రామ మందిర 2వ వార్షిక స్థాపన దినోత్సవ శుభాకాంక్షలు Greetings on 2nd Anniversary of the Ram Mandir establishment


🌹 రామ మందిర 2వ వార్షిక స్థాపన దినోత్సవ శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ



🌹 Happy 2nd Anniversary of the Ram Mandir establishment to everyone 🌹

Prasad Bharadwaj


మాఘ వినాయక చతుర్థి, తిల చతుర్ధి, కుంద చతుర్ధి శుభాకాంక్షలు Greetings on Magha Vinayaka Chaturthi, Tila Chaturthi, and Kunda Chaturthi


🌹 మాఘ వినాయక చతుర్థి, తిల చతుర్ధి, కుంద చతుర్ధి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ



🌹 Happy Magha Vinayaka Chaturthi, Tila Chaturthi, and Kunda Chaturthi to everyone 🌹

Prasad Bharadwaj



మాఘ వినాయక చతుర్థి పూజా విధానం Magha Vinayaka Chaturthi & Pooja Procedure


🌹 మాఘ వినాయక చతుర్థి, తిల చతుర్ధి, కుంద చతుర్ధి నాడు ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి..! పూజా విధానం. జనవరి 22.. 🌹

🍀 వినాయక చవితి రోజు వినాయకుడి పూజ చేసుకోలేని వాళ్లు.. అంతే ఫలితం రావాలంటే మాఘ వినాయక చతుర్ధి రోజున వినాయకుడిని పూజించాలి. ఇది కూడా వినాయక చవితి. 🍀

ప్రసాద్ భరద్వాజ


🌹 Performing these rituals on Magha Vinayaka Chaturthi, Tila Chaturthi, or Kunda Chaturthi will bring all auspicious blessings! Pooja procedure. January 22nd.. 🌹

🍀 Those who are unable to perform Ganesh Pooja on Ganesh Chaturthi can worship Lord Ganesha on Magha Vinayaka Chaturthi to receive the same benefits. This is also a Ganesh Chaturthi. 🍀

Prasad Bharadwaj



మాఘ మాసం విష్ణుమూర్తికి, సూర్యనారాయణ మూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. మాఘ మాసంలో శుక్ల పక్షంలో చవితిని లేదా చతుర్ధిని.. మాఘ వినాయక చతుర్ధి అంటారు. తిల చతుర్ధి, కుంద చతుర్థి పేర్లతో కూడా పిలుస్తారు. ఇది చాలా శక్తిమంతమైన రోజు అని పండితులు చెబుతున్నారు. జనవరి 22.. గురువారం.. మాఘ శుక్ల చతుర్థి తిథి వచ్చింది.

ఈ మాఘ శుక్ల చతుర్ధిని తిల చతుర్ధి అని పిలుస్తారు. ఆరోజు తిలలు అంటే నువ్వులు దానం ఇస్తే కోటి సార్లు తిలలు దానం చేసిన ఫలితం కలుగుతుంది. మామూలు సమయంలో నువ్వులు దానం ఇచ్చిన ఫలితం కంటే కోటి రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. అది తిల చతుర్ధికి ఉన్న ప్రాధాన్యత. దేవాలయంలో నువ్వులు దానం ఇవ్వడం వల్ల మామూలు సమయంలో ఇచ్చిన నువ్వుల దానం కంటే కోటి రెట్లు ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.

మాఘ శుక్ల చవితి తిధిని కుంద చవితి లేదా కుంద చతుర్థి అనే పేర్లతో పిలుస్తారు. కుంద పుష్పములు అంటే మల్లె పువ్వులు. మల్లె పూలతో ఈశ్వరుడిని పూజించేటటువంటి చవితి కనుక దీన్ని కుంద చతుర్ధి అంటారు. ఆరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం ఈశ్వరుడి శివ లింగ స్వరూపానికి కానీ ఈశ్వరుడి ఫోటోకి కానీ మల్లె పూలతో పూజ చేయండి. శివుడికి చిమ్మిలి నైవేద్యం పెట్టండి. దాని వల్ల జీవితంలో దంపతుల మధ్య గొడవలు ఉండవని, మంచి జీవిత భాగస్వామి లభిస్తుందని పండితులు తెలిపారు. కుటుంబ జీవితం బాగుండాలంటే జనవరి 22న మల్లెపూలతో శివుడిని పూజించాలన్నారు.

మాఘ శుక్ల చవితి తిథికి మరో గొప్ప ప్రత్యేకత కూడా ఉంది. దీన్ని మాఘ వినాయక చతుర్ధి అనే పేరుతో పిలుస్తారు. మాఘ వినాయక చతుర్ధి సంద్భంగా ఎలాంటి విధివిధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల పనులన్నీ సులభంగా పూర్తవుతాయో, ఆటంకాలన్నీ తొలగిపోతాయో, విఘ్నాలు ఉండవో, మాఘ వినాయక చతుర్ధి రోజున ఎలా పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి లేదా చతుర్ధిని మాఘ వినాయక చతుర్థి అంటారు. సహజంగా వినాయకుడు భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి రోజున పుట్టాడని, ఆ రోజు మనం అంతా వినాయక చవితి చేసుకుంటాం. అయితే, భాద్రపద మాసంలో మహిళలు రజస్వల దోషాల వల్ల, ఏటి సూతకాల దోషాల వల్ల, మైల వల్ల కానీ ఏ ఇతర ఆరోగ్య, వృత్తిపరమైన కారణాల వల్ల కానీ.. వినాయక చవితి రోజు వినాయకుడి పూజ చేసుకోలేని వాళ్లు.. వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకోలేని వాళ్లు.. ఆ రోజున వినాయకుడిని పూజిస్తే ఎంతటి అద్భుతమైన ఫలితం కలుగుతుందో.. అంతే ఫలితం రావాలంటే మాఘ వినాయక చతుర్ధి రోజున వినాయకుడిని పూజించాలి. అందుకే, మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి లేదా చతుర్ధిని మాఘ వినాయక చతుర్ధి అనే పేరుతో పిలుస్తారు. ఇది కూడా వినాయక చవితే.


🌻 పూజా విధానం.. 🌻

ఇంట్లో గణపతి విగ్రహం లేదా ఫోటో ఉంటే గంధం, కంకుమ బొట్లతో అలంకరణ చేయాలి. ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. గణపతికి కొబ్బరి నూనె దీపం, 5 వత్తుల దీపం ఇష్టం. అలాగే గణపతికి ఎర్రటి పూలు, ఎర్రటి వస్త్రాలు అంటే ఇష్టం. ఎర్రటి వస్త్రాలు ధరించి ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీలతో గణపతిని పూజించాలి. గణపతి 108 నామాలు చదువుకోవాలి. అది చదువుకోలేని వాళ్లు గం గణపతయే నమ: అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. గణపతికి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించండి.

ఇలా పూజిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పూజ సమయంలో రెండు మంత్రాలను కచ్చితంగా చదువుకోవాలి. గం క్షిప్రసాదాయ నమ:, వక్రతుండాయ హుం.. ఒక్కో మంత్రాన్ని 21సార్లు చదువుకోవాలి. మీ పనుల్లో ఏడాది పాటు ఆటంకాలు ఉండవు. కోరికలు తొందరగా నెరవేరతాయి. సంకటనాసిక గణేశ స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలని పండితులు తెలిపారు.

🌹🌹🌹🌹🌹

"నారాయణ నారాయణ జయ గోవింద హరే జయ గోపాల హరే" Narayana Narayana (a devotional YT Short)



https://youtube.com/shorts/Dxe2JdiWAvo


🌹 నారాయణ నారాయణ జయ గోవింద హరే జయ గోపాల హరే
Narayana Narayana 🌹



ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹

'దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభా దిగంబరా శ్రీ దత్తాత్రేయ' Sri Pada Vallabha Digambara (a devotional YT Short)


https://youtube.com/shorts/naX71jlb3sE

🌹 దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభా దిగంబరా శ్రీ దత్తాత్రేయ
Sri Pada Vallabha Digambara 🌹



ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

మూడు శతాబ్దాల తర్వాత కేరళలోని నీలా నదిపై జరిగే మహామఘ పండుగ – కేరళ కుంభమేళా The Kerala Kumbh Mela


🌹 మూడు శతాబ్దాల తర్వాత కేరళలో తొలిసారి మహామాఘ మహోత్సవం నీలా నది కేరళ కుంభమేళా 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 After three centuries, the Mahamagha festival is being celebrated for the first time in Kerala on the Nila River – the Kerala Kumbh Mela 🌹
Prasad Bharadwaj


కేరళలో దాదాపు మూడు శతాబ్దాల తర్వాత కుంభమేళా జరుగుతోంది. నీలా నది(Nila river) (భారతపుళ) తీరంలో కేరళ (Kerala) కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన' మహామాఘ మహోత్సవం' ప్రారంభమైంది.

మలప్పురం జిల్లా తిరునవయలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ఈ క్రతువును లాంఛనంగా ప్రారంభించారు. మాహామండలేశ్వర్ స్వామి ఆనందవనం భారతి మహారాజ్ నేతృత్వంలో మొదటి స్నానం నవముకుంద ఆలయ స్నాన ఘాట్‌లో జరిగింది. ఈ ఉత్సవాన్ని 270 ఏళ్ల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత పూర్తిస్థాయిలో నిర్వహించడం చెప్పుకోదగ్గ అంశం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. 1755లో ఈ కుంభమేళా జరిగినట్లు సమాచారం.

50 వేల మందికిపైగా నీలా నదిలో పవిత్ర స్నానాలు

ఫిబ్రవరి 3 వరకు కొనసాగే ఈ కుంభమేళా ఉత్సవానికి కేరళ, తమిళనాడు , కర్ణాటక సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. రోజుకు దాదాపు 50 వేల మందికిపైగా నీలా నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. వేడుకల్లో భాగంగా కాశీ పండితుల ఆధ్వర్యంలో రోజూ సాయంత్రం నీలానది హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు కేరళ ఆర్టీసీ.. 100 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అలాగే, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కేరళ సంప్రదాయ విద్య కలరిపయట్టు, యోగతో పాటు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ కుంభమేళాలో భాగమైన రథయాత్ర కు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది తమిళనాడులోని ఉడుమల్‌పేట సమీపంలోని తిరుమూర్తి కొండ నుంచి సోమవారం ఉదయం రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా ప్రభుత్వం నిలిపివేసింది.

🌹 🌹 🌹 🌹 🌹