹 🌹 🌹 🌹

28/Mar/2019

------------------------------------ x ------------------------------------

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 21  🌹 
21 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. Prasad Bharadwaj

🍃 సాధనా చతుష్టయము - 3 🍃 

110. యోగసాధన వలన నాభియందు యోగాగ్ని జనించి వారివారి సుకృత, దుష్కృత కర్మలు, నశించి చివరకు సాధకులు బ్రహ్మైక్యము పొందుదురు.

111. సాధన ప్రారంభించి పూర్తికాకపోయినను తగిన ఫలము లభించును. మిగిలిన సాధనను మరుజన్మలో కొనసాగించి సిద్ధింప చేసుకొనవచ్చు.

112. ఆత్మ సాధన ద్వారా, వివిధ అనుభూతుల ద్వారా, ఆనంద పారవశ్యమును పొంది తుదకు పరమశాంతిని పొందును.

113. యోగసాధన వలన అనారోగ్యము నశించి సమస్త రోగములు దోషములు తొలగిపోవును. 

114. ప్రతిగృహము ఒక యోగాశ్రమముగా మార్చుకొని సర్వులకు మార్గదర్శకముగా మార్చుకొనవచ్చును.

115. కుల, మత, జాతి, భేదము లేకుండా సర్వులకు ఆమోదయోగ్యమై, వ్యక్తి ఆటంకాలకు వీలు లేకుండా ఉండుట యోగము యొక్క ప్రత్యేకత.

116. భారతీయ యోగ ప్రాశస్త్యము, యోగ గ్రంథములు విదేశాలలో ప్రచారమై, యోగశక్తికి వారు ఆకర్షితులగుచున్నారు.

117. యోగము కల్ప వృక్షము, కామధేనువు, చింతామణి వంటిది అగుటయేగాక మోక్ష సిద్ధిని ప్రసాదించును.

118. యోగాగ్ని శరీరముగా గల వానికి వార్ధక్యముగాని, మరణముగాని తన అధీనములోనుండి సదా ఆరోగ్యవంతునిగా ఉంచును.

119. యోగాభ్యాసి శరీరము తేలికగా ఉండును. కంఠధ్వని స్పష్ఠముగా, మృదువుగా ఉండుటయేగాక శరీరము సుగంధమును వ్యాపింపజేయును. తేజోవంతముగా శరీరము ఉండును. ఎట్టి ప్రదేశములందైనను, శ్మశానమునందైనను, యోగి ఆనందమగ్నుడై యుండును.

120. ఇట్టి యోగమును సర్వ మానవాళి సద్వినియోగపర్చుకొని, పఠనము, శ్రవణము,అనుష్ఠానము ద్వారా దుఖఃములు, రోగములు తొలగించుకొని సుఖప్రాప్తి పొందుదురుగాక.
🌹 🌹 🌹 🌹 🌹

29.Mar.2019

---------------------------------------- x ----------------------------------------

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 22 🌹 
22 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 మనస్సు దాని వికారములు - 1 🍃 

121. మనస్సు అనేది అతి సూక్ష్మమైన స్థితి. ఇది యోగ సాధకుని మాయలో పడవేయు శత్రువు. అంతేగాక దీని ద్వారానే యోగి తన యోగ సాధన కొనసాగించి, దీనిని స్వాధీనపర్చుకొని యోగసాధన చేయును. శ్వాసకు, మనస్సుకు అవినాభావ సంబంధమున్నది. మనస్సును అదుపు చేయగల్గింది శ్వాస మాత్రమే. అందుకే శ్వాసపై ధ్యాస ఉంచాలి. అప్పుడే ఏకాగ్రత కుదరగలదు. చంచలత్వంతో కూడిన మనస్సుకు ఏకాగ్రత అవసరము.

122. మనస్సు కోతి లాంటిది. కోతి ఒక కొమ్మను వదలి మరొక కొమ్మను ఎలా పట్టుకొనునో అలాగే మనస్సు విషయము నుండి విషయమునకు తెంపు లేకుండా పోవుచున్నది. కనుక అది చెప్పినట్లు నడుచుకొనరాదు. మనస్సు నశింపకున్నచో సంకల్పములు, ఇంద్రియములు పనిచేయుచుండును. అనేక జన్మల సంస్కారములు మనస్సుకు ఆహారమగును. అట్టి మనస్సు యొక్క పుట్టుక, స్వభావము దాని ప్రభావము, దానిని అరికట్టుటకు ఉపాయములు సాధకుని కొరకు రూపొందింపబడినవి. అదియె అమనస్క యోగము.

123. మనస్సు అనునది కేవలం కల్పన మాత్రమే. దీనికి సంకల్పము, వికల్పము, ఆలోచన, ఊహ, అనుభవములు, కాలనియమము అను వికారములు కలవు. మనస్సు పనిచేయుట జీవితము. మనస్సు పనిచేయకుండా ఆగిపోవుటయె ముక్తి.

124. ఇంద్రియములలో మనస్సు పంచేద్రియములకు ఒక రాజు వంటిది. ఐదు ఇంద్రియాలను మనస్సు నడిపించును. మనస్సు, ఐదు ఇంద్రియములు కలసి మనోమయ కోశమందురు. తలంపులు, సంకల్పములు,ఎచ్చట పుట్టునో అచ్చటనే మనస్సు కలదు. శ్వాస లేనిచో మనస్సు లేదు. మనస్సు నశించిన శ్వాస నిలచిపోవును.

125. మనస్సు యొక్క రహస్యార్థ మేమనగా! శరీరం పని చేయాలంటే శక్తి కావాలి. శక్తి కావాలంటే ఆహారం కావాలి. ఆహారం జీర్ణం కావాలంటే ఆక్సిజన్‌ అవసరము. ఆక్సిజన్‌ ఆహారపు అణువులను దగ్ధం చేసి శక్తి పుట్టించును. శక్తి లేనిచో మనస్సు పనిచేయదు కావున మనస్సు లేనప్పుడు శక్తి యొక్క అవసరము లేదు. ఆహారము అవసరం లేదు. అప్పుడు మనస్సు దీర్ఘ సుషిప్తిలోకి చేరును. అట్టి సుషిప్తి స్థితియే యోగ నిద్ర, లేక పరమాత్మ స్థితి. నిర్విషయ నిర్వికార పరబ్రహ్మ స్థితి. అదియె బ్రహ్మానంద స్థితి. ముక్త స్థితి.

126. మనస్సనునది 24 తత్త్వముల సముదాయము యొక్క సంస్కారముల నిధి. అంతఃకరణము యొక్క ప్రథమ పరిణామము మనస్సు. అనేక జన్మల పరంపరలకు మనస్సు ప్రధాన కారణము. శ్వాసతో పాటు మనస్సు పుట్టుచున్నది. కావును శ్వాస, మనస్సు ఒక్కటే.

127. మనస్సు అతి సూక్ష్మాంశము. మానసిక శక్తి అనేక సూక్ష్మాంశములతో కూడి ఉన్నది. మనస్సు వెనుక అహంకారమున్నది. మనస్సు యొక్క శక్తి బుద్ధి అయి ఉన్నది. ఆహారము యొక్క సూక్ష్మాంశము మనస్సు. జలము యొక్క సూక్ష్మాంశము ప్రాణము. సత్వగుణము వలన జ్ఞానము అబ్బును గనుక సాత్వికాహారము అవసరము. మాంసాహారము తామసికము, గనుక అభ్యాసకులు విడిచిపెట్టవలెను.

128. మనిషి జన్మించుటకు బీజము మనస్సే. తలంపులు పుట్టుచోటు నాభి. నాభి బ్రహ్మ యొక్క స్థానము. శ్వాస నాభి నుండి పుట్టు చున్నది. బ్రహ్మ దేవుడు శ్రీమన్నారాయుణుని యొక్క నాభి యందు జన్మించాడు. విష్ణుదేవునికి తలంపు కలగగానే తన నాభి నుండి బ్రహ్మ జన్మించాడు.

129. అగ్ని, జ్వాల ఎలా కలిసి ఉన్నాయో అలానే తలంపులు, మనస్సు కలసి ఉన్నాయి. వీటిని విడదీయుటకు వీలులేదు. మానవుని యొక్క అన్ని ఆశలు, కోర్కెలు, సంతోషాలు ఈ మనస్సులోనే కేంద్రికృతమై ఉన్నాయి.
🌹 🌹 🌹 🌹 🌹

30.Mar.2019

---------------------------------------- x ----------------------------------------

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 23 🌹 
23 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 మనస్సు దాని వికారములు - 2 🍃 

130. కర్మ యను వృక్షమునకు మనస్సే బీజము. శ్వాసను నిలిపిన తలంపులు పుట్టవు. విషయములు, తలంపులు, సంకల్పములు, దృశ్యములు, శబ్దములు, భోగములు ఇవన్నీయూ ప్రారంభమున ఆనందముగా సుందరముగా తోచినను చివరకు భయంకరమైన తామరవలె దుఃఖమును కలుగుజేయును.

131. దుష్ట సంకల్పములచే మనస్సు అల్పత్వమును పొందినది. ఈ సంకల్పములు మనిషికి మనిషికి మధ్య భిన్నముగా నుండును.

132. చిత్తము నుండి మనస్సు ఏర్పడుతుంది. ''నేను''కు మనస్సుకు సూక్ష్మ భేదము ఉన్నది. మనస్సు ఇంద్రియములు, బుద్ధి, పంచప్రాణములు, శరీరము ఇవన్నీ సూక్ష్మ భూతముల వల్ల ఏర్పడినవి. ఇవి జడము.

133. శరీరము ఒక రథము గాను. మనస్సు పగ్గాలు, బుద్ధి సారధి, ఇంద్రియాలు అశ్వాలు, విషయాలు మార్గాలు, ఆత్మ రధికుడుగా సూక్ష్మ భూతముల కలయిక వల్ల ఏర్పడినవి. ఇందులో ఆత్మ ఒక్కటే చైతన్యము మిగిలినవి ఆత్మ వలన చైతన్యవంతమైనవి.

134. మనస్సును శుద్ధ, అశుద్ధ అను రెండు విధములుగా వర్ణించవచ్చు. శుద్ధ మనస్సుకు ఆశలుండవు, దేని యందు ఇచ్ఛవుండదు, కోర్కెలు లేనిది, ఆత్మ యందు ఐక్యమై ఉండును. అశుద్ధ మనస్సు బంధములు, ఆశలు, కోరికలు కల్గి ఉండును. శుద్ధ మనస్సుతో అశుద్ధ మనస్సును శుద్ధి చేయవచ్చును దానినే సాధన అందురు.

135. ఏ ఇతర ఆలోచనలు లేని మనస్సును అనన్య మనస్సందురు. పరమాత్మను అనన్య మనస్సుతోనే ప్రార్థించవలెను.

136. పురుష ప్రయత్నము, నిరంతర సాధన, భక్తి శ్రద్ధలు కల్గి, గురువు బోధతో సూక్ష్మ విషయములు గ్రహించి, అనన్య చిత్తముతో పరమాత్మను సేవించవలెను.

137. నీరు కలపని పాలవలె స్వచ్ఛమై మనస్సుతో సర్వకాల సర్వావస్థలయందు పరమాత్మ స్మరణతో వున్న, అట్టి వారిని అనన్య మనస్కులందురు.

138. మనస్సు యొక్క గుణములు, లక్షణములు, వేగము, విహారము, చంచలత్వము, లోకవ్యవహారములందు ఆసక్తి, అబద్ధము, ఈర్ష్య, కోపము, అజ్ఞానము, విచక్షణా జ్ఞానము లేకపోవుట, భ్రాంతి, చింతన, ఆలోచన, భోగప్రాప్తి, వార్థక్య, మరణముల భ్రాంతి కలిగినది. దుర్వాసనలతో కూడి, సంసార సాగరమను వృక్షమునకు మూలకారణము మనస్సు. జనన మరణముల హేతువైనది మనస్సు. మనస్సు ఎప్పుడు విషయాలను ద్వంద్వాలుగా విభజించి చూస్తుంది. మనస్సు పూర్వ జ్ఞాన జ్ఞాపకాలమీద ఆధారపడి ఉంటుంది. తెలిసినదాని నుండి తెలిసిన దానికి కదులుతూ ఉంటుంది. తెలియని ఆత్మాను భవమును గుర్తించదు. అందువలన యోగము అవసరము.

139. మనస్సు సత్వ,రజో, తమో గుణములు కలిగి ఉన్నది. తమస్సు వలన అజ్ఞానము, రజోగుణము వలన కోరికలు క్రోధము. సత్వ గుణము వలన పవిత్రత ప్రశాంతత కలిగి యుండును. మనస్సు లేని యెడల మనలో మిగిలి వున్నది ఆత్మయె. ఆత్మయే సర్వకాల సర్వావస్థలలో నిత్యమై ఉన్నది. కాలావస్థలు లేనప్పుడు కూడా ఉన్నది ఆత్మయె.
🌹 🌹 🌹 🌹 🌹

31.Mar.2019

---------------------------------------- x ----------------------------------------

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 24 🌹 
24 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 మనస్సు దాని వికారములు - 3 🍃 

140. మనస్సు ఒక మహా సముద్రము వంటిది. అందు తలంపులు అలల వలె లెక్కలేనన్ని పుట్టుచూ గిట్టుచున్నవి. వాటి జ్ఞాపకాలు మనస్సునందే నిలచియుండును. జ్ఞాపకాలే వాసనలు. కలలుకనేది మనస్సే. ఒక సంకల్పమునకు మరొక సంకల్పమునకు ఒక్కోసారి సంబంధము ఉండదు. ఒక్కొక్క సారి గొలుసుకట్టుగా వస్తాయి. నిద్రలో మనస్సు కారణ రూపంగా ఉంటుంది. సుఖదుఃఖాలకు, స్వర్గనరకాలకు మనస్సే కారణము. నీటిలో అలలు, తరంగములు ఉన్నంత వరకు క్రింది భాగము కనబడదు. అలానే మనో సంకల్పములు, భావనలు, ఉన్నంత కాలము అంతరమున వున్న ఆత్మ దర్శనము కాదు.

141. మనస్సు దేహమును, ఇంద్రియములను క్షోభపెట్టుచున్నది. ఒక్కోసారి అకారణముగా క్షోభించును. అనేక జన్మల వాసనలు, సంస్కారములు పొంది అజ్ఞానము వలన సంపూర్ణ స్వతంత్రముతో విచ్ఛలవిడిగా విర్రవీగుచున్నది. వ్యభిచారము చేయుచున్నది.

142. మనస్సు పిచ్చి పట్టిన కోతిలాంటిది. అట్టి కోతికి సారాతాపించిన, సారాతాపించిన కోతికి తేలుకుట్టిన దాని వికారములు ఎట్లుండునో, మనస్సు యొక్క వికారములు కూడా అట్లే ఉండును. ఇలాంటి మనస్సును స్వాధీనము చేసుకొనుట ఎంతటి కష్ట సాధ్యమో సాధకులు గ్రహించాలి.

143. మనస్సుకు క్షేత్రము శరీరము. స్థూల, సూక్ష్మ శరీరములు లేనిచో మనస్సు లేదు. మనస్సు తన పరికరములైన స్థూల, సూక్ష్మ శరీరములను అంటిపెట్టుకొని వుండును.

144. మంచి చెడులను తెలుసుకొను విచక్షణా జ్ఞానము, స్వార్థపూరిత మనస్సుకు ఉండదు. బంధ మోక్షములకు మనస్సే కారణము. మనస్సు స్వాధీనమైనప్పుడు అన్ని బంధములనుండి విముక్తి పొందుచున్నది. అప్పుడు సాధకుడు ఆత్మగా స్థిరమై, నిత్యమై యుండును.

145. క్షణ కాలములో మనస్సు స్వర్గ, భూలోక, పాతాళ లోకములందు సంచరించి అలపులేక తన శరీరమునందు ప్రవేశించు చున్నది.

146. అంతఃకరణ చతుష్టయములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములకు వాసనలతో కూడిన మనస్సే కారణము. జాగ్రత్‌, స్వప్న, అవస్థలందు మనస్సు పనిచేయును. సుషుప్తా అవస్థ యందు మనస్సు తాత్కాలికముగా లయించుచున్నది.

147. బట్ట బయలు అనగా మనస్సు కదలకుండా శాశ్వతముగా ఆగుట. అదే పరబ్రహ్మ స్థితి. మనస్సును జయించనిచో పరబ్రహ్మోపాసన చేయలేడు.

148. మనస్సు పరుగిడుట వలననె జీర్ణ కోశము, ప్రేగులు పనిచేసి ఆకలి దప్పులు కలుగునట్లు చేయుచున్నది. శరీరములోని దశ వాయువులు కర్మానుసారమైన మనస్సు వలననె పనిచేయు చున్నవి.

149. త్రాటిచే పశువులు ఈడ్వబడినట్లు మనస్సుచే మానవులు ఈడ్వబడుచున్నారు. పక్షుల రెక్కల వలె మనస్సు చంచలమైనది. ఎద్దు, ముక్కు తాడుచే ఈడ్వబడినట్లు, ఎలుకలు తామున్న ఇంటికే కన్నము వేయునట్లు, మానవుడు మనస్సుచే ఈడ్వబడుచున్నాడు. సాలె పురుగు తాను కట్టిన గూటిలోనే చిక్కి చచ్చినట్లు, మానవుడు మనసనే గూడులో చచ్చి పుట్టి చచ్చుచున్నాడు.

150. ప్రజ్ఞావంతుడు, గంభీరుడు, శూరుడు, స్థిరబుద్ధి గలవానిని కూడా మనస్సు చలింపజేయును. మనస్సు శరీరములో వున్నను శరీరమునకు వేరుగా స్వతంత్రించి ఉన్నది. మనసు కోరే భోగములకు శరీరము, ఇంద్రియములు పరికరములుగా నున్నవి.

151. కామము, సంకల్పము, సంశయము, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్యము, అధైర్యము, లజ్జ, బుద్ధి, భయము ఇవన్నీయూ మనో రూపములే. నేను నేను అని పలికేది మనస్సే. కలల రూపము మనస్సే. సవికల్ప సమాధి అనుభవములు మనస్సే. సంకల్పమే మనస్సు. సాక్షి, జ్ఞానము, ఎరుక, మరుపు మనస్సుకే. మనస్సే విషయాకారము. మనస్సున్నంతవరకు త్రిపుటి ఉండును. త్రిపుటి రహితమే ముక్తి.
🌹 🌹 🌹 🌹 🌹

01.Apr.2019

---------------------------------------- x ----------------------------------------

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 25 🌹 
25 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 మనస్సును జయించాలంటే - 1 🍃 

152. మనస్సును జయించాలంటే, వివేక వైరాగ్యాలతో దానిని అంతరములోనికి మరల్చి ఆత్మ స్వరూపములో విలీనము చేయాలి. అప్పుడు దాని తిరుగుబాటు ఆగిపోవును. మనస్సును శ్వాసతో అనుసంధానం చేయాలి. శ్వాస నిలిపిన మనసు నిల్చును. ఏ మాత్రము దానిని వదలిన, పులివలే జీవనారణ్యమునందు తిరుగాడుచుండును. శ్వాస నిదానించిన మనస్సు నిదానించను. శ్వాస ఆగిన, మనస్సు ఆగి, ఆత్మ అనుభవమవును.

153. మనస్సును స్వాధీనం చేసుకోనివాడు ధ్యానయోగము, జ్ఞాన యోగము లాంటివి సాధించలేడు. అందుకు దృఢ సంకల్పము, నిష్ఠ, నిరంతర సాధన అవసరము. నిరంతరము దానితో యుద్ధము, ఘర్షణ, పోరాటము సాగించాలి. నిబ్బరము, ఓపికా కలిగి ఉండాలి. ధ్యానమే ధ్యేయమై ఉండాలి.

154. పురాతన యోగులు, గురువులు, సాధకులు, అవధూతలు, ప్రవక్తలు, అవతార పురుషులు బోధించిన సాధనలు మనకు ఉపయోగపడతాయి. వారు సహజ యోగులు అనగా యోగీశ్వరులు.

155. తీవ్ర ముముక్షువైన వానికి ముందుగా సంకల్ప వికల్పములను, వాసనలను క్షయింపచేసిన, అందుకు ధ్యానము, ప్రాణాయామము చేయుట వలన మనస్సు అదుపులో ఉండును.

156. మనస్సుకు, ప్రాణానికి, శ్వాసకు పరస్పర సంబంధం ఉన్నది. శ్వాస, మనస్సులలో ఒకటి కట్టుబడిన రెండోవది అదుపులో ఉంటుంది. శ్వాసను మనస్సుతో ఎంత అదుపులో ఉంచిన అంత ఆయుర్వృద్ధి అగుచుండును.

157. తలంపులు పుట్టిన చోటును గమనించి అచటనే అవి పుట్టకుండా ఆపాలి. దీనినే చిత్త వృత్తి నిరోధము అందురు. మనస్సును మనస్సుతోనే గమనించాలి. మనసుకు మనసునే సాక్షిగా చేయాలి. విలక్షణమైన సాక్షిత్వమే ఆత్మ.

158. సంకల్ప రాహిత్యము, తీవ్ర విచారణ, తత్వ జ్ఞానము ద్వారా వాసనలు నశించి మనస్సు విలీనమై ఆత్మను పొందును. అందుకు నిరంతరము అభ్యాసం చేయాలి.

159. మనస్సను దారము నందు సమస్త ప్రపంచములు, విషయములు, గ్రుచ్చ బడినవి. అట్టి మనస్సను దారము, ఎప్పుడు నశించునో అపుడు విషయపదార్థములు కూడా నశించును. విషయములు మనస్సు కల్పించుకొన్నవే గనుక, మనస్సు నశించిన విషయములుండవు.

160. సంకల్పము కలిగిన వెంటనే గుర్తించాలి. దానిని అచ్చటనే ఆపివేయవలెను. అలా గుర్తించాలంటే మనస్సుతోనే ఆ సంకల్పములను సాక్షిగా గమనించాలి. సంకల్పములు రాని స్థితియే చిత్తవృత్తి నిరోధము.

161. అభ్యాస వైరాగ్యమను పురుష ప్రయత్నం ద్వారా ఇంద్రియ నిగ్రహము, ప్రాణాయామము కూడా అభ్యాసం చేయాలి. మనస్సు వాటికి కట్టుబడి ఉండును.
🌹 🌹 🌹 🌹 🌹

02.Apr.2019

---------------------------------------- x ----------------------------------------

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 26 🌹 
26 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 మనస్సును జయించాలంటే - 2 🍃 

162. ప్రాణాయామము వలన మనస్సు ఆత్మ యందు నిశ్చలమై ఉండును. ప్రాణాయామములోని పూరక, కుంభక, రేచకములు మూడు విధములుగా మనోలయానికి తోడ్పడును. వీటన్నింటికి స్వప్రయత్నము ముఖ్యావశ్యకము.

163. శుద్ధమైన ఆహారము వలన మనస్సు శుద్ధి అగును. సాత్విక ఆహరము వలన మనసు సాత్వికమగును. సాత్విక అణువులు మనస్సును శుద్ధి చేయును. సత్వగుణ ప్రధానమైన మనసే శాస్త్ర జ్ఞానమును, గురుబోధను గ్రహించగలుగును. శాస్త్రపఠనము, శ్రవణము, వైరాగ్యము, సజ్జనసాంగత్యము, గురుశుశ్రూష ముముక్షువుకు ఆవస్యకము.

164. దీర్ఘ కాలము నిరంతర శ్రద్ధతో, నమ్మకంతో సాధన చేసిన మనస్సును నిగ్రహించవచ్చును. అభ్యాసము వలన ఎంతకష్టమైన దానినైనా సాధించవచ్చు.

165. ఎవరు తమ మనస్సును జయించెదరో వారు ఈ సమస్త భూ మండలమందు సౌభాగ్య వంతులు, శాంత పురుషులు, సత్పురుషులు, సాధుచిత్తులు. వారే ముక్తులు.

166. విషయారణ్యములోని అజ్ఞానమను బురదతో మనస్సు కళంకమైనది. దానిని ఆత్మానాత్మ వివేకమను జలముతో శుభ్రము చేయవలెను.

167. బెస్తవాడు నీటిలోని చేపను నీటి నుండి వేరుచేసి బంధించినట్లు సాధకడు తాను విలక్షణమై మనస్సును వెదకి పట్టుకొనవలెను. తదుపరి ఆ చేపవలె మనస్సు గిలగిల కొట్టుకుని నశిస్తుంది. చంచలమైన మనస్సను కోతిని, భక్తి సాధన అను తాటితో కట్టివేసి, దానిని బుజ్జగించి వశము చేసుకున్న అది మనకు ముక్తిని సిద్ధింపచేస్తుంది.

168. వృక్షమగు మనస్సు యొక్క మూలమును సమూలముగా పెకిలించి వేయని ఎడల, దాని కొమ్మలచివరలను మాత్రమే నరికిన, అది తిరిగి వేల కొలది కొమ్మలుగా పెరిగి మహా వృక్షమై మరల తిరిగి వృద్ధి పొందును. మనసు యొక్క మూలము మూలావిద్య, కనుక మూలావిద్య నశించవలెను.

169. మనస్సును మనస్సు చేతనే స్వాధీన పర్చుకొనవలెను. సూక్ష్మమైన శుద్ధ మనస్సు చేత మలిన మనస్సును తుడిచివేయవలెను. ఇది ఎట్లనగా పలుచని వస్త్రమును కుట్టుటకు సన్నని సూది కావలెను. దబ్బనము పనికిరాదు కదా! అట్లే సూక్ష్మ మనస్సు చేతనే వాసనామయమైన స్థూల రూప మనస్సును జయించవలెను. వజ్రమును వజ్రము చేత భేదించినట్లు మనస్సును మనస్సుతోనే జయించాలి. మదించిన ఏనుగును అదుపు చేయవచ్చును గాని మనస్సును జయించుటకు ఉపాయము కావలెను. ఆ ఉపాయము సంకల్పము చేయకుండుటయే! ప్రాణ క్రియ అనే అంకుశముచే సంకల్పము లుడిగిపోవును.

170. ప్రారంభ దశలో సాధకుడు చిత్తవృత్తుల నుండి మనస్సుని నిరోధించలేడు. అందుకు ముందుగా ధ్యానం, యోగము, జ్ఞానము, ఆత్మవిచారణ ద్వారా సూక్ష్మమైన తాత్కాలిక నిర్వికల్ప స్థితిని పొందిన తుదకు ఆత్మ ప్రాప్తించగలదు. ప్రతి దినము నిరంతరము అభ్యాసము చేయవలెను.

171. శరీరమునకు వ్యాధి ఉన్నట్లు మనస్సుకు కూడా వ్యాధి కలదు. తలంపులే మనస్సుకున్న వ్యాధి. ఈ వ్యాధికి మందు ధ్యానము, జ్ఞానము. శరీర వ్యాధికి కారణము వాతము, పిత్తము, కఫము. మనోవ్యాధికి కారణము మూడు గుణములు.
🌹 🌹 🌹 🌹 🌹

03.Apr.2019

---------------------------------------- x ----------------------------------------

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 27 🌹 
27 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 మనస్సును జయించాలంటే - 3 🍃 

172. మనస్సు కంటే బుద్ధి బలమైనది అగుటచే, బుద్ధిచే మనస్సును నిగ్రహించవలెను. మనస్సనగా అజ్ఞానము, సంశయము. బుద్ధి అనగా వివేకము, విచక్షణ, నిర్ణయము.

173. ఆత్మతో ఐక్యమైన మనస్సుకు భౌతిక వస్తువులపై ఆసక్తి ఉండదు. అలానే సమాధి స్థితిలో ఉన్న మనస్సు నిశ్చలము, ప్రాపంచిక విషయములపై పరుగెత్తదు. అపుడు మనస్సుతో పాటు శ్వాస కూడా లయించును. ఇంద్రియ నిగ్రహమేర్పడును.

174. బుద్ధి అధీనంలో మనస్సు ఉన్నప్పుడు పూర్వపు వాసనలు నశించి చిత్తము కూడా నశించును. అపుడు తత్త్వ దర్శనమగును.

175. తత్త్వ జ్ఞాని అయిన వారికి మనస్సు యొక్క యదార్థ జ్ఞానము విలక్షణముగా కనబడును.

176. మనస్సును నియంత్రించుటకు 'సోహం' అను మంత్రము బాగుగా ఉపయోగపడును. శ్వాస తీసుకొనునపుడు 'సో' అని శ్వాసను వదలినపుడు 'హం' అని భావించుచుండవలెను. అట్లు శ్వాస అను గొలుసుతో మనస్సును బంధించవలెను.

177. ధ్యాన సమయములో కొద్ది రోజులపాటు మనస్సు యొక్క ప్రవర్తనను గమనించుట, దాని వికారములు, అది పరుగిడు విధానమును సాక్షిగా గమనించుట చేయవలెను. పిదప మనసు నిశ్చలమగును.

178. కుతర్కము, వాద వివాదములు, అనవసర చర్చలు, వదలి సాధన కొనసాగించవలెను. పిదప శాస్త్ర శ్రవణ పఠనముల అవసరము తీరిపోవును.

179. మనస్సును జయించుటకు సాధన మాత్రము చాలదు. ఆత్మ దర్శనం కావలెను. అపుడు రెక్కలు లేని పక్షివలె మనస్సు ఎగరలేక కుప్పకూలి పోవును. ఆత్మ దర్శనము కోసము, ఉపాసన, అనుష్ఠానములు సహాయపడును.

180. ఎవరి మనస్సు శారీరక మానసిక పీడలు లేక సంతృప్తి కలిగి యుండునో వారు దరిద్రులైనను సామ్రాజ్య సుఖము అనుభవించెదరు. శారీరక మానసిక పీడలు లేని మనస్సు లయమగును. అప్పుడు ఆత్మ సహజగముగా ప్రత్యక్షమగును.

181. మనస్సును ఆత్మ యందు లయింపజేయుటవలన మనస్సు ప్రశాంతముగా ఉండును. రజోగుణము నశించును. ఆత్మ ప్రాప్తి కలుగును. ఆత్మానందం కలుగును. భేద భావనలు పోయి మైత్రీగుణములు ప్రాప్తించును.

182. పరమాత్మను పొందిన మనస్సు ఎచ్చటెచ్చట విహరించినను అచ్చటచ్చట నున్నగుణ కర్మస్వభావములను విస్మరించి ఆత్మానుభూతిని పొందును. కారణము ఒక్కటైన పరమాత్మ సర్వవ్యాపి గనుక.

183. కర్పూరము అగ్నియందు కరిగినట్లు, నిప్పు నీటిలో కరిగినట్లు, పంచదార పాలలో కరిగినట్లు మనస్సు ఆత్మ యందు లయము కావలెను.

184. పవిత్ర సంకల్పముల చేత వాసనలతో కూడిన సంకల్పములను, శుద్ధ మనస్సుచేత మలిన మనస్సును కడిగివేసిన వాసనా క్షయము, త్యాగము ఏర్పడును. శాంతి, పరమశాంతి లభించును. శుద్ధ మనస్సు అనగా వైరాగ్యము, సత్సంగము, తత్త్వచింతన, గురుశుశ్రూషలు కలిగినది.

185. అతి సూక్ష్మమైన మనస్సును, దాని సంకల్ప వికారములను అరికట్టలేని వారు కర్మ యోగమును అభ్యాసం చేయవచ్చు. అభ్యాసం లేక శిక్షణ అనగా యోగకార్యమును పదేపదే లేదా నిరంతరము చేయుట అందురు. ఇందులో ప్రాపంచికమైన వివేక జ్ఞానము, ధ్యానము, కర్మఫల త్యాగములు ఉండవు.

186. చిత్త వృత్తులను సంపూర్ణముగా నిరోధించుటకు నిరంతరము చేయు ప్రయత్నమే అభ్యాస యోగము. అభ్యాసము ఆరూఢముగాను, ఆరూఢము అనుభవముగాను మారవలెను.

187. ఆత్మ రూపుడైన పరమ పురుషుని చేరుటకు అనేక మార్గములు కలవు. అవి కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన యోగములు. వీటిలో ఏ ఒక్కటైనను అభ్యాసం చేసిన అదే అభ్యాస యోగము. ఏ యోగములకైనను అభ్యాసం అవసరము. ఏ సాధననైనా లక్ష్యము తెలిసి, సాధనా పద్ధతులనెరిగి చేయవలెను.

188. యోగము యొక్క అష్ఠాంగములైన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధి సాధన చేయుటయె అభ్యాస యోగము. నిరంతర అభ్యాసము వలన చివరిదైన సమాధి స్థితిని పొందవచ్చు.
🌹 🌹 🌹 🌹 🌹

04.Apr.2019

---------------------------------------- x ----------------------------------------

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 28 🌹 
28 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 అమనస్క యోగము 🍃 

189. అతి శక్తివంతమైన మనస్సుతో పరమాత్మతో ఐక్యమగుటయె అమనస్కము అని పేరు. యోగమునకు మరొక పేరు అమనస్కము. అదే జీవబ్రహ్మైక్యము. ఈ అమనస్క యోగము అతి రహస్యమైనది. ఇది తెలిసిన యోగి కృతార్ధుడగును.

190. ఇంద్రియములన్నియూ విషయ నివృత్తమైనచో అమనస్క రూపమైన ఆనంద సముద్రమునందు మనస్సు, గాలి వీచని చోట దీపము వలె నిశ్చలమై బ్రహ్మమును పొంది యుండును.

191. అమనస్క యోగములో యోగి నిత్య శుద్ధ చైతన్యమైన పరమాత్మను తానే అని ''తత్‌ త్వం అసి'' అను అనుభూతిని పొందును.

192. అమనస్క స్థితిలో యోగికి భోగ విషయములు, పదార్థములు, వాసనలు నశించిపోవును. ఈ జగత్తు మిథ్య అను నిశ్చయము కలుగును. ఆత్మజ్ఞానము పొంది మనస్సు క్షయించినంతనే జీవన్ముకుడగును. అజ్ఞానికి దేహము నశించినను మనస్సు క్షయింపదు. సాధకుడు మొదట మనస్సునే క్షయింప చేయవలెను.

193. అమనస్క స్థితిని పొందిన యోగి విషయ నివృత్తి పొంది ఆనంద రూపుడై ఉండును. సకలేంద్రియములు విషయ రహితమైన తక్షణం మనస్సు నశించును. అదియె అమనస్క స్థితి.

సాధకుడు సంకల్పములు, ఆశలు, విషయ స్మరణములు త్యజించవలెను. అన్నీ ఉన్నను చెవిటి, మూగ, గ్రుడ్డివాని వలె జీవించవలెను. సాక్షీభూతుడుగా ఉండటమే అమనస్క యోగము. అదియె అమనస్క స్థితి. అమనస్క యోగము అద్వైతమును సూచించును. జీవన్ముక్తుల విషయములో అది అమనస్క ముద్ర అగును. అదియే అద్వైత సిద్ధి.
🌹 🌹 🌹 🌹 🌹

05.Apr.2019

---------------------------------------- x ----------------------------------------

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 29 🌹 
29 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 చిత్తము ఒక మాయా చక్రము 1 🍃 

194. అంతఃకరణ చతుష్టయములో చిత్తము ఒకటి.ఇది జడమైనది. దేహముపై ఆసక్తి, కుటుంబముపై ఆసక్తి, ఆశల చేత ఇది స్థూలత్వమును పొందుచున్నది. సమస్త ఇంద్రియములకు నాయకుడు చిత్తము. మాయా చక్రము యొక్క మాహానాభి (బొడ్డు) యే చిత్తము. ఇది శరీరము యొక్క కేంద్ర భాగము. చిత్తము మానవుని నాభి స్థానము నుండి పనిచేయును. ఇది నిరంతరము పరిభ్రమించుచుండును. విషయాసక్తియే చిత్త వృత్తి.

195. జీవికి గల అంతఃకరణ వృత్తియే చిత్తము. సమస్త దుఃఖములకు, సుఖాలకు, చిత్తమే కారణము. దేహము నేను అనెడి చిత్త వృత్తి నశించవలెను. యోగులు చిత్త క్షయానికి సాధన చేస్తుంటారు. దేహము చిత్తముచే చలింపబడుచున్నది.

196. అంతఃకరణము, బుద్ధి, మహత్తు, అహంకారము, ప్రాణము, జీవుడు ఇవన్నియూ చిత్తము యొక్క వృత్తి రూపములు.

197. చిత్తము ఒక విష వృక్షము. ఇంద్రియ విషయ భోగములు దాని శాఖలు, కొమ్మలు. ధ్యానమునకు చిత్తము యొక్క నిశ్చలత్వము చాలా అవసరము. చిత్తమందు వాసనారహితము కావలెను. ఇది చిత్త వృత్తి నిరోధము వలన జరుగును.

198. కర్మానుసారము ఏర్పడిన దేహమె చిత్తము. చిత్తమె జీవుడు. సంసార రాహిత్యమునకు, సంసార బంధనాలకు చిత్తమె కారణము.

199. మనస్సు అతి శీఘ్రముగా వివిధ ప్రదేశములు సంచరించి సేకరించిన అనేక ప్రాపంచిక విషయముల సమూహమే చిత్తము. చైతన్యము పై వాసనలు ముద్రించబడితే అతి చిత్తము. చిత్తములో వాసనాక్షయమైతే అది చిత్‌, అనగా పరమాత్మ.

200. చిత్తము శుద్ధమైన అనగా విషయములు నశించిన, చైతన్యము నిర్మలమైన స్థితి ఏది కలదో అదే సత్యము. ఈ చిత్తమును విచారణ ద్వారా, పరిశీలన ద్వారా ప్రయత్న పూర్వకముగా శుద్ధము చేయవలెను. సత్కర్మాచరణ, సత్సంగము ద్వారా చిత్త శుద్ధి కలుగును. అపుడు కర్మలు నశించును, తద్వారా బ్రహ్మానుభూతి కలుగును.
🌹 🌹 🌹 🌹 🌹

06.Apr.2019

---------------------------------------- x ----------------------------------------


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 30 🌹 
30 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 చత్తము ఒక మాయా చక్రము 2 🍃 

201. చిత్తము ఉన్నచో మూడు లోకములు ఉండును. చిత్తము నశించిన జగత్తు నశించును. రాగద్వేషములే చిత్త సంస్కారములు. ఆ సంస్కారములే సంసారము. లోకములు, లోకేశులు, లోకస్థులు, అన్నీ చిత్తభ్రాంతియే. వీటి మిథ్యాభావమే చిత్త శాంతి.

202. శరీరాభిమానము గల యోగి ఇతరుల అభిప్రాయములను గ్రహించలేడు. అందుకు యోగ సాధన అవసరము.

203. యోగాగ్నిలో పూర్వ సంస్కారములను భస్మం గావించుచూ, చిత్త శుద్ధి ద్వారా నూతన సంస్కారములు ఏర్పడకుండా చూడాలి. చిత్తములో విషయాకార వృత్తులు నశించి, ఆత్మాకార వృత్తులేర్పడవలెను. అద్వైత సిద్ధిలో అన్ని వృత్తులు నశించును.

204. కర్మ రాహిత్యము పొందినప్పుడు చిత్తము సమాధి స్థితి నొందుచున్నది. దానినే చిత్తలయము అంటారు.

205. అనేక వాంఛలు, విషయాల, కోరికల సంయోగమైన చిత్తము పురుషుని (ఆత్మ) కొరకు ఏర్పడినది. పురుషుడు లేనిచో చిత్తము లేదు. చిత్తము లేనిచో పురుషుడుండడు. ఇంద్రియాలు చిత్తానికి ప్రేరణ కలిగిస్తాయి. బుద్ధిని ఉపయోగించి ఇంద్రియాలను జయించాలి. చిత్త శాంతి కలిగితే పురుషుడే బ్రహ్మము.

206. చిత్తము శుద్ధ సాత్వికమైనప్పటికి దాని చుట్టూ రజోగుణములు, తమోగుణములు కప్పి ఉంటాయి.

207. ప్రకృతిలో గల అనేక శక్తులను గ్రహించే శక్తి చిత్తానికి మాత్రమే ఉంది.

208. చిత్త స్త్థెర్యము లభించాలంటే ఆత్మ జ్యోతిని ధ్యానించాలి. విషయ వాసనలు త్యజించాలి.

209. అనన్య చిత్తుడైనవాడు చిత్తమునందు నిరంతర బ్రహ్మ చింతన, సంకల్పములు లేకుండా అనంత భావంతో నిరంతరం ఆత్మ చింతన చేసిన అనన్యత సిద్ధించును.

210. మనస్సు కేవలము విషయములను సేకరించిన, బుద్ధి వాటిని గ్రహించి విశ్లేషణ చేయగా, చిత్తము ఆ విషయములను తనలో నిక్షిప్తము చేస్తుంది. అదే చిత్రగుప్తుని ఖాతా. దాన్ని బట్టి మనం తిరిగి కర్మలు చేస్తుంటాము. సంఘటనలన్నీ విషయాలుకాదు. విషయీకరించుకొన్నవి మాత్రమే విషయాలు. ఉదాసీన చిత్తము నిర్విషయ మగును.
🌹 🌹 🌹 🌹 🌹

07.Apr.2019

---------------------------------------- x ----------------------------------------



🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 31 🌹 
31 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 చత్తము ఒక మాయా చక్రము 3 🍃 

211. చిత్తము ఆత్మ జ్ఞానము చేతను, పరమాత్మ చింతన చేతను నిండియుండిన దానిని ఆధ్యాత్మిక చిత్తము అంటారు. అట్టి చిత్తములో భక్తి, సమర్పణ, అనన్య సాధన, కర్మల సమర్పణ, అసూయ లేకుండుట, అహంకార రహితము మొదలగు లక్షణములతో కూడి ఉంటుంది.

212. ప్రాపంచిక భావములు, దృశ్యములు, వస్తువులు, శబ్దములు, భోగములు, వికారములతో నిండి ఉండును.

213. చిత్త లక్షణములు: సంకటములో పడదోయుట, గాఢాంధకారము, భ్రమ, సంసారము, ద్వేషము, కామము, క్రోధము, విశ్రాంతి, స్వప్న, శారీరక ఆసక్తి, రాగము, సమస్త ఇంద్రియములకు నాయకుడిగా ఉండును.

214. చిత్తమును జయించాలంటే సూక్ష్మ బుద్ధి అవసరము. ఆత్మ దృష్టి, నివృత్తి సాధన ద్వారా చిత్తమాలిన్యమును నశింపజేయాలి.

215. అంతఃకరణ వృత్తులను అవగాహన చేసుకుంటూ దానిని నిరోధించవలెను. చిరకాలము ఆత్మ యందె మనస్సును లగ్నం చేయాలి. అందుకు నిరంతర అభ్యాసము చేయాలి.

216. నాశికాగ్రములో చిత్తాన్ని ఏకాగ్రము చేస్తే దివ్య పరిమళాలు వ్యక్తమవుతాయి. బ్రహ్మనాదాలు వినిపిస్తాయి, పదార్థములు లేకనే రుచులు, వాసనలు తెలుస్తుంటాయి. అష్టాంగ మార్గాలను అభ్యాసం చేసిన చిత్త మాలిన్యాలు తొలగుతాయి. ప్రాణాయామం అందుకు బాగా తోడ్పడుతుంది. దివ్యానుభవాలు, దివ్యానందము కలుగుతుంది.

217. బుద్ధిచే చిత్తమును విచారణ చేసి నిరోధించవలెను. చిత్తమును చిత్తము చేతనే నిరోధించవలెను. చిత్త వృత్తులను నిరోధించినప్పుడే మనస్సు నశించును. లేనిచో సంసార బంధములు ఏర్పడును.

218. ఈ జగత్తు అభావమని భావించి చిత్తము నశింపజేయు యోగ సాధనయె చిత్త క్షయము. ఆలోచన, విచారణ, జిజ్ఞాస అను మంత్రములతో, ఔషధములతో చిత్తమును చంపివేయవలెను. నిర్మల చిత్తమే పరమాత్మ. మనస్సు ఏర్పడటానికి మూలము చిత్తము.

219. సాధనా మార్గములు: శాస్త్ర పఠనము, పురుష ప్రయత్నము, శ్రవణము, నిరంతర సాధన, విచారణ, గురుశుశ్రూష, సజ్జన సాంగత్యము ఆత్మావలోకన, మనోనిగ్రహము, వైరాగ్యము, దృఢ నిశ్చయము అవసరము.

220. చిత్తము నశించిన వారి లక్షణములు: జ్ఞానాగ్నిచే పాపము క్షయించును. మైత్రి, కరుణ, సంతోష లక్షణములు, కోపము క్షీణించుట, వాసనాగ్రంథులు క్రమముగా విచ్ఛిన్నమగుట, మోహము తొలగుట, దుఃఖము తగ్గిపోవుట, లోభము పారిపోవుట, ఇంద్రియములు విషయ రహిత మగుట, కామము శిధిలమగుట, సమత్వ బుద్ధి, భోగాసక్తి నశించుట జరుగును.
🌹 🌹 🌹 🌹 🌹

08.Apr.2019

---------------------------------------- x ----------------------------------------



🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 32 🌹 
32 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 అహంకారము 1 🍃 

221. చిత్తము వలె అహంకారము కూడా అంతఃకరణ చతుష్టయములో ఒకటి. అహంకారము ఢాంభికము, మదము, గర్వముల ద్వారా వ్యక్తమవుతుంది. ఇవి శరీరానికి సంబంధించినవి. ఇది ఒక మాయాతత్వము. అరిషడ్వర్గాలు, దర్పం, డంబం మొదలగునవి అహంకార లక్షణములు.

222. అహంకార రూపములు: ధన మదము, విద్యా మదము, భోగ మదము, శీలము, రూపము, బలము, జ్ఞానము, కీర్తి మొదలగునవి కూడా అహంకార రూపములే. దేహ స్మృతి ఉన్నంత కాలము అహంకార స్మృతి ఉంటుంది. నేను నాది నావారు అనేది, నాకొరకు అనేవి అహంకార వ్యక్తీకరణములే.

223. బిరుదులు, డాంబికములు, పొగడ్తలు, అభినందనలపై ఆసక్తి కలవారు అహంకారము ఉన్నవారే. ఇట్టి డాంబిక, నామరూపాల ఆసక్తి కల్గి ఉండుట సాధనకు అడ్డంకులే. యోగి అయిన వాడు బాహ్యాలకు భ్రమపడరాదు.

224. మనస్సు యొక్క అంధకారమే అహంకారము. అహంకారము యొక్క బీజము అజ్ఞానమే. అవిద్యకు కారణము అహంకారము. అవిద్య తొలగించిన అహం అంతరించి పోతుంది. అహంకారము ఆత్మానుభవమునకు అడ్డుగా ఉన్నది. ''నేను'' పోతే ఉన్నది ఆత్మే.

225. అహంకారమునకు ఉనికి లేదు, స్పర్శకు అందనిది. అది పదార్థము కాదు. దాని స్వరూప లక్షణాలు తీవ్రముగా ఆలోచించి అన్వేషించవల్సి ఉంటుంది. ఇది అసుర రాజులను, సిద్ధులను, యోగులను, కూడా అధోగతిపాలు చేసినది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు అహంకారము ఉండదు. స్వప్న జాగ్రత్తులలోనే అహంకారము ఉంటుంది. మరుపు, మరణము, మూర్ఛ, సుషుప్తి, సమాధులలో ''నేను'' తాత్కాలికముగా ఉండదు. ''నేను'' శాశ్వతముగా పోవాలి. తిరిగి రాకూడదు.

226. నేను, నాది, నా శరీరము, నా ఇల్లు, నా చెవులు, ప్రాణము, మనస్సు, బుద్ధి అని వేరువేరుగా భావించుచున్నారు. ఇవన్నీ ఆత్మకు వేరుగా ఉన్నవి.

227. నిజమైన భోగి ఫలాపేక్షరహితముగా సర్వం భగవంతునికి సమర్పించినప్పుడు సత్‌ఫలితములన్నీ తనవే. యోగ లక్షణం ''నేను'' అనేది పూర్తిగా తొలగిపోవాలి. సర్వం ''బ్రహ్మ'' అను భావం కలిగి ఉండాలి.

228. శరీరము ''నేనే'' అను భావము వలన కర్మలతో బంధం ఏర్పడి పునర్జన్మలందు ఆసక్తి కల్గి ఉండును. అహంకార రూపమే జీవుడు. శరీరాభిమానము ఒక విష రోగము. అహంకారం మాటల ద్వారా, పనుల ద్వారా, సంబంధాల ద్వారా వ్యక్తమవుతుంది. అహంకారము వలననె కర్మలు ఏర్పడతాయి. అహంకారము అసుర గుణము. పాప కర్మలకు దారితీయును. యోగ సాధనకు తగినది కాదు. కామ క్రోధాదులె అహంకార చిహ్నములు. కర్తృత్వము అహంకారమే. భోక్తృత్వము అహంకారమే.
🌹 🌹 🌹 🌹 🌹

09.Apr.2019


---------------------------------------- x ----------------------------------------


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 33 🌹 
33 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ


🍃 అహంకారము 2 🍃 

229. నరకాసురుడు, భస్మాసురుడు, దుర్యోధనుడు, కార్తవీర్యార్జునుడు, శిశుపాలుడు, పరశురాముడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, మహిషాసురుడు ఇలా అనేక మంది అహంకారమువలననె అణచివేయబడిరి, నశించిరి.

230. అహంకార లక్షణాలు:ధన మదము, విద్యా మదము, జాతి, భోగ, శీల, రూప, బల, జ్ఞాన, కీర్తి, రాజ మదములు, ఇవన్నీ అహంకార లక్షణములె.

231. అహంకారము మూడు రకములు:
1.ఉత్తమ అహంకారము: ఇందు వ్యక్తి తానే పరమాత్మనని తనకంటే అన్యమెదీ లేదని భావించును.
2. అతిసూక్ష్మమైన వాడను తాను అని తాను అవయవ రహితుడనని భావించుట శుభ ప్రధ అహంకారము.
3. మూడవదైన లౌకిక అహంకారములో దేహమె నేనని తలచును. ఇది బంధానికి సంసార వృక్షానికి మూలమైనది. దీనిని విసర్జించవలెను. ఇది దుఃఖ హేతువు.

232. అహంకారము వలన బాధలు పెరుగును. అశాంతి, దుఃఖము, ఒంటరి తనము, వినాశనము, అనర్ధములు, పునర్జన్మలు, మాయ, అంధకారము, అనేక విపత్తులు, భయము, స్వార్థము, విషయాసక్తి, దుష్కర్మలు, నిర్దయ, శత్రుత్వము, వ్యామోహాలు పెంపొందును.

233. అహంకారమును జయించాలంటే అహంకారాన్నె ఆయుధంగా వాడాలి. ముల్లును ముల్లుతోనూ, వజ్రాన్ని వజ్రంతోనే ఛేదించినట్లు, అహంకారమును అహంకారముతోనే జయించాలి. మోక్షమునకు అహంకారము ప్రతిబంధకము. ఆత్మ స్వరూపమును స్మరించుట, విషయముల యెడల రాగ ద్వేషముల యెడల విముఖత, ఆధ్యాత్మిక గ్రంధ పఠనము, శ్రవణము, విచారణ, గురుబోధ, సాధు సంగమము వలన అహంకారము నశించును. సత్య, ఆత్మ జ్ఞానము వలన అహంకారము నశించును. అహంకారి యొక్క మాటలు, ప్రార్థనలు, క్రియలు భగవంతునికి చేరవు. ఆత్మార్పణయె అహంకార క్షయము.

234. ఫలితాన్ని ఆశించకుండా నిరంతర యోగ సాధన చేయుట వలన అహంకారము నశిస్తుంది. స్వార్థ రహిత, ఫలాపేక్ష రహిత, వాంచా రహిత కార్యములు నిర్వహించుట వలన అహంకారము తొలగి అపార శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయి.
🌹 🌹 🌹 🌹 🌹

---------------------------------------- x ----------------------------------------

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 34 🌹 
34 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 వసనలు 1 🍃 

235. వాసన అనునది ఒక భయంకరమైన, అంధకారమైన వికారములతో కూడి; మానవునకు సుఖదుఃఖములు, రాగద్వేషములు, పునర్జన్మలకు కారణమవుతాయి.

236. వాసనలు మాయాజాలము పిశాచములవలె జన్మ జన్మలుగా వెంబడించి మనిషిని మింగి వేయచున్నవి. ప్రతి సాధకుడు తీవ్రముగా విచారణ అభ్యాసము ద్వారా వాటి స్వభావములను తెలుసుకొని ఎవరికి వారు తమ జన్మలను, సంస్కారములను ఉద్ధరించుకొనవలెను. ఇదే సృష్టి రహస్యము, జన్మ రహస్యము, మాయాతత్వము.

237. వ్యక్తి ఎంత పండితుడైనను, గొప్ప జాతి వారైనను, వాసనల వలననె బంధింపబడి పునఃజన్మలకు ఈడ్వబడుచున్నాడు. జననమరణ హేతువైన సంస్కారముల నుండి విడుదలయినవాడే ధీరుడనబడును.

238. పంచేంద్రియములు, మనస్సు ద్వారా విషయ భోగములపై వ్యామోహము కల్గిన మనిషికి దుఃఖము కలుగుచున్నది.

239. వాసనలకు పుట్టుక, ఆది లేదు. అనాదిగా ఇది మానవుని వెంబడిస్తూ ఉన్నాయి. ఇవి వాటంతట అవె నశించవు. అది నశించాలంటే యోగ సాధన, యోగ విజ్ఞానము, సత్‌గ్రంధ పఠనము, దృఢ చిత్తముతో వాటి రహస్యమును తెలుసుకొని అంతము చేయాలి.

240. ఈ భౌతిక శరీరము వాసనలచే నిండియున్నది. మానవ దేహముచే, ఇంద్రియములచే, సూక్ష్మ శరీరములు చేయు కర్మల ఫలితములే వాసనలు. పూర్వవాసనలు ప్రారబ్ధాను భవమునిచ్చునప్పుడు సంస్కారములని పిలువబడును. జన్మ జన్మలుగా వెంబడించు కోరికలు, అలవాట్లు, అభ్యాసములతో కూడిన సంస్కారములు ఒకదానితో ఒకటి పెనవేసుకొనిపోయి బలపడి వాసనా రూపములుగా ఉంటున్నవి.

241. వాసనలు మూడు రకములు: 1) కర్మ వాసనలు 2) స్మృతి మాత్ర వాసనలు 3) కర్మలను అనుభవించుట వలన కలుగునవి (ఆగామి).

242. అనేక జన్మలందు అభ్యాసము చేతను, సంసార బంధముల చేతను, భోగముల చేతను, కోరికలు మొదలగు లౌకిక కార్యములే వాసనలగుచున్నవి.

243. విషయ వాసనలనే విషము, అవిద్యా, అజ్ఞానము వలన ప్రోగై దృఢపడి వాటితో నిండిన ఈ శరీరమే శాశ్వతమని భావన కలుగుటచే, అజ్ఞానములో కర్మలకు, బద్ధులగుచున్నారు.

244. వాసనలు అనేక రకములు.
1.లోకవాసన: అనగా లోకముచే గుర్తింపబడవలెనని కోరిక.
2.శాస్త్రవాసన: తాను గొప్ప శాస్త్రవేత్తననే భావన.
3. దేహవాసన: దేహమునందు ప్రీతి.
4.శుద్ధవాసన: సాధన ద్వారా తనలోని దుర్గుణములను వదలివేయుట. 
5.అశుద్ధవాసన: కామ క్రోధాదుల ద్వారా, వస్తు భోగముల ద్వారా ఏర్పడునది.
6. శుభవాసన: సాధన ద్వారా శుద్ధుడై శాశ్వతమైన మోక్షమునకు అర్హుడగుట.
7. సంచితవాసన: గత జన్మల వాసనలే సంచిత వాసనలు.
8. ప్రారబ్ధవాసన: తన యొక్క తన పూర్వికుల ద్వారా ఏర్పడిన వాసన ఈ జన్మలో వెంటవచ్చును.
9. ఆగామివాసన: కొత్తగా చేసినది రాబోవు జన్మలకు ప్రోగుపడినది.
10. ఇహలోక వాసనలు: ఈ లోకములోని ప్రసిద్ధ దృశ్యముల భావనలు.
11. పరలోక వాసనలు: సత్కర్మల ద్వారా పుణ్యలోక(స్వర్గ), దుష్కర్మల ద్వారా పాపలోక (నరక) అనుభవముల వాసనలు.

🌹 🌹 🌹 🌹 🌹


---------------------------------------- x ----------------------------------------


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 35 🌹 
35 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 వసనలు 2 🍃 

245. (మనిషి) జీవుడు జనన మరణములందు శరీరములు మారి పోయినప్పటికి, తన యొక్క వాసనలు మాత్రము అలానే ఉంటాయి. దానిని కారణ శరీరము అంటారు. వాటిని ఈ జన్మలోనే సత్కర్మల ద్వారా క్షయింప చేసుకోవాలి.

246. వాసనలు సత్కర్మల ద్వారా పూర్తిగా క్షయించినప్పుడు అతనికి పునఃజన్మ ఉండదు.

247. మానవులకు భార్య, పుత్ర, ధన, ధాన్యాదులందు, విషయములందు, ప్రాపంచిక వస్తువులందు ఆశ ఉన్నచో అవే మరు జన్మకు బీజములుగా ఉండి జనన మరణములకు కారణమగుచున్నవి.

248. మాయా ప్రభావము వలన జీవుడు అజ్ఞానముచే మాయను తెలుసుకోలేక మరణ కాలములో కూడా ఆ వాసనలు మరువకుండుటచే అవి అతని పునర్జన్మలకు కారణమగుచున్నవి.

249. ఎవరు వాసనలు అను త్రాళ్ళచే బంధింపబడి ఉన్నారో, వారందరు ఆశాపాశమున తగుల్కొని వాటికి వశులై ఉన్నారో అట్టి వారు తాళ్ళచే బంధింపబడిన పశువులవలె లోకములోనికి ఈడ్వబడతారు. వాసనారాహిత్యమే అమనస్కము.

250. వాసనలు లేని సాధకుని లక్షణములు: ఆశరాహిత్యము, నిర్భయము, సమత్వము, జ్ఞానము, నిష్కామత్వము, నైష్కర్మ్యము, సౌమ్యత, నిర్వికల్పము, ధీరత్వము, మైత్రి, సంతోషము, మృదుత్వము, మృదుభాషణము మొదలగున్నవి.

251. వాసనల ఫలితము: మహాదుఃఖము, రాగద్వేషములు, సంసార బంధనములు, దృశ్యపదార్థముల సంగమము, మోహము మొదలగునవి.

252. వాసనా రాహిత్య ఫలితములు: వాసనా రాహిత్యము శ్రేష్ఠమైన యోగ లక్షణము. శాంత స్థితి. మోక్షపదమును పొందును. మనస్సు సంకల్ప రహితమగును. అమనస్క స్థితిలో మనస్సు ఆత్మయందు లయమగును. అతడు కర్మలు చేసినను, చేయకున్నను సచ్చిదానంద స్థితిలో ఉండును. ముక్తుడగును.

253. వాసనా క్షయమునకు యోగ సాధన: ఎట్టి వారికైనను వాసనలు జయించుట చాలా కష్టము. అయినను వాసననలు జయించిన యోగులు కలరు. అందుకు మార్గము చిరకాలము యోగసాధన. లేనిచో సంసార వాసనలు, పూర్వ వాసనలు నశించవు. మిగిలిన సంస్కారములు మరుజన్మకు కారణమగును. వాసనలు ఆత్మతో ఏకము చేసిన, మనో నాశము, వాసన క్షయము కల్గి ఫలితములు లభించును. వాసనా బీజము నశించునంతవరకు అభ్యాసం చేయవలెను. బియ్యపు గింజపై పొట్టు, రాగి పాత్రపై చిలుమును ప్రయత్నపూర్వకముగా తొలగించునట్లు, హృదయ మందలి అజ్ఞానవాసనను తొలగించవలెను. అందుకు ప్రాప్తించిన, ప్రాప్తించని భోగములను త్యజించవలెను. చీడ పురుగులవలె నున్న వాసనలను వృద్ధికానివ్వక, నిరంతర అభ్యాసంతో వాసనలను నశింపచేయవలెను. వేరు మార్గము లేదు.

నిజానికి వాసనా క్షయమనగా ద్వైత భావన నశించుట, అద్వైత భావన నిలుచుట, సంసారము స్వప్న తుల్యమగుట. ఇట్టి లయ యోగమే ప్రధానము.
🌹 🌹 🌹 🌹 🌹

12.Apr.2019


---------------------------------------- x ----------------------------------------



🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 36 🌹
36 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 శరీరావస్థలు 1 🍃

254. యోగులు సాధనలో చేరవల్సిన చివరి స్థితి ''తురీయ'' స్థితి. అది సాధించుటకు ముందు క్రమముగా 1) జాగ్రదావస్థ 2) స్వప్నావస్థ 3) సుషుప్తావస్థ నాల్గవది తురీయావస్థ. తురీయావస్థకు చేరిన తర్వాత అతని స్థితి 'సమాధి' స్థితి. ఇది అపుడు సహజముగా ఏర్పడి యుండును.

255. జాగ్రదావస్థలో; దర్శనము, స్పర్శ, కర్తృత్వముతో సకల వ్యవహారములు చేయుచుండును. ఇందులో నేత్రములు ప్రధానమైనవి. ఈ స్థితిలో మనస్సు అనేక విషయములందు ఆసక్తి, అభిమానము, ప్రీతి, కలిగి విహరించును. ఇంద్రియముల ద్వారా బాహ్యసంస్కారములను అనుభవించుట జాగ్రత్‌ స్థితి. ఈ స్థితిలో, అంతిమ సమాధి స్థితికి కావల్సిన సమస్త విషయములు గ్రహించి ఎల్లప్పుడు ఎరుకలో వుండును. పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయముల ద్వారా ఎరిగుచున్న ఎరుకయె జాగ్రత్‌స్థితి.

256. స్వప్నావస్థ: ఈ అవస్థలో సాధకుడు మనోరూపుడు, భావరూపుడై ఉండును. అతనిని ''తైజసుడు'' అని అందురు. ఈ స్థితిలో జాగ్రత్‌ వస్తు సముదాయమంతా మనోభావరూపములో దర్శించును. తెలిసీ తెలియని స్థితి, జ్ఞాపకము ఉండి లేని స్థితి ఉండును. శ్వాస ప్రాణవాయువుతో కలిసినప్పుడు స్వప్నజాగ్రత్‌ స్థితి ఏర్పడును.

257. సుషుప్తావస్థ: చిత్తము దృశ్యరహితమైనపుడు, క్షీణ చిత్తము కలవారికి జాగ్రత్తునందే సుషిప్తి అగును. వాస్తవముగా విషయములు జ్ఞాపకము లేకుండా మరపు స్థితిలో వుండును. జడ స్థితిలో ఉండును. సుషుప్తిలో ఇది ఏమీ తెలియని స్థితి. జగత్‌ వస్తు వృత్తుల యొక్క నివృత్తి, తురీయదృశ్యమే జాగ్రత్తలో సుషుప్తి స్థితి. సుషుప్తిలో జాగ్రత్‌ స్థితిని పొందినవాడు జీవన్‌ముక్తుడు. సాధకుడు జాగ్రత్‌లో కూడా సుషుప్తిలో ఉండును. స్వప్నములేని నిద్రావస్థ సుషిప్తి ఈ స్థితిలో సర్వవృత్తులు అణగి ఉండును.

258. తురీయావస్థ: అవస్థలన్నింటిలో తురీయావస్థ ఉన్నతమైనది. సమాధి స్థితి పొందిన సాధకుడు ఆనందమయ జ్యోతి స్వరూపుడగుచున్నాడు. అదియె తురీయము. అభ్యాస యోగము స్థిరపడినచో ఏర్పడిన నిస్సంకల్ప స్థితియె తురీయము. మేల్కొని ఉన్నను, సుషిప్తిలో ఉన్నను తురీయ స్థితిని అనుభవించవలెను. ఆ స్థితిని పొందుటకు అహంకారం విడువ వలెను. సమత్వము పొంది దృఢ చిత్తము కల్గి ఉండవలెను. తురీయ స్థితి నిలకడ పొందినపుడు ఒకప్పుడు జాగ్రత్తు స్వప్నం వలె కనబడును. అందులో భిన్నత్వములోనూ అద్వైత భావనలు నిలకడ పొందవలెను. జాగ్రత్తు సుషుప్తివలె ఉన్నవాడు విదేహ ముక్తుడు.

259. తురీయ స్థితి సదా స్వీయ జ్ఞానము చింతించుట వలన ఏర్పడును. బ్రహ్మనిష్ఠయందు చలించకుండుట, స్వప్నంలోనే స్వప్న విషయము స్వీయ జ్ఞాపకము ఉండుట, గాఢ నిద్రలో నిద్రించుటను తెలియుటయే గాక తురీయ స్థితిలో ఆత్మ జ్ఞానము కలిగి ఉండవలెను. అదియె తురీయ స్థితి. ఈ స్థితిలో ద్వంద్వ రహితుడై సదా బ్రహ్మమునే ధ్యానించుచూ తరువాత విదేహ ముక్తి పొంది పరమాత్మలో లీనమగును.
🌹 🌹 🌹 🌹 🌹


13.Apr.2019

---------------------------------------- x ----------------------------------------


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 37 🌹
37 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 శరీరావస్థలు 2 🍃

260. తురీయ స్థితి పొందాలంటే నిరంతర శాస్త్ర పఠనము సజ్జన సాంగత్యము గురుశుశ్రూష, నిరంతర అభ్యాసము అవసరము.

261. తురీయ స్థితిలో సంకల్పములు ఉద్భవించవు. జఢత్వముండదు. వికల్పముండదు. మిగిలిన జాగ్రత్‌, స్వప్న, సుషుప్తులు, చిత్తము యొక్క రూపములు. అసత్యములు. తురీయము వాస్తవ రూపము. ఈ మూడవస్థలకు సాక్షిమాత్రుడే తురీయుడు.

262. నాలుగు అవస్థలు ప్రతి అవస్థలోనూ ఉండును. అలానే తురీయములోనూ నాలుగు అవస్థలు ఉండును. అని మొత్తము షోడశావస్థలు (16).

263. మనస్సు మృతి చెందిన స్థితియె సమాధి స్థితి. ఈ స్థితియె యోగి యొక్క పరమావధి. సమాధి స్థితి నిద్రావస్థ కాదు, మగత కాదు, స్వప్నము కాదు, అజ్ఞానము కాదు. పూర్ణ ప్రజ్ఞయె సమాధి. ఇది ఊరక కూర్చుండుటయె. ఆత్మ తత్త్వ బోధయె సమాధి.

264. సమాధి స్థితికి చేరడానికి చేయు నిరంతర సాధనయె యోగము. యోగమనగా సమాధి. సమాధి అనగా సమత్వ స్థితి. బ్రహ్మ కపాలము, భ్రూమధ్యము నందు, హృదయ కవాటము నందు బాహ్య ప్రపంచమును మరచి అంతరంగమున సంచరించుటను సమాధి అందురు. గాలి లేని చోట ఉన్న దీపమువలె నున్న నిశ్చలస్థితియె సమాధి స్థితి.

265. సమాధికి సంయమమని పేరు. భోగేచ్ఛ లేకపోవుట, ఔదార్యము, సౌందర్యము, వైరాగ్యములలో కూడా పరమానంద స్థితిలో నుండుటయె సమాధి స్థితి.

266. ఎవరు నిత్యము ఆత్మ విచార తత్పరులై ఉండునో, బాహ్య దృష్టి శూన్యుడై, అంతర్ముఖుడై ఉండునో , వారికి అదే సమాధి స్థితి.

267. యోగ సిద్ధులు సమాధి స్థితికి ప్రతిబంధకాలు వాటిని కోరరాదు. అరిషడ్వర్గాలు అంతరించి పోవాలి. ఆత్మ, మనస్సు కలిసిపోగా, మనోలయమగును. ఆత్మ అద్వయమై యుండును. .

268. సమాధి అనగా నిష్ఠ. ఈ స్థితిలో ధ్యానము, మంత్రము, జపము, పూజలు అనేవి ఆగి పోవును. దీనికే ఆత్మ నిష్ఠ, జ్ఞాన నిష్ఠ, యోగ నిష్ఠ, బ్రహ్మ నిష్ఠ అని పేర్లు. చిత్త స్వాధీనము, మనోక్షయమే సమాధి.

269. సమాధి స్థితిలో అనేక రకములు: 1) సవికల్ప సమాధి: ఇది ఎరుతో కూడి ఉండును. 2) నిర్వికల్ప సమాధి స్థితి: సాధకుడు శాంత స్థితిలో ఉండును. సత్వ, రజో, తమో గుణములు నశించి ఉండును. 3) నిర్బీజ సమాధి స్థితి: ఈ స్థితిలో కర్మ బీజాలు నశిస్తాయి. సంస్కారములు నశిస్తాయి. మిగిలిన అనేక సమాధి స్థితులు సవితర్న, శబ్దానువిద్ధ, దృశ్యానువిద్ధ మొదలగునవన్నీ సవికల్పమే.

270. సమాధి వలన ప్రయోజనములు:- 1) సంస్కారములు నశించును. 2) అతీంద్రియ జ్ఞాన మేర్పడును. 3) జ్ఞాన నేత్రము తెరుచుకొనును. వివిధ లోకాల దర్శనమవుతుంది. 4) కుండలిని యొక్క ఊర్ధ్వ అధో ప్రయాణాలను గమనించవచ్చు. 5) వ్యక్తి జీవన్ముక్తుడగును. 6) ఇదే బ్రహ్మానంద స్థితి. 7) మోహము నశించును. 8) దేహమందలి సూక్ష్మ శరీరములు తెలియబడును. 9) సోమరితనము, భోగ లాలసత్వము, తమో గుణము తొలగును. ప్రజ్ఞ కేవలమగును.
🌹 🌹 🌹 🌹 🌹


---------------------------------------- x ----------------------------------------


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 38 🌹 
38 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 యగ మాయ - 1 🍃 

271. యోగాభ్యాసకుని ప్రథమ కర్తవ్యము ప్రకృతి స్వరూపమైన మాయలో తాను ఎలా చిక్కుకున్నది, దాని లక్షణములు, స్వభావము, దాని నుండి ఎలా బయటపడాలి అను విషయమును తెలుసుకొనుట. 

272. గాఢాంధ కారమైన మాయా స్వరూపమును తెలుసుకొని, అది ఎలా మన యొక్క జ్ఞానమును, ప్రజ్ఞ, వివేకము, ఆలోచనను, మనస్సును, చిత్తమును కప్పి వేయుచున్నదో గ్రహించవలెను. 

273. మాయను జయించుట సులభము కాదు. మునిపుంగవుడైన నారదుడు కూడా శ్రీవిష్ణువు యొక్క మాయలో ఎలా క్షణములో సంసారము, భార్య, పిల్లలు, సుఖ సంతోషాలకులోనై దుఃఖమును అనుభవించాడో మనకు తెలుసు. 

274. మానవ సృష్టి ఆరంభమునందు ఈ మాయా తత్త్వమును గూర్చి యోగులు చర్చిస్తూ దాని నుండి బయటపడు మార్గమును, సాధనా విధానమును మనకు అందించి ఉన్నారు. సాధారణ మానవుడు దీనిని తొలగించుకొనుట కష్టము. 

275. మాయ అనగా మోహము, భ్రాంతి, భ్రమ, కల అని సాధారణముగా భావిస్తుంటాము. కానీ మాయయె ఎరు. మూల ప్రకృతియె మాయ. ఇది సత్యము కాదు. అసత్యము కాదు. స్వరూప జ్ఞానము మరచుటయె మాయ. సత్వ రజ స్థమోగుణములు మాయ నుండియె ఏర్పడుచున్నవి. లేనిది ఉన్నట్లు భ్రమ పడుటయె మాయ. సమస్యలు, వాసనలు, చంచలత్వము, విషయ సంస్కారములు మున్నగునవన్నియూ ఏకమైనదియె మాయ యగును. ఆశ, ఆసక్తి, ప్రీతి, బంధము, ఆకర్షణ, వ్యామోహములుగా మాయ వ్యక్తమగును.

276. ఈ పదునాలుగు లోకములు, దేవత్వము, మానవత్వము, సంకల్ప, రూప నామములు, ప్రకృతి పురుషులు సుఖ దుఃఖములు, అనుభవములన్నియూ మాయలోని భావములే. 

277. స్వప్నములో ఏనుగులు, గుర్రములు, స్త్రీలు, పదవులు, సంభాషణలు మొదలగునవి స్వప్నము పూర్తి అయిన తర్వాత జాగ్రదావస్థలో మాయమగును. అలానే ఇప్పుడు ఎరుకలో ఉన్న ఈ శరీరము, ఇల్లు, భార్యా, పుత్రులు, ప్రపంచము ప్రతి క్షణము, రోజురోజుకు, జన్మజన్మకు కొంతకాలమునకు ఎలా లేకుండా పోవునో ఇవన్నియూ మాయలో తోచినవే. 

278. సృష్టి రహస్యములు తెలిసినవాడే సత్య జ్ఞాని. మోక్ష పదవులు, లోక భ్రాంతులు, దేహ భ్రాంతులు కేవలము స్వప్నతుల్యములు, మాయలోని భావములు. ఏ క్షణమున మనిషికి జ్ఞానోదయము కలుగునో ఆ క్షణమునే మాయ అంతమై పోవును. అవన్నియూ లేనివే అగును. కాని జీవుడు మాయకు అధీనుడు. ఈశ్వరుడు మాయను జయించినవాడు. సత్వరజోతమో గుణములను పొరలు తొలగినప్పుడే జీవుడు బ్రహ్మమగుచున్నాడు. 

279. భక్తి, వైరాగ్య సాధనలతో, ఆత్మను శరణుజొచ్చిన మాయను దాటవచ్చు. భగవదాశ్రయము, శరణాగతి, ఆత్మ చింతన అభ్యాసం చేసినప్పుడే మాయను దాటగలము. 

280. శరీరములోని వివిధ భాగములు, నాడులు, షడ్చక్రములు, కుండలిని, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, త్రిగుణములు ఇవన్నియూ పరస్పర ఆధారములై తమ తమ ధర్మములను నిర్వర్తించుచున్నవి. అలానే ఆత్మ, అంతరాత్మ, జీవాత్మ, పరమాత్మలు కూడా మాయా శబలితమై వర్తించుచున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹


---------------------------------------- x ----------------------------------------


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) -39 🌹
39 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 యగ మాయ - 2 🍃

280. శరీరములోని వివిధ భాగములు, నాడులు, షడ్చక్రములు, కుండలిని, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, త్రిగుణములు ఇవన్నియూ పరస్పర ఆధారములై తమ తమ ధర్మములను నిర్వర్తించుచున్నవి. అలానే ఆత్మ, అంతరాత్మ, జీవాత్మ, పరమాత్మలు కూడా మాయా శబలితమై వర్తించుచున్నవి.

281. భ్రాంతియె భ్రమ. లేని వస్తువును ఉన్నట్లు తలంచుటయె భ్రమ. తాడుయందు పాము, ఎండమావులలో కనిపించే నీరు, శరీరమె తాను అనుకొనుట ఇవన్నియూ భ్రమలే అగును. ప్రతి ఒక్కరు మాయలో పుట్టి, మాయలో మరణిస్తున్నారు. స్వేచ్ఛా, మోక్షము, ముక్తి అనునవి మాయను జయించినప్పుడు లభిస్తాయి.

282. మాయకువశమైన వాని లక్షణములు: పుణ్య పాపకర్మలు చేయుట, మంచి చెడు కర్మలు, మూఢత్వము, అజ్ఞానము, రాక్షస స్వభావము, సంసారము, దుఃఖము, రాగద్వేషములు, అహంకారములు మొదలగునవి. దీనిని బంధము అందురు.

283. దివ్య దృష్టి లేనిదే మాయమర్మమును తెలుసుకొనుటకు వీలులేదు. భగవంతుని శక్తి విశేషము, యోగమాయ. భగవంతుని గ్రహించకుండా మాయ అవహించి ఉన్నది. ఈ మాయా తెర తొలగాలంటే ఆత్మ దర్శనం అవసరము. యోగ శక్తి ద్వారా భగవంతుడు అనేక అవతారములు దాల్చుచూ జగత్తును ఉద్ధరించుచున్నాడు.

284. ఎఱుక అనగా గుర్తు, సాక్షి స్థితి, జ్ఞప్తి, స్పురణ. జీవుడు ఎఱుక స్వభావుడు. ఎఱుక ఒక కల. పరిపూర్ణత్వములో తోచిన ఎఱుకయె కల. మాయను తెలుసుకోవాలంటే ఎఱిగే ఎఱుక అవసరము. సృష్టికి కారణము ఎఱుక. ఎఱుక లేని దశయె నిర్గుణము. లేని ఎఱుకను తెలుసుకొని చివరకు ఆ లేని ఎఱుకను విడువవలెను.

పంచ జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకొనేది మనస్సు అనే ఎఱుక. ఈ జగత్తుకు మూలము ఎఱుక. సుషుప్తి అవస్థనుండి తనంతట తాను ఎవరు పిలువకయె ఎఱుక వచ్చినది. అచల పరిపూర్ణముచేత ప్రకృతి, పురుషులు పుట్టలేదు. ఈ రెండు మాయయె. ఎఱుకకు మూలము మాయయె. ఎఱుక లేని స్థితియె పరిపూర్ణము. మనకండ్లకు కనబడు ఎఱుకలేని ఎఱుక ఇంద్రజాల భంగిమవలె ఇది కనిపించి చివరకు ఏమియూ లేకుండా పోవును.

285. అఖండ ఎఱుకయె బ్రహ్మము. జీవుడు పిండాండ రూపము. ఈశ్వరుడే బ్రహ్మము.

286. బట్టబయలు, ఉత్త బట్టబయలు ఏమి లేనిది. నిరాకారమె బట్టబయలు. పరబ్రహ్మ స్వరూపమే బట్టబయలు. ఇది సర్వత్రా సర్వవేళలందు నిండియున్నది. దీనికి నాశనంలేదు. దీనిని తెలుసుకొనిన బ్రహ్మమును తెలుసుకొన్నట్లే. ఇట్టి బట్టబయలుగా ఉండు పరబ్రహ్మ యందు ఎఱుకను విడచుటయె సాధకుని లక్ష్యము. అఖండ ఎఱుక పోతే బయలే.

అఖండ ఎఱుకనగా కోటి సూర్యుల కాంతిగా వెలుగుతూ ''ఓం'' అనే ప్రణవము, అందుండి వివిధ నాదములుగా వెలువడుతున్నది. ఇది నీవు కాదు. నీ నిజ స్వరూపము బట్టబయలు. అదియె శాశ్వతము, సత్యము, నిర్మలము, అనాది. ఇది సర్వత్రా నిగూఢముగా వ్యాపించి యున్నది.

287. అచల పరిపూర్ణము అనగా ఆత్మ, మనస్సు స్పందించక స్థిరముగా, నిశ్చలముగా ఉండి తిరిగి ఏకాలమందునూ చలింపకున్నచో దానిని అచలము అంటారు. ఇట్టి స్థితిలో వ్యక్తి వికార రహితుడై రూప నామములు లేక, జననమరణములు లేక స్త్రీ, పురుష నపుంసక భేదములు లేక ఉండుటయె అచల పరిపూర్ణమంటారు. ఇది భావాతీతము. త్రిగుణ రహితము.

288. సృష్టికి పూర్వము ఈ విశ్వమంతయు అసంగుడైన నిర్వికార పరబ్రహ్మ స్థితి యందుండెను. అదియె అఖండ జ్యోతి. ఈ జ్యోతి నుండియె మాయాశక్తి ప్రతిఫలించినది. ఆ మాయా శక్తియె సృష్టి నిర్మాణమునకు మూలము. ఈ మాయా శక్తికి సత్వ గుణము ప్రధానము. అందుండి మొదట ఈశ్వరుడు ఏర్పడి, మాయను తన వశము చేసుకొని దాని యందే నివసించుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹


16.Apr.2019

---------------------------------------- x ----------------------------------------


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 40 🌹
40 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 యగ మాయ - 3 🍃

289. ఈ మాయా శక్తి యందు కోట్లకొలది రేణువులు ఉత్పత్తి, స్థితి, లయములను పొందుచుండెను. చిత్‌ బ్రహ్మము మాయా శక్తిచే ఆవరింపబడి ఉన్నది. చిదణువు నుండె సృష్టి ఏర్పడుచున్నది. వడ్లగింజ పొట్టుచే మూయబడినట్లు జీవుని మాయా ఆవరించియున్నది.

290. తల్లి గర్భమున శిశువుకు పూర్ణ జ్ఞానముండును. ఆ స్థితిలో తాను తన పూర్వజన్మలలో చేసిన పుణ్యపాపకర్మలను తలచుకొనుచూ, పశ్చాత్తాప పడుచూ, ఈ జన్మలోనైనా జ్ఞానముతో సత్కర్మలతో జీవింతునని తలచుకొనుచూ, దుర్గంధ సహితమైన మలమూత్ర నరక కూపమునందు వసించుచుండును. అట్టి స్థితిలో వైష్ణవ మాయ కమ్మి శిశువు అధోముఖముగా తల్లి గర్భమునుండి భౌతిక ప్రపంచమున ప్రవేశించును.

291. మాయతో ఆవరించి ఉన్న ఆత్మను దర్శించాలంటే జీవుడు తన చుట్టూ ఆవరించి ఉన్న మాయను జయించాలి. అపుడే ఆత్మ సాక్షత్కారమై జీవుడు ఆత్మను దర్శించును. జ్ఞాని అగును. జీవాత్మ పరమాత్మ ఒక్కటే.

292. పదార్థములన్నియూ మూల ప్రకృతి నుండి ఉద్భవించి అందే లయమగుచున్నది. సమస్త ప్రాణికోటి ప్రళయకాలమున మాయ యందు అణగిఉండి, తిరిగి సృష్టి కార్యమున జన్మించును. కల్పారంభమున భగవంతుడు జీవులను మరల సృజించుచున్నాడు. కాని పరబ్రహ్మ మాయకు అంటనివాడు.

293. బ్రహ్మకు పగలు ప్రారంభము కాగానే మాయవలన చరాచర ప్రపంచము తెలియుచున్నది. బ్రహ్మకు రాత్రి సమయము కాగానే మాయ లయమై జీవులు అందు అణగి ఉండును. అలానే జీవుడు పగలంతా కోతి వలె సంచరించుచుండును. రాత్రి సమయమున నిద్రించును.

294. దేవతల, మానవుల కాల ప్రమాణము ఈ క్రింది విధముగా ఉండును.
దేవతల కాలము మానవుల కాలము
24 గంటలు 1 సంవత్సరము
1 నెల 30 సంవత్సరాలు
1 సంవత్సరము 360 సంవత్సరములు
1 యుగము 12,000 సంవత్సరములు
1 మహా యుగము 43,20,000 సంవత్సరములు
కలియుగము : 4,32,000 సంవత్సరాలు
ద్వాపరయుగము : 8,64,000 సంవత్సరాలు
త్రేతాయుగము : 12,96,000 సంవత్సరాలు
కృతయుగము : 17,28,000 సంవత్సరాలు
మహా యుగము మొత్తము 43,20,000 సంవత్సరాలు
1000 యుగములు బ్రహ్మకు 1 పగలు
1000 యుగములు బ్రహ్మకు 1 రాత్రి
అనగా 1000 þ 4,32,000 = 43,20,00,000 సంవత్సరాలు బ్రహ్మకు 1 పగలు.
అలానే బ్రహ్మకు రాత్రి పగలు కలిసి 86,40,00,000 సంవత్సరాలు 1 రోజు.
బ్రహ్మ యొక్క పగలు కల్పము
బ్రహ్మ యొక్క రాత్రి ప్రళయము
బ్రహ్మ యొక్క 30 రోజులు- బ్రహ్మకు 1 నెల
బ్రహ్మ యొక్క 12 నెలలు - బ్రహ్మకు 1 సంవత్సరము బ్రహ్మకు 100 సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుర్థాయము కావున బ్రహ్మ జీవితము కూడ పరిమితమైనదే అలానే మిగిలిన లోకములు. కేవలము పరబ్రహ్మ మాత్రమే శాశ్వతము.

295. భ్రాంతి తొలగించుటకు సాధకుని కర్తవ్యములు:- భగవత్‌ ధ్యానము. ధ్యానము వలన జ్ఞానము లభించి భ్రాంతి తొలగును. అపుడు భగవత్‌ ప్రాప్తి లభించును. నిరంతర సాధన, పురుష ప్రయత్నము, శాస్త్ర పఠనము, ఆధ్యాత్మిక విచారణ, దైవ స్మరణ, భక్తి శ్రద్ధల ద్వారా భ్రాంతి తొలగును. స్వస్వరూప జ్ఞానము (ఆత్మ దర్శనం) వలన మాయ తొలగును. మాయను మాయతోనే నశింపజేయవలెను. నిరంతర యోగాగ్నిలో మాయ భస్మం అగును.
🌹 🌹 🌹 🌹 🌹


17.Apr.2019

---------------------------------------- x ----------------------------------------


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 41 🌹
41 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 మక్ష మార్గము - 1 🍃

296. మోక్ష మనునది ఒక ప్రదేశముకాదు. అది ఒక అనుభూతి. సహజ స్థితి. దీనికి ముక్తి, కైవల్యము, సంపూర్ణ స్వాతంత్య్రము, లయము, ఐక్యము, బంధ విముక్తి, అమృతత్వము, బ్రహ్మత్వము అను పర్యాయ పదములు కలవు. ఇదియె బ్రహ్మానంద ప్రాప్తి. ఇంకను నిర్మాణము, అపవర్గము, పరమ పదము అని కూడా అందరు.

297. బంధ రహితము పొందినపుడే మోక్షము. బంధ విముక్తి పొందాలంటే మోక్ష సాధన మార్గాలను అనుసరించాలి. పునఃజన్మ రహితమైనదే మోక్షము. ఇది స్వయం ప్రకాశము. జనన, మరణ, విషచక్రము నుండి విముక్తియె మోక్షము. మోక్ష స్థితిని అనుభూతి పొందినవారు కూడా దానిని వర్ణించలేరు.

298. సచ్చిదానందమనగా సత్‌, చిత్‌, ఆనంద రూపము. ఏకరూపమైనది సత్‌. బాహ్య వస్తువులను ఏది గ్రహించునో అది చిత్‌. ఏ ఉపాధి లేని సుఖము ఏదో అదే ఆనందము.

299. కైవల్యమనగా బ్రహ్మ జ్ఞానము వలన పొందిన ఏకైక సిద్ధి. అఖండ ఆనందమైన మోక్షమే కైవల్యము. ఆత్మ స్వాతంత్య్రమే కైవల్యము. సాధకుని చరమ లక్ష్యము కైవల్యము. దానినే అమృతత్వము అని కూడా అంటారు.

300. మోక్ష గృహము బయట ఎచటోలేదు. అది మనలోనే ఉన్నది. అది ఉన్నదని తెలియకపోవుటయే అజ్ఞానము. అది తెలుసుకొనుటే జ్ఞానము. అదియే ఆత్మ. ఆత్మ స్థితియె మోక్షము కావున నీ హృదయమందే మోక్ష సామ్రాజ్యము కలదు. దేహమే దేవాలయము. జీవుడే దేవుడు. ''అహం బ్రహ్మాస్మి'' అట్టి బ్రహ్మ స్థితిని అనుభూతి పొందుటయే మోక్షము. మోక్షము ఇంద్రియాతీతమైనది. దేహాతీతమైనది. దేవాలయములలో, పుణ్యతీర్ధములలో, నదీతీరములలో మోక్ష గృహము లేదు. ఎక్కడ ఎప్పుడు భ్రాంతి రహితమో - అప్పుడే అక్కడే ముక్తి లేక మోక్షము.

301. మోక్షము మరణించిన తరువాత పొందేది కాదు. జీవించి ఉండగనే పొందే స్థితి. జీవన్ముక్తిని పొందుటే మోక్షము. ఇది పరలోక ప్రాప్తి కాదు. జ్ఞాన వైరాగ్య సంపన్నులకు తన అంతరాత్మ యందే మోక్షము కలుగును. ఆత్మ విచారణే మోక్షమునకు మార్గము. నిర్మల చిత్తమే మోక్షము. మోక్షమునకు అంతఃస్ఫూర్తి, జ్ఞానము అవసరము. హృదయమునందు ధ్యానము చేయుట వలన మోక్ష రూపమైన తన స్వరూపము తెలుసుకొనబడును. శరీరమందుగల మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారములు నశించిన తక్షణమే ఆత్మ దర్శనం అగును. అంతఃజ్యోతి దర్శనమే ఆత్మ దర్శనము.

302. మోక్షము పొందునది జీవాత్మ. ఇది మాయతో కప్పబడి ఉన్నది. జీవాత్మ పరమాత్మ యొక్క అంశయే. జ్ఞానులు మాత్రమే ఈ రహస్యమును తెలుసుకొని మోక్షమును పొందుచున్నారు. అంతర్ముఖియై గమనించిన తేజోవంతమైన దివ్య జ్యోతి దర్శనమై బ్రహ్మానంద స్థితి ఏర్పడును.

303. దివ్య భోగములు అనుభవించు పరలోకమే స్వర్గము. ఇది ఇంద్రుని లోకము. ఇది భోగవస్తు నిలయము. ఇచట శారీరక, మానసిక శక్తులు, ఆయుర్ధాయము భూలోక మానవుల కంటే ఉన్నతముగా ఉండును.

304. స్వర్గలోక ప్రాప్తి కలగాలంటే యోగి యజ్ఞయాగాధి కర్మలు, వేదాధ్యయనము, పుణ్య కార్యములు చేయవలెను. స్వర్గ ప్రాప్తి పొంది అందు తగిన పుణ్య ఫలమును అనుభవించిన తక్షణమే ఆ స్వర్గము నుండి వేరేలోకమునకు నెట్టివేయబడును. భూలోకమున జన్మించి మిగిలిన పాపకర్మలు ఏవైన ఉన్నచో వాటిని తొలగించుకొనవచ్చును. అనగా పుణ్య కార్యముల వలన పుణ్య లోకములు, పాప కార్యముల వలన భూలోకము నందు జన్మించవల్సిందే. ఈ విధముగా జీవుడు భూలోకమునుండి స్వర్గము, అచ్చట నుండి భూలోకము జన్మలు తీసుకుంటూ చివరకు ఆత్మ జ్ఞానము పొందినపుడే జన్మ పరంపరలకు ముక్తి లభించును. మోక్షము పొందాలంటే భూలోకములోనే సాధన చేయవల్సి ఉంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹

---------------------------------------- x ----------------------------------------


🌹  సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 42 🌹
42 వ భాగము
✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 మక్ష మార్గము - 2 🍃

305. పుణ్య కార్యములను కామ్యకర్మలంటారు. సత్రములు, కోనేరులు, దేవాలయములు, చలివేంద్రములు, అన్నదానములు, వస్త్రాదానము మొదలగువాని వలన స్వర్గము లభించునే కానీ మోక్షము లభించదు. కానీ ఆ కార్యములను నిష్కామముగా చేసిన అపుడు ముక్తికి మార్గము లభించును.

306. మోక్షము, మరణించిన తరువాత పరలోకములో పొందునది కాదు. అది అనుభవించేది కాదు. ఈ జన్మయందే, భౌతిక స్థితిలోనే, జీవించి ఉండగానే పొందవల్సిందే. అందుకు భౌతిక శరీరం కావాలి. ఇది వార్ధక్యములో చేయవల్సింది కాదు. బాల్యము, యవ్వనములందే మోక్ష సాధన ప్రారంభించి కొనసాగించవలెను. వృద్ధుడైన తరువాత శరీరము క్షీణించిన తరువాత చేయు సాధన వలన ఫలితము ఉండదు. అందుకే శరీరము ఆరోగ్యముగా శక్తివంతమై ఉన్నప్పుడు చేయవలయును. కావున ఎవరు ఈ జన్మ యందే తమ శరీరమును విడువక ముందే, కామ క్రోధాది అరిషడ్వర్గములను జయించగలరో వారే సాధకులు, యోగులు, మోక్షార్హులు.

307. మోక్షాభిలాష కలవానిని ముముక్షువు అందురు. అందుకు తగిన సాధన చేయాలి.
ముముక్షువు లక్షణము:- ఏ వికారము లేకుండుట. క్రియారహితులు లేక నిష్కామకర్మ చేయువారు, ఆత్మావగాహన కలవారు, గురువు ద్వారా జ్ఞానము పొందుట, సాక్షి స్థితిలో ఉండుట, తలంపులు తలెత్తకుండునట్లు జీవించుట.

308. జీవన్ముక్తుడు కానివాడు మోక్ష గృహము చేరలేడు. ఒక వ్యక్తి జీవించి ఉండగనే ముక్తిని పొందుటయే జీవన్ముక్తి. జీవన్ముక్తి రహస్యములను తెలుసుకొని దాని ప్రకారము సాధన చేయాలి. యోగి నిస్సంగిగా జీవ యాత్ర సాగిస్తాడు. మానవులలో శ్రేష్ఠుడు జీవన్ముక్తుడు. బ్రహ్మసాక్షాత్కారము పొందిన వాడు.

309. జీవన్ముక్తుని లక్షణములు:- విగ్రహారాధన చేయనివాడు, పూజలను వదిలినవాడు, సకల మలిన వాసనలు వదిలినవాడు, అహంకార రహితుడు, బ్రహ్మజ్ఞాని, త్యాగశీలి, పరమాత్మ ధ్యానములో ఉన్నవాడు, ఇష్టాఇష్టములు లేకుండుట, విషయాల సుఖదుఃఖాలు శరీరానికేగాని తనకు కాదని తలచుట, తామరాకుపై నీటి బొట్టువలె జీవించుట, జ్ఞానామృతమును పానం చేయుట.

310. బంధములే మోక్షమునకు ఆటంకములు. మోక్షమనగా విడుదల అని అర్థము. బంధముల నుండి విడుదల కావలెను. అదియె మోక్షము. సర్వ స్వాతంత్రమే విముక్తి.

311. బాహ్య బంధములు, అంతర బంధములు అని బంధములు రెండు రకములు. 1) బాహ్యబంధము: ఇది శరీరమునకు సంబంధించినది. ధనము, భార్య, బిడ్డలు, వస్తువులు, వాహనాలు, వ్యవహారములు, శబ్దములు, ప్రపంచ విషయములు. 2) అంతరబంధములు: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, అహంకారము దంభము, దర్పము ఈర్ష్య, అసూయలు రాగము, ద్వేషము మొదలగునవి. 3) స్వభావ బంధములు: సత్వ రజస్‌ తమో గుణములు.

312. రోదసీలో ఉత్తరాయణ, దక్షిణాయములే మార్గములు. ఉత్తరాయణము మానవ జన్మ రాహిత్యమునకు, దక్షిణాయణము పునఃజన్మలకు మార్గములు. వీటిని అర్చరాది, ధూమ్రాది మార్గములంటారు.

313. ఉత్తరాయణములో యోగులు, పుణ్యాత్ములు, బ్రహ్మవేత్తలు, మానవ జన్మరాహిత్యమునకు ఈ మార్గమును అనుసరించాలి. శుక్లపక్షము, ఉత్తరాయణము, ఉత్తమగతులకు సరైనది. అంతరిక్షమునందు శుక్లపక్షము పగలు కృష్ణపక్షము రాత్రిగా ఉండును. ఉత్తరాయణ కాలము దేవతల అధీనంలో ఉంది.

314. భూలోకమున ఒక రాత్రి ఒక పగలు, అంతరిక్షములో 30 రోజులకు సమానము. ఉత్తరాయణము 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి ఉండును. ఉత్తరాయణములో పుణ్యాత్ములు అంతరిక్షమునుండి దేవతల ద్వారా పుణ్యలోకములైన సూర్య చంద్ర లోకములకు చేర్చబడుదురు. అచట నుండి యోగ్యులైన వారిని భగవంతుని యొక్క పరంధామానికి పారిషదులు వచ్చి తీసుకెళ్ళిన తరువాత అపుడు బ్రహ్యైక్యము సిద్ధించును. కావున యోగి అగ్ని, ఆకాశము, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణముల ద్వారా బ్రహ్మమును చేరును.
🌹 🌹 🌹 🌹 🌹


19.Apr.2019

---------------------------------------- x ----------------------------------------



🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 43 🌹
43 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 మక్ష మార్గము - 3 🍃

315. దక్షిణాయణము, కృష్ణపక్షములో శరీరము వదిలిన వారు సకామకర్మ యోగ సంబంధమైన ప్రకాశమును పొంది తిరిగి జన్మింతురు. ఆత్మ జ్ఞానములేని, ఫలాపేక్ష కలిగిన వాడు తిరిగి జన్మించును. దక్షిణాయణము అధో మార్గము.

316. మోక్ష లోక ప్రవేశము దేవతలకు కూడా అసాధ్యము. సాధన కొద్ది బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి లభించును. చిత్తమును, ఇంద్రియములను నిగ్రహించిన వారికి మాత్రమే మోక్షము సాధ్యము. గురువు కేవలము సాంప్రదాయ బద్ధమైన బోధనయే కానీ సాధన మాత్రము సాధకుడే కొనసాగించవలెను. దీనితో పాటు దైవానుగ్రహము కావాలి. స్వయం కృష్ణి, సాధన, విశ్వాసము, శ్రద్ధ, ఆసక్తి, పురుష ప్రయత్నము ద్వారా ఎవరికి వారె ప్రయత్నించవలెను. కాని చరమ సాధనలో గురు కృప అనెడి సహాయము లభించును.

317. సాధనలో శ్రేష్ఠమైనది:- అజ్ఞానుల కంటే విగ్రహారాధకులు శ్రేష్ఠులు, విగ్రహారాధకుల కంటే నిర్మల బుద్ధితో బ్రహ్మమును ఆరాధించువారు, వారి కంటే అంతరాత్మలో భగవంతుని తెలుసుకొన్నవారు, వారి కంటే సదా పరమాత్మలో మైమరచి ధ్యానించువారు, వారి కంటే తనను తాను మరచి బ్రహ్మానందములో తేలియాడువారు శ్రేష్ఠులు.

318. సృష్టి నిర్మాణ కాలమందు పరబ్రహ్మము నుండి జీవులుగా కోట్లాదికోట్ల జన్మలు పొంది ఏదో ఒక జన్మలో సాధన ద్వారా ముక్తిని పొందిన వారు చివరకు ఏదో ఒక జన్మలో మోక్షమును పొందుదురు. సాధనను బట్టి ముందు వెనుక ఉండును.

319. మోక్షమునకు సాధన సంపత్తి: జ్ఞానము, యోగము, ఇంద్రియ నిగ్రహము, రాగద్వేషములు లేకుండుట, ద్వంద్వాతీతుడై సమత్వ స్థితిలో ఉండాలి. అహంకార రాహిత్యము, చిత్త శుద్ధి, మనోనాశము, వాసనాక్షయము, గృహస్థాశ్రమము, ప్రాపంచిక విషయములు త్యజించుట మొదలగునవి కావలెను.

320. అనేక పేర్లతో నెలకొల్పబడుతున్న ఆధ్యాత్మిక సంస్థలు, ఆశ్రమాలు, కేంద్రాలు, అభ్యాసమునకేగాని మోక్షమునకు ఉపయోగపడవు. చివరికి ప్రతి వ్యక్తి ఎవరికి వారు ఏకాకియై సాధన చేయాలేకాని జన సమూహములతో కూడి చేయునది మోక్ష సాధన కాదు. కుల, మత, జాతి, భేదములు లేని వారై ఉండాలి. అన్ని రకాల బంధముల నుండి విడివడాలి. వేషధారణ, వివిధాలంకారములు సాధనకు అడ్డంకులు.

321. నీటి మీద నడుచుట, గాలిలో తేలుట, ఉంగరాలు, హారాలు సృష్టించుట మొదలగునవి మోక్షమునకు తోడ్పడవు. నిజమైన యోగులు జనబాహుళ్యానికి, ప్రజాకర్షణకు దూరంగా ఉంటారు. వారికి సిద్ధులు లభించినప్పటికి వాటిని వినియోగించరు, ప్రదర్శించరు.

322. మానవునకు స్వయముగా విశిష్ఠ జ్ఞానము కలదు. సృష్టిలోని 84 లక్షల జీవ రాశులలో మానవ జన్మ శ్రేష్ఠమైనది. దానిని ఆత్మాజ్ఞానోపార్జనకు ఉపయోగించి ముక్తిని పొందాలి.

323. మోక్షమునకు ఉపయోగపడనివి: జపతపాలు, పూజలు, ఉపాసనలు, తీర్థయాత్రలు, జంతుబలులు, కీర్తి ప్రతిష్ఠలు, యాగములు మొదలగు భౌతిక సాధనలు వలన ముక్తి లభించదు.

324. కేవలం ఆత్మానుసంధానము, యోగ సాధన వలననె, బ్రహ్మత్వం, అమరత్వం, భగవదనుగ్రహము వలననె ముక్తి లభిస్తుంది అని నిర్ద్వంద్వముగా తెలియుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹


20.Apr.2019

---------------------------------------- x ----------------------------------------


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 44 🌹 
44 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 ఆత్మదర్శనము - 1 🍃 

325. ఆత్మదర్శనం పొందాలంటే: ఆత్మ అనగా నేమి, దాని స్థానము దాని లక్షణము, జీవాత్మ,పరమాత్మ అను విషయములను గుర్చి తెలుసుకోవాలి.

326. జీవాత్మ పరమాత్మను పొందుటయే యోగము. అందుకు అంతర్‌ దృష్టితో అంతర్ముఖమై సాధన చేయాలి. ఆత్మ నిర్మలము, అనాది, శాశ్వతము, నాశరహితము. అంతర్‌ ప్రజ్ఞయే దాని రూపము. ప్రకాశవంతమైన వెలుగు, జ్యోతి దర్శనము. ఆత్మయే బ్రహ్మము.

327. పురుషుడు, క్షేత్రజ్ఞుడు, సర్వసాక్షి, వికార రహితుడు, పంచ జ్ఞానేంద్రియములకు, పంచ భూతములకు, అతీతమైనది, పరమాత్మ అంశయైనది ఆత్మ. స్వానుభవములో ఆత్మకు పరమాత్మకు భేదములేదు. ఆత్మ లక్షణము సచ్చిదానందము.

328. భౌతిక వస్తువైన ఒక మంచు ముక్కను తీసుకున్నచో అది వేడికి కరిగి నీరవుతుంది. ఇంకనూ వేడి చేసిన అది అగ్నిగా మారి ఆవిరై సూక్ష్మమై వ్యాపిస్తుంది. అది వాయువులో కలిసి వాయువుగా ఇంకా విస్తరిస్తుంది. ఆ వాయువు ఆకాశములో కలుస్తుంది. ఆకాశము అనేక రకాలైన మూలకములతో నిండి ఉంటుంది. మొదట మనం తీసుకున్న మంచు ముక్క ఇపుడు మూలకములుగా విడిపోయింది. ఆ మూలకములు అణువులుగా విడిపోతాయి. అణువులు పరమాణువులుగానూ, ఆ పరమాణువులు గౌతమ బుద్ధుని వివరణ ద్వారా కలాపములుగానూ, ఆ కలాపములు మరల విడిపోయి అష్ట కలాపములుగానూ విడిపోయి వాటి యందు అవే తిరుగాడు చుండును. ఆ అష్టకలాపమునే శివమందురు. అందులో 8 కలాప అణువులు తమ చుట్టూ తాము తిరుగాడు చుండును. దీనినే శివతాండవము అంటారు. ఒక అష్టకలాపములో 8 సూక్ష్మాతి సూక్ష్మమైన కలాపాలుంటాయి. అవి నాట్యమాడుతూ ఉంటాయి. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన అష్ట కలాపాలకు మూలము బ్రహ్మము.

329. బ్రహ్మం సర్వకాల సర్వావస్థలయందు ఏకం, నిత్యం, విమలం, అచలమై సర్వే సర్వత్రా విస్తరించి ఉన్నది. అట్టి బ్రహ్మం ఒకానొకప్పుడు సృష్టి చేయాలనే సంకల్పం చేసుకున్నప్పుడు, ఆ సంకల్పం యొక్క వత్తిడికి స్పందనలు బయలుదేరి అవి తమ చుట్టూ తాము తిరుగుతూ అష్టకలాపములుగా రూపొంది, అవి కలాపములుగానూ, కలాపములు పరమాణువులుగానూ, పరమాణువులు అణువులుగానూ, అణువులు మూలకములుగానూ, మూలకములు ఆకాశముగానూ, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి ఏర్పడినది.

330. భూమికి వాసన, నీటికి రుచి, అగ్నికి రూపము, వాయువుకు స్పర్శ, ఆకాశానికి వినికిడి అను పంచ తన్మాత్రలు ఏర్పడినవి. ఇట్లు బ్రహ్మము విశ్వమంత వ్యాపించి తాను అన్నింటి యందు అంతర్లీనమై సాక్షిగా అంటక వున్నది. ఈ విషయమంతా సాధన ద్వారా, యోగము ద్వారా అవగాహన చేసుకొనుటయే జ్ఞానము. అట్టి జ్ఞానమే బ్రహ్మము (ప్రజ్ఞానం బ్రహ్మ).

331. సాక్షిగా సర్వత్ర విస్తరించి ఉన్న ఆత్మ, సాధన ద్వారా యోగిగా వ్యక్తమగుచూ, సాధనలో ముందుకు నడుస్తూ, తానే గురువై సాధన కొనసాగించుటకు తోడ్పడును. 

332. ఆత్మ ప్రకాశము ద్వారానే జగత్తు ప్రకాశింపబడుచూ ప్రకాశించుచున్నది. ఈ జగత్‌ అంతయూ ఆత్మచే పరిపూర్ణమై యున్నది. అహం అను అహంభావంతో తానే జ్ఞానరూపమై విరాజిల్లు చున్నది. 

333. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ బ్రహ్మానికి ప్రతినిధులై సృష్టి స్థితి లయ కారకులై జగత్తును పాలించుచున్నారు. వారిని తెలుసుకొని వారి ద్వారానే బ్రహ్మమును పొందవచ్చు. 

334. మానవులు చేసిన పుణ్య పాప కర్మలు ఆత్మకు అంటవు. ఎట్లనగా, భూమిపై పడిన సూర్య కిరణములకు, భూమిపై గల శుద్ధ అశుద్ధ వాసనలు అంటవు. ఆత్మయె సత్యానంద పరబ్రహ్మము.
🌹 🌹 🌹 🌹 🌹


21.Apr.2019

---------------------------------------- x ----------------------------------------


🌹 సర్వయోగ సమన్వయము -గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 45 🌹 
45 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 ఆత్మదర్శనము - 2 🍃 

335. సమస్త ప్రాణులందును ఆత్మ వున్నది. శరీరము, ఇంద్రియములు, మనస్సు అను వాటితో ఆత్మ కలిసి పోయి ఉన్నది. అయినప్పటికి వాటన్నింటికి సాక్షిగా అతీతముగా ఆత్మ ఉన్నది. మనవరుకు చూస్తే దేహమే దేవాలయము. అందులో ఆత్మయె పరమాత్మ. 

336. హృదయకమలమే ఆత్మ స్థానము. సూత్రమునందు మణులు ఉన్నట్లు, అన్ని శరీరము లందు ఆత్మ స్వయం ప్రకాశమై ఉన్నది. హృదయము నందు దాని మధ్యలో ఒక సూక్ష్మ రంధ్రము కలదు. అందులో సర్వ రూపుడగు పరమాత్మ జీవాత్మల రూపములో నిక్షిప్తమై వున్నది. అది ఒక ప్రకాశవంతమైన జ్వాల. సాధకుడు ఆత్మానుభవముతో, ఆత్మగా అందరిలోనూ తానే ఉన్నట్లు తెలిసినచో, అది సూత్రాత్మ అనుభవము. 

337. జీవునికి గల ఆయుః ప్రమాణము పూర్తి అయిన తరువాత ఆత్మ శరీరమును వదులుచున్నది. పాము కుబుసము విడిచిన పిదప ఆ కుబుసముతో సంబంధము లేనట్లు శరీరమును వదలును. జలమునందు గల ఆత్మ ఆ సమయములో తన చుట్టూ గల జలము కొద్ది కొద్దిగా తగ్గుచూ పూర్తిగా ఇంకిపోయిన తరువాత ఆత్మ శరీరమును వదలుచున్నది. నాలుక ఎండిపోవును. మరణించు సమయమున తులసి తీర్ధము పోయుటకు కారణము అదే. మెరుపు తీగవలె అది అతి సూక్ష్మముగా ఉండును. ఆత్మకు నారాయణుడని పేరు. నారములనగా జలము అని అర్ధము. ఈ విధముగా జలమునందుండువాడు కనుక నారాయణుడని అంటారు. 

338. అంగుష్టము వలె ఆత్మ ఉన్నది. హృదయ గుహ యందు కలదు. మనస్సునకు అనేక తలంపులు కలుగుచుండును. తలంపునకు తలంపునకు మధ్య రేప్పవాల్చునంత క్షణము మాత్రము బయలుగా ఉండును. ఆ స్థలమేదో అదే ఆత్మ క్షేత్రము. దానినే చిదాకాశము అంటారు. 

339. ఆత్మ శరీరమందలి అన్ని ప్రదేశములందును సంచరించుచుండును. కాని అందు ముఖ్యమైనవి 1) హృదయ కమలము 2) భ్రూమధ్యము 3) బ్రహ్మ కపాలము. ఇవి యోగసాధనా కేంద్రములు. అందుకే భక్తులు ఈ ప్రదేశములందు విభూతి, తిలకాలను ఉంచుతుంటారు. 

340. శిశు రూపమును తయారుచేయునది ఆత్మసత్తాయే. శిశువు హృదయ కమలమందు ఏడవ నెలలో జీవి ప్రవేశించును. సృష్టిలోకి ప్రవేశించిన ఇట్టి జీవాత్మ పరమాత్మలో ఐక్యమై నప్పుడు తిరిగి ఆ జీవుడికి జన్మలుండవు. 

341. జీవాత్మ శరీరమును, ఇంద్రియములు తానే అని తలచును. కాని పరమాత్మకు వీటితో సంబంధములేక సాక్షిగా ఉండి గమనించును. ప్రతి జీవి యొక్క బీజము పరమాత్మయే. దేహభావన తొలగిన జీవుడు పరమాత్మను పొందును. 

342. జీవుడను పక్షి కర్మఫలములను అనుభవించుటకు బందీయైఉన్నాడు. రెండవ పక్షి అయిన ఈశ్వరుడు వాటిని అనుభవించక కేవలము సాక్షిభూతుడై ఉన్నాడు. నాడులందు తిరుగాడుచున్న ప్రాణమే జీవుడు. జీవుడు త్రిగుణములు, సకలేంద్రియములు, వికారములు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, అరిష్వర్గములతో కూడి ఉండును. వీటి నుండి విడుదలయైన జీవుడే పరమాత్మ. 

343. సృష్టి యందలి సర్వము బ్రహ్మ స్వరూపములే. జీవుడు ఆ సమస్తములోని వాడగుటచే అట్టి వాడు కూడా బ్రహ్మమే అగును. జీవుడు ఆత్మ స్వరూపుడు. దేహ రక్షణకై నిరంతరము కర్మలు చేయుచుండును. అజ్ఞాని తెలియక, తానువేరు, బ్రహ్మమువేరు అని తలచును. 

344. పరబ్రహ్మ యొక్క సూక్ష్మ రేణువులైన కలాపములే జీవుడుగా రూపొందును. జీవునిలోని ఆత్మ స్వయం ప్రకాశమై శరీరమును నడిపించుచున్నది. తాను సాక్షిగా ఉంటుంది. ఆత్మ దర్శనము పొందిన జీవునికి త్రిమూర్తులు వశమగుదురు.

🌹 🌹 🌹 🌹 🌹


22.Apr.2019

---------------------------------------- x ----------------------------------------


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 46 🌹 
46 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 ఆత్మదర్శనము - 3 🍃 

345. పాలలో నేయి కనబడక ఎలా మరుగున ఉన్నదో అట్లే సకల ప్రాణులందు గల ఆత్మ మాయచే కప్పబడి మరుగై ఉన్నది. త్రిగుణములైన సత్వ రజో తమో గుణములలో ఆవరించబడిన ఆత్మ తెలియబడుటలేదు.

346. పంచకోశములైన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములచే ఆత్మ కప్పబడి ఉన్నది. వాటిని తనకంటే వేరని తెలుసుకొన్న, ఆత్మ దర్శనం అగును.

347. బంగారునాణెములు వేర్వేరు రకములున్నట్లే ఆత్మ వేరువేరు పేర్లతో పిలువబడుచున్నది. అవి ప్రత్యగాత్మ, సచ్చిదానంద, నిత్యుడు, నిర్గుణుడు, నిర్వికారుడు, చిదాకాశము, జీవాత్మ, జ్యోతి, చిదాత్మ, అంతర్యామి, అఖండడు, పరమాత్మ, నిర్గుణుడు, బ్రహ్మము, అంతరాత్మ, నిరంజనుడు, నిర్మలుడు మొదలగు పేర్లతోసందర్భోచితముగా ఆత్మ పిలువబడుచున్నది.

348. ఆత్మను పొందినవారి లక్షణములు: సంకల్ప రహితుడు, శుద్ధుడు, నిర్భయుడు, ద్వంద్వ రహితుడు, మాయాతీతుడు అయివుంటాడు.

349. పూజ అనగా ఆత్మ దేవుని ధ్యానించుటయే. వస్తుసామాగ్రి, శబ్దము, పూజాసామాగ్రిలతో బాహ్యముగా భౌతికముగా చేయునది పూజకాదు అది కూడా అజ్ఞానము, అవిద్య, మనస్సు, చిత్తము, అహంకారములతో ఆత్మను ధ్యానించవలెను. తుదకు అన్నీ విడిచిపెట్టి ఆత్మ ధ్యాస స్థిరముకావలెను.

350. ఆత్మ చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడనగా రహస్యముగా చిత్రించునది. అట్లు గుప్తముగా ఉండి జీవుడు చేయు కర్మలను, పాపపుణ్యములను, తలంపులను, ఇతర వికారములను గమనించుచుండును. సాక్షిగా ఉన్నాడు. జీవుని సకలకర్మలకు, జాగ్రత్‌, స్వప్న, సుషుప్తులకు సాక్షి చిత్రగుప్తుడే.

351. శరీరము సర్వము నాశనముకాగా చివరకు మిగిలినది ఆత్మయే. శరీరమునకు అంటిపెట్టుకొని ఉన్న పంచజ్ఞానేంద్రియములు, కర్మేంద్రియము, అంతఃకరణ చతుష్ఠయము తొలగించిన మిగిలినది ఆత్మయే. అదియే జ్ఞాన దృష్టికి దర్శనం అగును. ఇదియె సాంఖ్యము. స్వస్వరూపమును తెలుసుకొన్నవాడే సాంఖ్యుడు.

352. క్షేత్రమనగా కేవలము పదార్థ సంబంధమైన, పంచభూతాత్మకమైన స్థూల శరీరమే కాదు. అనేక దృశ్యముల మిశ్రమమే క్షేత్రము. కంటికి కనిపించని సూక్ష్మభూతములు కూడా క్షేత్రములే.
🌹 🌹 🌹 🌹 🌹


---------------------------------------- x ----------------------------------------


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 47 🌹 
47 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 ఆత్మదర్శనము - 4 🍃 

353. ఆత్మ జ్ఞానము, అజ్ఞానము తొలగిన ప్రాప్తించును. స్వచ్ఛమైన, ప్రకాశవంతమైన కాంతి, జ్ఞానము ఆత్మనుండియె ప్రకాశించును. ఆత్మ తత్త్వ బోధనచే, ఆత్మను పొందవచ్చును. పొగచేత నిప్పు, దుమ్ముచేత అద్దము, మాయచేత గర్భస్థ శిశువు కప్పబడి ఉన్నట్లు, కామముచేత ఆత్మజ్ఞానము కప్పబడి ఉన్నది. 

354. ఆత్మదర్శన ఫలితములు:- 

1. కర్మలు చేసినను అవి అంటవు.
2. సుఖ,దుఃఖ జనన మరణాది బ్రాంతులు నశించును.
3. భయము, మరణ భయము తొలగిపోవును.
4. వీర్యము, బుద్ధి, తేజస్సు వృద్ధి పొందును.
5. బాహ వ్యాపారమున చంచలముగా కనిపించినప్పటికి అంతరమున మేరు పర్వతమువలె నిశ్చలముగా ఉండును.
6. అహంకారము నశించి, మానసిక వ్యాధులు తొలగును. శరీర ప్రారబ్ధముండును.
7. శాపములు, పాపదృష్టి వీరిపై ప్రభావం చూపలేవు. మానసిక చింతలుండవు.
8. దుఃఖములు, మనోవ్యాధి తొలగును.
9. శాశ్వత సుఖము, పరమశాంతి ప్రాప్తించును.
10. చిత్త భ్రమ తొలగి, చిత్త శాంతి లభించును.

355. ఆత్మదర్శనమునకు సాధనా మార్గములు: 

1. ప్రతి క్షణము, భుజించుచున్నను, నిద్రించుచున్నను, కూర్చున్నను, నడుచుచున్నప్పుడు ఎల్లవేలల ఆత్మవిచారణ చేయుచుండవలెను.
2. జనకుడు, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, భగీరదుడు మొదలైన యోగులు నిరంతరము యోగ సాధన చేసిన వారే.
3. శ్రీ వసిష్టులవారి శ్రీ యోగవాసిష్టము, ఆత్మ జ్ఞానము పొందుటకు తోడ్పడును.
4. అనంత దీక్ష, సాధన, నిష్ఠ, మానసికశక్తి ద్వారా కృషి చేయవలెను.
5. అంతరాత్మ ప్రేరణతో ఆత్మను తెలుసుకోవలెను. ఆత్మయె ప్రేరణ.
6. ఆత్మ గ్రంథ పఠనము ద్వారా పొందునదికాదు.
7. దుష్ప్రవర్తన, అశాంతి, ఏకాగ్రత లేనివాడు ఆత్మను పొందలేడు.
8. కోరికలు లేనివాడు, దుఃఖరహితుడు, వాంఛారహితుడు, ఇంద్రియ శుద్ధి కలవాడు, మనోక్షయము, చిత్త శుద్ధి కలవాడు మాత్రమే ఆత్మను తెలుసుకొనగలడు.
9. శారీరక, మానసిక దుర్బలుడు ఆత్మను పొందలేడు. కార్యదక్షత, ఆరోగ్యము, నమ్మకము నిరంతర సాధన కలవారిని ఆత్మ వరించును.
10. అంతరాత్మ యందే పరమాత్మను దర్శించవలెను. ముముక్షువు, శాంతుడు, సమాధి నిష్టుడు, సూక్ష్మ బుద్ధి కలవాడు, దివ్య దృష్టి కలవాడు, సంకల్ప శక్తి కలవాడు మాత్రమే ఆత్మను పొందగలడు.
11. అనుభవజ్ఞుడైన గురువును పొంది ఆత్మ రహస్యము తెలుసుకొని అనుభూతి పొందవలెను.
12.ఆత్మను పొందాలంటే విచారణ, అభ్యాసము, స్వానుభవము, శాస్త్ర జ్ఞానము, గురువాక్యము వీని సమన్వయము వలననే ఆత్మావగాహన కలుగును. స్త్రీలు, పురుషులు, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, శూద్రులు, ఛండాలురు, బాలురు, వృద్ధులు, యవ్వనులు, వ్యాధిగ్రస్తులు మొదలగువారందరు ఆత్మ విచారణ చేయవచ్చు.
13. ఆత్మ దర్శనమునకు ఉపయోగపడనివి: వస్తు సంపద, ధనము, మిత్రులు, బంధువులు, తీర్థయాత్రలు, నదీస్నానములు మొదలగునవి.
14. ఆత్మను కేవలము సూక్ష్మ బుద్ధిచేతనే తెలుసుకొనుటకు వీలగును. అంతన్నేత్రంతో హృదయ భాగమున సహజముగా ఏకాగ్రతతో ఆత్మను ధ్యానించి భగవత్‌ సాక్షాత్కారము పొందవచ్చు. భగవంతుని స్వరూపము నిర్వికారము, నిరాకారము. అందువలన సగుణోపాసన కన్నా నిర్గుణోపాసన వలననే పరమాత్మను పొందవచ్చు. కాని నిర్గుణోపాసన అసాధ్యము. సగుణోపాసన చేయగా చేయగా, అది నిర్గుణోపాసనకు దారి తీయును.

 

🌹 🌹 🌹 🌹 🌹


---------------------------------------- x ----------------------------------------




🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 48 🌹 
48 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 యగం చేయాలంటే శరీరం తప్పనిసరి - 1 🍃 

356. శరీర శోధనయె యోగము. అందుకే దానిని గూర్చి పూర్తిగా తెలుసుకొనుటయే యోగమార్గము. ఇట్టి శరీరమును పరీక్షించి, పరిశోధించి దాని తత్త్వములను కనుగొని, ఆరోగ్యమును శరీర పునఃనిర్మాణమును తెలుసుకొనవలసి ఉండును. ఇదియే యోగరహస్యము. ఇది దేహాంతర భాగము నందు జరుగవలెను. దీనికి బాహ్యవస్తువులతో పనిలేదు. ఆత్మ, అనాత్మ, మనస్సు, జీవాత్మ, పరమాత్మ, జీవుడు వాటి వివరములు తెలుసుకొనవలెను. దీనినే సాంఖ్య యోగమందురు. పరమాత్మ తత్త్వము కూడా శరీరము నందే కలదు. 

357. బ్రహ్మ జ్ఞానము శరీరము ద్వారానే సాధనతో అనుభూతి చెందవలెను. జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి, తురీయావస్థలు శరీరమునకు సంబంధించినవే. అందుకు మౌనము, ధ్యానము, కర్మ, జ్ఞానము శరీరాధారముగా జరుగు క్రియలే. గణపతి, రుద్రుడు, శివుడు మొదలగు చక్రాధిష్ఠాన దేవతలందరు శరీరమందే కొలువుతీరి యున్నారు. 

358. శరీరము ఆరోగ్యముగా, దృఢముగా ఉన్నంత కాలము జీవుడు శరీరములోనే ఉండును. దేహమే దేవాలయము. అహం బ్రహ్మాస్మి. జీవుడే దేవుడు. శరీరము నశ్వరమైనను అందే సర్వశక్తులు, దేవతలు వసించి ఉన్నారు. 

359. శరీరము అను గూడు చర్మముచే కప్పబడినది. మాంసము, నరములు, గ్రంధులు, దుర్వాసనలతో కూడి ఉన్నది. వివిధాలంకారములతో శోభిల్లిన శరీరం స్మశానమున కుక్కలు, గ్రద్దలు, నక్కలకు ఆహారం అగుచున్నది. ప్రథ్వి అంతయు స్మశాన వాటికయే. కాని కేవలం జన్మాదిగా దృఢమైన వాసనలు మాత్రము తన వెంట గొనిపోవు చున్నాడు. 

360. పూర్వము ఋషులు, యోగులు, ముముక్షువులు సాధనలో శరీర ప్రాధాన్యతను గుర్తించి దాని ఆధారముగానే అనేక సిద్ధులు పొందిరి. 

361. ఈ శరీరము మైధునం వలన కలిగినది. నరక సదృశమైన యోని నుండి వెలువడినది. ఎముకలు, మాంసము, చర్మముతో కప్పబడి, మలమూత్రములు, పిత్తము, కఫము, మజ్జ, క్రొవ్వు మొదలగు అనేక మలముల కోశాగారము ఈ శరీరము. 

362. ఒక పదార్థము దాని విభజన అణువుల మయము. ఇంకా వేరు చేయలేని ఒక చిన్న పదార్థమును పరమాణువు అంటారు. ఇవన్నియూ మూల అణువు నుండి వచ్చినవే. అణువు పరిమాణవులుగా విడిపోయాయి. ఇవి సున్నితమైన సూక్ష్మ దర్శినితో కూడా కనబడవు. 

363. జీవుడు స్థూల శరీరమును వదలి సూక్ష్మ శరీరుడై పరలోకములకు పోవును. సూక్ష్మ శరీరము నశించదు. జీవుడు సూక్ష్మ శరీరమును వదలి ఉండడు. జీవుడు ఒక శరీరమును వదలి వేరొక శరీరమును పొందును. కాని సూక్ష్మ శరీర భంగమే మోక్షము, జన్మరాహిత్యము.
🌹 🌹 🌹 🌹 🌹


---------------------------------------- x ----------------------------------------


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 49 🌹 
49 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 యగం చేయాలంటే శరీరం తప్పనిసరి - 2 🍃 

364. ఈ శరీరము 25 తత్త్వములతో విరాజిల్లుచున్నది. అందు 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణములు, 5 విషయములు, 4 అంతఃకరణ చతుష్టయము, 25వది జీవాత్మ. 

1. జ్ఞానేంద్రియములు: కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము.
2. కర్మేంద్రియములు: కాళ్ళు, చేతులు, నోరు, గుదము, జననేంద్రియము.
3. పంచప్రాణములు: ప్రాణ,అపాన,ఉదాన,సమాన, వ్యాన వాయువులు.
4. విషయ పంచకము: భూమికి వాసన, నీటికి రుచి, అగ్నికి రూపము, వాయువుకు స్పర్శ, ఆకాశమునకు వినికిడి. ఇవి జీవుని యందు గల విషయాసక్తి.
5. అంతఃకరణ చతుష్టయము: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. 25వది జీవాత్మ. 26వది పరమాత్మ.

365. పంచ ప్రాణములు కాక ఉపప్రాణములు 5 కలవు. 1) నాగవాయువు: ఇది మాటలను పలికించును. వాంతి, త్రేన్పులను తెప్పించును. 2) కూర్మవాయువు: కనురెప్పలు తెరచుట, మూయుట చేయును. 3) క్రుకురము: తుమ్ములు వచ్చునట్లు చేయును, ఆకలి దప్పికలు కలుగజేయును. 4) దేవదత్తము: ఆవులింతలు కలుగుజేయును. 5) ధనుంజయవాయువు: శిశువును గర్భము నుండి బయటకి నెట్టి వేయును. శవంలో ఉబ్బించి తరువాత పోవును. 

366. ఈ శరీరము యొక్క గుణములు: 1) కామము 2) క్రోధము 3) లోభము 4) మోహము 5) మదము 6) మాత్సర్యము 7) దంబము 8) దర్పము 9) ఈర్ష్య 10) అసూయ మొదలగునవి. 

367. శరీర రకములు: 1) స్థూల శరీరము 25 తత్వములతో కూడి కర్మలు చేస్తూనే యోగ మార్గాలను అనుసరిస్తూ ముక్తిని పొందుటకు అవసరమై ఉన్నది. అందుకే ''శరీర మాధ్యమం ఖలు ధర్మ సాధనం'' అన్నారు. కంటికి కనిపించని షడ్చక్రాలు, కుండలిని, ఇడా పింగళ, సుషుమ్ననాడులు, ఈ శరీరములోనే ఉన్నవి. ఇవే యోగ మార్గములు. 

368. అజ్ఞాన స్వరూపమైన కారణ శరీరము నుండే ఈ స్థూల శరీరము ఏర్పడినది. ఈ శరీరము 7 జానల పొడవు, 4 జానల వలయము, 70 ఎముకలు, 40 ఫలముల రక్తము, 23 కోట్ల రోమములు, 192 సంధులు, 8 ఫలముల గుండె, 360 ఫలముల మాంసము, 1 సోలెడు పైత్యము, 1 సోలెడు శుక్లములతో ఏర్పడినది. 

369. సూక్ష్మ శరీరము ఇది 17 తత్వములతో ఏర్పడినది. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, ప్రాణములు 5, మనస్సు, బుద్ధి. దీనికి మనోమయ శరీరమని పేరు. ఇది శ్వేత వర్ణము కలిగి ఉండును. 

370. వ్యక్తి నిద్రించుచున్నప్పుడు, ఇంద్రియములు పని చేయుటలేదు. ఆ సమయములో సూక్ష్మ శరీరమే ఆ పనిని నిర్వహించుచున్నది. ఇట్టి సూక్ష్మ శరీరము అగ్నితో కాలదు, కత్తితో నరకబడదు, నీటిలో తడవదు, గాలికి కదలదు, ప్రళయకాలమందును నశించదు. ఈ సూక్ష్మ శరీరమునకు ఒక కారణ శరీరము కూడా కలదు. కారణ శరీరము నశించిన సూక్ష్మ శరీరము కూడా నశించును. తక్షణం జీవాత్మ పరమాత్మ యందు లయించును. 

371. మోక్షము కోరువాడు మొదట సూక్ష్మ శరీరమునకు మూల కారణమైన కారణ శరీరమును జయించవలెను. దానిని జయించాలంటే బ్రహ్మ సాక్షాత్కారము చేత భ్రాంతిని నశింపజేయాలి. కారణ శరీరమే అజ్ఞానము. స్థూల సూక్ష్మ శరీరముల రెంటికి జన్మకారణమైన అవిద్యయె కారణ దేహము. అహంకారము నశించిన కారణ శరీరము నశించి ముక్తి కలుగును. 

372. అహంకారము వలన అవివేకము కలుగును. అవివేకము వలన అభిమానం కలుగును. అభిమానం నుండి కామక్రోధములు, కామక్రోధముల వలన కర్మలు చేయుట, కర్మల నుండి పునఃజన్మలు కలుగును. 

373. మహాకారణ శరీరము కారణ శరీరమునకు మూల కారణము. జీవుడు ప్రత్యగాత్మ అన్న పేరుతో సహస్రారమున నిల్చి, తురీయావస్థను పొంది, ప్రపంచ విషయములనెరుగక తన నిజానందములో ఉండును. అందుకే యోగ సాధన. మహాకారణ శరీరము ఒక ఆధ్యాత్మికత. ఇదే ముక్తికి మార్గము.
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #BookofDzyan #Theosophy

26.Apr.2019

---------------------------------------- x ----------------------------------------



🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 50 🌹 
50 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 యగం చేయాలంటే శరీరం తప్పనిసరి - 3 🍃 

374. ప్రాణమయ శరీరము(ప్రాణ శక్తి): ఈ స్థూల శరీరము పనిచేయాలంటే అందుకు కావలసిన శక్తిని అందించునదే ప్రాణమయ శరీరము. ఒక వాహనము నడవాలంటే ఇంధనము కావాలి. అలానే ఈ శరీరమునకు ప్రాణ శక్తి ఇంధనము. ఈ ప్రాణ శక్తిని ఉత్పత్తి చేసే నాడులు చక్రములు. ఈ ప్రాణమయ శరీరములోనే ఉన్నవి. 

375. యాతనా శరీరము స్థూల సూక్ష్మ శరీరాలకు అనుసంధానముగా వ్యవహరిస్తున్నది. స్థూల సూక్ష్మ శరీరముల క్రియలు ఈ యాతన శరీరమునకు తెలియవు. స్థూల శరీరం లేకపోయినా, స్వర్గ నరకాలను అనుభవించేది యాతనా శరీరమే.

376. ఆత్మ శరీరము: 

మృత్యువును జయించిన వారు ఈ శరీరమును ధరిస్తారు. వీరు సత్యలోకాలలో యోగులుగా ఉంటారు. జనన మరణాలుండవు. అపుడపుడు దైవ కార్య నిమిత్తము భూమిపై అవతరిస్తుంటారు. 

377. ఇడ, పింగళ, సుషుమ్న నాడులు యోగమందు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇవి మూలాధారము వద్ద మొదలై ఆజ్ఞాచక్రము వరకు వెన్నుపూసలో ఉంటాయి. మధ్య నున్న సుషుమ్న నాడి ఆజ్ఞాచక్రమును దాటి బ్రహ్మ రంధ్రము వరకు వ్యాపించి కుండలిని శక్తిని చేరుతుంది. 

378. మూలాధార చక్రానికి ఉన్న త్రికోణానికి ఎడమవైపున వున్నది ఇడనాడి. కుడివైపున వున్నది పింగళనాడి. ఈ రెండింటికి మధ్యలో ఉన్నది సుషుమ్న నాడి. ఇది మూలాధారము నుండి సహస్రారము వరకు వ్యాపించి బ్రహ్మ రంధ్రములో చేరి బ్రహ్మానందమును అనుభవించును. ఇవిగాక 72,000 నాడులు, ఉపనాడులు వెన్నుపూస నంటి ఉండి పని చేయుచుండును. 

379. షట్‌ చక్రాలు: 1) మూలాధారము 2) స్వాధిష్ఠానము 3) మణిపూరకము 4) అనాహతము 5) విశుద్ధము 6) ఆజ్ఞా 7) సహస్రారము. 

1. మూలాధార చక్రము: గుదస్థానమున కలదు వినాయకుడు అధినేత. 4 దళములు కలిగి ఉండును.

2. స్వాధిష్ఠాన చక్రము: 6 దళములు. బ్రహ్మ దీనికి అధిష్ఠాన దేవత. లింగస్థాన మందుండును. 
3. మణిపూరక చక్రము: 10 దళములతో విష్ణువు అధిష్ఠాన దేవతగా ఉండును. నాభిస్థానమునందు కలదు. 4. అనాహత చక్రము:- ఇది హృదయ స్థానము నందు కలదు. 12 దళములు. రుద్రుడు అధిష్ఠాన దేవత.

5. విశుద్ధ చక్రము:- ఇది కంఠ స్థానమున 16 దళములతో ఉన్నది. దీనికి జీవుడు అధిష్ఠాన దేవత.

6. ఆజ్ఞా చక్రము:- ఇది 2 దళములతో ఈశ్వరుడు అధిష్ఠాన దేవతగా ఉండును. భ్రూమధ్యమున ఇది వెలుగొందుచుండును. ఇదే మూడవ నేత్రము.

7. సహస్రార చక్రము:- యోగ ప్రయాణములో చివరి స్థానము సహస్రారము. ఇది జ్యోతిర్మయ స్థానము. శ్రీ గురుమూర్తి దీనికి అధిష్ఠాన దేవత. ఈ వేయి రేకుల మధ్య అష్టదళ పద్మముండును.

8. కుండలిని: ఇది మూలప్రకృతి. దీనిని ఈశ్వరి, మహామాయ, జగదాంబ, పరాశక్తి అని అంటారు. దీనికి సహస్ర దళములు కలవు. జీవుని నడిపించే ఈ కుండలిని కొన్ని వేల నాడులతో షడ్జక్రాల ద్వారా సహస్రారమున చేరి బ్రహ్మానంద స్థితిని పొందుతుంది.

9. కుండలిని లేక మాయా శక్తి ప్రేరణలో చక్ర స్థానమందున్న దళములుకదలి, జీవుడు ప్రారబ్ధమునను భవించుటకు ప్రేరణ పొందును. త్రిగుణముల కారణముగా ఆగామికర్మ చేయుటకును ప్రేరణ పొందును.

10.చంచల ప్రాణాన్ని ఊర్థ్వ ముఖముగా నున్న ఆజ్ఞా చక్రములో స్థిరముగా నిలుపు యోగమును ఊర్థ్వ రేతస్సు అందరు. సహస్రారములో ఆత్మ సాక్షాత్కారము పొందిన వాడిని ఊర్థ్వ రేతస్కుడు అందురు.

🌹 🌹 🌹 🌹 🌹

---------------------------------------- x ----------------------------------------


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 51 🌹 
51 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 పరాణాయామము - 1 🍃 

380. మనిషి, అనారోగ్యానికి కారణము ప్రాణ సంచారము. శరీరములో సమానముగా ప్రసరించకుండుట అని గ్రహించాలి. అందుకు కారణము చిత్త ఏకాగ్రత లేకపోవుట. చంచల మనస్సు, రజోగుణ విజృంభణ కారణముగా ప్రాణ సంచారము సమస్థితిలో జరుగుట లేదు. 

381. ప్రాణాయామము అభ్యాసము ద్వారా ఎక్కువ తక్కువలుగా నున్న ప్రాణశక్తిని, లోపములను తెలుసుకొని సమస్థితిలో ఉంచుకొని వివిధ కేంద్రాలకు పంపిణి చేయుట జరుగుతుంది. అపుడు అనారోగ్యము తొలగిపోవును. 

382. యోగ సాధనలో ప్రాణాయామము ఒక అంశము. యోగం యొక్క అష్ఠాంగములలో ప్రాణాయామము ఒక అంగము మాత్రమే. స్థిర ప్రాణము నుండి చంచల ప్రాణావస్థకు దిగినవాడి పేరు జీవుడు. తిరిగి స్థిర ప్రాణుడగుటయే ఆత్మ స్థితి. 

383. ప్రాణాయామము ద్వారా సాధకుడు భౌతిక ప్రాణశక్తులను వశపర్చుకొని ఉశ్చ్వాస నిశ్వాసముల గతిని క్రమపర్చును. యోగమునకు ప్రాణాయామము మొట్టమొదటి ఆవశ్యకత. 

384. ప్రాణాయామము అనగా ప్రాణ ''నిగ్రహత'' అని అర్థము. ఉశ్చ్వాస నిశ్వాసములను తగ్గించుటయే ప్రాణాయామ ముఖ్య ఉద్దేశము. ప్రాణవాయువును అపానములో చేర్చుటే ప్రాణాయామము. ప్రాణాన్ని వశంచేసుకోవటమే ప్రాణాయామము యొక్క ముఖ్య ఉద్దేశము. క్రమముగా ప్రాణమును బిగబట్టుచూ చేయు సాధన ప్రాణాయామాభ్యాస మనబడును. అనేక శారీరక వ్యాయామములు శరీరమునకు చెందినవి. ప్రాణాయామము ఉశ్చ్వాస నిశ్వాసములకు సంబంధించిన వ్యాయామము. 

385. అపానవాయువు నందు ప్రాణ వాయువును, ప్రాణవాయువునందు అపానవాయువును హోమము చేయుటే ప్రాణాయామము. యమనియమాలలో ఇది 4వది. 

386. ప్రాణాయామములో పూరక, రేచక, కుంభకములు కలవు. 1) బయటి వాయువును లోపలకు పీల్చుట పూరకమందురు. ఇదియె ఉశ్చ్వాసము. ప్రాణమును హోమము చేయుటను పూరకమందురు. రేచకమనగా లోపలి వాయువును ముక్కురంధ్రముల ద్వారా బయటకు వదులుట. ఇదియె నిశ్వాస క్రియ. కుంభకమనగా లోపలకు పీల్చిన గాలిని, వెంటనే బయటకు వదలక వీలైనంత సేపు నిలిపి ఉండుటను పూరక కుంభకమంటారు. గాలిని వదలిన తరువాత వెంటనే పీల్చక, నిలిపి ఉంచుటను రేచక కుంభకమని అంటారు. ఈ రెంటిని అంతఃకుంభకమని, బాహ్యకుంభకమని కూడా అంటారు. బాహ్య కుంభకాన్ని శూన్యక కుంభకమని కూడా అంటారు. 

387. కుంభక ప్రాణాయామములో గాలి పీల్చినపుడు ప్రాణవాయువు శరీర అంతర్భాగములకు లోతుగా వెళ్ళి అందున్న కణజాలముకు శక్తినొసంగును. అలానే రేచక కుంభకములో లోతైన అంతర్భాగములో గల చెడు పదార్థములను సేకరించి బయటకి నెట్టివేయును. కావున పూరకము వలన కణజాలము శక్తివంతము, రేచకము వలన చెడు తొలగి శరీరమంతయు ఆరోగ్యవంతమగును. 

388. పూరక రేచక కుంభకముల వలన శరీరాంతర్భాగములో గల వెన్నెముకలో ఉన్న ఇడ, పింగళ, సుషుమ్న నాడులు చైతన్యవంతమై మూలాధారములో ఉన్న కుండలిని ఊర్ధ్వముఖమై సహస్రారములో ప్రవేశింపజేయును. శివ శక్తుల సమ్మేళనము ఏర్పడి బ్రహ్మానంద స్థితి కల్గి ముక్తికి మార్గము ఏర్పడును. 

389. పూరక రేచక కుంభకములతో పాటు కేవల కుంభకము ఒకటి కలదు. అందులో పూరకంతో రేచకంతో పనిలేకుండా అకస్మాత్తుగా శ్వాసను కుంభించి బిగబెట్టినచాలు. దీని వలన శరీరము కాయకల్పమగును. ఆయుర్వృద్ధి అగును. 

390. 2 నయనేంద్రియముల మధ్య, 2 ముక్కు ద్వారముల యొక్క పై భాగమున, ఈ మూడు కలిసే కూడలిని భ్రూమధ్యము (త్రివేణి సంగమము) అని అంటారు. శ్వాస ఎడమ కుడి ముక్కు రంధ్రముల ద్వారా ఆడుచుండును. ఈ రెండును భ్రూమధ్యమున చేరి ఒక చోట కలసి అచట నుండి సహస్రారమునకు చేరును. అచట కుండలిని శక్తిని ప్రజ్వలింపజేయును. ఆవేడిమికి బ్రహ్మ కపాలమునందు గల అమృతము కరిగి చుక్కలుచుక్కలుగా కారుచుండును. అదే ఆనంద స్థితి. జ్యోతి స్వరూపమును దర్శించు స్థితి.

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #BookofDzyan #Theosophy

28 Apr 2019

---------------------------------------- x ----------------------------------------




🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 52 🌹 
52 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 ప్రాణాయామము - 2 🍃 

391. అభ్యాస యోగములో శ్వాసను ఓంకారముతో పీల్చి బయటకు పోకుండా ఆపి, ప్రాపంచిక విషయములపై మనస్సు పోకుండా నశింపజేయుటయే అభ్యాస యోగమని పేరు. దీని ద్వారా ఇంద్రియములను అరికట్టుట, మనస్సును హృదయమునందు స్థిరపర్చుట, ప్రాణవాయువును బ్రహ్మరంధ్రమున నిలుపుట, ఓం కారము ఉచ్ఛరించి శ్వాసను లయింపజేయుట జరుగును. 

392. ప్రాణాయామమునకు మనస్సుకు చాలా సన్నిహిత సంబంధమున్నది. ఇది మనస్సు యొక్క చంచలత్వమును నశింపజేయును. మనస్సు బహిర్ముఖము కాకుండును. మనస్సు ప్రాణములు పరస్పరము నిరోధించబడును. కావున సాధకుడు యోగాభ్యాసము నందు కొంత సమయము ప్రాణాయామ సాధనలో కేటాయించిన మనస్సు నిశ్చలమగును. 

393. సాధకులు ప్రాణాయామము చేయునపుడు 'ఓం' అను మంత్రముతో పీల్చి 'ఓం' అను మంత్రముతో వదలవలెను. అలానే 'సోహం' మంత్రమును కూడా ప్రాణాయామముతో జతపర్చాలి. శ్వాసను పీల్చినపుడు 'సో' అనియూ వదలినపుడు 'హం' అనియూ ఉచ్చరించుచుండవలెను. పీల్చుచున్నప్పుడు బ్రహ్మ భావమును పెంచుకొనుచు, వదలుచున్నప్పుడు జీవ భావము తగ్గించుకొనవలెను. చివరకు నేనే బ్రహ్మమును అని దీని భావము. 'అజప' గాయత్రిలో 'సోహం', 'హంసో' అని జపించిన, నీవే నేను, నేనే నీవు అని సాధన చేసినట్లగును. ఈ విధముగా సోహం మంత్రమును సర్వకాల సర్వావస్థలందును జపము చేయు వారికి మరుజన్మ ఉండదు. 

394. ప్రాణాయామ సాధనా విధానము: మొదట కుడిముక్కును కుడిచేతి బొటన వ్రేలితో నొక్కిపెట్టి, ఎడమ ముక్కుతో గాలిని పూర్తిగా పీల్చి నింపవలెను. ఆసమయములో బ్రహ్మ తత్త్వములో ఉండి జగత్తు తనలో లీనం అవుతున్నట్లు భావించాలి. అలా ఉంచగలిగినంత సేపు ఉంచాలి. తరువాత ఎడమ నాశికను మూసి, నిలిపి ఉంచిన గాలిని కుడి నాశిక గుండా బయటకు వదలాలి. అట్టి శూన్యక కుంభకములో ఉండగలిగినంత సేపు ఉండి, తరువాత కుడి నాశికను ద్వారా గాలిని పీల్చి, నిల్పి ఉంచి ఎడమ నాశిక ద్వారా గాలిని బయటకు వదలాలి. ఇపుడు ఒక రౌండు పూర్తి అయినట్లు. రెండవ రౌండు మొదట తెల్పినట్లు ఎడమ ముక్కుతో పీల్చి బిగబెట్టి కుడిముక్కుతో వదలాలి. మరల కుడి ముక్కుతో పీల్చి బిగించి ఎడమ ముక్కుతో వదలాలి ఇలా చేయగల్గినన్ని రౌండ్లు కనీసము 5 సార్లు ఒక వారము చేసిన తరువాత, ఒక్కొక్క రౌండు పెంచుకుంటు 10 రౌండ్ల వరకు చేయవచ్చు. సాధారణముగా 10 రౌండ్లు సరిపోతాయి. ఇలా 10 రౌండ్లు పూర్తి చేయుటకు 5 నుండి 10 నిమిషములు పట్టవచ్చు.

395. ప్రాణాయామములో ఇంకొక విధానము: పైన తెల్పినట్లు ఏ విధమైన పూరక శూన్యక కుంభకములు లేకుండా ఆపకుండా చేస్తూ పోవాలి. ఇలా చేయుటకు మొదట పదిరౌండ్లతో మొదలపెట్టి 20, 30, 50 పెంచుకుంటూ 108 రౌండ్ల వరకు చేయవచ్చు. అందుకు షుమారు 5 నిమిషములు చాలు. 

396. ప్రాణాయామములో మూడవ విధానము: కుడి ముక్కు నొక్కి పెట్టి ఎడమ ముక్కుతో శ్వాసను వదులుతూ పీల్చుకుంటూ అదే ముక్కుతో 10, 20, 30, 108 రౌండ్లవరకు క్రమముగా పెంచుకుంటూ చేయాలి. దీనికి చంద్రభేది ప్రాణాయామమని పేరు. 

397. ప్రాణాయామములో నాలుగవ విధానము: ఎడమ ముక్కు నొక్కి పెట్టి కుడి ముక్కుతో శ్వాసను వదులుతూ పీల్చుకుంటూ అదే ముక్కుతో 10, 20, 30, 108 రౌండ్ల వరకు క్రమంగా పెంచుకుంటూ చేయాలి. దీనికి సూర్యభేది ప్రాణాయామమని అంటారు. 

398. ప్రాణాయామములో ఐదవ విధానము: ఈ పద్ధతిలో రెండు ముక్కుల ద్వారా శ్వాసను వదులుతూ పీల్చుకుంటూ అలానే 10, 20, 30, 108 రౌండ్ల వరకు పెంచుకుంటూ పోవాలి. దీనికి భస్త్రికా ప్రాణాయామమని పేరు. 

399. ప్రాణాయామములో ఆరవ విధానము: ఈ పద్ధతిలో రెండు ముక్కుల ద్వారా శ్వాసను గట్టిగా వదులుతూ ఉండాలి. ప్రత్యేకంగా పీల్చుకోవలసిన పనిలేదు. దీనికి కపాలభాతి అని పేరు. ఈ పద్ధతిలో శ్వాసను ప్రత్యేకముగా పీల్చకపోయినప్పటికి ఒక సారి వదలి మరల రెండవ సారి వదలినపుడు మధ్యలో కొంత సమయము మనకు తెలియకుండానే కొంచము శ్వాసను తీసుకొనుట జరుగుతుంది. ఈ ప్రాణాయామము వలన లోపల ఉన్న చెడు అంతా వేగముగా ఊడ్చిపెట్టినట్లు బయటకు నెట్టివేయబడుతుంది. కొత్త శక్తిని నింపుకొనుటకు వీలవుతుంది. తలలో ఉన్న అడ్డంకులు (బ్లాక్సు) తొలగిపోతాయి. 

400. ప్రాణాయామములో ఏడవ విధానము (శ్రీతలి):- ఈ పద్ధతిలో నాలుకను ముందుకు చాపి మడత పెట్టి నోటి ద్వారా గాలిని పూర్తిగా పీల్చుకొని నోరు మూసి ముక్కుతో గాలిని వదలాలి. అలా నాలుక ద్వారా పీల్చుకుంటూ ముక్కు ద్వారా వదులుతున్నప్పుడు శరీరములోని వేడిగాలి. బయటకు వెళ్ళి సమత్వ స్థితి ఏర్పడుతుంది. ఇది కూడా 10, 20, 30, 108 సార్లు చేయవచ్చు.
🌹 🌹 🌹 🌹 🌹


29 Apr 2019

---------------------------------------- x ----------------------------------------



---------------------------------------- x ----------------------------------------




No comments:

Post a Comment