Showing posts with label Pushyamasam పుష్యమాసం. Show all posts
Showing posts with label Pushyamasam పుష్యమాసం. Show all posts
పుష్య పౌర్ణమి (జనవరి 3, 26): ఈ ఐదు ప్రదేశాలలో దీపాలు వెలిగిస్తే కష్టాలు తొలగిపోయి, నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి! Pushya Pournami (Jan 3, 26): Lighting lamps in these five places will solve troubles and complete pending tasks!
🌹 పుష్య పౌర్ణమి ( జనవరి 3): ఈ ఐదు ప్రదేశాల్లో దీపారాధన.. కష్టాలు మటుమాయం.. పెండింగ్ పనులు ఇట్టే పూర్తవుతాయి..! 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Pushya Pournami (January 3): Lighting lamps in these five places will make your troubles disappear and pending tasks will be completed instantly! 🌹
Prasad Bharadwaj
పుష్య మాసం పౌర్ణమి రోజున ( జనవరి 3) హిందు పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ..
సుఖ సంతోషాలు కూడా మీ సొంతం అవుతాయి. పుష్య మాసం పూర్ణిమ నాడు ఏయే ప్రదేశాలలో దీపం వెలిగిస్తే శుభం కలుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పుష్యమాసం శనిభగవానుడికి శనీశ్వరుడికి చాలా ఇష్టం. పౌర్ణమి తిథి శని వారం.. పుష్య మాసం లో వచ్చిదంటే పురాణాల ప్రకారం ఆరోజుకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ ఏడాది ( 2026) జనవరి 3 వ తేది శనివారం పుష్య పౌర్ణమి తిథి వచ్చింది. ఆ రోజున శని భగవానుడి పూజించి నల్లనువ్వులు దానంతో పాటు శ్రీ మహా విష్ణువు, లక్ష్మిని పూజించడం వలన ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనంతో పాటు జీవితంలో ఆనందం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
1. ఇంట్లో దేవుడి మందిరం దగ్గర: పుష్యమాసం పౌర్ణమి తిథి రోజున ( జనవరి3) ఇంట్లో దేవుడి దగ్గర ఆవునెయ్యితో దీపారాధన చేయడం వలన ఇప్పటి వరకు కష్టాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి.. లక్ష్మీదేవి ఆశీస్సులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
2. తులసి మొక్క దగ్గర : హిందువులు.. తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. పురాణాల ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. పుష్యమాసం పూర్ణిమ రోజున తులసి మొక్క దగ్గర ఉదయం ( సూర్యోదయానికి ముందు) .. సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఆవునెయ్యితో దీపారాధ చేయాలి. ఆ తరువాత లక్ష్మీ దేవి అష్టోత్తర నామాలతో కుంకుమ పూజ చేయాలి. మహాలక్ష్మి అమ్మవారికి పండ్లు.. పాయసం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వలన ఆర్థిక కష్టాలు తొలగి.. పెండింగ్పనులు త్వరగా పూర్తవుతాయి.
3. రావి చెట్టు దగ్గర దీపం: ఈ చెట్టులో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు నివసిస్తారు. పుష్యమాసం సూర్యభగవానుడి చాలా ఇష్టమైన నెల. అందుకే ఈ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజున ( 2026 జనవరి 3) ఇక్కడ రెండు కుందుల్లో దీపారాధన చేయాలి. ఒకదానిలో ఆవునెయ్యి దీపారాధన.. మరొక దానిలో నువ్వుల నూనె దీపారాధన చేయాలి. తరువాత అగర్ బత్తీలు వెలిగించి.. బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వలన త్రిమూర్తుల ఆశీస్సులు కలగడమే కాకుండా... పూర్వీకులు కూడా సంతోషించి.. పితృదోషాలు తొలగిపోతాయి.
4. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర: పుష్యమాసం.. పౌర్ణమి తిథి రోజున (2026 జనవరి 3) ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఆవునెయ్యితో దీపారాధన చేయడం వలన ఇంట్లోకి నెటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఇంటి గుమ్మాన్ని పసుపు, కుంకుమతో అలంకరించాలి. గుమ్మానికి పైన పూలదండ కడితే మరీ మంచిది. ఇలా చేయడం వలన అన్ని రకాల సమస్యలకు పరిష్కారం కలుగుతుంది.
5. శని భగవానుడి దగ్గర : శని భగవానుడి దగ్గర నువ్వులనూనె దీపారాధన చేయాలి. పుష్యమాసం శనీశ్వరుడికి ఇష్టమైన నెల. పౌర్ణమి తిథి రోజున శనీశ్వరుడి తైలాభిషేకం చేసి.. నువ్వులతో అర్చించాలి. ధూపం.. దీపం.. తరువాత శనీశ్వరునికి బెల్లంతో తయారు చేసిన నువ్వుల లడ్డు సమర్పించాలి. పేదలకు వస్త్రదానం చేయాలి. ఇలా చేయడం వలన శనిభగవానుడు సంతోషించి.. కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని పండితులు చెబుతున్నారు.
ఇంకా ఏమేమి చేయాలంటే..
లక్ష్మీదేవిని పసుపు రంగు పువ్వులతో పూజించడం వల్ల మీకు డబ్బుకు లోటు ఉండదు.
పుష్యమాసం పౌర్ణమి రోజున పవిత్రమైన నదిలో పవిత్ర స్నానం చేసి... దీపదానం చేయడం వల్ల తెలిసి, తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి ... కోరిన కోరికలు నెరవేరడం.
ఆహారం, డబ్బు, బట్టలు దానం దానం చేయడం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు.. వ్యాపారంలో లాభం.
ఓం సోమాయ నమః... 108 సార్లు ఈ మంత్రాన్ని జపించి చంద్రునికి అర్ఘ్యం ఇస్తే మంచి జరుగుతుంది.
తెల్లటి వస్తువులను దానం చేయడం ఉత్తమం. బియ్యం, పాలు, చక్కెర, తెల్లటి వస్త్రాలు, వెండి వస్తువులు వంటివి పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయడం జాతకంలో చంద్రదోషం తొలగిపోయి.. మేలు జరుగుతుంది.
పవిత్ర నదుల్లో స్నానం.. మోక్షానికి మార్గం
ఏది ఎలా చేసినా భక్తి పూర్వకంగా శ్రద్దతో చేయాలి
🌹🌹🌹🌹🌹
పౌష పౌర్ణమి, శాకంబరి పౌర్ణమి, శివముక్కోటి, అన్వధన శుభాకాంక్షలు / Happy Pausha Pournami, Shakambari Pournami, Shivamukkoti, and Anvadhan
🌹 పౌష పౌర్ణమి, శాకంబరి పౌర్ణమి, శివముక్కోటి, అన్వధన శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹 Happy Pausha Pournami, Shakambari Pournami, Shivamukkoti, and Anvadhan to everyone 🌹
Prasad Bharadwaj
పుష్య పౌర్ణమి, శాంకంబరీ పౌర్ణమి, శ్రీ శాకాంబరి దేవి జయంతి, శివ ముక్కోటి, అన్వధన శుభాకాంక్షలు! Happy Pushya Pournami, Shakambari Pournami, Sri Shakambari Devi Jayanti, Shiva Mukkotri, and Anvadhan!
ప్రసాద్ భరద్వాజ
🌹 Pushya Poornami, Shankambari Poornami, Shri Shakambari Devi Jayanti, Shiva Mukkoti, Anvadhana Wishes to all 🌹
Prasad Bhardwaj
పుష్య పూర్ణిమ ని శాంకంబరీ పౌర్ణమి అంటారు. ఈ రోజును శాకాంబరి జయంతిగా జరుపుకుంటారు. ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజును శివ ముక్కోటిగా చెబుతారు. అందువల్ల ఈ పౌర్ణమిని శివ ముక్కోటిగా కూడా వ్యవహరిస్తారు. ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం శుభప్రదంగా భావిస్తారు. శాకాంబరి దేవిని దుర్గా అవతారంగా భావిస్తారు. పుష్యపౌర్ణమికే పౌషీ అనే పేరు. అన్వధన అని కూడా అంటారు. ఈ రోజున వస్త్రదానం చేయడం మంచిది అని పండితులు చెబుతారు.
🌹 శాకంబరి మూల మంత్రం 🌹
"ఓం అం శాం శాకంభరీ-దేవ్యై నమః."
శాకంభరీ దేవి మంత్రం, పోషణ మరియు మొత్తం శ్రేయస్సును అందిస్తుంది మరియు అడ్డంకులు మరియు బాధలను తొలగిస్తుందని నమ్ముతారు. ఒకరు మనుగడ భయాన్ని దాటి, జీవితంలో ఉన్నతమైన లక్ష్యం కోసం ప్రయత్నించవచ్చు, శాకంభరీ దేవి ఆధ్యాత్మిక శక్తితో ఆనందకరమైన ఆత్మ స్థితిని సాధించడం సాధ్యం అవుతుంది.
మంత్రాలకు తార్కిక మనస్సును ఆకర్షించే అర్థాలు మాత్రమే ఉండవు, కానీ ప్రతి అక్షరం యొక్క శబ్దం కూడా మన శరీరంలో కొన్ని ప్రతిధ్వనులను సృష్టిస్తుంది. శాకంభరీ దేవి మంత్రాన్ని పఠించడం వల్ల మనలో ఒక రకమైన ప్రతిధ్వని కలుగుతుంది, దాని ద్వారా మనం ఆధ్యాత్మిక పోషణను పొందుతాము.
🍀 శాకంబరి దేవి ఆశీర్వాదం కోసం మరొక మంత్రం 🍀
"ఓం అం శం శాకంభరీ-దేవ్యై సకల-స్థావరా జంగమ-రక్షకీ ధన-ధాన్య వృత్తి-కారిణ్యై నమః."
🙌 శాకంభరి దేవత అనుగ్రహం 🙌
తంత్ర-మంత్రాన్ని కోరుకునే వారు సాధనకు శాకంభరి దేవత అనుగ్రహం కోరుకుంటారు. తల్లి శాకంభరి తన శరీరం నుండి ఉత్పత్తి చేయబడిన కూరగాయలు, పండ్లు, మూలాలు మొదలైన వాటితో ప్రపంచాన్ని పోషించింది. ఈ కారణంగా, మాతా 'శాకంభరి' పేరుతో ప్రసిద్ది చెందింది. తంత్ర-మంత్ర నిపుణుల దృష్టిలో తంత్ర-మంత్ర సాధనకు శాకంబరి నవరాత్రి చాలా అనుకూలంగా భావిస్తారు. పౌష్య మాసం యొక్క ప్రకాశవంతమైన పక్షం ఎనిమిదవ రోజున శాకంభరి నవరాత్రి పండుగ ప్రారంభమవుతుందని గ్రంథాల ప్రకారం. మాతా శాకంభరి జయంతిని పౌర్ణమి తేదీన జరుపుకుంటారు. దుర్గా అవతారాలలో శకభరి ఆదిశక్తి దేవత ఒకటి. దుర్గా యొక్క అన్ని అవతారాలలో, రక్తదంతిక, భీముడు, భ్రమరి, శకంభరి ప్రసిద్ధి చెందారు. శాకాంబరి దేవి యొక్క వివరణ శ్రీ దుర్గసప్తశతిలో వస్తుంది. శాకాంబరి దేవిని పూజించే వారి ఇళ్లలో ఆహారం నిండి ఉంటుందని చెబుతారు.
🍓 శాకంబరి దేవి అవతారం కథ 🍓
పురాతన కాలంలో భూమి ఎండిపోయినప్పుడు మరియు వంద సంవత్సరాలు వర్షాలు లేనప్పుడు, చుట్టూ కరువు కారణంగా గందరగోళం ఏర్పడింది. భూమి యొక్క అన్ని జీవులు నీరు లేకుండా దాహంతో చనిపోవడం ప్రారంభించాయి మరియు అన్ని మొక్కలు మరియు వృక్షాలు ఎండిపోయాయి. ఈ సంక్షోభ సమయంలో, అందరూ కలిసి భగవతిదేవిని ఆరాధించారు. ఆమె భక్తుల పిలుపు విన్న దేవత భూమిపై శాకంభరిగా అవతరించి భూమిని వర్షపునీటితో తడిపింది. ఇది భూమిపై జీవితాన్ని తిరిగి పుంజుకుంది. చుట్టూ పచ్చదనం ఉంది. అందువల్ల, ఈ దేవత యొక్క అవతారాన్ని శాకంభరిగా పూజిస్తారు మరియు ఈ రోజును శాకంభరి పూర్ణిమ లేదా శాకంభరి జయంతిగా జరుపుకుంటారు.
పుష్యమాసం శనిభగవానుడికి శనీశ్వరుడికి చాలా ఇష్టం. పౌర్ణమి తిథి శని వారం.. పుష్య మాసం లో వచ్చిదంటే పురాణాల ప్రకారం ఆరోజుకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ ఏడాది ( 2026) జనవరి 3 వ తేది శనివారం పుష్య పౌర్ణమి తిథి వచ్చింది. ఆ రోజున శని భగవానుడి పూజించి నల్లనువ్వులు దానంతో పాటు శ్రీ మహా విష్ణువు, లక్ష్మిని పూజించడం వలన ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనంతో పాటు జీవితంలో ఆనందం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
పుష్యమాసంలో శ్రీమహావిష్ణువుని, శనైశ్వరుణ్ణి ఆరాధిస్తే కష్టాలు తొలుగుతాయి Worshipping Lord Maha Vishnu and Lord Shani in the month of Pushya
🌹 పుష్యమాసంలో శ్రీమహావిష్ణువుని, శనైశ్వరుణ్ణి ఆరాధిస్తే కష్టాలు తొలుగుతాయి. 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹 Worshipping Lord Maha Vishnu and Lord Shani in the month of Pushya alleviates difficulties. 🌹
Prasad Bharadwaj
పుష్యమాసం ప్రారంభమైంది. ఈ మాసంలో నెల పడతారు. కావున కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో శనిదేవుడిని ఆరాధిస్తే విశేష ఫలితాలు వస్తాయని అంటారు.
శ్రావణ మాసం మహాలక్ష్మీ, కార్తీక మాసం శివుడు, మార్గశిర మాసం విష్ణువు ఎలాగో ఈ పుష్య మాసంలో శనిదేవుడిని పూజించాలని పురాణాలు చెబుతున్నాయి. మరి ముఖ్యంగా ఏలిననాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి. శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తే ఆ ప్రభావం తగ్గుతుంది. అలాగే ఈ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం చేసి.. నువ్వులు దానంగా ఇస్తే మంచిది. శనిదేవుడికి నువ్వులతోపాటు బెల్లం ప్రీతిపాత్రమని చెబుతారు.
శని భగవానుడు ధర్మం, న్యాయం, సత్యంలను పరిరక్షిస్తుంటాడని పురాణాలు చెబుతున్నాయి. కోర్టు వివాదాల్లో బాధపడే వారు ఈ పుష్య మాసంలో శని దేవుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయని అంటారు. ఈ నెల రోజులు శనిదేవునికి నువ్వులు, బెల్లం నైవేద్యంగా సమర్పించి.. వాటిని స్వీకరిస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇక ఈ మాసంలో శని భగవానుడితో పాటు పుష్యమాసం తొలి అర్థభాగం శ్రీమహా విష్ణువును పూజిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ మాసంలో సోమవారం శివుడిని మారేడు దళాలతో.. ఆదివారం సూర్యుడిని జిల్లేడు పూలతో ఆర్చిస్తారు. పుష్య మాసంలో శుక్ల పక్ష షష్ఠి రోజు శ్రీవల్లీదేవ సేన సమేత శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తారు.
ఈ మాసంలో సూర్యోదయ కాంతి యోగ చైతన్యాన్ని ప్రసరిస్తుంది. మకరరాశిలో సూర్యుడు ప్రవేశించే సమయం నుంచి ఉత్తరాయణ పుణ్య కాలం ఏర్పడుతుంది. ఈ పుణ్యకాలంలో దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా సూర్యుడి ప్రయాణం కొనసాగుతుంది. ఈ సమయంలో సూర్య కిరణాలు ప్రత్యేకమైన తేజస్సు కలిగి ఉంటాయి. ఈ సూర్య కాంతి వల్ల ప్రజలకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
🌹🌹🌹🌹🌹
నేటి నుంచే పుష్యమాసం.. శనీశ్వరుడికి ప్రీతికర మాసం పుష్యమాసం Pushya Masam, loved by Lord Shani, begins today...
🌹 నేటి నుంచే పుష్యమాసం.. శనీశ్వరుడికి ప్రీతికర మాసం పుష్యమాసం 🌹
ప్రసాద్ భరద్వాజ
పుష్య మాసం పుణ్య మాసం. ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసి ఉంటాడు, అందుకే దీనికి పుష్య మాసం అని పేరు వచ్చింది. అటు శనిదేవుడి జన్మనక్షత్రం కూడా పుష్యమే.. అందుకే ఈ మాసం శని దేవునికి ప్రీతికరమైనది. ఆయనను పూజిస్తే కష్ఠాలు తొలగి శుభాలు కలుగుతాయని నమ్మకం. విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజిస్తే సౌందర్యం, శివుడిని మారేడు దళాలతో అర్చిస్తే ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్ర వచనం. ఈ నెలలో చేసే గింజంత దానమైనా అనంత పుణ్య ఫలాన్ని ఇస్తుందని అంటారు. నదీ స్నానాలు సూర్యారాధనతో ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితుల వాక్కు.
శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి వెలిగించడం వల్ల వెలువడే సుగంధభరితమైన పొగ మానసిక ప్రశాంతతను ఇచ్చి, మనలోని సోమరితనాన్ని, ప్రతికూల ఆలోచనలను పారద్రోలుతుందని పండితులు చెబుతున్నారు. 'ఆధ్యాత్మికంగా చూస్తే.. ఈ ధూపం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి ఈతిబాధలు తొలగిపోతాయి. అలాగే సకల దేవతల అనుగ్రహం లభించి, కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి. మనసు ఉల్లాసంగా మారి పనుల పట్ల ఉత్సాహం పెరుగుతుంది' అంటున్నారు.
శీతాకాలంలో వచ్చే పుష్య మాసం జపతపాదులు, ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది, ఈ మాసంలో పితృదేవతలను పూజిస్తే దోషాలు తొలగిపోతాయి. "పుష్య" అనే మాటకు పోషణ, శక్తి కలిగినది అని అర్థం. దీనిని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ లలోకూడా అనుసరిస్తారు.
పుష్య మాసం ఆధ్యాత్మిక పరంగా విశిష్టమైనదే కానీ వివాహాలు, గృహప్రవేశం, నిశ్చితార్థాలు మొదలైన కొన్ని రకాల కార్యాలకు ఆశుభకరమైన మాసంగా జ్యోతిష శాస్త్రం పరిగణిస్తోంది. పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయమని పండితులు చెబుతున్నారు.
ఈ నెల రోజుల పాటు శనైశ్చరుణ్ని పూజించిన వారికి ఆయన మేలు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. జాతకంలో ఏలినాటి శని ఉన్న వారు ఈ మాసంలో రోజూ ఉదయానే కాలకృత్యాలు తీర్చుకొని శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్ధించాలి. పౌర్ణమి రోజున తెల్లవారు జామునే లేచి శనికి తైలాభిషేకం చేయించి నవ్వులు దానమివ్వాలి. ఆ రోజు నువ్వులు, బెల్లం ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
పుష్యమాసం మొదటి పక్షం రోజులు శ్రీ మహా విష్ణువుని తులసీ దళాలతో పూజిస్తే మానసిక ప్రశాంత లభిస్తుంది. పుష్య సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతో, ఆదివారం రోజున సూర్యుణ్ణి జిల్లేడు పూలతో పూజించడం శ్రేష్టం.
🌹 🌹 🌹 🌹 🌹
ప్రసాద్ భరద్వాజ
పుష్య మాసం పుణ్య మాసం. ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసి ఉంటాడు, అందుకే దీనికి పుష్య మాసం అని పేరు వచ్చింది. అటు శనిదేవుడి జన్మనక్షత్రం కూడా పుష్యమే.. అందుకే ఈ మాసం శని దేవునికి ప్రీతికరమైనది. ఆయనను పూజిస్తే కష్ఠాలు తొలగి శుభాలు కలుగుతాయని నమ్మకం. విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజిస్తే సౌందర్యం, శివుడిని మారేడు దళాలతో అర్చిస్తే ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్ర వచనం. ఈ నెలలో చేసే గింజంత దానమైనా అనంత పుణ్య ఫలాన్ని ఇస్తుందని అంటారు. నదీ స్నానాలు సూర్యారాధనతో ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితుల వాక్కు.
శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి వెలిగించడం వల్ల వెలువడే సుగంధభరితమైన పొగ మానసిక ప్రశాంతతను ఇచ్చి, మనలోని సోమరితనాన్ని, ప్రతికూల ఆలోచనలను పారద్రోలుతుందని పండితులు చెబుతున్నారు. 'ఆధ్యాత్మికంగా చూస్తే.. ఈ ధూపం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి ఈతిబాధలు తొలగిపోతాయి. అలాగే సకల దేవతల అనుగ్రహం లభించి, కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి. మనసు ఉల్లాసంగా మారి పనుల పట్ల ఉత్సాహం పెరుగుతుంది' అంటున్నారు.
శీతాకాలంలో వచ్చే పుష్య మాసం జపతపాదులు, ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది, ఈ మాసంలో పితృదేవతలను పూజిస్తే దోషాలు తొలగిపోతాయి. "పుష్య" అనే మాటకు పోషణ, శక్తి కలిగినది అని అర్థం. దీనిని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ లలోకూడా అనుసరిస్తారు.
పుష్య మాసం ఆధ్యాత్మిక పరంగా విశిష్టమైనదే కానీ వివాహాలు, గృహప్రవేశం, నిశ్చితార్థాలు మొదలైన కొన్ని రకాల కార్యాలకు ఆశుభకరమైన మాసంగా జ్యోతిష శాస్త్రం పరిగణిస్తోంది. పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయమని పండితులు చెబుతున్నారు.
ఈ నెల రోజుల పాటు శనైశ్చరుణ్ని పూజించిన వారికి ఆయన మేలు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. జాతకంలో ఏలినాటి శని ఉన్న వారు ఈ మాసంలో రోజూ ఉదయానే కాలకృత్యాలు తీర్చుకొని శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్ధించాలి. పౌర్ణమి రోజున తెల్లవారు జామునే లేచి శనికి తైలాభిషేకం చేయించి నవ్వులు దానమివ్వాలి. ఆ రోజు నువ్వులు, బెల్లం ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
పుష్యమాసం మొదటి పక్షం రోజులు శ్రీ మహా విష్ణువుని తులసీ దళాలతో పూజిస్తే మానసిక ప్రశాంత లభిస్తుంది. పుష్య సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతో, ఆదివారం రోజున సూర్యుణ్ణి జిల్లేడు పూలతో పూజించడం శ్రేష్టం.
🌹 🌹 🌹 🌹 🌹
Pushyamasam పుష్యమాసం
🌹పుష్యమాసం 🌹
చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య” అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం.
ఆధ్యాత్మికంగా జపతపాదులు , ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు , మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది.
విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివునకు కార్తీకం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి.
ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు , బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీనివెనుక శాస్త్రీయ కోణం చుస్తే ఈ రెండూ పదార్ధాలు మనిషి ఓంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి.
శని ధర్మదర్శి న్యాయం , సత్యం , ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వ ప్రేమను , పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే . మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి , నియమ నిష్ఠులు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు.
అంతే గాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి.
పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీ హరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం.
అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్ల పక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి ( సుబ్రహ్మణ్య షష్ఠి ) ఎలాగో వారికి ఈ రోజు అంత పవిత్రమైనది.
ఇక శుక్ల పక్షంలో వచ్చే అష్టమిరోజు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం.
🌹🌹🌹🌹🌹
చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య” అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం.
ఆధ్యాత్మికంగా జపతపాదులు , ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు , మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది.
విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివునకు కార్తీకం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి.
ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు , బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీనివెనుక శాస్త్రీయ కోణం చుస్తే ఈ రెండూ పదార్ధాలు మనిషి ఓంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి.
శని ధర్మదర్శి న్యాయం , సత్యం , ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వ ప్రేమను , పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే . మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి , నియమ నిష్ఠులు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు.
అంతే గాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి.
పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీ హరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం.
అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్ల పక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి ( సుబ్రహ్మణ్య షష్ఠి ) ఎలాగో వారికి ఈ రోజు అంత పవిత్రమైనది.
ఇక శుక్ల పక్షంలో వచ్చే అష్టమిరోజు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Posts (Atom)