🌹. సనాతన ధర్మం లో బహుళ విశ్వ భావనలు : 🌹


*🌹. సనాతన ధర్మం లో బహుళ విశ్వ భావనలు : 🌹*
*✍️. ---భట్టాచార్య, మణి శర్మతో........* 
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻. Science and Spirituality 🌻*

*🌻. బహుళ విశ్వాలు – సమాంతర విశ్వాలు :- 🌻*

ఈ విశ్వం ఒక్కటేనా? లేక అపరిమితంగా విస్తరిస్తున్న అసంఖ్యాక 'బహుళ విశ్వాల్లో (మల్టీవర్స్‌) ఇదొకటా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే విషయంలో ఖగోళ శాస్త్రవేత్తలు రెండుగా చీలిపోయారు. కొందరు అవునని, కొందరు కాదనీ తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఖగోళ శాస్త్రవేత్తల్లో కొందరి వాదన ప్రకారం బిగ్‌ బ్యాంగ్‌ తర్వాత ఈ విశ్వం అపరిమితంగా విస్తరించడం ప్రారంభించింది. చాలా భాగాల్లో ఈ విస్తరణ కొనసాగుతుండగా, కొన్నిచోట్ల మాత్రం నిలిచిపోయింది. ఇలాంటి అసంఖ్యాక విశ్వాలను మహాసాగరంలోని 'బుడగలు'గా శాస్త్రవేత్తలు వర్ణిస్తున్నారు.

   మనకి సమాంతరమైన విశ్వం ఇంకొకటి ఉండే అవకాశం ఉందంటున్నారు డాక్టర్ బ్రైన్ గ్రీన్ అనే శాస్త్రవేత్త.


 *🌻. ది హిడెన్ రియాలిటి: 🌻*

 పారలల్ యూనివర్స్, డీప్ లాస్ ఆఫ్ కాస్మోస్” అనే పుస్తకం రాసిన ఆయన ఇచ్చిన ఒక టివి ఇంటర్వూలో నిరంతరం చలనశీలంగా ఉన్న ఈ ఖగోళ విశ్వంలో, మన ప్రపంచం పక్కనే ఇంకొక ప్రపంచం ఉండవచ్చని చెప్పారు.

        ఖగోళాంతరాలలో ఉన్న ఎన్నో విశ్వాలలో మన విశ్వం ఒకటనీ, వీటిలో కనీసం ఒకటి మన ప్రపంచానికి మిల్లీమీటరు దూరంలో వున్నా వుండవచ్చని డాక్టర్ బ్రైన్ గ్రీన్ లాగా ఎంతోమంది ఖగోళశాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. మన పక్కనే ఉన్నా మన ఇంద్రియాలకు ఈ విశ్వం ఉన్నట్లు అనుభవం అవ్వదు. ఎందుకంటే ఇది మన కళ్ళకి కనిపించే మూడు డైమెన్షన్ (3 dimensions) లకు అతీతంగా ఉంది.

        భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌, బెల్జియం పరిశోధకుడు థామస్‌ హెర్టాగ్‌తో కలసి వెలువరించిన తన చివరి పరిశోధనా పత్రంలో హాకింగ్ ‘బహుళ విశ్వ భావన’ను కొట్టిపారేయలేదు. అయితే ఆ ఖగోళాల సంఖ్యను తగ్గించాడు. చాలా స్వల్ప సంఖ్యలోనే అవి ఉంటాయన్నారు. సైద్ధాంతిక భౌతికశాస్త్రంలోని 'స్ట్రింగ్‌ థియరీ' అనే ఒక విభాగం ఆధారంగా ఈ సూత్రీకరణను చేశారు.

            22 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆండ్రోమెడా గేలక్సీ, మన పాలపుంత వైపు గంటకి 2 లక్షల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మనకి కనిపించని మరో విశ్వం యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల ఇలా రెండు గేలాక్సీలు దగ్గరవుతున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

        సమాంతర విశ్వాలకు సంబంధించిన ఈ అంతరిక్ష రహస్యాన్ని ఛేదించడానికి ప్రపంచమంతా ముందుకి వచ్చింది. ఎన్నో యూరోపియన్ యునియన్ దేశాలతో పాటు తైవాన్, చైనా, రష్యా, అమెరికా ఈ ప్రాజెక్టుకి సహాయపడుతున్నాయి.

        మనం ఇంకొక విశ్వానికి వెళ్ళి చూసి రావచ్చా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే శాస్త్రవేత్తలు ఈ విషయంపై ఇంకా పరిశోధించాల్సి ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే మన శరీర నిర్మాణంలో ఉండే గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంతత్వం మనని ఈ విశ్వానికి కట్టిపడేసి ఉంచుతాయి. అందువల్ల ఇంకొక విశ్వాన్ని చేరాలంటే ముందు వీటిని అధిగమించాల్సి ఉంటుంది. అవి మనని మన విశ్వంలోని నాలుగు డైమెన్షన్ ( పైన కింద, ముందు వెనక, కుడి ఎడమలు, దేశకాలం) నుండి బయటకి రానివ్వవు. మన పక్కనే ఇంకొక విశ్వం ఉండి ఉండచ్చు. కానీ దాన్ని అర్ధం చేసుకోవాలంటే వాటికున్న నిరూపకాలను లేక డైమెన్షన్ లను ముందు మనం అర్ధం చేసుకోవాలి. 

        సైన్స్ ఫిక్షన్ ఆలోచన నుంచి సైన్స్ చెప్పే నిజాల మధ్య ఆలోచిస్తే మన విశ్వంతో పాటు ఈ బ్రహ్మాండంలో మరెన్నో విశ్వాలున్నాయంటున్నారు శాస్త్రజ్ఞులు. ఈ అంశాన్నే “ప్యారలల్ యూనివర్సెస్” (సమాంతర విశ్వాలు) గా అభివర్ణిస్తున్నారు. దీని నుంచి వచ్చిందే “మల్టీవర్స్” (బహుళ విశ్వం) అనే అంశం కూడా.

        సుమారు 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ జగత్తు అంతా ఒక అనంతమైన ఏకత్వంతో నిండి ఉండేది. బిగ్ బాంగ్ సిద్ధాంతం ప్రకారం మనకు తెలియని ఏదో ప్రేరణ వల్ల అదంతా విస్తృతమై 3 డైమెన్షనల్‌గా విస్తరించింది. ఈ విస్తరణ బహుళ సంఖ్యలో ‘పాకెట్ యూనివర్సెస్’ రూపంలో జరిగి ఉండవచ్చని శాస్త్రజ్ఞుల భావన. ఇలా విస్తరించిన ఆ అపారమైన శక్తి అంతా చల్లబడిన తరువాత దాని గుండా కాంతి ప్రసారం జరిగిందని, క్రమంగా చిన్న చిన్న కణాలు, రేణువులన్నీ కలిసిపోయి పెద్ద పెద్ద భాగాలుగా ఏర్పడ్డాయని, శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ విశ్వంలోని సౌరకుటుంబాలు, నక్షత్రాలు, గ్రహాలు అలా ఏర్పడినవే. మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత మన విశ్వాన్ని దాటి గమనించడానికి అనుకూలంగా లేదు.

        ఈ బహుళ విశ్వ భావన, హైందవ విశ్వోద్భవ శాస్త్రానికేమీ కొత్త కాదు. ఈ భావనను తెలియజేసిన మన ప్రాచీన హిందూ గ్రంథాలలో భాగవతం మొదటిది. ఇందులో బహుళ విశ్వాల గురించి, వాటి మధ్య ఉండే సంబంధాల గురించి వివరించబడి ఉంది.

"వైదిక విశ్వోద్భవ శాస్త్రం ప్రకారం, లెక్కలేనన్ని విశ్వాలు ఉన్నాయి, ఇవి కారణ మహాసముద్రం (లేక కారణ వైకుంఠం) యొక్క ఉపరితలం మీద నురుగులాగా ఉంటాయి. ప్రతి విశ్వమూ ఒక కర్పరం చేత కప్పబడి ఉంటుంది. ఈ విశ్వాలన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఉన్నప్పటికీ వాటి మధ్య పరస్పర చర్య సాధ్యం కాదు.

"బ్రియాన్ పెన్ ప్రేస్"... అనే శాస్త్రవేత్త, భాగవత గ్రంథం లోని ఒక శ్లోకం (6.16.37) యొక్క అర్థాన్ని, తాను వ్రాసిన *“ది పవర్ ఒఫ్ స్టార్స్”* అనే గ్రంథంలో ఇలా వివరించాడు : 

*“ప్రతీ విశ్వాన్ని ఆవరించుకొని ఏడు పొరలు ఉంటాయి. అవి – భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, శక్తి మరియు అహం. ఇందులో ప్రతీ పొర లేక ఆవరణము తనకు ముందున్న పొర కన్నా పది రేట్లు పెద్దది గా ఉంటుంది. ఇలాంటి విశ్వాలు అసంఖ్యాకంగా ఉంటాయి. అవి అనంతమైన పరిమాణంలో ఉన్నప్పటికీ అవి నీలోని పరమాణువుల వలే చలిస్తూ ఉంటాయి. కాబట్టే నువ్వు (భగవంతుడు) అనంతుడవని చెప్పబడ్డావు.”*

*భాగవతం 3.11.41. ఇలా చెబుతుంది :“...అన్ని విశ్వాలూ సమావృతమై భారీ అణువుల సముదాయంగా కనబడతాయి.”*

*భాగవతం 10.14.11 ఇలా చెబుతుంది : “...... ధూళి రేణువులు ఎలాగైతే తెరిచి ఉంచిన కిటికీల గుండా ప్రవేశిస్తాయో, అలాగే అసంఖ్యాక విశ్వాలు నీ శరీరం యొక్క రోమ కూపాల గుండా ప్రవేశిస్తున్నాయి.*  

*భాగవతం 2-5-40-41 ఇలా చెబుతుంది:*
 *“ప్రియమైన పుత్రా నారదా! మొత్తం 14 లోకాలలో ఏడు లోకాలు అధో భాగంలో ఉన్నాయి. మొదటి లోకమైన ‘అతల’ నడుము పై ఉన్నది. రెండవదైన ‘వితల’ తొడలపై ఉన్నది. మూడవదైన ‘సుతల’ మోకాళ్ళపై ఉన్నది. నాలుగవదైన ‘తలాతల’ మోకాలు క్రింది భాగంలో, ఐదవదైన ‘మహాతలం’ కాలి మడమ పై, ఆరవదైన ‘రసాతలం’ పాదం యొక్క పై భాగంలో, ఏడవ దైన ‘పాతాళం’ అరికాలు లోనూ ఉన్నాయి. ఈ విధంగా భగవంతుని విరాట్ రూపం లో అన్ని లోకాలూ ఉన్నాయి.”*

మొత్తం పదునాలుగు లోకాలలో ఏడు ఊర్ధ్వ లోకాలు, ఏడు అథో లోకాలు గా చెప్పబడ్డాయి. 

ఏడు ఊర్ధ్వ లోకాలు – భూ, భువ, సువ, మహా, జనో, తపో, సత్య లోకాలు.

ఏడు అథో లోకాలు – అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు.

*మనం నివసిస్తున్న భూమి వంటివి ఈ సృష్టిలో కోటానుకోట్లు ఉంటాయని విష్ణు పురాణం చెబుతుంది. బ్రహ్మ వైవర్త పురాణంలో సమాంతర విశ్వ భావన కనిపిస్తుంది.*

పరమాత్మను “అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు” అని చెబుతారు. మనం నివసిస్తున్న భూమి ఒక సౌరమండలంలో ఉంది. అట్లాంటి ఎన్నో మండలాలు కలిస్తే ఒక ‘అండం’ అని అంటారు. అలాంటి అనంతమైన ఎన్నో అండాలు కలిస్తే ఒక ‘బ్రహ్మాండం’. అలాంటి అనంతమైన బ్రహ్మాండాలు కలిపితే అది “లీలా విభూతి” అని అంటారు. అయితే ఈ లోకాలన్నిటికీ సృష్టి, ప్రళయాలు ఉంటాయి.

*భగవంతుడు ఏర్పర్చుకున్న కార్య వైకుంఠం నుండి సృష్టి- స్థితి - లయాలు జరుగుతాయి. వీటన్నింటికీ కారణమైన ‘కారణ వైకుంఠం’ లేక ‘పరమపదం’ విరజ అనే నదికి అవల ఉంటుంది. అది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి దానిని "నిత్యం" అని వ్యవహరిస్తారు. దాన్నే ‘నిత్య విభూతి’ అని అంటారు. విరజా నదికి క్రింద ఉన్నది ‘లీలా విభూతి’, పైన ఉన్నది ‘నిత్య విభూతి’. నిత్య విభూతి లీలా విభూతికి మూడు రెట్లు ఉంటుంది. లీలా విభూతికి ఎంత క్రిందకు వెళ్ళినా అంతం ఉండదు. నిత్య విభూతికి పైన అంతం ఉండదు. అందుకే పరమాత్మకి ‘ఉభయ విభూతి నాయకుడు’ అని పేరు. విభూతి అంటే సంపద అని అర్థం.*

ఉపపరమాణు స్థాయిలో బహుళ విశ్వాలు లేక సమాంతర విశ్వాలు ఉంటాయని 'యోగ వాశిష్టం' చెబుతుంది. మనకు అనుభవంలోకి రాని అనేక నిరూపకాలు (dimensions) ఉన్నాయని, ఆ నిరూపకాలలో అనేక విశ్వాలుంటాయని, నేడు శాస్త్రవేత్తలు భావిస్తున్న 'బహుళ విశ్వ భావన' (Multiverse Theory) లేక 'సమాంతర విశ్వ భావన' (Parallel Universes) తో ఇది సరిపోలుతోంది.

వైదిక భౌతిక శాస్త్రం ప్రకారం మన విశ్వం లోని అంతరాళం బహు నిరూపకాలతో కూడినది. మన విశ్వంలో ప్రధానంగా 64 నిరూపకాలు ఉన్నాయని వైదిక వాఙ్మయం చెబుతుంది. ఇందులో ప్రతీ నిరూపకము అనేక ఉప నిరూపకాలుగా విభజింపబడి ఉంటుంది. భూలోక వాసులు 3 నిరూపకాలను కలిగిన ప్రపంచాన్ని మాత్రమే చూడగలరు లేదా అనుభూతి చెందగలరు. అంతకు మించి నిరూపకాల స్థాయిలో ఉన్న విశ్వం యొక్క వాస్తవికతను వారు తమ ఇంద్రియాల ద్వారా అనుభూతి చెందలేరు. అందుకే మనం ఎక్కువ నిరూపకాల స్థాయి కలిగిన లోకాలను, ఆ లోక వాసులను చూడలేక పోతున్నాము. అంతే కాక వైదిక భౌతిక శాస్త్రం ప్రకారం వివిధ స్థాయిలకు చెందిన లోకాలలో కాలం వివిధంగా ఉంటుంది. ఇదే విషయాన్ని ఐన్ స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతంలో వివరించారు.

వీటన్నిటినీ పరిశీలిస్తే ‘బహుళ విశ్వాలు’ లేక ‘సమాంతర విశ్వాలు’ అనే భావన వైదిక వాఙ్మయం లో ప్రాచీన కాలంలోనే చెప్పబడి ఉందని తెలుస్తోంది.
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ లలితా సహస్ర నామములు - 79 / Sri Lalita Sahasranamavali - Meaning - 79


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 79 / Sri Lalita Sahasranamavali - Meaning - 79 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 151

సత్యఙ్ఞానానందరూపా సామరస్యాపరాయణా

కపర్ధినీ కళామాలా కామధుక్ కామరూపిణీ

791. సత్యఙ్ఞానానందరూపా :
సచ్చిదానందరూపిణీ

792. సామరస్యాపరాయణా :
జీవుల యెడల సమరస భావముతో ఉండునది

793. కపర్ధినీ :
జటాజూటము కలిగినది (జటాజూటధారీఇన శివునకు కపర్ధి అను పేరు కలదు)

794. కళామాలా :
కళల యొక్క సమూహము

795. కామధుక్ :
కోరికలను ఇచ్చు కామధేనువు వంటిది

796. కామరూపిణీ : కోరిన రూపము ధరించునది

🌻. శ్లోకం 152

కళానిధి: కావ్యకళా రసఙ్ఞా రసశేవధి:

పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా

797. కళానిధి: :
కళలకు నిధి వంటిది

798. కావ్యకళా :
కవితారూపిణి

799. రసఙ్ఞా :
సృష్టి యందలి సారము తెలిసినది

800. రసశేవధి: :
రసమునకు పరాకాష్ట

801. పుష్టా :
పుష్ఠి కలిగించునది

802. పురాతనా ;
అనాదిగా ఉన్నది

803. పూజ్యా ;
పూజింపదగినది

804. పుష్కరా :
పుష్కరరూపిణి

805. పుష్కరేక్షణా ;
విశాలమైన కన్నులు కలది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 79 🌹

📚. Prasad Bharadwaj

🌻 Sahasra Namavali - 79 🌻

791) Satya gnananda roopa -
She who is personification of truth, knowledge and happiness

792) Samarasya parayana -
She who stands in peace

793) Kapardhini -
She who is the wife of Kapardhi (Siva with hair)

794) Kalamala -
She who wears arts as garlands

795) Kamadhukh -
She who fulfills desires

796) Kama roopini -
She who can take any form

797) Kala nidhi -
She who is the treasure of arts

798) Kavya kala -
She who is the art of writing

799) Rasagna -
She who appreciates arts

800) Rasa sevadhi -
She who is the treasure of arts

801) Pushta -
She who is healthy

802) Purathana -
She who is ancient

803) Poojya -
She who is fit to be worshipped

804) Pushkara -
She who gives exuberance

805) Pushkarekshana -
She who has lotus like eyes

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi

31.Aug.2020

నారద భక్తి సూత్రాలు - 82


🌹. నారద భక్తి సూత్రాలు - 82 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము - సూత్రము - 50

🌻 50. స తరతి స తరతి స లోకాంస్తారయతి ॥ - 1 🌻

అటువంటి పరాభక్తుడు తాను గమ్యం చేరడమే గాక, లోకంలో చాలామంది తరించడానికి ఉపకరణమవుతాడు. ఇట్టివాడు భాగవతోత్తముదై, భగవంతుని చేతిలో పరికరమవుతాడు.

యోగ్యతగల భక్తులకు ఇతని ద్వారా భగవంతుడు అనుగ్రహాన్ని ప్రనాదిస్తాడు. ఈ రకమైన పరాభక్తులు భగవంతునికి, భక్తునికి మధ్య అనుసంధాన కర్తలుగా ఉంటారు. వీరు భగవంతునితో సమానులు.

బ్రహ్మ భూతః ప్రసన్నాత్మా నశోచతి న కాంక్షతి

సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్‌ ॥

- (18:54) భగవద్దిత

తా॥ సచ్చిదానందఘన పరబ్రహ్మయందు ఏకీభావ స్థితుడై, ప్రసన్న మనస్మ్కుడైన యోగి దేనికీ శోకించడు. దేనినీ కాంక్షించడు. సమస్త ప్రాణులందు సమభావం ఉన్న యోగి పరాభక్తిని పొందుతాడు. పరే భాగవతోత్తములు.

భక్తుడు యోగ్యుడైతేనె భగవదనుగ్రహం పొందుతాడు. గనుక సాధకుడు సాధించె సాధనా స్థితిగతులను భగవద్గిత తెలియచెస్తున్నది. ఒక్కొక్క స్థితిని ఈ క్రింది విధంగా అధిగమించి, యోగ్యత సంపాదించాలి. చివరకు స్థిరమైన, శాశ్వతమైన పరమప్రేమ స్థితిని పొందుతాడు భక్తుడు.

1) _ ఆత్మ వశ్యైర్విధయాత్మా ప్రసాద మధిగచ్చతి ॥ - (2:64) భగవద్గిత

ఆత్మకు వశమైన బుద్ధితో జీవించడం వల్ల “ప్రసాదం” అనగా ఇచ్చెవాడు, పుచ్చుకునేవాడు అనె విభజన ఉన్న జీవేశ్వర భిన్నత్వం అనె స్థితిని అధిగమిసాడు. ఎ రకంగానూ దుఃఖాన్ని దగ్గరకు చేరకుండా ఉంచే మోదాన్ని ప్రసాదమంటారు. క్రసాద స్థితిలో ఈశ్వరునకు మనసు, బుద్ధి, చిత్తం లొంగి ఉంటాయి.

ఆ బుద్ధి భెద భావాన్ని పాటించదు. మనసు విషయాసక్తం కాదు. ఈ శుద్ధ బుద్ధి ఆత్మ స్థితిని గ్రహించి, దానికి వశమై వర్తిస్తూ జీవేశ్వర భిన్నత్వాన్ని వోగొట్టుకొంటుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

31.Aug.2020

శివగీత - 48 / The Siva-Gita - 48




🌹. శివగీత - 48 / The Siva-Gita - 48 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ
ఏడవ అధ్యాయము

🌻. విశ్వరూప సందర్శన యోగము - 2 🌻

శ్రీభగవానువాచ:-

మయి పర్వం యథా రామ! - జగచ్చైత చ్చరా చరమ్,
వర్తతే తద్దర్శయామి - నద్రుష్టం క్షమతే భవాన్ 10

దివ్యం చక్షు: ప్రదాస్యామి - తుభ్యం దాశరథాత్మజః !
తేన పశ్య భయం త్యక్త్వా - మత్తేజో మడలం ధ్రువమ్ 11

న చర్మ చక్షుషా ద్రష్టుం - శక్యతే మామకం మహః,
నరేణ వా సురేణాపి - తన్మ మాను గ్రహం వినా 12

ఓ రామా! ఈ చరాచరాత్మక మైన ప్రపంచ మంతయు నా యుదరంబున లీనంబైయున్నది. దానిని నీవు చూచుటకై నీకు శక్తి చాలదు. ఈ చర్మ చక్షువులతో మానవుడైనను దేవుడైనను నా కరుణాకటాక్షము లేక నా తేజో మండలమును కనుగొనలేడు. కావున, ఓయీ! దాశరథీ ! నీకు దివ్యదృష్టిని ఇచ్చుచున్నాను. నిర్భయుండవై నా తేజస్సును చక్కగా చూడుము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹  The Siva-Gita - 48  🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 07 :
🌻 Vishwaroopa Sandarshana Yoga - 2
🌻

Sri Bhagavan said:

O Rama! This entire mobile and immobile creation dwells inside my belly. You do not have enough strength and capability to witness that scene. With these eyes of flesh neither human nor god can ever be able to see my brilliant cosmic form without my grace.

Therefore, O son of Dashratha! I'm giving you divine eyes (divya drishti) do not fear and properly see my divine cosmic form.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

31.Aug.2020

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 39 / Sri Gajanan Maharaj Life History - 39


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 39 / Sri Gajanan Maharaj Life History - 39 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 8వ అధ్యాయము - 4 🌻

శ్రీమహారాజు దగ్గర నుండి వీళ్ళు కొంత ధనం పొందే ఆశతో వచ్చారు. వీళ్ళు వచ్చినప్పటికి శ్రీమహారాజు నిద్రపోతున్నారు. శ్రీమహారాజును లేపేందుకు ఈ బ్రాహ్మణులు, గట్టిగా వేదపఠనం చెయ్యడం మొదలు పెడతారు. వారి ఆపఠనంలో ఒకచోట కొద్దిగా తప్పు అవుతుంది, కాని దానిని వాళ్ళు సరిదిద్దలేదు.

అందుకని శ్రీమహారాజు లేచి, మీరు వైదికులు ఎందుకు అయ్యారు ? వేదంయొక్క ప్రాముఖ్యతను మీరు అనవసరంగా దిగజార్చు తున్నారు. ఈవిద్య వ్యాపారం చేసేందుకు కాదు, మనుష్యులను ఉద్ధరించడానికి. మిమ్మల్ని వైదికులుగా సూచించే మీతలకున్న అలంకరణ కయినా కనీసం కొంత గౌరవం ఇవ్వండి.

ఇప్పుడు నేను చదువుతాను మీరు మరల దానిని నేను ఎలాచదివేనో అలా అనండి. అమాయకులను మోసగించకండి, అని వాళ్ళతో అన్నారు. అలా అంటూ, ఈ బ్రాహ్మణులు తప్పుగా చదివిన వేద అధ్యాయాన్ని శ్రీమహారాజు పఠించారు. ఈయన ఉఛ్ఛారణ స్వఛ్ఛంగా, గట్టిగా ఉంది. మరియు ఈయన పఠనంలో ఒక్కతప్పు కూడాలేదు.

వశిష్ఠుడు స్వయంగా ఈపవిత్ర వేదపఠనం చేస్తున్నట్టు అనిపించింది. బ్రాహ్మణులు దిగ్ర్భాంతిచెంది తలలు ఎత్తడానికి కూడా సిగ్గుపడ్డారు. సూర్యుని ముందు క్రొవొత్తిలా అనిపించింది. శ్రీమహారాజును, బ్రాహ్మణులు ముందు ఒక పిచ్చివానిగా భావించారు, ఇప్పుడు తెలిసింది. ఆయన ఒక గొప్ప పండితుడని.

శ్రీమహారాజు భగవంతుని అవతారమని, బ్రాహ్మణ కులస్తుడని, అన్నిటికి అతీతుడయిన ఒక గొప్ప యోగి అని, తమయొక్క పూర్వజన్మ కృతులవల్ల ఇటువంటి భగవంతుడి లాటి యోగి దర్శన భాగ్యంకలిగిందని వారికి అనిపించింది.

ఖాండుపాటిల్ను వీళ్ళకు ఒక్కొక్క రూపాయి ఇవ్వవలసిందిగా శ్రీమహారాజు కోరారు. బ్రాహ్మణులు దానిని స్వీకరించి సంతోషంగా వెళ్ళిపోయారు. శ్రీమహారాజు నిజమయిన యోగుల వలె, షేగాం వాసులతో ఎక్కువ సంబంధం ఇష్టపడేవారు కాదు.

షేగాంకు ఉత్తరంగా ఒకతోట ఉంది. అక్కడ పుష్కళంగా కాయగూరలు పండించబడుతూ ఉండేవి. ఆతోటలో ఒక వేపచెట్టు యొక్క చల్లని నీడలో ఒక శివమందిరం ఉండేది. కృష్ణాజిపాటిల్ దాని యజమాని. శ్రీమహారాజు అక్కడకు వెళ్ళి ఆ శివమందిరం దగ్గర ఒక చెట్టుచుట్టూ ఉన్న బండమీద కూర్చుని - నేను కొద్దిరోజులు శివుని దగ్గర ఉండేందుకు నీఈతోటకి వచ్చాను.

దేవాది దేవుడయిన శివభగవానుడు ఈతోటలో ఉండడానికి ఇష్టపడ్డారు కనుక నేను కూడా ఆయన దగ్గర ఉండేందుకు కోరుకున్నాను. కనుక నాకొక చిన్నపందిరి నిలబెట్టమని కృష్ణాజితో అన్నారు. వెంటనే కృష్ణాజి ఒక చక్కని పందిరి నిలబెట్టించాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 39 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj

🌻 Chapter 8 - part 4 🌻

They came to Shri Gajanan Maharaj with the hope of getting some money from Him. When they came, Shri Gajanan Maharaj was sleeping. The Brahmins started reciting Vedic hymns loudly to awaken Shri Gajanan Maharaj .

There was some mistake in their recitation, but they did not correct it, so Shri Gajanan Maharaj got up and said to them, Why have you become Vedic? You are lowering the greatness of Vedas unnecessarily.

This knowledge is not for the purpose of running a business but for the salvation 0f human beings. At least show some respect to the saffron head dress, which indicates that you are a Vedic. I will now recite the hymns and you repeat the same as I pronounce. Do not misguide innocent poor believers.

Saying so Shri Gajanan Maharaj recited the same chapter of Vedas that was recited incorrectly by these Brahmins; his pronunciation was clear, loud and his recitation, errorless. It appeared as if Vashistha himself was reciting the holy Vedas.

The Brahmins were astonished and felt embarrassed to even lift their faces. The analogy can be compared to a lit candle fantasizing that it has better capacity to spread light around itself than the mighty sun.

The Brahmins first thought that Shri Gajanan Maharaj was a mad person, but now found Him to be a learned saint. They were convinced that all the four Vedas were on the tip of His tongue.

They took Shri Gajanan Maharaj a to be a God incarnate and a Brahmin by caste - a yogi free of any bondage or attachment, and because of their good deeds of previous life, they believed they were fortunate enough to get the Darshan of such a Godly saint.

Shri Gajanan Maharaj a asked Khandu Patil to give them a rupee each as dakshina. The Brahmins accepted this dakshina and happily went away. Shri Gajanan Maharaj , like a true saint, disliked the attachment of Shegaon’s locals. In the northern region of Shegaon there was a garden where vegetables were grown in abundance.

Under the cool dark shade of a neem tree, there was a temple of Lord Shiva in the Garden. Krishnaji Patil owned the temple. Shri Gajanan Maharaj went there and sat on a platform under a tree near the Shiva temple and said to Krishnaji, I have come to your garden to stay here for a few days near Lord Shiva.

Lord Shiva is the God of all Gods and since He liked to stay in your garden, I too wish to be near Him. So erect a small shade for me here. Krishnaji thereupon got erected a tin shade on the platform.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

31.Aug.2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 30


🌹.  భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 30  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని శరీరి : నాల్గవ పాత్ర (రూపధారణము) - 2 🌻

114. ఒకేసారి సంస్కారములు లేని ఆత్మకు, ప్రథమముగా సంస్కారమును, చైతన్యమే లేని ఆత్మకు ప్రథమముగా చైతన్యమును కలిగినవి. ఇట్లు కలిగిన ప్రథమ సంస్కారము పరమాణు ప్రమాణమైన స్థూల సంస్కారము.

115. అనంత శాశ్వత (A) పరమాత్మ పొందిన చైతన్యము అత్యంత పరిమితమైన స్థూల సంస్కారము మూలముగా పొందిన అత్యంత పరిమిత స్థూల చైతన్యమేగాని అది ... ... తన అనంత స్థితియొక్క చైతన్యమునుగాదు, లేక (B) స్థితిలోని అనంతపరమాత్మయైన తన స్వీయ చైతన్యమును గాదు.

116. అవిభాజ్యమైన ఆత్మయొక్క తొలి చైతన్యము, తొలి రూపము ద్వారా తొలి సంస్కార అనుభవమును పొందుచూ, ఆత్మలో ఒక మనోప్రవృత్తిని సృష్టించుచున్నది. అదియేమనగా - పరమాణు ప్రమాణములో పరిమితము, స్థూలము అయిన తొలిరూపముతోడనే తన శాశ్వత అనంత పరమాత్మతో సాహచర్యము చేసి, తాదాత్మ్యము చెందునట్టి ప్రవృత్తిని సృష్టించుచున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

31.Aug.2020

శ్రీ శివ మహా పురాణము - 211


🌹 .   శ్రీ శివ మహా పురాణము - 211  🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

46. అధ్యాయము - 1

🌻. సంక్షేప సతీచరిత్రము - 4 🌻

జీవతస్తేన దక్షో హి తత్ర సర్వే హి సత్కృతాః | పునస్స కారితో యజ్ఞ శ్శంకరేణ కృపాలునా || 39

రుద్రశ్చ పూజితస్తత్ర సర్వై ర్దేవైర్వి శేషతః | యజ్ఞే విష్ణ్వాదిభిర్భక్త్యా సుప్రసన్నాత్మభిర్మునే || 40

సతీదేహ సముత్పన్నా జ్వాలా లోక సుఖావహా | పతితా పర్వతే తత్ర పూజితా సుఖదాయినీ || 41

జ్వాలా ముఖీతి విఖ్యాతి సర్వకామ ఫలప్రదా | బభూవ పరమా దేవీ దర్శనా త్పాపహారిణీ || 42

ఆయన దక్షుని జీవింపజేసి, అందరినీ సత్కరించెను. కృపానిధి యగు శంకరుడు మరల ఆ యజ్ఞమును చేయించెను (39).

ఆ యజ్ఞములో దేవతలందరు విష్ణువును ముందిడుకొని ప్రసన్నమగు మనస్సు గలవారై భక్తితో రుద్రుని ప్రత్యేకముగా పూజించిరి (40).

ఓ మహర్షీ! సతియొక్క దేహము నుండి పుట్టినట్టియు, లోకములకు సుఖమనిచ్చు జ్వాల పర్వతమునందు పడెను. అచట ఆమెను పూజించినచో సుఖములనిచ్చును (41).

ఆ పర్వతమునందు సర్వకామనలనీడేర్చునట్టియు, దర్శనముచే పాపములను పోగొట్టు ఆ దేవదేవి జ్వాలాముఖియను పేర ప్రసిద్ధిని గాంచెను (42).

ఇదానీం పూజ్యతే లోకే సర్వకామఫలాప్తయే | సంవిధాభి రనేకాభిః మహోత్సవ పురస్సరమ్‌ || 43

తతశ్చ సా సతీ దేవీ హిమాలయ సుతాsభవత్‌ | తస్యాశ్చ పార్వతీ నామ ప్రసిద్ధమభవత్తదా || 44

సా పునశ్చ సమారాధ్య తపసా కఠినేన వై | తమేవ పరమేశానం భర్తారం సముపాశ్రితా || 45

ఏ తత్సర్వం సమాఖ్యాతం యత్పృష్టోహం మునీశ్వర | యచ్ఛ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః || 46

ఇతి శ్రీ శివ మహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సతీసంక్షేప చరిత్ర వర్ణనం నామ ప్రథమః అధ్యాయః (1).

ఇప్పటికీ ఆమె లోకమునందు, కోర్కెలన్నియు ఈడేరి ఫలములు లభించుటకై మహోత్సవ పూర్వకముగా అనేక తెరంగులలో పుజింపబడుచున్నది (43).

ఆ తరువాత ఆ సతీదేవి హిమాలయుని కుమార్తె అయెను. అపుడామెకు పార్వతియను పేరు ప్రఖ్యాతమాయెను (44).

ఆమె మరల కఠోరమగు తపస్సును చేసి ఆ పరమేశ్వరుని భర్తగా పొందెను (45).

ఓమునిశ్రేష్ఠా! నీవు నన్ను ప్రశ్నించిన విషయములనన్నిటినీ చెప్పతిని. దీనిని విన్నవారి పాపములన్నియు తొలగిపోవుననటలో సందేహము లేదు (46).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితములో రెండవ ఖండలో సతీసంక్షేప చరిత్ర వర్ణనము అనే మొదటి అధ్యాయము ముగిసినది (1).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

31.Aug.2020

శ్రీ మదగ్ని మహాపురాణము - 82


🌹.   శ్రీ మదగ్ని మహాపురాణము - 82  🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 33
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అథ పవిత్రారోపణ విధానమ్‌‌‌ - 2 🌻

ఆచార్యాణాం చ సూత్రాణి పితృమాత్రాదిపుస్తకే. 12

నాభ్యన్తం ద్వాదశగ్రన్థిం తథా గన్ధపవిత్రకే | అఙ్గలాత్కల్పనాదౌద్విర్మాలా చాష్టోత్తరం శతమ్‌. 13

అథవార్కచతుర్వింశషట్త్రింశన్మాలికా ద్విజ | అనామామధ్యమాఙ్గుష్ఠైర్మన్దాద్యైర్మాలికార్థిభిః. 14

కనిష్ఠాదౌ ద్వాదశ వా గ్రన్థయః స్యుః పవిత్రకే | రవేః కుమ్భహుతాశాదేః సమ్భవీ విష్ణువన్మతమ్‌. 15

పీఠస్య పీఠమానం స్యాన్మేఖలాన్తే చ కుణ్డకే | యథాశక్త సూత్రగ్రన్థిః పరిచారే7థ వైష్ణవే. 16

సూత్రాణి వా సప్తదశ సూత్రేణ త్రివిభక్త కౌ |

ఆచార్యునికొరకును, తలిదండ్రులకొరకును, పుస్తకముపై ఉంచుటకొరకును నిర్మింపబుడు పవిత్రకమునాభిప్రదేశమువరకును వ్రేలాడవలెను. దీనికి పండ్రెండు ముడులు ఉండవలెను. దానిపై మంచి గంధము పూయవలెను.

వనమాలయందు రెండేసి అంగుళములదూరమున క్రమముగా నూటఎనిమిది ముడులు వేయవలెను. లేదా కనిష్ఠ-మధ్యదు-ఉత్తమపత్రకములపై క్రమముగా పండ్రెండు, ఇరువదినాలుగు, ముప్పదియారుముడులు వేయవలెను.

మంద-మధ్యమ-ఉత్తమమాలార్థు లగ పురుషులు అనామికా-మధ్యమా-అంగుష్ఠములచేతనే పవిత్రకములను గ్రహింపవలెను. లేదా కనిష్ఠకాది నామధేయములు గల పవిత్రకములందు అన్నింటియందును పండ్రెండేసి ముడులే ఉండవలెను.

(తంతువుల సంఖ్యను పట్టియు, పొడవును పట్టియు ఈ కనిష్ఠికాదినామదేయము లేర్పడినవి). సూర్యునకు, కలశమునకు, అగ్ని మొదలగు వాటికిని గూడ యథాసంభవముగ భగవంతు డగు విష్ణువునకు వలెనే పవిత్రకములను అర్పించుట ఉత్తమ మని చెప్పబడినది. పీఠముకొరకు దాని పొడవును పట్టియు, కుండమునకు దాని మేఖలపర్యంతమును పొడవు గల పవిత్రకముండవలెను.

విష్ణుపార్షదులకు యథాశక్తిగ సూత్రగ్రంథులను సమర్పింపవలెను. లేదా గ్రంథులు లేకుండ పదునేడు సూత్రములు సమర్పింపవలెను. భద్రుడను పార్షదునకు త్రిసూత్రము సమర్పింపవలెను.

ఏకాదశ్యాం యాగగృహే భగవన్తం హరిం యజేత్‌. 18

సమస్తపరివారాయ బలిం పీఠే సమర్చయేత్‌ | క్షౌం క్షేత్రపాలాయ ద్వారాన్తే ద్వారోపరి శ్రియమ్‌. 19

ధాత్రే దక్షే విధాత్రే చ గఙ్గాం చ యమునాం తథా | శఙ్ఖపర్మనిధీ పూజ్య మధ్యే వాస్త్వపసారణమ్‌. 20

సారఙ్గాయేతి భూతానాం భూతశుద్ధిం స్థితశ్చరేత్‌ |

ఓం హూం హః ఫట్‌ హ్రూం గన్ధతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రరూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

పఞ్చోద్ఘాతైర్గన్థతన్మాత్రస్వరూపం భూమిమణ్డలమ్‌ |

చతురస్రం చ పీతం చ కఠినం వజ్రలాఙ్ఛితమ్‌.

ఇన్ద్రాధిదైవతం పాదయుగ్మమధ్యగతం స్మరేత్‌ |

శుద్ధం చ రసతన్మాత్రం ప్రవిలాప్యాథ సంహరేత్‌ 7

రసమాత్రం రూపమాత్రే క్మరమేణానేన పూజకః. 22

పవిత్రమును గోరోచనముతోను, అగురుకర్పూరములు కలిపిన పసుపుతోను, కుంకుమరంగుతోను పూయవలెను. భక్తుడు ఏకాదశీదివసమున స్నానసంధ్యాదులు చేసి, పూజగృహము వ్రవేవించి, భగవంతుడగు శ్రీహరిని పూజింపవలెను.

విష్ణువుయొక్క సమస్తపరివారమునకును బలి సమర్పించి విష్ణువును పూజింపవలెను. ద్వారముయొక్క అంతమునందు ''క్షం క్షేత్రపాలాయ నమః'' అని చెప్పి క్షేత్రపాలపూజ చేయవలెను.

ద్వారము పై భాగమున ''శ్రియై నమః'' అని చెప్పుచు శ్రీదేవిని పూజించవలెను. ద్వారదక్షిణ (కుడి) దేశమున ''ధాత్రే నమః'' ''గంగాయై నమః'' అను మంత్రము లుచ్చరించుచు, ధాతను, గంగను పూజింపవలెను. ఎడమ వైపున ''విధాత్రే నమః'' ''యమునాయై నమః'' అని చెప్పుచు విధాతను, యమునను, పూజింపవలెను.

ఇదే విధముగ ద్వారముయొక్క కుడి-ఎడమ ప్రదేశములందు క్రమముగ ''శఙ్ఖనిధయే నమః'' పద్మనిధయే నమః''అని చెప్పుచు శంఖపద్మనిధులను పూజింపవలెను.

[పిదప మండపములోపల కుడి హిదము మణవను మూడు మార్లు కొట్టి విఘ్నములను పారద్రోలవలెను].

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం

31.Aug.2020

Twelve Stanzas from the Book of Dzyan - 28


🌹 Twelve Stanzas from the Book of Dzyan - 28 🌹

🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴

STANZA VI
🌻 The Final Battle - 5 🌻

57. Humanity had become obsessed with the idea of gain, the accumulation of material goods. Small and big wars were started with only one aim — to rob one’s neighbours... Sorcerers of black magic rejoiced, devouring lavish food received in the form of bloody vapours.

They did not need to sully themselves through contact with those paltry people, who were prone to slay each other in hand-to-hand combat and were even prepared to blow up the planet simply to clear everything out of her bowels.

People refused to understand that they themselves would perish with all the rest. But greed was simply blinding. And that was playing into the hands of the darkness. The world went mad. The Gorgon reigned supreme in people’s minds.

58. The Great Beacons of the World then arrived on the scene. Sometimes they would appear at one end of the Earth, sometimes at the other.

These were the Sons of God, descended again to the Earth in order to bring the half-crazed world to its senses. People gradually began to wake up to the perception of Truths.

But with the departure of these Great Bearers of Fire, human beings once again attacked each other with weapons, hiding behind the name or banner of the Son of God...

Sorrow filled the Hearts of the Sons of Light, who watched from above as the blood of those whom they had instructed in Love and Forgiveness was shed... Claiming the authority of the Sacred Names and Images, human beings schemed and plotted terrible intrigues.

The darkness was deceptive, claiming to act on behalf of Heaven... The bloody harvest was on, as those who blindly trusted in the darkness were plunged into the gloom of ignorance.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #BookofDzyan #Theosophy

31.Aug.2020

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 47


🌹.  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 47  🌹

📚. ప్రసాద్ భరద్వాజ
చివరి భాగము

🌻. సమాధికి ముందు కాలజ్ఞానము - 2 🌻

ఫాల్గుణ మాసంలో నేను వీరభోగ వసంతరాయులనై శ్రీశైలం వెళ్ళి అక్కడి ధనాన్ని బీదలకు పంచిపెడతాను. తరువాత ఉగ్రమైన తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి నుండి మూడు వరాలు పొందుతాను.

విక్రమ నామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి రోజున బెజవాడ ఇంద్రకీలాద్రికి వస్తాను. అక్కడ ఋషులను దర్శించి, తరువాత కార్తవీర్యార్జున దత్తాత్రేయులవారి వద్ద పలు విద్యలు అభ్యసించి, ఆది దత్తాత్రేయులవారిని దర్శించి, అక్కడి నుండి మహానందికి వెళ్ళి రెండు నెలలు గడుపుతాను. అనంతరం శ్రావణ నక్షత్ర యుక్త కుంభ లగ్నాన వీరనారాయణపురం చేరతాను. అక్కడ 15 దినములు గడుపుతాను.

కలియుగాన 3040 సంవత్సరాలు గడిచిపోయేటప్పటికి పుణ్యతీర్థాలు క్రమ క్రమంగా తమ పవిత్రతను కోల్పోవటం జరుగుతుంది. గంగానది పూర్తిగా అంతర్థానమయిపోతుంది.

ప్రపంచాన ధనమే అన్నింటికీ మూలమౌతుంది. పాతాళ గంగలో నీరు ఇంకిపోతుంది. నూట యిరవై తిరుపతులు నీటిపాలయిపోతాయి. నాలుగు సముద్రాల మధ్య నున్న ధనమంతా శ్రీశైలం చేరుకుంటుంది. సముద్రాలు కలుషితమయిపోతాయి. జల చరములు – ఎక్కడివక్కడే నశించిపోతాయి.

బంగారు గనుల కోసం కొండల్లో బతికేందుకు ప్రజలు మక్కువ చూపుతారు. కాశీనగరంలో కొట్లాటలు జరుగుతాయి. వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఎక్కువ అయిపోతాయి. కలహాలు, కల్లోలాలు మితిమీరిపోయాయి. కుటుంబంలో సామరస్యత వుండదు. వావీ వరసలు వల్లకాట్లో కలుస్తాయి.

సృష్టి మొత్తం తెలిసిన యోగులు పుడతారు. రెంటాల చెరువు క్రింద ఆపదలు పుడతాయి. వినాయకుడు వలవల ఏడుస్తాడు. గోలుకొండ క్రింద బాలలు పట్నాలు ఏలుతారు. శృంగేరి, పుష్పగిరి పీఠాలు పంచాననం వారి వశమవుతాయి. హరిద్వార్ లో మర్రిచెట్టు మీద మహిమలు పుడతాయి. హరిద్వారానికి వెళ్ళే దారి మూసుకుపోతుంది. అహోబిలంలోని ఉక్కుస్థంభం కొమ్మలు రెమ్మలతో, జాజిపూలు పూస్తుంది. నా రాకకు ముందుగా స్త్రీలు అధికారాన్ని అందుకుంటారు. కులాధిక్యత నశించి వృత్తిలో ఎక్కువ తక్కువలు అంటూ లేక అందరూ సమానమయిపోతారు’’

🌻. సమాధి తర్వాత తిరిగి దర్శనం 🌻

నవమి నాటి రాత్రికి సిద్దయ్యను బనగానపల్లెకు పంపి పువ్వులు తెప్పించమని గోవిందమాంబకి ఆదేశించారు స్వామి. వెంటనే సిద్దయ్య బనగానపల్లెకు ప్రయాణం అయ్యాడు.

సిద్దయ్య తిరిగి వచ్చేసరికి స్వామి సమాధిలో ప్రవేశించటం పూర్తయిపోయింది. అది తెలుసుకున్న సిద్దయ్య తీవ్రంగా దుఃఖించి ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. సమాధి నుంచి అది తెలుసుకున్న బ్రహ్మంగారు సిద్దయ్యను పిలిచి, సమాధిపై వున్న బండను తొలగించమని తిరిగి పైకి వచ్చారు.

అప్పుడు సిద్దయ్య కోరిక ప్రకారం ‘పరిపూర్ణ స్థితిని’ బోధించారు.

బ్రహ్మంగారు వైదిక ధర్మమును అవలంభించారు. అయితే, ఎప్పుడూ కుల మతాతీతులుగా ప్రవర్తించారు తప్ప ఏనాడూ సంకుచిత కులాభిమానమును గానీ, మాట ద్వేషమును గానీ ప్రదర్శించలేదు. దూదేకుల కులస్థుడైన సైదులును తన శిష్యునిగా స్వీకరించి, అనేక విషయాలను, శాస్త్ర రహస్యాలను అతనికి వివరించారు.

సమాధి అయిన తరువాత కూడా అతనికే దర్శనమిచ్చి దండ కమండల పాదుకలు, ముద్రికను కూడా ప్రసాదించారు. తమ కొడుకులకు కూడా యివ్వని ప్రాముఖ్యత దూదేకుల సైదులుకు ఇచ్చారు. అతనిని సిద్దునిగా మార్చి, ‘సిద్దా’ అనే మకుటంతో పద్యాలు చెప్పారు. అలాగే కడప, బనగానపల్లె, హైదరాబాదు, కర్నూలు నవాబులకు జ్ఞానబోధ చేసి శిష్యులుగా స్వీకరించారు.

🌻. కందిమల్లాయపాలెం – చింతచెట్టు 🌻

కందిమల్లాయపాలెంలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి యింటి ఆవరణలో, 14,000 కాలజ్ఞాన పత్రాలను పాత్రలో దాచారు. పైన ఒక చింతచెట్టు నాటినట్లు తెలుస్తోంది. అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి వుంటుంది. ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు, మరేవైనా ప్రమాదాలు కలిగే ముందు, సూచనగా ఆ చెట్టుకు వున్న మొత్తం పూత ఒక రాత్రికే రాలిపోయి, జరగబోయే అశుభాన్ని సూచిస్తుంది.

అలాగే ఈ చెట్టుక్కాసిన చింతకాయలు లోపల నల్లగా వుండి, తినడానికి పనికి రాకుండా వుంటాయి. చెట్ల పంగ నుండి ఎర్రని రక్తము వంటి ద్రవము కారి, గడ్డ కట్టి కుంకుమలా వుంటుందట. దాన్ని అక్కడి ప్రజలు వ్యాధులు, ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు. బనగానపల్లెలో వున్న వృద్దులందరూ ఆ చెట్టు గూర్చి చెప్పగలుగుతారు.

ఆ చింతచెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే వుంటుంది.

ఓం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామియే నమః 🙏

🌻. సమాప్తం... 🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కాలజ్ఞానం

31.Aug.2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 142


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 142 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. ఆరోగ్యము 🌻

మనస్సు నందు ఏర్పడే సంకల్పాలు, వికల్పాలు ప్రాణశక్తిని సంచాలనం చేస్తే ఆ‌ ప్రాణశక్తి యొక్క వైఖరిని అనుసరించి మన శరీరంలోని భాగాలు నిర్మాణమై పని చేస్తాయి.

కనుక మన ఆరోగ్యము అను స్థితి మన మనస్సు, ప్రాణశక్తి, భౌతిక శరీరమునకు మధ్యనున్న సమన్వయముపై ఆధారపడి ఉంటుంది. అందువలన మానసిక ఆరోగ్యము చాలా ముఖ్యము.

ఆరోగ్యమనే స్థితే అసలు మనకి సహజ స్థితి. దానిని చెదరకుండా చూచుకొనుటయే మనము ప్రధానముగా అవలంబించవలసినది అని ఆయుర్వేద శాస్ర్తము తెలియజేస్తుంది. ప్రకృతి ధర్మాలను అనుసరించే ఏ శాస్ర్తమైనా దీనినే ప్రతిపాదించింది. నిత్యజీవితంలో ఏ విధానాన్ని అవలంబిస్తే ఈ ఆరోగ్యస్థితి చెదరకుండా ఉంటుందో ఆ విధానాన్ని 'స్వస్థవృత్తము' అను పేరుతో ఆయుర్వేద శాస్ర్తము మనకు అందించింది.

కాని ప్రస్తుతము మానవజాతి ఈ విధానాన్ని అంగీకరించలేని హీన స్థితిలో ఉన్నదని చెప్పాలి. ఎందుకంటే అనారోగ్యంతో పోరాటం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడింది. ఇప్పటి వైద్యరంగంలో దీని వలన పరష్కారం లేదనేది సుష్పష్టము...

....✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

31.Aug.2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 98


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 98 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శంఖలిఖిత మహర్షులు - 4 🌻

19..ప్రతి ఋషివాక్యానికి ఎంతో లోతైన, విశాలమైన, సమస్త జగత్తుకూ హితంచేకూర్చే భావం కలిగిన అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకు వారు చెప్పినవాటిలో, పితృదేవతలను అర్చించటం ఒక విధి. అంటే చచ్చిపోయిన వాళ్ళను అర్చించటం. ‘బ్రతికిఉన్నవాళ్ళకు అన్నంపెట్టమని చెప్పవచ్చుకదా!’ అని తద్దినాలపై ఒక విమర్శ. బ్రతికేవాడికే అన్నంపెట్టమని వారు చెప్పారు.

20. అయితే చనిపోయినవారి పేరుమీద పెట్టమని, వారిని జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పారు. అంటే చచ్చిపోయిన వాడు తింటాడా? వాడికి తద్దినం ఎందుకు పెట్టాలి? అనే ప్రశ్నలకు; పోయినవాడికి శ్రాద్ధం పెట్టి, ఉన్నవాడికే భోజనం పెట్టమన్నారు. అయితే వారు ఈ ఉద్దేశ్యం మరచిపోయి, ఇటువంటి కుతర్కంతో కూడిన వాదనలు మనవారు కొందరు చేస్తూ ఉంటారు.

21. రోజూ ఒక్కమారైనా దేశం కోసం ప్రార్థనచేయాలి. ‘గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు’ అని రోజూ నమస్కరించాలి.

22. అంటే, “గోవు నుంచి సమస్త పశువులు, బ్రాహ్మణులనుంచి సమస్త మానవులు” అని దాని అర్థం. అంతేకాని, గోవులు, బ్రాహ్మణులుమాత్రమే బాగుండాలి, మిగతావారు అక్కరలేదు అని కాదు. అలా ఉండనేఉండదు వైదికమార్గం. ‘గోవులతో మొదలుపెట్టి క్రిమికీటకాదులవరకు, ఒకరికొకరు హానిచేయకుండా ఎవరిబ్రతుకు వాళ్ళు బ్రతుకుతూ శాంతితో ఉందురుగాక! విద్యావంతులు, అవిద్యావంతులు, ధనవంతులు, దరిద్రులు, అంతా సుఖంగా ఉందురుగాక!’

23. రోజూ సంధ్యావందనంలో అనవలసిన మాటలివి. వాళ్ళందరూ సుఖపడాలి అని బ్రహ్మణుడు మూడుసార్లు అనాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

31.Aug.2020

అద్భుత సృష్టి - 19


🌹. అద్భుత సృష్టి - 19 🌹

✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌟. ప్రొటీన్ల తయారీకి DNA ఎలా ఉపయోగపడుతుంది? 🌟

ఇది రెండు దశలలో జరుగుతుంది.

1. మొదటి దశలో-ఎంజైమ్స్ DNA లోని సమాచారాన్ని చదివి మెస్సెంజర్ రైబో న్యూక్లియిక్ ఆమ్లం (mRNA)కు అందజేస్తాయి. DNAకు రైబోసోమ్స్ కి మధ్య mRNA అనేది సమాచార వ్యవస్థను నడిపించి ప్రొటీన్ తయారీలో తన వంతు పాత్రను నిర్వహిస్తుంది.

2. రెండవ దశ:-mRNA లోని సమాచారం ద్వారా అమినో ఆమ్లాల(Amino acids) భాషలోకి అనువదించి శరీరానికి అవసరమైన ప్రొటీన్స్ (బిల్డింగ్ బ్లాక్స్) తయారీ యంత్రాంగానికి సహాయకుడిగా ప్రోటీన్స్ ని తయారు చేసుకుంటుంది. ఇది చాలా పెద్ద పని ఎందుకంటే 20 రకాల అమినోయాసిడ్స్ ఉంటాయి. వీటి ద్వారా రకరకాల ప్రోటీన్స్ ని తయారు చేయవలసి ఉంటుంది.

🌟. DNA ని ఎవరు కనుగొన్నారు?- ( సైన్స్ పరంగా)

1869 సంవత్సరం చివరలో బయోకెమిస్ట్ "ఫ్రైడరిచ్ మీషెర్" మొదటిసారిగా DNA ని కనుగొనడం జరిగింది తరువాత ఇందులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవటానికి సైంటిస్టులకు ఒక శతాబ్ద కాలం పట్టింది.

"DNA లో ఉన్న సమాచారం ఒక తరం నుండి మరొక తరానికి తీసుకుని వెళ్తుంది." అని 1953లో "జేమ్స్ వాట్సన్", "ప్రాన్సీస్ క్రిక్" మారిన్ విల్కిన్స్ మరి రోసలిండ్ ఫ్రాంక్లిన్ కృషివల్ల తేలింది.

🌟. సైన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం DNA గురించి సంక్షిప్తంగా 🌟

🔹. శరీరం అనేది ఎన్నో కణాల సముదాయం అనీ, కణ కేంద్రకంలో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి అనీ తేలింది.

🔹 క్రోమోజోమ్స్ లోపల DNA స్ట్రాండ్స్ ఉంటాయి.

🔹 DNA అంటే డీ - ఆక్సీ రైబో న్యూక్లియిక్ ఆమ్లం అంటారు.

🔹 DNA జన్యువులలో ఉన్న వంశపారంపర్యంగా వచ్చిన జ్ఞాన సమాచారం అంతా నిక్షిప్తం చేయబడి ఉంటుంది. ఇది సకల జీవరాశులలోనూ ఈ విధంగానే ఉంటుంది.

🔹 DNA లో 30,000 చురుకుగా పనిచేసే జన్యువులు ఉంటాయి. ప్రతి జన్యువుకు నిర్దిష్ట చర్య ఉంటుంది.

🔹. ఈ DNA..తల్లి యొక్క మరి తండ్రియొక్క కణాలు అయిన అండం మరి శుక్రకణం నుండి బిడ్డకు సంక్రమిస్తాయి. ఇవి ఎనిమిది కణాల కలయిక. దీనిని "ప్రైమోర్డియల్ సెల్" అంటారు. కాబట్టి ఇది అనువంశిక అణువు.

🔹. క్రోమోజోమ్స్ "X" ఆకారంలో, "Y" ఆకారంలో ఉంటాయి. DNA అనేది క్రోమోజోమ్స్ లోపల ఫోల్డ్ చేయబడి ఉంటుంది. ఈ క్రోమోజోమ్స్ చివర్ల DNA బయటకు విడిపోకుండా క్యాపింగ్ చేయబడతాయి. దీనినే "టెలిమియర్ క్యాపింగ్" అంటారు.

🔹 క్రోమోజోమ్స్ చివర్ల ఈ టెలిమియర్ క్యాపింగ్ అనేది లేకపోతే DNA విడివడి పొడవుగా అంతం అనేది లేకుండా పెరుగుతూ ఉంటుంది.

ఉదాహరణకు:- షూ- లేస్ చివర్ల నొక్కబడి ఉన్న ప్లాస్టిక్ క్యాప్స్ లాంటివి ఉంటాయి. అవి ఊడిపోతే లేస్ ఎలా ఊడిపోతుందో అదేవిధంగా.

🔹 DNA ఇలా అన్నేచురల్ గా పెరుగుతూ ఉంటే అక్కడ ఉన్న ఆర్గాన్స్ కూడా అన్ నాచురల్ గా పెరుగుతాయి‌ వీటినే క్యాన్సర్ కణుతులు అంటారు. అందుకే ఈ టెలిమియర్ క్యాపింగ్ చాలా ప్రధానమైనది.

🔹 DNAలో అధికశాతం 98 నుండి 99% జ్ఞానం నాన్ కోడింగ్ లో ఉంది. దీనిని "జంక్ DNA " అన్నారు.

🔹 1 నుండి 2% కోడింగ్ DNA ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ తయారు చేయబడతాయి.

🔹. 98 నుండి 99% నాన్ కోడింగ్ DNA. దీనిని "జంక్ DNA" అన్నారు. ఇది ఎందుకూ పనికి రాదు అంటూ డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీ మరి జ్యామితీయ కొలతల సమాంతర జ్ఞానం ఉండవచ్చు అని సైన్స్ చెప్పింది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

31.Aug.2020

18. గీతోపనిషత్ - అనర్హుడు - మనస్సుచే మోసగింపబడిన వారు దైవ ధ్యానమును చేయలేరు. రసానుభూతిని పొందలేరు.


🌹  18. గీతోపనిషత్ - అనర్హుడు - మనస్సుచే మోసగింపబడిన వారు దైవ ధ్యానమును చేయలేరు. రసానుభూతిని పొందలేరు.  🌹

భోగైశ్వర్యప్రసక్తానం తయాపహృతచేతసామ్ |
వ్యవసాయాత్మికా బుద్ధి: సమాధౌ న విధీయతే || 44

భగవంతుడు రస స్వరూపుడు. రసాస్వాదనము చేయుటకే జీవనము. అదియే వైభవము. అట్టి వైభవమును పొందుటకు ఈ క్రిందివారనర్హులని భగవానుడు బోధించుచున్నాడు.

1) కర్మఫలములం దాసక్తి గలవాడు,
2) పుణ్యము కొరకు మంచిపని చేయువాడు,
3) కోరికలతో నిండిన మనస్సు కలవాడు,
4) భోగములయం దాసక్తి కలవాడు,
5) జ్ఞాన సముపార్జన చేయనివాడు,
6) ఐశ్వర్యములను సంపాదించుటకు ప్రయాస పువాడు,
7) తెలిసినదానిని ఆచరించనివాడు.

పైవారందరూ వారి మనస్సుచే మోసగింపబడినవారు. వారు దైవ ధ్యానమును చేయలేరు. రసానుభూతిని పొందలేరు.
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

31.Aug.2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 41


🌹.  కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 41  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి - 5 🌻

మీరందరూ తప్పక ఈ విమర్శ చేసేటటువంటి విధానములన్నింటిలో పూర్ణజ్ఞానమును పొందాలి. ఏమిటవి? పంచకోశ విచారణ, దేహత్రయ విచారణ, శరీరత్రయ విచారణ, అవస్థాత్రయ విచారణ, జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ విచారణ, ధ్యాన ధ్యాతృ ధ్యేయ విచారణ, జడచేతన విచారణ, ఆధార ఆధేయ విచారణ, నిత్యానిత్య విచారణ, అత్మానాత్మ విచారణ, కార్యకారణ విచారణ, సదసద్ విచారణ, దృగ్ దృశ్య విచారణ - ఇలాంటివాటన్నింటినీ పూర్తిచేయాలి.

ఇవన్నింటినీ ఎప్పుడైతే నీవు పూర్తి చేస్తావో, వీటన్నింటిలో నుండి వచ్చేటటువంటి అనుభవం ఏదైతే వుందో, ఆ అనుభవం నిన్ను ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి దగ్గర చేస్తుంది. అది పొందేటటువంటి స్థితికి నిన్ను చేరుస్తుంది. అందుకని వీటన్నింటినీ బాగా నీకు అధ్యయనం చేయిస్తారనమాట. ఈ అధ్యయనం చేయించడం వల్ల - సాంఖ్య విచారణలో వున్నటువంటి విశేషణం ఇదే -

ఈ సాంఖ్య విచారణలో ఇవన్నీ చేయడం ద్వారా నీలో ఏవేవి దూరం అవ్వాలో, నీలో ఏవేవి నిరసింపబడాలో, ఏయే వాటి నుంచి నీవు అధిగమించాలో, వాటన్నింటినీ నీవు అధిగమించిన స్థితిలో నిలబడతావనమాట. తత్ ప్రభావం చేత నీకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. ఈ రకంగా నడిపేటప్పుడు అనుభవజ్ఞానం చాలా ముఖ్యము. అందుకని - ఎందుకని అంటే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మము.

ఎందుకని ఆ మాట అంటున్నారంటే ఆత్మ సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. ఇక ఆత్మ కంటే సూక్ష్మమైనది లేదనమాట. అది సర్వ వ్యాపకము. అన్నింటికంటే సూక్ష్మము. మరి చిహ్నముల ద్వారా దానిని ప్రత్యక్షమయ్యేటట్లు చెయ్యగలుగుతామా? అంటే అర్ధం ఏమిటీ? సరే.

ఇక్కడి నుంచి ఇప్పుడున్న వ్యవస్థలో అనేక దేశాలలో అనేక రకాలైనటువంటి చిహ్నాల ద్వారా ఈ జ్ఞానాన్ని దివ్యత్వాన్ని వ్యక్తీకరించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కాని అవేవీ సత్యానికి ఆత్మానుభూతిని నిర్ణయించలేవు. అంటే అర్ధం ఏమిటీ?

ఒకాయన ఒక చేతిలో కొబ్బరికాయ పట్టుకుని వుంటాడు. ఒకాయన దానిని తీక్షణంగా చూస్తూ వుంటాడు. చూడగా చూడగా చూడగా చూడగా చూపు ద్వారా దానిని ప్రేరేపించడం ద్వారా చేతిలో వున్న కొబ్బరికాయ క్రిందపడిపోతుంది.

ఇప్పుడు ఆయనకి ఆత్మానుభూతి వున్నట్లేనా? ఒకాయన కళ్ళకు గంతలు కట్టుకుని తన ఎదురుగుండా వున్నటువంటి పుస్తకంలో వున్న వేదాన్ని అంతా చదివేస్తాడు. దీన్ని బ్లైండ్ రీడింగ్ [blind reading] అంటారు. మరి ఆయనకి ఆత్మానుభూతి వున్నట్లేనా?

ఒకాయనకి దూరశ్రవణ విద్య. అంటే మనం ఫోన్ లో ఎట్లా మాట్లాడుకుంటున్నామో, ఆయన ఫోన్ సహాయం లేకుండా తెలుసుకో గలుగుతాడు. అలాంటి దూరశ్రవణ విద్య వున్నటువంటివాళ్ళు వుంటారు.

అలాగే కొంతమందికి ఏదైనా ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకి సమాధానం ఇన్వొకింగ్ – ఇంట్యూషన్ [invoking – intuition] అంటారు దీన్ని. ఈ ఇంట్యూషన్ [intuition] ద్వారా చెప్పేటటువంటి విధానం ఒకటి వుంటుంది. అలాగే కొంతమందికి ట్రాన్సెన్-డెన్టల్ [Transcendental Meditation] అంటారు.

అంటే ఒకరి చేతిలో వాహకంగా పనిచేసేటటువంటి నిబద్ధత కొంతమంది మానసిక వ్యవస్థలలో వుంటుంది. అట్టి మానసిక వ్యవస్థ కలిగినటువంటి వాళ్ళు - తప్పక ఏం జరుగుతుందంటే - ఆ మానసిక వ్యవస్థల నుంచి వాళ్ళు ప్రేరణని పొంది, ఆ ప్రేరణ ద్వారా వాళ్ళు సమాధానాన్ని చెప్తూ వుంటారు.

ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మ ప్రజ్ఞా పరిధిలో. ఈ ప్రజ్ఞ కి చైతన్యానికి వున్నటువంటి వలయాలలో చిట్టచివరి వలయాలలో [outer periphery] ఉంటారనమాట. అంటే సూక్ష్మం అనగానే ఇలాంటివన్నీ మొదలైపోతాయనమాట.

సూక్ష్మం అనగానే అనేకరకాలైన శక్తులు, అనేకరకాలైనటువంటి స్థూలానికి అతీతమైనటువంటి - అతీత శక్తులు అతీత శక్తులు అంటారు - దేనికి అతీతం అంటే స్థూలానికి అతీతం.

అంటే మన కళ్ళు, మన చెవులు, మన ముక్కులు, మన స్పర్శ, మన నోరు ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు తెలుసుకోగలిగినదానికంటే అతీతమైనటువంటిది. అవతలిది. అలాంటిదేదైనా వచ్చినపుడు వాళ్ళు అవి చేయగలుగుతారనుకోండి.

మరి వీటి ద్వారా ఆత్మ వున్నదని నిరూపించదగునా అంటే అట్లాంటివాటి వల్ల ఆత్మ యొక్క సాక్షాత్కార జ్ఞానాన్ని పొందలేము. అత్మానుభూతిని పొందలేము.

మరి ఎలాగండీ నిరూపణ అంటే ఇదంతా గ్రుడ్డివాడు ఏనుగును పట్టుకున్న రీతి. వాళ్ళు పట్టుకున్నది ఏనుగును కాదా? ఏనుగు లక్షణాలు కావా అంటే ఒకానొక అంశీభూతములే.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

31.Aug.2020

31-August-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 475 / Bhagavad-Gita - 475🌹
2) 🌹 Sripada Srivallabha Charithamrutham - 263🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 143🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 165🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 79 / Sri Lalita Sahasranamavali - Meaning - 79🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 82 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 52🌹
8) 🌹. శివగీత - 48 / The Shiva-Gita - 48🌹
9) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 30🌹
10) 🌹. సౌందర్య లహరి - 90 / Soundarya Lahari - 90🌹

11) 🌹. శ్రీమద్భగవద్గీత - 390 / Bhagavad-Gita - 390🌹

12) 🌹. శివ మహా పురాణము - 211🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 87 🌹
14) 🌹.శ్రీ మదగ్ని మహాపురాణము - 82 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 98 🌹
16) 🌹 Twelve Stanzas From The Book Of Dzyan - 29🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 47 🌹
18) 🌹. అద్భుత సృష్టి - 19 🌹
19) 🌹 Seeds Of Consciousness - 162🌹 
20) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 41🌹
21) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 18 📚
22)


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 475 / Bhagavad-Gita - 475 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 20 🌴*

20. ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి |
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసమ్భవాన్ ||

🌷. తాత్పర్యం : 
జీవులు మరియు భౌతికప్రకృతి రెండును అనాది యని తెలిసికొనవలెను. వాని యందలి పరివర్తనములు మరియు భౌతికగుణము లనునవి భౌతికప్రకృతి నుండి ఉద్భవించినవి.

🌷. భాష్యము :
ఈ అధ్యాయమునందు తెలుపబడిన జ్ఞానము ద్వారా మనుజుడు కర్మక్షేత్రము (దేహము) మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞులను (జీవాత్మ, పరమాత్మ) గూర్చి తెలిసికొనవచ్చును.

 కర్మక్షేత్రమైన దేహము భౌతికప్రకృతినియమమై నట్టిది. దాని యందు బద్ధుడై దేహకర్మల ననుభవించు ఆత్మయే పురుషుడు(జీవుడు). అతడే జ్ఞాత. అతనితోపాటు గల వేరొక జ్ఞాతయే పరమాత్ముడు. 

కాని ఈ ఆత్మా, పరమాత్మ రూపములు దేవదేవుడైన శ్రీకృష్ణుని భిన్న వ్యక్తీకరణములే యని మనము అవగాహనము చేసికొనవలెను. ఆత్మా ఆ భగవానుని శక్తికి సంబంధించినది కాగా, పరమాత్మ రూపము అతని స్వీయ విస్తృతరూపమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 475 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 20 🌴*

20. prakṛtiṁ puruṣaṁ caiva
viddhy anādī ubhāv api
vikārāṁś ca guṇāṁś caiva
viddhi prakṛti-sambhavān

🌷 Translation : 
Material nature and the living entities should be understood to be beginningless. Their transformations and the modes of matter are products of material nature.

🌹 Purport :
By the knowledge given in this chapter, one can understand the body (the field of activities) and the knowers of the body (both the individual soul and the Supersoul). 

The body is the field of activity and is composed of material nature. The individual soul that is embodied and enjoying the activities of the body is the puruṣa, or the living entity. He is one knower, and the other is the Supersoul. 

Of course, it is to be understood that both the Supersoul and the individual entity are different manifestations of the Supreme Personality of Godhead. The living entity is in the category of His energy, and the Supersoul is in the category of His personal expansion.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 263 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 31
*🌴 Dasa Maha Vidyas of Devi - 2 🌴*

*🌻 The sixth form is Tripura Bhairavi : 🌻*

The power which can pacify the situations arising out of kaala’s presence, is called Tripura Bhairavi. This Tripura Bhairavi is said to be the power not different from Nrusimha Bhagawan.  

In this creation, transformation always keeps happening. The root causes of this are attraction and repulsion. They keep happening every moment. This Tripura Bhairavi’s name in the night is ‘Kaala rathri’. Bhairava’s name is Kaala Bhairava.  

My coming avathar ‘Nrusimha Saraswathi’ will be the combined form of these two. For Maha Yogis that is the combined Tripura Bhairavi – Kala Bhairava avathar. 

*🌻 The seventh form is Dhoomavathi : 🌻*

This Dhoomavathi is indeed ‘Ugra Thara’. By surrendering to Her, one’s calamities will get destroyed and one gets wealth.  

In Vedas, she is described as the one who removes famine distress. But she is the one responsible for all the pitiable states of hunger, poverty and quarrels of jeevas. With Her grace, all troubles will be driven away. 

*🌻 The eight form is Bhagala Mukhi : 🌻*

This Mother is worshipped for removing the misfortunes causing grief in the country and community and also the worldly and unworldly calamities, and to subdue enemies. Firstly Brahmadeva did ‘upasana’ of Bhagala Maha Vidya.  

Vishnu Bhagawan and Parasuram also are worshippers of Bhagala Mukhi. For a long time the Venkateswara idol in Tirumala was worshipped as Bhagala Mukhi. 

*🌻 The nineth form is Mathangi : 🌻*

Mathangi has got the power to make the life of a householder happy and to give the four ‘purushardhas’ (dharma, ardha, kama and moksha). She is also called the daughter of ‘Mathanga’ Mahamuni. 

*🌻 The tenth form is Kamalalaya : 🌻*

She is the representative of ‘plenty’. As She is worshipped by Bhargavas, She has got the name Bhargavi. By Her grace, one gets the landlordship and high fame. She represents material wealth. She is also called Padmavathi Devi.  

She is the cohort of Sri Venkateswara Maha Prabhu in Tirumala. ‘My Dear! I will teach you the nature of ‘Dasa Maha Vidyas’ deciding how much to be taught and through whom.  

For people who worship Anagha Devi, the combined form of Dasa Maha Vidyas and Anagha, Her Prabhu, their children ‘Astha Siddhis’ with grant them their grace.  

If you do ‘Anagha Asthami’ on the eight day (Asthami) in the second half of every month, all your desires will be fulfilled.  

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 142 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు  
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 *🌻. ఆరోగ్యము 🌻*

మనస్సు నందు ఏర్పడే సంకల్పాలు, వికల్పాలు ప్రాణశక్తిని సంచాలనం చేస్తే ఆ‌ ప్రాణశక్తి యొక్క వైఖరిని అనుసరించి మన శరీరంలోని భాగాలు నిర్మాణమై పని చేస్తాయి. 

కనుక మన ఆరోగ్యము అను స్థితి మన మనస్సు, ప్రాణశక్తి, భౌతిక శరీరమునకు మధ్యనున్న సమన్వయముపై ఆధారపడి ఉంటుంది. అందువలన మానసిక ఆరోగ్యము చాలా ముఖ్యము. 

ఆరోగ్యమనే స్థితే అసలు మనకి సహజ స్థితి. దానిని చెదరకుండా చూచుకొనుటయే మనము ప్రధానముగా అవలంబించవలసినది అని ఆయుర్వేద శాస్ర్తము తెలియజేస్తుంది. ప్రకృతి ధర్మాలను అనుసరించే ఏ శాస్ర్తమైనా దీనినే ప్రతిపాదించింది. నిత్యజీవితంలో ఏ విధానాన్ని అవలంబిస్తే ఈ ఆరోగ్యస్థితి చెదరకుండా ఉంటుందో ఆ విధానాన్ని 'స్వస్థవృత్తము' అను పేరుతో ఆయుర్వేద శాస్ర్తము మనకు అందించింది. 

కాని ప్రస్తుతము మానవజాతి ఈ విధానాన్ని అంగీకరించలేని హీన స్థితిలో ఉన్నదని చెప్పాలి. ఎందుకంటే అనారోగ్యంతో పోరాటం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడింది. ఇప్పటి వైద్యరంగంలో దీని వలన పరష్కారం లేదనేది సుష్పష్టము...
....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 163 🌹*
*🌴 The Buddhic Plane - 5 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 Colors 🌻*

Orange is the color of light in the material, the spirit in matter. Golden-yellow is the color of the light of the pure Buddhic plane, the most subtle material, also called Devachan. Blue is the color of the spiritual plane, beyond matter. 

When we elevate ourselves to the Buddhic plane, we can perceive colors clearly and even hear their sounds. One symbol for contemplation is a blue center surrounded by golden-yellow which is framed by orange. 

If we see ourselves as spirit at the center of a circle, then the first circle around the center is the light, the soul itself; its enlightenment is called Buddhi. We don’t have to do anything to purify this light. Then there is the personality. 

Depending on how advanced we are, it is controlled by either higher or lower thinking. The mind needs to be cleared of impurities to a point where thinking becomes transparent. 

The light of the soul can shine through the body when thoughts are no longer drenched with personal motives and desires.

🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K.P. Kumar: Mithila / seminar notes – Master E. Krishnamacharya: Occult Anatomy / Full Moon Meditations.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 79 / Sri Lalita Sahasranamavali - Meaning - 79 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 151

 సత్యఙ్ఞానానందరూపా సామరస్యాపరాయణా 
కపర్ధినీ కళామాలా కామధుక్ కామరూపిణీ 

791. సత్యఙ్ఞానానందరూపా :
 సచ్చిదానందరూపిణీ 

792. సామరస్యాపరాయణా : 
జీవుల యెడల సమరస భావముతో ఉండునది 

793. కపర్ధినీ : 
జటాజూటము కలిగినది (జటాజూటధారీఇన శివునకు కపర్ధి అను పేరు కలదు) 

794. కళామాలా : 
కళల యొక్క సమూహము 

795. కామధుక్ : 
కోరికలను ఇచ్చు కామధేనువు వంటిది
 
796. కామరూపిణీ : కోరిన రూపము ధరించునది  

🌻. శ్లోకం 152

కళానిధి: కావ్యకళా రసఙ్ఞా రసశేవధి: 
పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా 

797. కళానిధి: : 
కళలకు నిధి వంటిది 

798. కావ్యకళా : 
కవితారూపిణి 

799. రసఙ్ఞా : 
సృష్టి యందలి సారము తెలిసినది 

800. రసశేవధి: : 
రసమునకు పరాకాష్ట 

801. పుష్టా : 
పుష్ఠి కలిగించునది 

802. పురాతనా ; 
అనాదిగా ఉన్నది 

803. పూజ్యా ; 
పూజింపదగినది 

804. పుష్కరా : 
పుష్కరరూపిణి 

805. పుష్కరేక్షణా ; 
విశాలమైన కన్నులు కలది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 79 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 79 🌻*

791 ) Satya gnananda roopa -   
She who is personification of truth, knowledge and happiness

792 ) Samarasya parayana -   
She who stands in peace

793 ) Kapardhini -   
She who is the wife of Kapardhi (Siva with hair)

794 ) Kalamala -  
 She who wears arts as garlands

795 ) Kamadhukh -   
She who fulfills desires

796 ) Kama roopini -   
She who can take any form

797 ) Kala nidhi -   
She who is the treasure of arts

798 ) Kavya kala -  
 She who is the art of writing

799 ) Rasagna -   
She who appreciates  arts

800 ) Rasa sevadhi -  
 She who is the treasure of arts

801 ) Pushta -   
She who is healthy

802 ) Purathana -   
She who is ancient

803 ) Poojya -   
She who is fit to be worshipped

804 ) Pushkara -   
She who gives exuberance

805 ) Pushkarekshana -   
She who has lotus like eyes

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 82 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
 తృతీయాధ్యాయము - సూత్రము - 50

*🌻 50. స తరతి స తరతి స లోకాంస్తారయతి ॥ - 1 🌻*

అటువంటి పరాభక్తుడు తాను గమ్యం చేరడమే గాక, లోకంలో చాలామంది తరించడానికి ఉపకరణమవుతాడు. ఇట్టివాడు భాగవతోత్తముదై, భగవంతుని చేతిలో పరికరమవుతాడు. 

యోగ్యతగల భక్తులకు ఇతని ద్వారా భగవంతుడు అనుగ్రహాన్ని ప్రనాదిస్తాడు. ఈ రకమైన పరాభక్తులు భగవంతునికి, భక్తునికి మధ్య అనుసంధాన కర్తలుగా ఉంటారు. వీరు భగవంతునితో సమానులు.

బ్రహ్మ భూతః ప్రసన్నాత్మా నశోచతి న కాంక్షతి
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్‌ ॥
- (18:54) భగవద్దిత

తా॥ సచ్చిదానందఘన పరబ్రహ్మయందు ఏకీభావ స్థితుడై, ప్రసన్న మనస్మ్కుడైన యోగి దేనికీ శోకించడు. దేనినీ కాంక్షించడు. సమస్త ప్రాణులందు సమభావం ఉన్న యోగి పరాభక్తిని పొందుతాడు. పరే భాగవతోత్తములు.

భక్తుడు యోగ్యుడైతేనె భగవదనుగ్రహం పొందుతాడు. గనుక సాధకుడు సాధించె సాధనా స్థితిగతులను భగవద్గిత తెలియచెస్తున్నది. ఒక్కొక్క స్థితిని ఈ క్రింది విధంగా అధిగమించి, యోగ్యత సంపాదించాలి. చివరకు స్థిరమైన, శాశ్వతమైన పరమప్రేమ స్థితిని పొందుతాడు భక్తుడు.

1) _ ఆత్మ వశ్యైర్విధయాత్మా ప్రసాద మధిగచ్చతి ॥ - (2:64) భగవద్గిత

ఆత్మకు వశమైన బుద్ధితో జీవించడం వల్ల “ప్రసాదం” అనగా ఇచ్చెవాడు, పుచ్చుకునేవాడు అనె విభజన ఉన్న జీవేశ్వర భిన్నత్వం అనె స్థితిని అధిగమిసాడు. ఎ రకంగానూ దుఃఖాన్ని దగ్గరకు చేరకుండా ఉంచే మోదాన్ని ప్రసాదమంటారు. క్రసాద స్థితిలో ఈశ్వరునకు మనసు, బుద్ధి, చిత్తం లొంగి ఉంటాయి. 

ఆ బుద్ధి భెద భావాన్ని పాటించదు. మనసు విషయాసక్తం కాదు. ఈ శుద్ధ బుద్ధి ఆత్మ స్థితిని గ్రహించి, దానికి వశమై వర్తిస్తూ జీవేశ్వర భిన్నత్వాన్ని వోగొట్టుకొంటుంది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 51 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj

*🌻 Even though Sri Rama and Sri Krishna were incarnations of the Divine, they approached a Guru. They taught the world the importance of having a Guru in one’s life. 🌻* 

Sage Sandeepani was the Guru to Sri Krishna and his friend Sudhama. Since Sri Krishna and Sudhama were great souls, they knew the importance of a Guru. 

 They served the Guru like he was Lord Shiva. Let’s see how Sri Krishna and Sudhama served Sage Sandeepani and how he blessed them. 

Sloka: Yo gurussa sivah prokto ya ssiva ssa guru ssmrtaha Vikalpam yastu kurvita sa bhavet pataki gurau 

Sri Krishna and Sudhama came under Sage Sandeepani’s tutelage at a very tender age. As children, they played together a lot. We will observe from this story that even though they quarreled and fought a lot, they never separated. 

However, if the Guru gave them any tasks, they would always carry out those tasks with great love and devotion. They never postponed the task given by the Guru. Any task given by the Guru was immediately attended to and completed. 

They would always make Sage Sandeepani happy. They would also take on all the tasks given by the wife of Sage Sandeepani. Once, she called for Sri Krishna and Sudhama. They immediately went up to her and asked if they were called.  

She said “Yes, my dear sons, we are out of sacrificial wood. Please bring some from the forest”. The forest she was referring to was not an ordinary forest. It was a dense forest that was covered in darkness even during day time.  

It would be impossible to see anything. It was filled with poisonous trees and predatory animals. Sri Krishna and Sudhama were tender little children. They were excited to go to the forest. They were not afraid. They happily agreed to carry out her command. 

Saying,”Mother, don’t worry. We will bring lots of sacrificial wood”, they set out for the forest. It was completely dark in that dense forest. Sri Krishna and Sudhama gathered up the wood they could find in the darkness. 

They couldn’t just pick up the wood, they had to search and gather. Soon, there were gusts and pouring rain. As sunset approached, the little traces of sunlight disappeared. 

Sri Krishna and Sudhama got scared. The held hands and walked in the rain. Soon, the forest was flooded. Without letting go of each other, they began swimming. 

 It was no more a forest to walk in; it was a forest to swim in. They couldn’t tell where the ups and downs in the forest were. They had no idea where they were going. 

Slowly, they found a tree that they took shelter under. They spent the night under the tree shivering in the cold. It was so dark and cold that it felt like the night of doomsday. 

They were very scared. Somehow, the night passed. In the morning, Sage Sandeepani set out in search of the little children, calling out their names. 

He found them both under the tree shivering from cold. He trembled with compassion. Let’s see what happens ahead.   

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 48 / The Siva-Gita - 48 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ఏడవ అధ్యాయము
*🌻. విశ్వరూప సందర్శన యోగము - 2 🌻*

శ్రీభగవానువాచ:-
మయి పర్వం యథా రామ! - జగచ్చైత చ్చరా చరమ్,
వర్తతే తద్దర్శయామి - నద్రుష్టం క్షమతే భవాన్ 10
దివ్యం చక్షు: ప్రదాస్యామి - తుభ్యం దాశరథాత్మజః !
తేన పశ్య భయం త్యక్త్వా - మత్తేజో మడలం ధ్రువమ్ 11
న చర్మ చక్షుషా ద్రష్టుం - శక్యతే మామకం మహః,
నరేణ వా సురేణాపి - తన్మ మాను గ్రహం వినా 12

ఓ రామా! ఈ చరాచరాత్మక మైన ప్రపంచ మంతయు నా యుదరంబున లీనంబైయున్నది. దానిని నీవు చూచుటకై నీకు శక్తి చాలదు. ఈ చర్మ చక్షువులతో మానవుడైనను దేవుడైనను నా కరుణాకటాక్షము లేక నా తేజో మండలమును కనుగొనలేడు. కావున, ఓయీ! దాశరథీ ! నీకు దివ్యదృష్టిని ఇచ్చుచున్నాను. నిర్భయుండవై నా తేజస్సును చక్కగా చూడుము.    

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 48 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 07 :
*🌻 Vishwaroopa Sandarshana Yoga - 2 🌻*

Sri Bhagavan said: 

O Rama! This entire mobile and immobile creation dwells inside my belly. You do not have enough strength and capability to witness that scene. With these eyes of flesh neither human nor god can ever be able to see my brilliant cosmic form without my grace. 

Therefore, O son of Dashratha! I'm giving you divine eyes (divya drishti) do not fear and properly see my divine cosmic form.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 39 / Sri Gajanan Maharaj Life History - 39 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 8వ అధ్యాయము - 4 🌻*

శ్రీమహారాజు దగ్గర నుండి వీళ్ళు కొంత ధనం పొందే ఆశతో వచ్చారు. వీళ్ళు వచ్చినప్పటికి శ్రీమహారాజు నిద్రపోతున్నారు. శ్రీమహారాజును లేపేందుకు ఈ బ్రాహ్మణులు, గట్టిగా వేదపఠనం చెయ్యడం మొదలు పెడతారు. వారి ఆపఠనంలో ఒకచోట కొద్దిగా తప్పు అవుతుంది, కాని దానిని వాళ్ళు సరిదిద్దలేదు. 

అందుకని శ్రీమహారాజు లేచి, మీరు వైదికులు ఎందుకు అయ్యారు ? వేదంయొక్క ప్రాముఖ్యతను మీరు అనవసరంగా దిగజార్చు తున్నారు. ఈవిద్య వ్యాపారం చేసేందుకు కాదు, మనుష్యులను ఉద్ధరించడానికి. మిమ్మల్ని వైదికులుగా సూచించే మీతలకున్న అలంకరణ కయినా కనీసం కొంత గౌరవం ఇవ్వండి. 

ఇప్పుడు నేను చదువుతాను మీరు మరల దానిని నేను ఎలాచదివేనో అలా అనండి. అమాయకులను మోసగించకండి, అని వాళ్ళతో అన్నారు. అలా అంటూ, ఈ బ్రాహ్మణులు తప్పుగా చదివిన వేద అధ్యాయాన్ని శ్రీమహారాజు పఠించారు. ఈయన ఉఛ్ఛారణ స్వఛ్ఛంగా, గట్టిగా ఉంది. మరియు ఈయన పఠనంలో ఒక్కతప్పు కూడాలేదు. 

వశిష్ఠుడు స్వయంగా ఈపవిత్ర వేదపఠనం చేస్తున్నట్టు అనిపించింది. బ్రాహ్మణులు దిగ్ర్భాంతిచెంది తలలు ఎత్తడానికి కూడా సిగ్గుపడ్డారు. సూర్యుని ముందు క్రొవొత్తిలా అనిపించింది. శ్రీమహారాజును, బ్రాహ్మణులు ముందు ఒక పిచ్చివానిగా భావించారు, ఇప్పుడు తెలిసింది. ఆయన ఒక గొప్ప పండితుడని. 

శ్రీమహారాజు భగవంతుని అవతారమని, బ్రాహ్మణ కులస్తుడని, అన్నిటికి అతీతుడయిన ఒక గొప్ప యోగి అని, తమయొక్క పూర్వజన్మ కృతులవల్ల ఇటువంటి భగవంతుడి లాటి యోగి దర్శన భాగ్యంకలిగిందని వారికి అనిపించింది.

 ఖాండుపాటిల్ను వీళ్ళకు ఒక్కొక్క రూపాయి ఇవ్వవలసిందిగా శ్రీమహారాజు కోరారు. బ్రాహ్మణులు దానిని స్వీకరించి సంతోషంగా వెళ్ళిపోయారు. శ్రీమహారాజు నిజమయిన యోగుల వలె, షేగాం వాసులతో ఎక్కువ సంబంధం ఇష్టపడేవారు కాదు.

షేగాంకు ఉత్తరంగా ఒకతోట ఉంది. అక్కడ పుష్కళంగా కాయగూరలు పండించబడుతూ ఉండేవి. ఆతోటలో ఒక వేపచెట్టు యొక్క చల్లని నీడలో ఒక శివమందిరం ఉండేది. కృష్ణాజిపాటిల్ దాని యజమాని. శ్రీమహారాజు అక్కడకు వెళ్ళి ఆ శివమందిరం దగ్గర ఒక చెట్టుచుట్టూ ఉన్న బండమీద కూర్చుని - నేను కొద్దిరోజులు శివుని దగ్గర ఉండేందుకు నీఈతోటకి వచ్చాను. 

దేవాది దేవుడయిన శివభగవానుడు ఈతోటలో ఉండడానికి ఇష్టపడ్డారు కనుక నేను కూడా ఆయన దగ్గర ఉండేందుకు కోరుకున్నాను. కనుక నాకొక చిన్నపందిరి నిలబెట్టమని కృష్ణాజితో అన్నారు. వెంటనే కృష్ణాజి ఒక చక్కని పందిరి నిలబెట్టించాడు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 39 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 8 - part 4 🌻*

They came to Shri Gajanan Maharaj with the hope of getting some money from Him. When they came, Shri Gajanan Maharaj was sleeping. The Brahmins started reciting Vedic hymns loudly to awaken Shri Gajanan Maharaj .

There was some mistake in their recitation, but they did not correct it, so Shri Gajanan Maharaj got up and said to them, Why have you become Vedic? You are lowering the greatness of Vedas unnecessarily. 

This knowledge is not for the purpose of running a business but for the salvation 0f human beings. At least show some respect to the saffron head dress, which indicates that you are a Vedic. I will now recite the hymns and you repeat the same as I pronounce. Do not misguide innocent poor believers. 

Saying so Shri Gajanan Maharaj recited the same chapter of Vedas that was recited incorrectly by these Brahmins; his pronunciation was clear, loud and his recitation, errorless. It appeared as if Vashistha himself was reciting the holy Vedas. 

The Brahmins were astonished and felt embarrassed to even lift their faces. The analogy can be compared to a lit candle fantasizing that it has better capacity to spread light around itself than the mighty sun. 

The Brahmins first thought that Shri Gajanan Maharaj was a mad person, but now found Him to be a learned saint. They were convinced that all the four Vedas were on the tip of His tongue. 

They took Shri Gajanan Maharaj a to be a God incarnate and a Brahmin by caste - a yogi free of any bondage or attachment, and because of their good deeds of previous life, they believed they were fortunate enough to get the Darshan of such a Godly saint.

Shri Gajanan Maharaj a asked Khandu Patil to give them a rupee each as dakshina. The Brahmins accepted this dakshina and happily went away. Shri Gajanan Maharaj , like a true saint, disliked the attachment of Shegaon’s locals. In the northern region of Shegaon there was a garden where vegetables were grown in abundance. 

Under the cool dark shade of a neem tree, there was a temple of Lord Shiva in the Garden. Krishnaji Patil owned the temple. Shri Gajanan Maharaj went there and sat on a platform under a tree near the Shiva temple and said to Krishnaji, I have come to your garden to stay here for a few days near Lord Shiva.

 Lord Shiva is the God of all Gods and since He liked to stay in your garden, I too wish to be near Him. So erect a small shade for me here. Krishnaji thereupon got erected a tin shade on the platform.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 30 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని శరీరి : నాల్గవ పాత్ర (రూపధారణము) - 2 🌻*

114. ఒకేసారి సంస్కారములు లేని ఆత్మకు, ప్రథమముగా సంస్కారమును, చైతన్యమే లేని ఆత్మకు ప్రథమముగా చైతన్యమును కలిగినవి. ఇట్లు కలిగిన ప్రథమ సంస్కారము పరమాణు ప్రమాణమైన స్థూల సంస్కారము.

115. అనంత శాశ్వత (A) పరమాత్మ పొందిన చైతన్యము అత్యంత పరిమితమైన స్థూల సంస్కారము మూలముగా పొందిన అత్యంత పరిమిత స్థూల చైతన్యమేగాని అది ... ... తన అనంత స్థితియొక్క చైతన్యమునుగాదు, లేక (B) స్థితిలోని అనంతపరమాత్మయైన తన స్వీయ చైతన్యమును గాదు.

116. అవిభాజ్యమైన ఆత్మయొక్క తొలి చైతన్యము, తొలి రూపము ద్వారా తొలి సంస్కార అనుభవమును పొందుచూ, ఆత్మలో ఒక మనోప్రవృత్తిని సృష్టించుచున్నది. అదియేమనగా - పరమాణు ప్రమాణములో పరిమితము, స్థూలము అయిన తొలిరూపముతోడనే తన శాశ్వత అనంత పరమాత్మతో సాహచర్యము చేసి, తాదాత్మ్యము చెందునట్టి ప్రవృత్తిని సృష్టించుచున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 90 / Soundarya Lahari - 90 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

90 వ శ్లోకము

*🌴. దుష్ట మంత్ర ప్రభావం, దరిద్రము తొలగుటకు, 🌴*

శ్లో: 90. దదానే దీనేభ్యః శ్రియమ నిశమాశాను సదృశీమమన్దం సౌందర్య ప్రకరమకరన్దం వికిరతి తవాస్మిన్ మన్దార స్తబకసుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః కరణచరణై ష్షట్చరణతామ్ ll
 
🌷. తాత్పర్యం : 
అమ్మా! భగవతీ! దీనులకు వారి వారి కోర్కెలకు అనుగుణముగా సంపదలు ఇచ్చు అధికమయిన లావణ్యము అను పూదేనెను వెదజల్లుచున్నదియూ, కల్ప కుసుమ పుష్ప గుచ్చము వలే సొగసైనదియు అగు నీ పాద కమలమునందు మనస్సుతో కూడిన జ్ఞానేంద్రియ పంచకము అను ఆరు పాదములు కలవాడనయి తుమ్మెద వలె మునుగుదును గాక !

🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 30 రోజులు జపం చేస్తూ, తేనె, పాయసం నివేదించినచో దుష్ట మంత్ర ప్రభావాలు, దరిద్రము తొలగుతాయి అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹Soundarya Lahari - 90 🌹*
📚. Prasad Bharadwaj 

SLOKA - 90

*🌴 Cutting of Bad Spells cast, dispel poverty 🌴*

90. Dhadhane dinebhyah sriyam anisam asaanusadhrusim Amandham saundharya-prakara-makarandham vikirathi; Tav'asmin mandhara-sthabhaka-subhage yatu charane Nimajjan majjivah karana-charanah sat-charanathaam.
 
🌻 Translation : 
My soul with six organs,is similar to the six legged honey bees,which dip at your holy feet,which are as pretty, as the flower bunch, of the celestial tree,which always grant wealth to the poor, whenever they wish, and which without break showers floral honey.

Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :  
If one chants this verse 1000 times a day for 30 days, offering payasam and honey as prasadam, one can overcome the effect of bad spells and to dispel poverty
 
🌻 BENEFICIAL RESULTS: 
Removal of charms and enchantments by enemies, dispel poverty. 
 
🌻 Literal Results: 
Patronage of high society, gains influence, control of senses. 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 390 / Bhagavad-Gita - 390 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 39 🌴

39. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున | 
న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్ || 

🌷. తాత్పర్యం : 
ఇంకను ఓ అర్జునా! సర్వజీవులకు జన్మకారక బీజమును నేనే. స్థావరజంగములలో నేను లేకుండ ఏదియును స్థితిని కలిగియుండలేదు. 

🌷. భాష్యము : 
ప్రతిదానికి ఒక కారణముండును. అట్టి కారణము లేదా బీజము శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు శక్తి లేకుండా ఏదియును స్థితిని కలిగియుండలేదు కనుక అతడు సర్వశక్తిమంతుడని పిలువబడినాడు. అతని శక్తి లేకుండా స్థావరము గాని, జంగమము గాని ఏదియును మనుగడను కలిగియుండలేదు. కనుకనే కృష్ణుని శక్తిపై ఆధారపడనిదిగా గోచరించునది మాయగా (లేనటువంటిది) పిలువబడును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 390 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 39 🌴

39. yac cāpi sarva-bhūtānāṁ
bījaṁ tad aham arjuna
na tad asti vinā yat syān
mayā bhūtaṁ carācaram

🌷 Translation : 
Furthermore, O Arjuna, I am the generating seed of all existences. There is no being – moving or nonmoving – that can exist without Me.

🌹 Purport :
Everything has a cause, and that cause or seed of manifestation is Kṛṣṇa. Without Kṛṣṇa’s energy, nothing can exist; therefore He is called omnipotent. Without His potency, neither the movable nor the immovable can exist. Whatever existence is not founded on the energy of Kṛṣṇa is called māyā, “that which is not.”
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 211 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
46. అధ్యాయము - 1

*🌻. సంక్షేప సతీచరిత్రము - 4 🌻*

జీవతస్తేన దక్షో హి తత్ర సర్వే హి సత్కృతాః | పునస్స కారితో యజ్ఞ శ్శంకరేణ కృపాలునా || 39

రుద్రశ్చ పూజితస్తత్ర సర్వై ర్దేవైర్వి శేషతః | యజ్ఞే విష్ణ్వాదిభిర్భక్త్యా సుప్రసన్నాత్మభిర్మునే || 40

సతీదేహ సముత్పన్నా జ్వాలా లోక సుఖావహా | పతితా పర్వతే తత్ర పూజితా సుఖదాయినీ || 41

జ్వాలా ముఖీతి విఖ్యాతి సర్వకామ ఫలప్రదా | బభూవ పరమా దేవీ దర్శనా త్పాపహారిణీ || 42

ఆయన దక్షుని జీవింపజేసి, అందరినీ సత్కరించెను. కృపానిధి యగు శంకరుడు మరల ఆ యజ్ఞమును చేయించెను (39). 

ఆ యజ్ఞములో దేవతలందరు విష్ణువును ముందిడుకొని ప్రసన్నమగు మనస్సు గలవారై భక్తితో రుద్రుని ప్రత్యేకముగా పూజించిరి (40). 

ఓ మహర్షీ! సతియొక్క దేహము నుండి పుట్టినట్టియు, లోకములకు సుఖమనిచ్చు జ్వాల పర్వతమునందు పడెను. అచట ఆమెను పూజించినచో సుఖములనిచ్చును (41). 

ఆ పర్వతమునందు సర్వకామనలనీడేర్చునట్టియు, దర్శనముచే పాపములను పోగొట్టు ఆ దేవదేవి జ్వాలాముఖియను పేర ప్రసిద్ధిని గాంచెను (42).

ఇదానీం పూజ్యతే లోకే సర్వకామఫలాప్తయే | సంవిధాభి రనేకాభిః మహోత్సవ పురస్సరమ్‌ || 43

తతశ్చ సా సతీ దేవీ హిమాలయ సుతాsభవత్‌ | తస్యాశ్చ పార్వతీ నామ ప్రసిద్ధమభవత్తదా || 44

సా పునశ్చ సమారాధ్య తపసా కఠినేన వై | తమేవ పరమేశానం భర్తారం సముపాశ్రితా || 45

ఏ తత్సర్వం సమాఖ్యాతం యత్పృష్టోహం మునీశ్వర | యచ్ఛ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః || 46

ఇతి శ్రీ శివ మహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సతీసంక్షేప చరిత్ర వర్ణనం నామ ప్రథమః అధ్యాయః (1).

ఇప్పటికీ ఆమె లోకమునందు, కోర్కెలన్నియు ఈడేరి ఫలములు లభించుటకై మహోత్సవ పూర్వకముగా అనేక తెరంగులలో పుజింపబడుచున్నది (43). 

ఆ తరువాత ఆ సతీదేవి హిమాలయుని కుమార్తె అయెను. అపుడామెకు పార్వతియను పేరు ప్రఖ్యాతమాయెను (44). 

ఆమె మరల కఠోరమగు తపస్సును చేసి ఆ పరమేశ్వరుని భర్తగా పొందెను (45). 

ఓమునిశ్రేష్ఠా! నీవు నన్ను ప్రశ్నించిన విషయములనన్నిటినీ చెప్పతిని. దీనిని విన్నవారి పాపములన్నియు తొలగిపోవుననటలో సందేహము లేదు (46).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితములో రెండవ ఖండలో సతీసంక్షేప చరిత్ర వర్ణనము అనే మొదటి అధ్యాయము ముగిసినది (1).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 87 🌹*
Chapter 26
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 The Burning of Sanskaras 🌻*

The Avatar suffers like no other human being. The Avatar has a universal body and a universal mind. 

The forms of all beings are contained in his universal body, as the minds of all beings are contained in his universal mind. The Avatar suffers physically through all the individual bodies, and he suffers mentally through all individual minds. 
 
The Avatar is responsible for every being in creation until that individual attains realization of its true divine nature. 

The Avatar suffers physically while he is working on earth, because the universal work in the gross universe requires tremendous physical  
exertion. Through the exertion of his physical body while alive, he is directly at work for  
all physical beings in the universe. 

Even now that the Avatar has dropped his body, he remains responsible for every being in the creation. Therefore, even when he is not physically present, he is still working to bring about the results of the work he did while physically on earth. 

He continues to exert, but not physically; he exerts mentally, thus he suffers mentally, even while he is not in a human body, until the final results of his work manifest. 
 
Why must the Avatar, who is God, suffer even after he has dropped his body? 

He suffers mentally to bring about the results of his work, which is to burn the sanskaras of our minds through the fire of his love, and this happens during the period of his manifestation. That consuming fire of love exists in His universal mind. 

All individual minds are contained in his universal mind, but also contained in that universal mind is his work and love for each being, because his universal mind feels the pressure of responsibility for every being from the beginning to the end. 

This pressure of responsibility for all beings, combined with the resistance of their individual egos, is the factor that causes the Avatar to suffer mentally. 

The Avatar's responsibility is to maintain an inner connection with each individual ego-mind, and to work for that individual mind through all of its evolution and involution in creation, until that limited mind becomes ready, as a result of  
the Avatar's efforts, for ego-annihilation.  

The annihilation of the ego-mind is planned within the Avatar's universal mind. It is that fire of love in the universal mind that consumes the sanskaras of the limited mind.  

The preparation for this annihilation is seen to while the Avatar is physically present on  
earth, but the result of that work is accomplished whether he is in a physical form or not. 
 
This burning up of each being's sanskaras is now taking place in the Avatar's universal  
mind. 

This burning and the results of this fire—mental annihilation—are both aspects of Meher Baba's manifestation.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 82🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 33
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. అథ పవిత్రారోపణ విధానమ్‌‌‌ - 2 🌻*

ఆచార్యాణాం చ సూత్రాణి పితృమాత్రాదిపుస్తకే. 12

నాభ్యన్తం ద్వాదశగ్రన్థిం తథా గన్ధపవిత్రకే | అఙ్గలాత్కల్పనాదౌద్విర్మాలా చాష్టోత్తరం శతమ్‌. 13

అథవార్కచతుర్వింశషట్త్రింశన్మాలికా ద్విజ | అనామామధ్యమాఙ్గుష్ఠైర్మన్దాద్యైర్మాలికార్థిభిః. 14

కనిష్ఠాదౌ ద్వాదశ వా గ్రన్థయః స్యుః పవిత్రకే | రవేః కుమ్భహుతాశాదేః సమ్భవీ విష్ణువన్మతమ్‌. 15

పీఠస్య పీఠమానం స్యాన్మేఖలాన్తే చ కుణ్డకే | యథాశక్త సూత్రగ్రన్థిః పరిచారే7థ వైష్ణవే. 16

సూత్రాణి వా సప్తదశ సూత్రేణ త్రివిభక్త కౌ |

ఆచార్యునికొరకును, తలిదండ్రులకొరకును, పుస్తకముపై ఉంచుటకొరకును నిర్మింపబుడు పవిత్రకమునాభిప్రదేశమువరకును వ్రేలాడవలెను. దీనికి పండ్రెండు ముడులు ఉండవలెను. దానిపై మంచి గంధము పూయవలెను.

 వనమాలయందు రెండేసి అంగుళములదూరమున క్రమముగా నూటఎనిమిది ముడులు వేయవలెను. లేదా కనిష్ఠ-మధ్యదు-ఉత్తమపత్రకములపై క్రమముగా పండ్రెండు, ఇరువదినాలుగు, ముప్పదియారుముడులు వేయవలెను. 

మంద-మధ్యమ-ఉత్తమమాలార్థు లగ పురుషులు అనామికా-మధ్యమా-అంగుష్ఠములచేతనే పవిత్రకములను గ్రహింపవలెను. లేదా కనిష్ఠకాది నామధేయములు గల పవిత్రకములందు అన్నింటియందును పండ్రెండేసి ముడులే ఉండవలెను.

 (తంతువుల సంఖ్యను పట్టియు, పొడవును పట్టియు ఈ కనిష్ఠికాదినామదేయము లేర్పడినవి). సూర్యునకు, కలశమునకు, అగ్ని మొదలగు వాటికిని గూడ యథాసంభవముగ భగవంతు డగు విష్ణువునకు వలెనే పవిత్రకములను అర్పించుట ఉత్తమ మని చెప్పబడినది. పీఠముకొరకు దాని పొడవును పట్టియు, కుండమునకు దాని మేఖలపర్యంతమును పొడవు గల పవిత్రకముండవలెను. 

విష్ణుపార్షదులకు యథాశక్తిగ సూత్రగ్రంథులను సమర్పింపవలెను. లేదా గ్రంథులు లేకుండ పదునేడు సూత్రములు సమర్పింపవలెను. భద్రుడను పార్షదునకు త్రిసూత్రము సమర్పింపవలెను.

ఏకాదశ్యాం యాగగృహే భగవన్తం హరిం యజేత్‌. 18

సమస్తపరివారాయ బలిం పీఠే సమర్చయేత్‌ | క్షౌం క్షేత్రపాలాయ ద్వారాన్తే ద్వారోపరి శ్రియమ్‌. 19

ధాత్రే దక్షే విధాత్రే చ గఙ్గాం చ యమునాం తథా | శఙ్ఖపర్మనిధీ పూజ్య మధ్యే వాస్త్వపసారణమ్‌. 20

సారఙ్గాయేతి భూతానాం భూతశుద్ధిం స్థితశ్చరేత్‌ |

ఓం హూం హః ఫట్‌ హ్రూం గన్ధతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రరూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

పఞ్చోద్ఘాతైర్గన్థతన్మాత్రస్వరూపం భూమిమణ్డలమ్‌ |

చతురస్రం చ పీతం చ కఠినం వజ్రలాఙ్ఛితమ్‌.

ఇన్ద్రాధిదైవతం పాదయుగ్మమధ్యగతం స్మరేత్‌ |

శుద్ధం చ రసతన్మాత్రం ప్రవిలాప్యాథ సంహరేత్‌ 7

రసమాత్రం రూపమాత్రే క్మరమేణానేన పూజకః. 22

పవిత్రమును గోరోచనముతోను, అగురుకర్పూరములు కలిపిన పసుపుతోను, కుంకుమరంగుతోను పూయవలెను. భక్తుడు ఏకాదశీదివసమున స్నానసంధ్యాదులు చేసి, పూజగృహము వ్రవేవించి, భగవంతుడగు శ్రీహరిని పూజింపవలెను.

 విష్ణువుయొక్క సమస్తపరివారమునకును బలి సమర్పించి విష్ణువును పూజింపవలెను. ద్వారముయొక్క అంతమునందు ''క్షం క్షేత్రపాలాయ నమః'' అని చెప్పి క్షేత్రపాలపూజ చేయవలెను.

 ద్వారము పై భాగమున ''శ్రియై నమః'' అని చెప్పుచు శ్రీదేవిని పూజించవలెను. ద్వారదక్షిణ (కుడి) దేశమున ''ధాత్రే నమః'' ''గంగాయై నమః'' అను మంత్రము లుచ్చరించుచు, ధాతను, గంగను పూజింపవలెను. ఎడమ వైపున ''విధాత్రే నమః'' ''యమునాయై నమః'' అని చెప్పుచు విధాతను, యమునను, పూజింపవలెను. 

ఇదే విధముగ ద్వారముయొక్క కుడి-ఎడమ ప్రదేశములందు క్రమముగ ''శఙ్ఖనిధయే నమః'' పద్మనిధయే నమః''అని చెప్పుచు శంఖపద్మనిధులను పూజింపవలెను.

 [పిదప మండపములోపల కుడి హిదము మణవను మూడు మార్లు కొట్టి విఘ్నములను పారద్రోలవలెను].

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 98 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శంఖలిఖిత మహర్షులు - 4 🌻*

19..ప్రతి ఋషివాక్యానికి ఎంతో లోతైన, విశాలమైన, సమస్త జగత్తుకూ హితంచేకూర్చే భావం కలిగిన అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకు వారు చెప్పినవాటిలో, పితృదేవతలను అర్చించటం ఒక విధి. అంటే చచ్చిపోయిన వాళ్ళను అర్చించటం. ‘బ్రతికిఉన్నవాళ్ళకు అన్నంపెట్టమని చెప్పవచ్చుకదా!’ అని తద్దినాలపై ఒక విమర్శ. బ్రతికేవాడికే అన్నంపెట్టమని వారు చెప్పారు. 

20. అయితే చనిపోయినవారి పేరుమీద పెట్టమని, వారిని జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పారు. అంటే చచ్చిపోయిన వాడు తింటాడా? వాడికి తద్దినం ఎందుకు పెట్టాలి? అనే ప్రశ్నలకు; పోయినవాడికి శ్రాద్ధం పెట్టి, ఉన్నవాడికే భోజనం పెట్టమన్నారు. అయితే వారు ఈ ఉద్దేశ్యం మరచిపోయి, ఇటువంటి కుతర్కంతో కూడిన వాదనలు మనవారు కొందరు చేస్తూ ఉంటారు.

21. రోజూ ఒక్కమారైనా దేశం కోసం ప్రార్థనచేయాలి. ‘గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు’ అని రోజూ నమస్కరించాలి. 

22. అంటే, “గోవు నుంచి సమస్త పశువులు, బ్రాహ్మణులనుంచి సమస్త మానవులు” అని దాని అర్థం. అంతేకాని, గోవులు, బ్రాహ్మణులుమాత్రమే బాగుండాలి, మిగతావారు అక్కరలేదు అని కాదు. అలా ఉండనేఉండదు వైదికమార్గం. ‘గోవులతో మొదలుపెట్టి క్రిమికీటకాదులవరకు, ఒకరికొకరు హానిచేయకుండా ఎవరిబ్రతుకు వాళ్ళు బ్రతుకుతూ శాంతితో ఉందురుగాక! విద్యావంతులు, అవిద్యావంతులు, ధనవంతులు, దరిద్రులు, అంతా సుఖంగా ఉందురుగాక!’

23. రోజూ సంధ్యావందనంలో అనవలసిన మాటలివి. వాళ్ళందరూ సుఖపడాలి అని బ్రహ్మణుడు మూడుసార్లు అనాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 28 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴* 

STANZA VI
🌻 The Final Battle - 5 🌻

57. Humanity had become obsessed with the idea of gain, the accumulation of material goods. Small and big wars were started with only one aim — to rob one’s neighbours... Sorcerers of black magic rejoiced, devouring lavish food received in the form of bloody vapours. 

They did not need to sully themselves through contact with those paltry people, who were prone to slay each other in hand-to-hand combat and were even prepared to blow up the planet simply to clear everything out of her bowels. 

People refused to understand that they themselves would perish with all the rest. But greed was simply blinding. And that was playing into the hands of the darkness. The world went mad. The Gorgon reigned supreme in people’s minds.
 
58. The Great Beacons of the World then arrived on the scene. Sometimes they would appear at one end of the Earth, sometimes at the other. 

These were the Sons of God, descended again to the Earth in order to bring the half-crazed world to its senses. People gradually began to wake up to the perception of Truths. 

But with the departure of these Great Bearers of Fire, human beings once again attacked each other with weapons, hiding behind the name or banner of the Son of God...

Sorrow filled the Hearts of the Sons of Light, who watched from above as the blood of those whom they had instructed in Love and Forgiveness was shed... Claiming the authority of the Sacred Names and Images, human beings schemed and plotted terrible intrigues. 

The darkness was deceptive, claiming to act on behalf of Heaven... The bloody harvest was on, as those who blindly trusted in the darkness were plunged into the gloom of ignorance. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 47 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*చివరి భాగము*

*🌻. సమాధికి ముందు కాలజ్ఞానము - 2 🌻*

ఫాల్గుణ మాసంలో నేను వీరభోగ వసంతరాయులనై శ్రీశైలం వెళ్ళి అక్కడి ధనాన్ని బీదలకు పంచిపెడతాను. తరువాత ఉగ్రమైన తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి నుండి మూడు వరాలు పొందుతాను. 

విక్రమ నామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి రోజున బెజవాడ ఇంద్రకీలాద్రికి వస్తాను. అక్కడ ఋషులను దర్శించి, తరువాత కార్తవీర్యార్జున దత్తాత్రేయులవారి వద్ద పలు విద్యలు అభ్యసించి, ఆది దత్తాత్రేయులవారిని దర్శించి, అక్కడి నుండి మహానందికి వెళ్ళి రెండు నెలలు గడుపుతాను. అనంతరం శ్రావణ నక్షత్ర యుక్త కుంభ లగ్నాన వీరనారాయణపురం చేరతాను. అక్కడ 15 దినములు గడుపుతాను.

కలియుగాన 3040 సంవత్సరాలు గడిచిపోయేటప్పటికి పుణ్యతీర్థాలు క్రమ క్రమంగా తమ పవిత్రతను కోల్పోవటం జరుగుతుంది. గంగానది పూర్తిగా అంతర్థానమయిపోతుంది.

ప్రపంచాన ధనమే అన్నింటికీ మూలమౌతుంది. పాతాళ గంగలో నీరు ఇంకిపోతుంది. నూట యిరవై తిరుపతులు నీటిపాలయిపోతాయి. నాలుగు సముద్రాల మధ్య నున్న ధనమంతా శ్రీశైలం చేరుకుంటుంది. సముద్రాలు కలుషితమయిపోతాయి. జల చరములు – ఎక్కడివక్కడే నశించిపోతాయి. 

బంగారు గనుల కోసం కొండల్లో బతికేందుకు ప్రజలు మక్కువ చూపుతారు. కాశీనగరంలో కొట్లాటలు జరుగుతాయి. వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఎక్కువ అయిపోతాయి. కలహాలు, కల్లోలాలు మితిమీరిపోయాయి. కుటుంబంలో సామరస్యత వుండదు. వావీ వరసలు వల్లకాట్లో కలుస్తాయి.

సృష్టి మొత్తం తెలిసిన యోగులు పుడతారు. రెంటాల చెరువు క్రింద ఆపదలు పుడతాయి. వినాయకుడు వలవల ఏడుస్తాడు. గోలుకొండ క్రింద బాలలు పట్నాలు ఏలుతారు. శృంగేరి, పుష్పగిరి పీఠాలు పంచాననం వారి వశమవుతాయి. హరిద్వార్ లో మర్రిచెట్టు మీద మహిమలు పుడతాయి. హరిద్వారానికి వెళ్ళే దారి మూసుకుపోతుంది. అహోబిలంలోని ఉక్కుస్థంభం కొమ్మలు రెమ్మలతో, జాజిపూలు పూస్తుంది. నా రాకకు ముందుగా స్త్రీలు అధికారాన్ని అందుకుంటారు. కులాధిక్యత నశించి వృత్తిలో ఎక్కువ తక్కువలు అంటూ లేక అందరూ సమానమయిపోతారు’’

*🌻. సమాధి తర్వాత తిరిగి దర్శనం 🌻*

నవమి నాటి రాత్రికి సిద్దయ్యను బనగానపల్లెకు పంపి పువ్వులు తెప్పించమని గోవిందమాంబకి ఆదేశించారు స్వామి. వెంటనే సిద్దయ్య బనగానపల్లెకు ప్రయాణం అయ్యాడు.

సిద్దయ్య తిరిగి వచ్చేసరికి స్వామి సమాధిలో ప్రవేశించటం పూర్తయిపోయింది. అది తెలుసుకున్న సిద్దయ్య తీవ్రంగా దుఃఖించి ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. సమాధి నుంచి అది తెలుసుకున్న బ్రహ్మంగారు సిద్దయ్యను పిలిచి, సమాధిపై వున్న బండను తొలగించమని తిరిగి పైకి వచ్చారు.

అప్పుడు సిద్దయ్య కోరిక ప్రకారం ‘పరిపూర్ణ స్థితిని’ బోధించారు.

****

బ్రహ్మంగారు వైదిక ధర్మమును అవలంభించారు. అయితే, ఎప్పుడూ కుల మతాతీతులుగా ప్రవర్తించారు తప్ప ఏనాడూ సంకుచిత కులాభిమానమును గానీ, మాట ద్వేషమును గానీ ప్రదర్శించలేదు. దూదేకుల కులస్థుడైన సైదులును తన శిష్యునిగా స్వీకరించి, అనేక విషయాలను, శాస్త్ర రహస్యాలను అతనికి వివరించారు.

సమాధి అయిన తరువాత కూడా అతనికే దర్శనమిచ్చి దండ కమండల పాదుకలు, ముద్రికను కూడా ప్రసాదించారు. తమ కొడుకులకు కూడా యివ్వని ప్రాముఖ్యత దూదేకుల సైదులుకు ఇచ్చారు. అతనిని సిద్దునిగా మార్చి, ‘సిద్దా’ అనే మకుటంతో పద్యాలు చెప్పారు. అలాగే కడప, బనగానపల్లె, హైదరాబాదు, కర్నూలు నవాబులకు జ్ఞానబోధ చేసి శిష్యులుగా స్వీకరించారు.

*🌻. కందిమల్లాయపాలెం – చింతచెట్టు 🌻*

కందిమల్లాయపాలెంలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి యింటి ఆవరణలో, 14,000 కాలజ్ఞాన పత్రాలను పాత్రలో దాచారు. పైన ఒక చింతచెట్టు నాటినట్లు తెలుస్తోంది. అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి వుంటుంది. ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు, మరేవైనా ప్రమాదాలు కలిగే ముందు, సూచనగా ఆ చెట్టుకు వున్న మొత్తం పూత ఒక రాత్రికే రాలిపోయి, జరగబోయే అశుభాన్ని సూచిస్తుంది.

అలాగే ఈ చెట్టుక్కాసిన చింతకాయలు లోపల నల్లగా వుండి, తినడానికి పనికి రాకుండా వుంటాయి. చెట్ల పంగ నుండి ఎర్రని రక్తము వంటి ద్రవము కారి, గడ్డ కట్టి కుంకుమలా వుంటుందట. దాన్ని అక్కడి ప్రజలు వ్యాధులు, ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు. బనగానపల్లెలో వున్న వృద్దులందరూ ఆ చెట్టు గూర్చి చెప్పగలుగుతారు.

ఆ చింతచెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే వుంటుంది.

ఓం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామియే నమః 🙏

*🌻. సమాప్తం... 🌻*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. అద్భుత సృష్టి - 19 🌹*
 ✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
          
🌟. *ప్రొటీన్ల తయారీకి DNA ఎలా ఉపయోగపడుతుంది?* 🌟

ఇది రెండు దశలలో జరుగుతుంది.

*1. మొదటి దశలో*-ఎంజైమ్స్ DNA లోని సమాచారాన్ని చదివి మెస్సెంజర్ రైబో న్యూక్లియిక్ ఆమ్లం (mRNA)కు అందజేస్తాయి. DNAకు రైబోసోమ్స్ కి మధ్య mRNA అనేది సమాచార వ్యవస్థను నడిపించి ప్రొటీన్ తయారీలో తన వంతు పాత్రను నిర్వహిస్తుంది.

*2. రెండవ దశ*:-mRNA లోని సమాచారం ద్వారా అమినో ఆమ్లాల(Amino acids) భాషలోకి అనువదించి శరీరానికి అవసరమైన ప్రొటీన్స్ (బిల్డింగ్ బ్లాక్స్) తయారీ యంత్రాంగానికి సహాయకుడిగా ప్రోటీన్స్ ని తయారు చేసుకుంటుంది. ఇది చాలా పెద్ద పని ఎందుకంటే 20 రకాల అమినోయాసిడ్స్ ఉంటాయి. వీటి ద్వారా రకరకాల ప్రోటీన్స్ ని తయారు చేయవలసి ఉంటుంది.

🌟. *DNA ని ఎవరు కనుగొన్నారు?- ( సైన్స్ పరంగా)*
1869 సంవత్సరం చివరలో బయోకెమిస్ట్ *"ఫ్రైడరిచ్ మీషెర్"* మొదటిసారిగా DNA ని కనుగొనడం జరిగింది తరువాత ఇందులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవటానికి సైంటిస్టులకు ఒక శతాబ్ద కాలం పట్టింది.

*"DNA లో ఉన్న సమాచారం ఒక తరం నుండి మరొక తరానికి తీసుకుని వెళ్తుంది."* అని 1953లో *"జేమ్స్ వాట్సన్"*, *"ప్రాన్సీస్ క్రిక్"* మారిన్ విల్కిన్స్ మరి రోసలిండ్ ఫ్రాంక్లిన్ కృషివల్ల తేలింది.

🌟. *సైన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం DNA గురించి సంక్షిప్తంగా* 🌟

🔹. శరీరం అనేది ఎన్నో కణాల సముదాయం అనీ, కణ కేంద్రకంలో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి అనీ తేలింది.

🔹 క్రోమోజోమ్స్ లోపల DNA స్ట్రాండ్స్ ఉంటాయి.

🔹 DNA అంటే డీ - ఆక్సీ రైబో న్యూక్లియిక్ ఆమ్లం అంటారు.

🔹 DNA జన్యువులలో ఉన్న వంశపారంపర్యంగా వచ్చిన జ్ఞాన సమాచారం అంతా నిక్షిప్తం చేయబడి ఉంటుంది. ఇది సకల జీవరాశులలోనూ ఈ విధంగానే ఉంటుంది.

🔹 DNA లో 30,000 చురుకుగా పనిచేసే జన్యువులు ఉంటాయి. ప్రతి జన్యువుకు నిర్దిష్ట చర్య ఉంటుంది.

🔹. ఈ DNA..తల్లి యొక్క మరి తండ్రియొక్క కణాలు అయిన అండం మరి శుక్రకణం నుండి బిడ్డకు సంక్రమిస్తాయి. ఇవి ఎనిమిది కణాల కలయిక. దీనిని *"ప్రైమోర్డియల్ సెల్"* అంటారు. కాబట్టి ఇది అనువంశిక అణువు.

🔹. క్రోమోజోమ్స్ *"X"* ఆకారంలో, *"Y"* ఆకారంలో ఉంటాయి. DNA అనేది క్రోమోజోమ్స్ లోపల ఫోల్డ్ చేయబడి ఉంటుంది. ఈ క్రోమోజోమ్స్ చివర్ల DNA బయటకు విడిపోకుండా క్యాపింగ్ చేయబడతాయి. దీనినే *"టెలిమియర్ క్యాపింగ్"* అంటారు.

🔹 క్రోమోజోమ్స్ చివర్ల ఈ టెలిమియర్ క్యాపింగ్ అనేది లేకపోతే DNA విడివడి పొడవుగా అంతం అనేది లేకుండా పెరుగుతూ ఉంటుంది.
*ఉదాహరణకు*:- షూ- లేస్ చివర్ల నొక్కబడి ఉన్న ప్లాస్టిక్ క్యాప్స్ లాంటివి ఉంటాయి. అవి ఊడిపోతే లేస్ ఎలా ఊడిపోతుందో అదేవిధంగా.

🔹 DNA ఇలా అన్నేచురల్ గా పెరుగుతూ ఉంటే అక్కడ ఉన్న ఆర్గాన్స్ కూడా అన్ నాచురల్ గా పెరుగుతాయి‌ వీటినే క్యాన్సర్ కణుతులు అంటారు. అందుకే ఈ టెలిమియర్ క్యాపింగ్ చాలా ప్రధానమైనది.

🔹 DNAలో అధికశాతం 98 నుండి 99% జ్ఞానం నాన్ కోడింగ్ లో ఉంది. దీనిని *"జంక్ DNA "* అన్నారు.

🔹 1 నుండి 2% కోడింగ్ DNA ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ తయారు చేయబడతాయి.

🔹. 98 నుండి 99% నాన్ కోడింగ్ DNA. దీనిని *"జంక్ DNA"* అన్నారు. ఇది ఎందుకూ పనికి రాదు అంటూ డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీ మరి జ్యామితీయ కొలతల సమాంతర జ్ఞానం ఉండవచ్చు అని సైన్స్ చెప్పింది.

 సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 163 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 10. Immortality is freedom from the feeling ‘I am’, to have that freedom remain in the sense ‘I am’, its simple, its crude, yet it works! 🌻*

The feeling ‘I am’ is dormant at birth, it appears spontaneously say around the age of three. It is the essence of the five elements that make up the body or the food body. 

The body is a limitation and as long as the ‘I am’ identifies itself with the body there is no chance of freedom and death is certain.  

Eternity or immortality is possible only when you are free from the ‘I am’. For this freedom to accrue you have to be after the ‘I am’, understand it, abide in it and transcend it. 

Judging from the enormous amount of spiritual literature available the understanding, abidance and transcendence of the ‘I am’ appears to be a too simple and crude ‘Sadhana’ or practice, yet it works!
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 41 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 5 🌻*

మీరందరూ తప్పక ఈ విమర్శ చేసేటటువంటి విధానములన్నింటిలో పూర్ణజ్ఞానమును పొందాలి. ఏమిటవి? పంచకోశ విచారణ, దేహత్రయ విచారణ, శరీరత్రయ విచారణ, అవస్థాత్రయ విచారణ, జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ విచారణ, ధ్యాన ధ్యాతృ ధ్యేయ విచారణ, జడచేతన విచారణ, ఆధార ఆధేయ విచారణ, నిత్యానిత్య విచారణ, అత్మానాత్మ విచారణ, కార్యకారణ విచారణ, సదసద్ విచారణ, దృగ్ దృశ్య విచారణ - ఇలాంటివాటన్నింటినీ పూర్తిచేయాలి. 

ఇవన్నింటినీ ఎప్పుడైతే నీవు పూర్తి చేస్తావో, వీటన్నింటిలో నుండి వచ్చేటటువంటి అనుభవం ఏదైతే వుందో, ఆ అనుభవం నిన్ను ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి దగ్గర చేస్తుంది. అది పొందేటటువంటి స్థితికి నిన్ను చేరుస్తుంది. అందుకని వీటన్నింటినీ బాగా నీకు అధ్యయనం చేయిస్తారనమాట. ఈ అధ్యయనం చేయించడం వల్ల - సాంఖ్య విచారణలో వున్నటువంటి విశేషణం ఇదే - 

ఈ సాంఖ్య విచారణలో ఇవన్నీ చేయడం ద్వారా నీలో ఏవేవి దూరం అవ్వాలో, నీలో ఏవేవి నిరసింపబడాలో, ఏయే వాటి నుంచి నీవు అధిగమించాలో, వాటన్నింటినీ నీవు అధిగమించిన స్థితిలో నిలబడతావనమాట. తత్ ప్రభావం చేత నీకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. ఈ రకంగా నడిపేటప్పుడు అనుభవజ్ఞానం చాలా ముఖ్యము. అందుకని - ఎందుకని అంటే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మము.
         
ఎందుకని ఆ మాట అంటున్నారంటే ఆత్మ సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. ఇక ఆత్మ కంటే సూక్ష్మమైనది లేదనమాట. అది సర్వ వ్యాపకము. అన్నింటికంటే సూక్ష్మము. మరి చిహ్నముల ద్వారా దానిని ప్రత్యక్షమయ్యేటట్లు చెయ్యగలుగుతామా? అంటే అర్ధం ఏమిటీ? సరే. 

ఇక్కడి నుంచి ఇప్పుడున్న వ్యవస్థలో అనేక దేశాలలో అనేక రకాలైనటువంటి చిహ్నాల ద్వారా ఈ జ్ఞానాన్ని దివ్యత్వాన్ని వ్యక్తీకరించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కాని అవేవీ సత్యానికి ఆత్మానుభూతిని నిర్ణయించలేవు. అంటే అర్ధం ఏమిటీ? 

ఒకాయన ఒక చేతిలో కొబ్బరికాయ పట్టుకుని వుంటాడు. ఒకాయన దానిని తీక్షణంగా చూస్తూ వుంటాడు. చూడగా చూడగా చూడగా చూడగా చూపు ద్వారా దానిని ప్రేరేపించడం ద్వారా చేతిలో వున్న కొబ్బరికాయ క్రిందపడిపోతుంది. 

ఇప్పుడు ఆయనకి ఆత్మానుభూతి వున్నట్లేనా? ఒకాయన కళ్ళకు గంతలు కట్టుకుని తన ఎదురుగుండా వున్నటువంటి పుస్తకంలో వున్న వేదాన్ని అంతా చదివేస్తాడు. దీన్ని బ్లైండ్ రీడింగ్ [blind reading] అంటారు. మరి ఆయనకి ఆత్మానుభూతి వున్నట్లేనా?

 ఒకాయనకి దూరశ్రవణ విద్య. అంటే మనం ఫోన్ లో ఎట్లా మాట్లాడుకుంటున్నామో, ఆయన ఫోన్ సహాయం లేకుండా తెలుసుకో గలుగుతాడు. అలాంటి దూరశ్రవణ విద్య వున్నటువంటివాళ్ళు వుంటారు. 

అలాగే కొంతమందికి ఏదైనా ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకి సమాధానం ఇన్వొకింగ్ – ఇంట్యూషన్ [invoking – intuition] అంటారు దీన్ని. ఈ ఇంట్యూషన్ [intuition] ద్వారా చెప్పేటటువంటి విధానం ఒకటి వుంటుంది. అలాగే కొంతమందికి ట్రాన్సెన్-డెన్టల్ [Transcendental Meditation] అంటారు. 

అంటే ఒకరి చేతిలో వాహకంగా పనిచేసేటటువంటి నిబద్ధత కొంతమంది మానసిక వ్యవస్థలలో వుంటుంది. అట్టి మానసిక వ్యవస్థ కలిగినటువంటి వాళ్ళు - తప్పక ఏం జరుగుతుందంటే - ఆ మానసిక వ్యవస్థల నుంచి వాళ్ళు ప్రేరణని పొంది, ఆ ప్రేరణ ద్వారా వాళ్ళు సమాధానాన్ని చెప్తూ వుంటారు.
    
ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మ ప్రజ్ఞా పరిధిలో. ఈ ప్రజ్ఞ కి చైతన్యానికి వున్నటువంటి వలయాలలో చిట్టచివరి వలయాలలో [outer periphery] ఉంటారనమాట. అంటే సూక్ష్మం అనగానే ఇలాంటివన్నీ మొదలైపోతాయనమాట. 

సూక్ష్మం అనగానే అనేకరకాలైన శక్తులు, అనేకరకాలైనటువంటి స్థూలానికి అతీతమైనటువంటి - అతీత శక్తులు అతీత శక్తులు అంటారు - దేనికి అతీతం అంటే స్థూలానికి అతీతం. 

అంటే మన కళ్ళు, మన చెవులు, మన ముక్కులు, మన స్పర్శ, మన నోరు ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు తెలుసుకోగలిగినదానికంటే అతీతమైనటువంటిది. అవతలిది. అలాంటిదేదైనా వచ్చినపుడు వాళ్ళు అవి చేయగలుగుతారనుకోండి. 

మరి వీటి ద్వారా ఆత్మ వున్నదని నిరూపించదగునా అంటే అట్లాంటివాటి వల్ల ఆత్మ యొక్క సాక్షాత్కార జ్ఞానాన్ని పొందలేము. అత్మానుభూతిని పొందలేము. 

మరి ఎలాగండీ నిరూపణ అంటే ఇదంతా గ్రుడ్డివాడు ఏనుగును పట్టుకున్న రీతి. వాళ్ళు పట్టుకున్నది ఏనుగును కాదా? ఏనుగు లక్షణాలు కావా అంటే ఒకానొక అంశీభూతములే. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 18. గీతోపనిషత్ - అనర్హుడు - మనస్సుచే మోసగింపబడిన వారు దైవ ధ్యానమును చేయలేరు. రసానుభూతిని పొందలేరు. 🌹*

*భోగైశ్వర్యప్రసక్తానం తయాపహృతచేతసామ్ |*
*వ్యవసాయాత్మికా బుద్ధి: సమాధౌ న విధీయతే || 44*

భగవంతుడు రస స్వరూపుడు. రసాస్వాదనము చేయుటకే
జీవనము. అదియే వైభవము. అట్టి వైభవమును పొందుటకు ఈ
క్రిందివారనర్హులని భగవానుడు బోధించుచున్నాడు.

1) కర్మఫలములం దాసక్తి గలవాడు,

2) పుణ్యము కొరకు మంచిపని చేయువాడు,

3) కోరికలతో నిండిన మనస్సు కలవాడు,

4) భోగములయం దాసక్తి కలవాడు,

5) జ్ఞాన సముపార్జన చేయనివాడు,

6) ఐశ్వర్యములను సంపాదించుటకు ప్రయాస పువాడు,

7) తెలిసినదానిని ఆచరించనివాడు. 

పైవారందరూ వారి మనస్సుచే మోసగింపబడినవారు. వారు దైవ ధ్యానమును చేయలేరు. రసానుభూతిని పొందలేరు.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹