వరలక్ష్మి వ్రతం : (పూజా విధానం ) Varalakshmi Vratham: (Worship Procedure)


వరలక్ష్మి వ్రతం : (పూజా విధానం )


శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి :-

పసుపు ................. 100 grms

కుంకుమ ................100 grms

గంధం .................... 1box

విడిపూలు................ 1/2 kg

పూల మాలలు ........... 6

తమలపాకులు............ 30

వక్కలు..................... 100 grms

ఖర్జూరములు..............50 grms

అగర్బత్తి ....................1 pack

కర్పూరము.................50 grms

చిల్లర పైసలు .............. Rs. 30/- ( 1Rs coins )

తెల్ల టవల్ .................1

బ్లౌస్ పీసులు .............. 2

మామిడి ఆకులు............

అరటిపండ్లు ................ 1 dazans

ఇతర రకాల పండ్లు ........ ఐదు రకాలు

అమ్మవారి ఫోటోల ......................

కలశము .................... 1

కొబ్బరి కాయలు ............ 3

తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం 2............

స్వీట్లు ..............................

బియ్యం 2 kg

కొద్దిగా పంచామృతం లేదా పాలు 100 ML




పూజా సామాగ్రి :-


దీపాలు ....
గంట
హారతి ప్లేటు
స్పూన్స్
ట్రేలు
నూనె
వత్తులు
అగ్గిపెట్టె
గ్లాసులు
బౌల్స్


శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే

శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి

ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చు

వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. “శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే” శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవడంతోపాటు,

లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి.


వ్రత విధానం :-

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి.

కావలసినవి :-

పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపుకుందులు, ఐదువత్తులతో, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి.

తోరం ఎలా తయారుచేసుకోవాలి :-

తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటేఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలనుతయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.


గణపతి పూజ:-

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥

ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥

గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.

ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణికాయ నమః,
ఓంలంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం గణాధిపాయ నమః,
ఓంధూమకేతవే నమః,
ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,
ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయనమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.

స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.


ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్!!

నీటిని నివేదన చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి). ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి)ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామినీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి!అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!

వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగామహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాల


ి.

కలశపూజ :-

కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ ఃస్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాఃగంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥

అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన, పూజాద్రవ్యాలపైన, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.


అధాంగపూజ:-

పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.

చంచలాయై నమః – పాదౌ పూజయామి, చపలాయై నమః – జానునీ పూజయామి, పీతాంబరాయైనమః – ఉరుం పూజయామి, కమలవాసిన్యైనమః – కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, సుముఖాయైనమః – ముఖంపూజయామి, సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి, రమాయైనమః – కర్ణౌ పూజయామి, కమలాయైనమః – శిరః పూజయామి, శ్రీవరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి.


(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)


శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి :-

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓంబుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓంలోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓంలోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓంపద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓంపద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓంపద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓంచంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓంఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓంభాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓంహేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓంవరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓంహిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓంమంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓంభువనేశ్వర్యై నమః




తోరపూజ :-

తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.


కమలాయైనమః – ప్రథమగ్రంథిం పూజయామి,
రమాయైనమః – ద్వితీయ గ్రంథింపూజయామి,
లోకమాత్రేనమః – తృతీయ గ్రంథింపూజయామి,
విశ్వజనన్యైనమః – చతుర్థగ్రంథింపూజయామి,
మహాలక్ష్మ్యై నమః – పంచమగ్రంథిం పూజయామి,
క్షీరాబ్ది తనయాయై నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి,
విశ్వసాక్షిణ్యై నమః – సప్తమగ్రంథిం పూజయామి,
చంద్రసోదర్యైనమః – అష్టమగ్రంథిం పూజయామి,
శ్రీ వరలక్ష్మీయై నమః – నవమగ్రంథిం పూజయామి.
ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే


వ్రత కథా ప్రారంభం :-

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా!స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను.

శ్రద్ధగా వినండి.

పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి.ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలుసర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరినవిధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు కునిప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.


వరలక్ష్మీ సాక్షాత్కారం :-

వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ…ఈ శ్రావణపౌర్ణమి నాటికిముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. “హే జననీ!నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగామన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’’ అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.


అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు.శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతితన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవినిసంకల్ప విధులతో


సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే

శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించిప్రతిష్టించింది.


అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు.ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలుఘల్లుఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచితకంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణభూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి.ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకువరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతోతమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.

వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా… శివుడుపార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవిస్తరంగా మీకువివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడాసకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయనిసూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపైవేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీతీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి.అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి.రాత్రి ఉపవాసం ఉండాలి.

భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడంతప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది....


సర్వేజనాసుఖినోభవతు


13 Aug 2021

పంచ తత్వములు - పంచ శరీరములు Five Tattava (Essences/Principles), Five Bodies



🌹. పంచ తత్వములు - పంచ శరీరములు 🌹

ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌ: ఓంసౌ: క్లీంఐం ఆత్మతత్త్వం విశ్వాత్మికం స్థూలదేహం, పరిశోదయామి జుహోమి స్వాహా

ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీం సౌ: ఓంసౌ: క్లీంబం విద్యాతత్త్వం తైజస్మాత్మికం సూక్ష్మదేహం, పరిశోదయామి జుహోమి స్వాహా

ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌ: ఓంసౌ: క్లీంఐం శివతత్త్వం ప్రాజ్ఞాత్మికం కారణదేహం, పరిశోదయామి జుహోమి స్వాహా

ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసా: ఓం సౌః క్లీంఐం సర్వతత్త్వం పాంచభౌతికం, మహాకారణదేహం, పరిశోదయామి జుహోమి స్వాహా


1) స్థూలదేహము అనగా పంచభూతముల ద్వారా ఏర్పడిన ఈ పాంచభౌతిక దేహమే ఈ స్థూలదేహము (పంచభూతములు అనగా,.ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వి. )


2) ఇవి ఒక్కొక్క భూతము నుండి ఒక్కొక్క శక్తి వచ్చినది. పరబ్రహ్మము నుండి అన్ని మహత్తు లు పుట్టి వాటినుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వి. వీటి చేరిక వల్లనే మానవ దేహము ఏర్పడుతుంది.


3) మొదటి దైన ఆకాశ తత్వము నుండి ఐదు పంచకములు ఏర్పడినవి అవి 1. జ్ఞాత 2.మనసు 3.బుద్ధి 4. చిత్తము 5. అహంకారం. వీటి సమ్మేళనమే శరీరము నందు వుండును.—-వీటిని అతీంద్రియములు అని పిలుచుదురు.


4) వాయు తత్వము నుండి

ప్రాణవాయువు,
సమానవాయువు,
వ్యానవాయువు,
ఉదానవాయువు,
అపానవాయువు, వచ్చినవి. వీటినే పంచప్రాణాలు అందురు. అవి తమ తమ విధులను నిర్వర్తించును.


5) అగ్ని తత్వము నుండి

శ్రోత్రము 2.త్వక్ 3.చక్షువు 4.జిహ్వ 5. ఘ్రాణము వచ్చినవి.
వీటినే జ్ఞానేంద్రియములు అందురు.(అగ్ని పంచకములు)


6) జల తత్వము నుండి

1.శబ్ద 2. స్పర్శ 3. రూప 4.రస 5. గంధ ములు వచ్చినవి. వీటిని పంచతన్మాత్రలు అందురు.


7) పృథ్వి తత్వము నుండి

1.వాక్కు 2. ఫాణి 3. పాదము 4. గుహ్యము 5.పాయువు వచ్చినవి. వీటిని కర్మేంద్రియములు అందురు.


8) వీటన్నిటి కలయికయే స్థూలదేహము . (దీనిని జాగ్రతావస్థ అందురు)


9) కొంతమంది అనేక శరీరములున్నవి అంటారు. అనగా

స్థూల 2.సూక్ష్మ 3. కారణ దేహములు అంటారు. మరికొందరు మహాకారణ దేహము అని కుడా అంటారు.

పైన చెప్పిన 25 తత్వములతో కూడిన దేహమునే స్థూలదేహము అంటారు.


10) సూక్ష్మదేహము అనగా జ్ఞానేంద్రియములు ఐదు, శబ్దాదులు ఐదు (కర్మేఇంద్రియాలు)

ప్రాణాదులు ఐదు, మనసు, బుధ్ధి, రెండు అనగా మొత్తం 17 తత్వములు కలిసిన దానిని సూక్ష్మదేహము అందురు. దీనినే లింగశరీరము అని కూడా అంటారు. (ఇది స్వప్నావస్థలో జరుగు ప్రక్రియ.)


11) స్థూలదేహములో వున్నా దశేన్ద్రియములు సూక్ష్మదేహము లోకి ఏరూపములో పోయినవి —?

అనేది మీకు ప్రశ్నగా మారవచ్చు—- అందుకే ఆయా ఇంద్రియాలకు సరి అయిన నిర్వచనము— పైకి కనిపించే చెవులు కాకుండా (పైకి కనిపించే డొప్పలు కావు) వాటికి భిన్న మైనట్టి ఆ చెవుల రంద్రాలలో వ్యాప్తమై వున్న శూన్యాన్ని ఆశ్రయించు కొని శబ్దాన్ని గ్రహించే శక్తి కలిగినట్టి సూక్ష్మ ఇంద్రియాన్నే శ్రోత్రేన్ద్రియం అంటారు. ఇలాగే మిగతా ఇంద్రియాలు కూడాను.


12) మనకు పైకి కనిపించే చర్మానికి భిన్నమైనది, అపాదమస్తకం వ్యాప్తమై, శీతోష్ణాది స్పర్శానుభూతిని కలిగించే సూక్ష్మేంద్రియాన్ని త్వగ్గీన్ద్రియం అంటారు.


13) కండ్లకు భిన్న మైనట్టి కండ్లను అశ్రయించి వున్నట్టి , కనుగుడ్డుకు అగ్ర భాగములో ఉంటు రూపాన్ని గ్రహించే శక్తిగల సూక్ష్మేన్ద్రియాన్ని చక్షురీన్ద్రియం అంటారు.


14 ) కేవలం నాలుక కాకుండా ఆ నాలుకను ఆశ్రయించి నాలుక యొక్క అగ్ర భాగములో ఉంటూ తీపి, పులుపు మొదలైన రసాలని, రుచులని గ్రహించ గలిగే సూక్ష్మేన్ద్రియాన్ని జిహ్వేంద్రియం అంటారు.


15) అట్లాగే పైకి కనిపించే ముక్కుకు భిన్నమైనదై ఆ ముక్కును ఆశ్రయించి ముక్కుకు అగ్రభాగములో గందాదుల్ని (వాసనలను) గ్రహించే శక్తి గల సూక్ష్మేంద్రియాన్ని ఘ్రాణేంద్రియం అంటారు.


16) కర్మేన్ద్రియాలంటే, మాట్లాడే ఇంద్రియమైన నాలుక, పనిచేసే చేతులు, నడిచే పాదాలు, మలమూత్ర విసర్జన చేయు గుదము, జననేంద్రియములు బయటికి కనిపించే పనులు చేసేందుకు కారణ మైనట్టి ఇంద్రియాలు. వాగేన్ద్రియము అంటే వాక్ కు భిన్న మైనట్టి వాక్ కు ఆశ్రయ మైనట్టి ఎనిమిది స్థానాలలో ఉంటూ శబ్దోచ్చారణకు సమర్ధ మైనట్టి ఇంద్రియం , శబ్దోచ్చారణకు వినియోగించే ఎనిమిది స్థానాలు 1.హృదయం 2. ఖంఠము 3. శిరస్సు (మూర్ధ్వం) 4. తాలువు 5. నాలుక 6.దంతములు 7. పెదవులు 8. ముక్కు అంటారు. ఇలాగే ఒక్కొక్క దానికి స్థూలానికి, సూక్ష్మానికి వున్న తేడాను గమనించండి.(ఇది స్వప్నావస్థ)


17) కారణశరీరము అంటే స్థూల, సూక్ష్మ(లింగ) రెండు దేహాలకు హేతుభూత మైనది. అనాది ఐనట్టి, అనిర్వచనీయమైనట్టి , ప్రకాశస్వరూపుడైనట్టి, బ్రహ్మ, ఆత్మలు రెండు ఒకటే అనే జ్ఞానాన్ని మరలిస్తుండేటువంటి అజ్ఞానాన్నే కారణశరీరము అంటారు. ఆత్మ, పరమాత్మల అభిన్నత్వాన్ని, అధ్యైతభావాన్ని, అనుభవములలోనికి రానీయకుండా నివారిస్తుంటుంది. ఈ కారణశరీరము — అనాది ఐనట్టి , అవిద్య మాయ యొక్క రూపమే కారణ శరీరానికి ఉపాధి అంటారు —- ఇటువంటి ఉపాధికి భిన్నమయినటువంటి ఆత్మను మనం తెలుసుకోవాలి. —- శరీరము అనే పదము దీనికి వాడుతున్నారు. కారణశరీరము ఎట్లా క్షయమౌతుంది— ? బ్రహ్మ, ఆత్మల యొక్క ఏకత్వ జ్ఞానము వల్ల ఆత్మ, పరమాత్మలు ఒకటే అనే జ్ఞానము కలగడం తోనే ఈ కారణ శరీరము క్షయమైపోతుంది.


18) సర్వ వ్యాపాకుడైన ఆత్మయే విశ్వానికి జీవశక్తి అయినాడు. అంటే మూలతత్వము. అతని వల్లనే ఇవన్నీ పుడుతున్నాయి. ఆ పరబ్రహ్మలోనే లయమైపోతాయి. కాబట్టి ఆత్మ, పరమాత్మలు ఒకటే అనే జ్ఞానము కలగడంవల్ల శరీరం అనేది మిధ్య అనేది తెలిపోవటంతో ఈ కారణశరీరము పోతుందని భావము. మిగిలేది చిత్తము, జ్ఞాతతో(ఆత్మతో) కూడుకున్నది.దీనినే ప్రాజ్ఞుడు అని అందురు. ఇది నిద్రావస్థ లేదా సుషుప్తావస్థ.


19) మహాకారణ అనగా ఏ తత్వము లేక స్వయం జ్యోతి యై, సర్వసాక్షి అయిన శుద్ధ చైతన్యము నే మహాకారణము అందురు. దీనినే అనుభవజ్ఞులు హిరణ్యగర్భుడు అని అక్షర పురుషుడని ఇంకా అనేక పేర్లతో కొనియాడారు.

🌹 🌹 🌹 🌹 🌹


13 Aug 2021

శ్రీ లలితా సహస్ర నామములు - 115 / Sri Lalita Sahasranamavali - Meaning - 115


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 115 / Sri Lalita Sahasranamavali - Meaning - 115 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ |
మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ‖ 115 ‖ 🍀


🍀 566. నిత్యతృప్తా -
నిత్యసంతుష్టి స్వభావము కలది.

🍀 567. భక్తనిధిః -
భక్తులకు నిధి వంటిది.

🍀 568. నియంత్రీ -
సర్వమును నియమించునది.

🍀 569. నిఖిలేశ్వరీ -
సమస్తమునకు ఈశ్వరి.

🍀 570. మైత్ర్యాది వాసనాలభ్యా -
మైత్రి మొదలైన వాసనా చతుష్టయము గలవారిచే పొందబడునది.

🍀 571. మహాప్రళయ సాక్షిణీ -
మహాప్రళయ స్థితియందు సాక్షి భూతురాలుగా ఉండునది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 115 🌹

📚. Prasad Bharadwaj

🌻 115. nityatṛptā bhaktanidhir niyantrī nikhileśvarī |
maitryādi-vāsanālabhyā mahāpralaya-sākṣiṇī || 115 || 🌻


🌻 566 ) Nithya Truptha -
She who is satisfied always

🌻 567 ) Bhaktha Nidhi -
She who is the treasure house of devotees

🌻 568 ) Niyanthri -
She who control

🌻 569 ) Nikhileswari -
She who is goddess for every thing

🌻 570 ) Maitryadhi vasana Labhya -
She who can be attained by habits like Maithree (friendship)

🌻 571 ) Maha pralaya sakshini -
She who is the witness to the great deluge


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


13 Aug 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 66


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 66 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భక్తి మార్గము 🌻


పూర్వము బ్రహ్మ దేవుడు వేదమును తన మనస్సున ముమ్మారు పరామర్శించెను. ధర్మముల రూపముగా నొకమారు , జీవిత సమన్వయముగా నొకమారు, పరిశుద్ధ జ్ఞానముగా నొకమారు అధ్యయనము చేసెను. అటుపై నొక నిర్ణయమునకు వచ్చెను.

భక్తి మార్గమున తప్ప మరియొక మార్గమున మోక్షము లేదు.

ఇట్లు నిర్ణయించుకొని విష్ణుమూర్తిని తన స్వరూపము గల వానినిగా ధ్యానము చేసెను. (దానితో తన అస్తిత్వము విష్ణువు నందు అర్పణము చేసెను. ఇదియే సన్న్యాసము.). తత్ఫలితముగా తన వికారము నుండి విమోచనము పొందెను.

అపుడు విష్ణువు మార్గములే తన మార్గములుగా గోచరించినవి. (దానితో సృష్టి సామర్థ్యము గూడ తన నుండి ప్రసరించెను.)

✍🏼 మాస్టర్ ఇ.కె.

భాగవతము 2-35

🌹 🌹 🌹 🌹 🌹


13 Aug 2021

వివేక చూడామణి - 115 / Viveka Chudamani - 115


🌹. వివేక చూడామణి - 115 / Viveka Chudamani - 115🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 26. ఆత్మ మార్పులేనిది - 2 🍀


383. స్వచ్ఛమైన మనస్సును ఆత్మపై స్థిరపర్చి తమ ఖచ్చిమైన ఆత్మ విజ్ఞానమును పొందుతూ, నిదానముగా అట్టి స్థితిపై మనస్సును నిల్పిన అట్టి వ్యక్తి తన శాశ్వతమైన ఆత్మను తాను తెలుసుకొనగలడు.

384. ప్రతి వ్యక్తి తన ఆత్మను తాను దర్శించవలెను. అది విభజించుటకు వీలులేని, శాశ్వతమైనది. అన్ని పరిమితులకు అతీతమైనది. అది శరీరము, శరీర భాగాలు, ప్రాణాలు, అహమును తన యొక్క అజ్ఞానము వలన సృష్టించబడినవని గ్రహించి, అవన్నీ ఆకాశముతో నిండి యున్నవని తెలుసుకోవాలి.

385. ఆకాశము వందలకొలది పరిమిత వస్తు సముదాయమును తనలో నింపుకొని; అవి కుండ, జాడి, పార, సూది మొదలగునవి; తాను ఒకటిగా, అనేకముగా కాకుండా ఉన్నది. అదే విధముగా పవిత్రమైన బ్రహ్మము కూడా అహాన్ని ఇతరమైన వాటిని తనలో లేకుండా చేసి ఒకటిగానే తోచుచున్నది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 VIVEKA CHUDAMANI - 115 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj


🌻 26. Self is Unchangeable - 2 🌻


383. Fixing the purified mind in the Self, the Witness, the Knowledge Absolute, and slowly making it still, one must then realise one’s own infinite Self.

384. One should behold the Atman, the Indivisible and Infinite, free from all limiting adjuncts such as the body, organs, Pranas, Manas and egoism, which are creations of one’s own ignorance – like the infinite sky.

385. The sky, divested of the hundreds of limiting adjuncts such as a jar, a pitcher, a receptacle for grains or a needle, is one, and not diverse; exactly in a similar way the pure Brahman, when divested of egoism etc., is verily One.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹



13 Aug 2021

శ్రీ శివ మహా పురాణము - 438


🌹 . శ్రీ శివ మహా పురాణము - 438🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 28

🌻. శివుని సాక్షాత్కారము - 1 🌻


పార్వతి ఇట్లు పలికెను-

ఎవరో ఒక మహాత్ముడు వచ్చినాడని మాత్రమే నేను తలంచితిని, ఇపుడు విషయమంతయూ తెలిసినది. పైగా నీవు పవిత్రమగు బ్రాహ్మణుడు (1). ఓ దేవా! నీవు చెప్పినది నాకు తెలిసినది. అది అసత్యమే గాని సత్యము కాదు. సర్వము తెలియునని నీవు చెప్పిన మాట సత్యమే అయినచో, నీవు ఇట్లు విరుద్ధముగా మాటలాడియుండవు (2).

పరబ్రహ్మ, తన ఇచ్ఛచే స్వీకరింపబడిన దేహము గలవాడునగు మహేశ్వరుడు అప్పుడప్పుడు తన లీలచే అట్టి వేషమును ధరించి కానవచ్చును (3). నీవు బ్రహ్మచారి వేషముతో నన్ను మోసగించుటకు వచ్చి కుయుక్తులు పన్ని మోసపూరితములగు మాటలను పలికితివి (4).

నేను శంకరుని స్వరూపమును ప్రత్యేకించి ఎరుంగుదును. శివతత్త్వము నెరుంగుదును. కావున నా యోగ్యతకను గుణముగా బాగుగా విమర్శించి చెప్పుచున్నాను (5). శివుడు స్వరూప దృష్ట్యా నిర్గుణ బ్రహ్మ. కాని కారణమగు ప్రకృతితో గూడి సగుణుడైనాడు. నిర్గుణుడు, గుణ స్వరూపుడునగు ఆయనకు జాతి ఎట్లుండును? (6)

ఆ సదాశివుడు విద్యలన్నింటికీ నిధానము. పూర్ణపరమాత్ముడగు ఆ శివునకు విద్యతో పనియేమి? (7)ఆ శంభుడు కల్పప్రారంభములో వేదములను ఉచ్ఛ్వాస రూపముగా పూర్వము విష్ణువునకు ఇచ్చెను. ఆయనతో సమమగు గొప్ప ప్రభువు మరియొకడు లేడు (8).

సర్వప్రాణులకు ఆదియందున్న సద్ఘనుడగు పరమేశ్వరునకు వయస్సు యొక్క లెక్క ఎక్కడిది? ప్రకృతి ఆయన నుండి పుట్టినది. ఆయన యొక్క శక్తికి కారణమేమి ఉండును? (9) శక్తికి ప్రభువు, అవ్యయుడు అగు ఆ శంకరుని ఎవడైతే సర్వదా ప్రేమతో సేవించునో, అట్టివానికి ఆ శంభుడు ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తులను ఇచ్చును (10).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


13 Aug 2021

గీతోపనిషత్తు -239


🌹. గీతోపనిషత్తు -239 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 19-2

🍀 18-2. నిద్ర - మెలకువ - నిద్రించుటయు, మేల్కాంచుటయు జీవులకు అవశమై యున్నది. నిద్ర మెలకువ వచ్చుటయే గాని తెప్పించు కొనలేము. ఇది అవశస్థితి. అట్లే జన్మించుట, మరణించుట కూడ. అట్లే సృష్టి, ప్రళయము కూడ. ఈ చక్రము నుండి జీవులు బయల్పడుట ప్రయత్న పూర్వకముగ చేయవలెను. ఈ చక్రగతి దాటుటకు చక్రమును త్రిప్పుచున్న తత్త్వముతో ముడిపడవలెను. చక్రము నందుండుట ఒక ఎత్తు, చక్రమును త్రిప్పు తత్త్యముతో యుండుట మరియొక ఎత్తు. పరబ్రహ్మ యోగమున ఇది సాధ్యపడునని భగవానుని ఉపదేశము. 🍀

భూత గ్రామ స్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్ర్యాగమే2 వశః పార్థ ప్రభవ త్యహరాగమే || 19


తాత్పర్యము : ప్రాణి సమూహము లన్నియు కూడ పరాధీనమై పగటి యందు మేల్కొని, వర్తించి మరల పరాధీనమై రాత్రియందు నిదురలోనికి చనుచున్నవి. బ్రహ్మపగలు యందు కూడ ప్రాణి సమూహము అట్లే అవశులై పుట్టుచు చచ్చుచు, మరల పుట్టుచు జీవించి బ్రహ్మరాత్రి యందు లయమందు చున్నది.

జీవులు మేల్కొనక ముందు తామున్నామని తెలిసి యుండరు. మేల్కొనినంతనే తెలియును. ఆ తెలివి నిద్రవరకే. నిద్రయందు తెలివి అవ్యక్తము లోనికి చనును. మరల మెలకువ కలిగినంతనే ఏర్పడును. నిద్రించుటయు, మేల్కాంచుటయు జీవులకు అవశమై యున్నది. నిద్ర వచ్చుటయేగాని, నిద్రను తెప్పించుకొనలేము. మెలకువ వచ్చుటయేగాని, మెలకువను తెప్పించుకొనలేము. ఇది అవశస్థితి. అట్లే జన్మించుట, మరణించుట కూడ. అట్లే సృష్టి, ప్రళయము కూడ.

ఈ చక్రము నుండి జీవులు బయల్పడుట ప్రయత్న పూర్వకముగ చేయవలెను. ఆ ఉపాయము తరువాత శ్లోకమున పరమాత్మ తెలియజేయు చున్నాడు. సృష్టి లయములకు, జనన మరణములకు, మెలకువ నిద్ర లకు అతీతమైన, అక్షరమైన పరతత్త్వమును గుర్తించి, దానితో ముడిపడుటయే మార్గమని తెలియచేయును. సృష్టిచక్రము, జనన మరణ చక్రము, అహోరాత్ర చక్రము, జీవులను శుక్ల కృష్ణ గతులలో అనంతము త్రిప్పుచునే యుండును.

ఈ చక్రగతి దాటుటకు చక్రమును త్రిప్పుచున్న తత్త్వముతో ముడిపడవలెను. చక్రము నందుండుట ఒక ఎత్తు, చక్రమును త్రిప్పు తత్త్యముతో యుండుట మరియొక ఎత్తు. పరబ్రహ్మ యోగమున ఇది సాధ్యపడునని భగవానుని ఉపదేశము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


13 Aug 2021

13-AUGUST-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 239 🌹  
2) 🌹. శివ మహా పురాణము - 438🌹 
3) 🌹 వివేక చూడామణి - 115 / Viveka Chudamani - 115🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -67🌹  
5) 🌹 Osho Daily Meditations - 56🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 115🌹
7) 🌹. పంచ తత్వములు - పంచ శరీరములు 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -239 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 19-2
 
*🍀 18-2. నిద్ర - మెలకువ - నిద్రించుటయు, మేల్కాంచుటయు జీవులకు అవశమై యున్నది. నిద్ర మెలకువ వచ్చుటయే గాని తెప్పించు కొనలేము. ఇది అవశస్థితి. అట్లే జన్మించుట, మరణించుట కూడ. అట్లే సృష్టి, ప్రళయము కూడ. ఈ చక్రము నుండి జీవులు బయల్పడుట ప్రయత్న పూర్వకముగ చేయవలెను. ఈ చక్రగతి దాటుటకు చక్రమును త్రిప్పుచున్న తత్త్వముతో ముడిపడవలెను. చక్రము నందుండుట ఒక ఎత్తు, చక్రమును త్రిప్పు తత్త్యముతో యుండుట మరియొక ఎత్తు. పరబ్రహ్మ యోగమున ఇది సాధ్యపడునని భగవానుని ఉపదేశము. 🍀*

భూత గ్రామ స్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్ర్యాగమే2 వశః పార్థ ప్రభవ త్యహరాగమే || 19

తాత్పర్యము : ప్రాణి సమూహము లన్నియు కూడ పరాధీనమై పగటి యందు మేల్కొని, వర్తించి మరల పరాధీనమై రాత్రియందు నిదురలోనికి చనుచున్నవి. బ్రహ్మపగలు యందు కూడ ప్రాణి సమూహము అట్లే అవశులై పుట్టుచు చచ్చుచు, మరల పుట్టుచు జీవించి బ్రహ్మరాత్రి యందు లయమందు చున్నది. 

జీవులు మేల్కొనక ముందు తామున్నామని తెలిసి యుండరు. మేల్కొనినంతనే తెలియును. ఆ తెలివి నిద్రవరకే. నిద్రయందు తెలివి అవ్యక్తము లోనికి చనును. మరల మెలకువ కలిగినంతనే ఏర్పడును. నిద్రించుటయు, మేల్కాంచుటయు జీవులకు అవశమై యున్నది. నిద్ర వచ్చుటయేగాని, నిద్రను తెప్పించుకొనలేము. మెలకువ వచ్చుటయేగాని, మెలకువను తెప్పించుకొనలేము. ఇది అవశస్థితి. అట్లే జన్మించుట, మరణించుట కూడ. అట్లే సృష్టి, ప్రళయము కూడ. 

ఈ చక్రము నుండి జీవులు బయల్పడుట ప్రయత్న పూర్వకముగ చేయవలెను. ఆ ఉపాయము తరువాత శ్లోకమున పరమాత్మ తెలియజేయు చున్నాడు. సృష్టి లయములకు, జనన మరణములకు, మెలకువ నిద్ర లకు అతీతమైన, అక్షరమైన పరతత్త్వమును గుర్తించి, దానితో ముడిపడుటయే మార్గమని తెలియచేయును. సృష్టిచక్రము, జనన మరణ చక్రము, అహోరాత్ర చక్రము, జీవులను శుక్ల కృష్ణ గతులలో అనంతము త్రిప్పుచునే యుండును. 

ఈ చక్రగతి దాటుటకు చక్రమును త్రిప్పుచున్న తత్త్వముతో ముడిపడవలెను. చక్రము నందుండుట ఒక ఎత్తు, చక్రమును త్రిప్పు తత్త్యముతో యుండుట మరియొక ఎత్తు. పరబ్రహ్మ యోగమున ఇది సాధ్యపడునని భగవానుని ఉపదేశము. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 438🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 28

*🌻. శివుని సాక్షాత్కారము - 1 🌻*

పార్వతి ఇట్లు పలికెను-

ఎవరో ఒక మహాత్ముడు వచ్చినాడని మాత్రమే నేను తలంచితిని, ఇపుడు విషయమంతయూ తెలిసినది. పైగా నీవు పవిత్రమగు బ్రాహ్మణుడు (1). ఓ దేవా! నీవు చెప్పినది నాకు తెలిసినది. అది అసత్యమే గాని సత్యము కాదు. సర్వము తెలియునని నీవు చెప్పిన మాట సత్యమే అయినచో, నీవు ఇట్లు విరుద్ధముగా మాటలాడియుండవు (2). 

పరబ్రహ్మ, తన ఇచ్ఛచే స్వీకరింపబడిన దేహము గలవాడునగు మహేశ్వరుడు అప్పుడప్పుడు తన లీలచే అట్టి వేషమును ధరించి కానవచ్చును (3). నీవు బ్రహ్మచారి వేషముతో నన్ను మోసగించుటకు వచ్చి కుయుక్తులు పన్ని మోసపూరితములగు మాటలను పలికితివి (4).

నేను శంకరుని స్వరూపమును ప్రత్యేకించి ఎరుంగుదును. శివతత్త్వము నెరుంగుదును. కావున నా యోగ్యతకను గుణముగా బాగుగా విమర్శించి చెప్పుచున్నాను (5). శివుడు స్వరూప దృష్ట్యా నిర్గుణ బ్రహ్మ. కాని కారణమగు ప్రకృతితో గూడి సగుణుడైనాడు. నిర్గుణుడు, గుణ స్వరూపుడునగు ఆయనకు జాతి ఎట్లుండును? (6) 

ఆ సదాశివుడు విద్యలన్నింటికీ నిధానము. పూర్ణపరమాత్ముడగు ఆ శివునకు విద్యతో పనియేమి? (7)ఆ శంభుడు కల్పప్రారంభములో వేదములను ఉచ్ఛ్వాస రూపముగా పూర్వము విష్ణువునకు ఇచ్చెను. ఆయనతో సమమగు గొప్ప ప్రభువు మరియొకడు లేడు (8).

సర్వప్రాణులకు ఆదియందున్న సద్ఘనుడగు పరమేశ్వరునకు వయస్సు యొక్క లెక్క ఎక్కడిది? ప్రకృతి ఆయన నుండి పుట్టినది. ఆయన యొక్క శక్తికి కారణమేమి ఉండును? (9) శక్తికి ప్రభువు, అవ్యయుడు అగు ఆ శంకరుని ఎవడైతే సర్వదా ప్రేమతో సేవించునో, అట్టివానికి ఆ శంభుడు ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తులను ఇచ్చును (10). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
 
*🌹. వివేక చూడామణి - 115 / Viveka Chudamani - 115🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 26. ఆత్మ మార్పులేనిది - 2 🍀*

383. స్వచ్ఛమైన మనస్సును ఆత్మపై స్థిరపర్చి తమ ఖచ్చిమైన ఆత్మ విజ్ఞానమును పొందుతూ, నిదానముగా అట్టి స్థితిపై మనస్సును నిల్పిన అట్టి వ్యక్తి తన శాశ్వతమైన ఆత్మను తాను తెలుసుకొనగలడు. 

384. ప్రతి వ్యక్తి తన ఆత్మను తాను దర్శించవలెను. అది విభజించుటకు వీలులేని, శాశ్వతమైనది. అన్ని పరిమితులకు అతీతమైనది. అది శరీరము, శరీర భాగాలు, ప్రాణాలు, అహమును తన యొక్క అజ్ఞానము వలన సృష్టించబడినవని గ్రహించి, అవన్నీ ఆకాశముతో నిండి యున్నవని తెలుసుకోవాలి. 

385. ఆకాశము వందలకొలది పరిమిత వస్తు సముదాయమును తనలో నింపుకొని; అవి కుండ, జాడి, పార, సూది మొదలగునవి; తాను ఒకటిగా, అనేకముగా కాకుండా ఉన్నది. అదే విధముగా పవిత్రమైన బ్రహ్మము కూడా అహాన్ని ఇతరమైన వాటిని తనలో లేకుండా చేసి ఒకటిగానే తోచుచున్నది. 


 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 115 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 26. Self is Unchangeable - 2 🌻*

383. Fixing the purified mind in the Self, the Witness, the Knowledge Absolute, and slowly making it still, one must then realise one’s own infinite Self.

384. One should behold the Atman, the Indivisible and Infinite, free from all limiting adjuncts such as the body, organs, Pranas, Manas and egoism, which are creations of one’s own ignorance – like the infinite sky.

385. The sky, divested of the hundreds of limiting adjuncts such as a jar, a pitcher, a receptacle for grains or a needle, is one, and not diverse; exactly in a similar way the pure Brahman, when divested of egoism etc., is verily One.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 66 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. భక్తి మార్గము 🌻*

పూర్వము బ్రహ్మ దేవుడు వేదమును తన మనస్సున ముమ్మారు పరామర్శించెను. ధర్మముల రూపముగా నొకమారు , జీవిత సమన్వయముగా నొకమారు, పరిశుద్ధ జ్ఞానముగా నొకమారు అధ్యయనము చేసెను. అటుపై నొక నిర్ణయమునకు వచ్చెను.

*భక్తి మార్గమున తప్ప మరియొక మార్గమున మోక్షము లేదు.*

ఇట్లు నిర్ణయించుకొని విష్ణుమూర్తిని తన స్వరూపము గల వానినిగా ధ్యానము చేసెను. (దానితో తన అస్తిత్వము విష్ణువు నందు అర్పణము చేసెను. ఇదియే సన్న్యాసము.). తత్ఫలితముగా తన వికారము నుండి విమోచనము పొందెను. 

అపుడు విష్ణువు మార్గములే తన మార్గములుగా గోచరించినవి. (దానితో సృష్టి సామర్థ్యము గూడ తన నుండి ప్రసరించెను.)

✍🏼 *మాస్టర్ ఇ.కె.*
భాగవతము 2-35
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 56 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 56. SETTLING DOWN 🍀*

*🕉 Lovers become afraid when things go smoothly. They start feeling that perhaps love is disappearing. 🕉*

When love settles, everything becomes smooth. Then love becomes more like friendship-and that has a beauty of its own. Friendship is the very cream, the very essence, of love. So settle! And don't be worried, otherwise sooner or later you will start creating trouble. The mind always wants to create trouble, because then it remains important; when there is no trouble, it becomes unimportant. 

The mind is just like the police department. If the city is calm and quiet, they feel bad: no robbery, no riot, no murders--nothing! They are not needed for anything. When everything is silent and peaceful, the mind has a fear, because if you really settle, the mind will be no more. Just remember this. The mind has to go, because it is not the goal. The goal is to go beyond the mind. So help each other to be silent, and keep things going smoothly. If the other starts to get panicky, try to help.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 115 / Sri Lalita Sahasranamavali - Meaning - 115 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ |*
*మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ‖ 115 ‖ 🍀*

🍀 566. నిత్యతృప్తా - 
నిత్యసంతుష్టి స్వభావము కలది.

🍀 567. భక్తనిధిః - 
భక్తులకు నిధి వంటిది.

🍀 568. నియంత్రీ - 
సర్వమును నియమించునది. 

🍀 569. నిఖిలేశ్వరీ - 
సమస్తమునకు ఈశ్వరి.

🍀 570. మైత్ర్యాది వాసనాలభ్యా - 
మైత్రి మొదలైన వాసనా చతుష్టయము గలవారిచే పొందబడునది.

🍀 571. మహాప్రళయ సాక్షిణీ - 
మహాప్రళయ స్థితియందు సాక్షి భూతురాలుగా ఉండునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 115 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 115. nityatṛptā bhaktanidhir niyantrī nikhileśvarī |*
*maitryādi-vāsanālabhyā mahāpralaya-sākṣiṇī || 115 || 🌻*

🌻 566 ) Nithya Truptha -   
She who is satisfied always

🌻 567 ) Bhaktha Nidhi -  
 She who is the treasure house of devotees

🌻 568 ) Niyanthri -   
She who control

🌻 569 ) Nikhileswari -   
She who is goddess for every thing

🌻 570 ) Maitryadhi vasana Labhya -   
She who can be attained by habits like Maithree (friendship)

🌻 571 ) Maha pralaya sakshini -   
She who is the witness to the great deluge

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. పంచ తత్వములు - పంచ శరీరములు 🌹*

ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌ: ఓంసౌ: క్లీంఐం ఆత్మతత్త్వం విశ్వాత్మికం స్థూలదేహం, పరిశోదయామి జుహోమి స్వాహా 

ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీం సౌ: ఓంసౌ: క్లీంబం విద్యాతత్త్వం తైజస్మాత్మికం సూక్ష్మదేహం, పరిశోదయామి జుహోమి స్వాహా 

ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌ: ఓంసౌ: క్లీంఐం శివతత్త్వం ప్రాజ్ఞాత్మికం కారణదేహం, పరిశోదయామి జుహోమి స్వాహా

 ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసా: ఓం సౌః క్లీంఐం సర్వతత్త్వం పాంచభౌతికం, మహాకారణదేహం, పరిశోదయామి జుహోమి స్వాహా

1) స్థూలదేహము అనగా పంచభూతముల ద్వారా ఏర్పడిన ఈ పాంచభౌతిక దేహమే ఈ స్థూలదేహము (పంచభూతములు అనగా,.ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వి. )

2) ఇవి ఒక్కొక్క భూతము నుండి ఒక్కొక్క శక్తి వచ్చినది. పరబ్రహ్మము నుండి అన్ని మహత్తు లు పుట్టి వాటినుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వి. వీటి చేరిక వల్లనే మానవ దేహము ఏర్పడుతుంది.

3) మొదటి దైన ఆకాశ తత్వము నుండి ఐదు పంచకములు ఏర్పడినవి అవి 1. జ్ఞాత 2.మనసు 3.బుద్ధి 4. చిత్తము 5. అహంకారం. వీటి సమ్మేళనమే శరీరము నందు వుండును.—-వీటిని అతీంద్రియములు అని పిలుచుదురు.

4) వాయు తత్వము నుండి

ప్రాణవాయువు,
సమానవాయువు,
వ్యానవాయువు,
ఉదానవాయువు,
అపానవాయువు, వచ్చినవి. వీటినే పంచప్రాణాలు అందురు. అవి తమ తమ విధులను నిర్వర్తించును.
5) అగ్ని తత్వము నుండి

శ్రోత్రము 2.త్వక్ 3.చక్షువు 4.జిహ్వ 5. ఘ్రాణము వచ్చినవి.
వీటినే జ్ఞానేంద్రియములు అందురు.(అగ్ని పంచకములు)

6) జల తత్వము నుండి

1.శబ్ద 2. స్పర్శ 3. రూప 4.రస 5. గంధ ములు వచ్చినవి. వీటిని పంచతన్మాత్రలు అందురు.

7) పృథ్వి తత్వము నుండి

1.వాక్కు 2. ఫాణి 3. పాదము 4. గుహ్యము 5.పాయువు వచ్చినవి. వీటిని కర్మేంద్రియములు అందురు.

8) వీటన్నిటి కలయికయే స్థూలదేహము . (దీనిని జాగ్రతావస్థ అందురు)

9) కొంతమంది అనేక శరీరములున్నవి అంటారు. అనగా

స్థూల 2.సూక్ష్మ 3. కారణ దేహములు అంటారు. మరికొందరు మహాకారణ దేహము అని కుడా అంటారు.
పైన చెప్పిన 25 తత్వములతో కూడిన దేహమునే స్థూలదేహము అంటారు.

10) సూక్ష్మదేహము అనగా జ్ఞానేంద్రియములు ఐదు, శబ్దాదులు ఐదు (కర్మేఇంద్రియాలు)

ప్రాణాదులు ఐదు, మనసు, బుధ్ధి, రెండు అనగా మొత్తం 17 తత్వములు కలిసిన దానిని సూక్ష్మదేహము అందురు. దీనినే లింగశరీరము అని కూడా అంటారు. (ఇది స్వప్నావస్థలో జరుగు ప్రక్రియ.)

11) స్థూలదేహములో వున్నా దశేన్ద్రియములు సూక్ష్మదేహము లోకి ఏరూపములో పోయినవి —?

అనేది మీకు ప్రశ్నగా మారవచ్చు—- అందుకే ఆయా ఇంద్రియాలకు సరి అయిన నిర్వచనము— పైకి కనిపించే చెవులు కాకుండా (పైకి కనిపించే డొప్పలు కావు) వాటికి భిన్న మైనట్టి ఆ చెవుల రంద్రాలలో వ్యాప్తమై వున్న శూన్యాన్ని ఆశ్రయించు కొని శబ్దాన్ని గ్రహించే శక్తి కలిగినట్టి సూక్ష్మ ఇంద్రియాన్నే శ్రోత్రేన్ద్రియం అంటారు. ఇలాగే మిగతా ఇంద్రియాలు కూడాను.

12) మనకు పైకి కనిపించే చర్మానికి భిన్నమైనది, అపాదమస్తకం వ్యాప్తమై, శీతోష్ణాది స్పర్శానుభూతిని కలిగించే సూక్ష్మేంద్రియాన్ని త్వగ్గీన్ద్రియం అంటారు.

13) కండ్లకు భిన్న మైనట్టి కండ్లను అశ్రయించి వున్నట్టి , కనుగుడ్డుకు అగ్ర భాగములో ఉంటు రూపాన్ని గ్రహించే శక్తిగల సూక్ష్మేన్ద్రియాన్ని చక్షురీన్ద్రియం అంటారు.

14 ) కేవలం నాలుక కాకుండా ఆ నాలుకను ఆశ్రయించి నాలుక యొక్క అగ్ర భాగములో ఉంటూ తీపి, పులుపు మొదలైన రసాలని, రుచులని గ్రహించ గలిగే సూక్ష్మేన్ద్రియాన్ని జిహ్వేంద్రియం అంటారు.

15) అట్లాగే పైకి కనిపించే ముక్కుకు భిన్నమైనదై ఆ ముక్కును ఆశ్రయించి ముక్కుకు అగ్రభాగములో గందాదుల్ని (వాసనలను) గ్రహించే శక్తి గల సూక్ష్మేంద్రియాన్ని ఘ్రాణేంద్రియం అంటారు.

16) కర్మేన్ద్రియాలంటే, మాట్లాడే ఇంద్రియమైన నాలుక, పనిచేసే చేతులు, నడిచే పాదాలు, మలమూత్ర విసర్జన చేయు గుదము, జననేంద్రియములు బయటికి కనిపించే పనులు చేసేందుకు కారణ మైనట్టి ఇంద్రియాలు. వాగేన్ద్రియము అంటే వాక్ కు భిన్న మైనట్టి వాక్ కు ఆశ్రయ మైనట్టి ఎనిమిది స్థానాలలో ఉంటూ శబ్దోచ్చారణకు సమర్ధ మైనట్టి ఇంద్రియం , శబ్దోచ్చారణకు వినియోగించే ఎనిమిది స్థానాలు 1.హృదయం 2. ఖంఠము 3. శిరస్సు (మూర్ధ్వం) 4. తాలువు 5. నాలుక 6.దంతములు 7. పెదవులు 8. ముక్కు అంటారు. ఇలాగే ఒక్కొక్క దానికి స్థూలానికి, సూక్ష్మానికి వున్న తేడాను గమనించండి.(ఇది స్వప్నావస్థ)

17) కారణశరీరము అంటే స్థూల, సూక్ష్మ(లింగ) రెండు దేహాలకు హేతుభూత మైనది. అనాది ఐనట్టి, అనిర్వచనీయమైనట్టి , ప్రకాశస్వరూపుడైనట్టి, బ్రహ్మ, ఆత్మలు రెండు ఒకటే అనే జ్ఞానాన్ని మరలిస్తుండేటువంటి అజ్ఞానాన్నే కారణశరీరము అంటారు. ఆత్మ, పరమాత్మల అభిన్నత్వాన్ని, అధ్యైతభావాన్ని, అనుభవములలోనికి రానీయకుండా నివారిస్తుంటుంది. ఈ కారణశరీరము — అనాది ఐనట్టి , అవిద్య మాయ యొక్క రూపమే కారణ శరీరానికి ఉపాధి అంటారు —- ఇటువంటి ఉపాధికి భిన్నమయినటువంటి ఆత్మను మనం తెలుసుకోవాలి. —- శరీరము అనే పదము దీనికి వాడుతున్నారు. కారణశరీరము ఎట్లా క్షయమౌతుంది— ? బ్రహ్మ, ఆత్మల యొక్క ఏకత్వ జ్ఞానము వల్ల ఆత్మ, పరమాత్మలు ఒకటే అనే జ్ఞానము కలగడం తోనే ఈ కారణ శరీరము క్షయమైపోతుంది.

18) సర్వ వ్యాపాకుడైన ఆత్మయే విశ్వానికి జీవశక్తి అయినాడు. అంటే మూలతత్వము. అతని వల్లనే ఇవన్నీ పుడుతున్నాయి. ఆ పరబ్రహ్మలోనే లయమైపోతాయి. కాబట్టి ఆత్మ, పరమాత్మలు ఒకటే అనే జ్ఞానము కలగడంవల్ల శరీరం అనేది మిధ్య అనేది తెలిపోవటంతో ఈ కారణశరీరము పోతుందని భావము. మిగిలేది చిత్తము, జ్ఞాతతో(ఆత్మతో) కూడుకున్నది.దీనినే ప్రాజ్ఞుడు అని అందురు. ఇది నిద్రావస్థ లేదా సుషుప్తావస్థ.

19) మహాకారణ అనగా ఏ తత్వము లేక స్వయం జ్యోతి యై, సర్వసాక్షి అయిన శుద్ధ చైతన్యము నే మహాకారణము అందురు. దీనినే అనుభవజ్ఞులు హిరణ్యగర్భుడు అని అక్షర పురుషుడని ఇంకా అనేక పేర్లతో కొనియాడారు.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹