4వ పాశురము Part 1 - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 4th Pasuram Part 1 - Tiruppavai Pasuras Bhavartha Gita Malika



https://youtube.com/shorts/zKhf5pScldU


🌹 4వ పాశురము Part 1 - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 4th Pasuram Part 1 - Tiruppavai Pasuras Bhavartha Gita Malika 🌹

🍀 4వ పాశురం part 1 - కరుణా వర్ష ప్రార్థన గీతం 🍀

తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 తిరుప్పావై నాలుగో పాశురంలో గోదాదేవి విష్ణుమూర్తిని మేల్కొలపడానికి పాడుతూ, పరమ శివుడిని కూడా ప్రార్థిస్తుంది. ఓ త్రిలోకేశ్వరా! నీవు కూడా కైలాసంలో నిద్రపోతున్నావా? శ్రీమన్నారాయణుని పాదాల చెంత చేరాలని, గోపికలందరం నీకు నమస్కరిస్తున్నాం. పద్మనాభుడు తన చేతిలో చక్రాయుధం ధరించి, మెరుపులా మెరుస్తూ, శంఖంలా గంభీరంగా ఉన్నాడు. వెన్నెలలు కురిసే ఈ మార్గశిర మాసంలో మేము నీటిలో స్నానానికి వెళ్ళేందుకు, నీవు కూడా మేల్కొని, వర్షాలను కురిపించు అని ప్రార్ధిస్తుంది. 🍀

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

డిసెంబర్ 18న నేడు చివరి మాస శివరాత్రి. Today, December 18th, is the last monthly Shivaratri of the year.



🌹 🔱 డిసెంబర్ 18న నేడు చివరి మాస శివరాత్రి. నేటి రాత్రి మాసశివరాత్రి వ్రతం చేసి రాహు-కేతు దోషాల నుంచి విముక్తి పొందండి. 🔱🌹

ప్రసాద్ భరద్వాజ



ఈ ఏడాదిలో చివరి మాస శివరాత్రి డిసెంబర్ 18న అంటే నేడు వచ్చింది. ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థశి తిథిరోజు మాసశివరాత్రి వ్రతం చేస్తారు.మాస శివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు.

ఈ వ్రతం మహత్యం శివపురాణంలో కూడా ఉంది. లక్ష్మీదేవి, ఇంద్రాణి, సరస్వతి, గాయత్రి, సావిత్రి, సీత, పార్వతి కూడా మాసశివరాత్రి వ్రతం చేశారని పురాణాల్లో ఉంది.

మాఘమాసం కృష్ణ పక్ష చతుర్థశి తిథి.. డిసెంబర్ 18 గురువారం తెల్లవారుఝామున 2 గంటల 32 నిమిషాలకు మొదలవుతుంది.. సూర్యోదయం , సూర్యాస్తయమం వరకూ చతుర్థశి తిధి ఉంది. శివ పూజ కోసం ఈ రోజు రాత్రి 11.51 నుంచి రాత్రి 12.45 వరకు శుభ ముహూర్తం.


🌻 రాహు-కేతు అశుభతను దూరం చేసే మాస శివరాత్రి వ్రతం 🌻

రాహు-కేతు అశుభ ప్రభావం వల్ల జీవితంలో సంతోషం దూరమవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివుని పూజ చెయ్యడం వల్ల రాహు దోషం నుంచి విముక్తి లభిస్తుంది.అందుకే మాస శివరాత్రి రోజు నిశిత కాల ముహూర్తంలో శివునికి నీటితో అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది. ఎవరి కుండలిలో రాహు-కేతు మహాదశ ఉంటుందో..మాసశివరాత్రి రోజు పూజ చేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. ఇది రాహు-కేతు జానిత అన్ని రకాల దోషాలను సమాప్తం చేస్తుంది.


🔱 అసంభవాన్ని సంభవం చేసే మాసశివరాత్రి వ్రతం 🔱

మాస శివరాత్రి వ్రతం చెయ్యడం వల్ల ఎంత కష్టమైన పని అయినా సంపూర్ణం అవుతుందని..చేపట్టిన పనిలో అడ్డంకులు తొలగి పోతాయని భక్తుల విశ్వాసం.


🌿 మాస శివరాత్రి వ్రతం ఎలా చేయాలి? 🌿

మాసశివరాత్రి వ్రతం చేయాలని సంకల్పం తీసుకోండి..ఇంట్లో శివలింగానికి అభిషేకం చేయండి..లేదంటే ఆలయానికి వెళ్లిరండి..ఆలయంలో 11 ప్రదక్షిణలు చేయండి.

సాయంత్రం కూడా శివపూజ చేయండి. మహాశివరాత్రికి చేసినట్టే జాగరణ చేస్తే ఇంకా మంచిది. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ తర్వాత పండ్లు తీసుకోండి..మసరుటి రోజు ఉపవాసం విరమించండి.

"ఓం నమః శివాయ" మంత్రాన్ని 108 సార్లు జపించండి. శివ అష్టోత్తరం లేదా శివ తాండవ స్తోత్రం పఠించండి.రాత్రంతా జాగరణ చేసి శివనామస్మరణ చేయండి.

సంవత్సరానికి 12 మాస శివరాత్రులు వస్తాయి.. వీటిలో మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రినే మాఘ మహాశివరాత్రిగా జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజు పాటించే నియమాలనే ఈ మాస శివరాత్రి రోజు అనుసరించాలి. ఈ రోజు ఉపవాసం ఆచరిస్తే పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గ్రహదోషాల నివారణ కోసం, సంతానం, ఆరోగ్యం, వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగించుకునేందుకు కూడా మాసశివరాత్రి వ్రతం చేస్తారు.

🌹🌹🌹🌹🌹


'ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం' Maha Vishnu Stotram



https://youtube.com/shorts/nKUEL1S6nXw


🌹 ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం Maha Vishnu Stotram శుభ గురువారం 🌹


తప్పకుండా వీక్షించండి

ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹



3వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 3rd Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita Malika


https://youtube.com/shorts/dShNLpo8VrM


🌹 3వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 3rd Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita Malika 🌹

🍀 3వ పాశురం - హరి భక్తి దీక్షా గీతం 🍀




తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 2 - పాశురాలు 3&4 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 2 - Pasuras 3&4



https://www.youtube.com/watch?v=_wnD-_LyvB8


🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 2 - పాశురాలు 3&4 Tiruppavai Pasuras Bhavartha Gita Series 2 - Pasuras 3&4 🌹

🍀 3వ పాశురం - హరి భక్తి దీక్షా గీతం, 4వ పాశురం - కరుణా వర్ష ప్రార్థన గీతం 🍀


తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ



🍀 గోదాదేవి రచించిన 30 పాశురాలు ప్రతి ఒక్కరూ మంచి అలవాట్లతో జీవించాలని.. తోటివారికి సాయపడాలని.. భగవంతుడిని తప్పకుండా ఆరాధించాలని సూచిస్తాయి. ధనుర్మాసంలో ఒక్కో రోజు ఒక్కో పాశురం చొప్పున 30 రోజులు 30 పాశురాలు గానం చేస్తారు. మొదటి 5 పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై ముఖ్య ఉద్దేశం తెలియ జేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రార్థిస్తే సకాలంలో వానలు కురుస్తాయి, పంటలు పుష్కలంగా పండుతాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాగే శ్రీకృష్ణుడిని పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయని.. గోదాదేవి చెబుతుంది. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹



గరుడ పురాణం ప్రకారం జీవితంలో తప్పని సరిగా చేయవలసిన కర్మలు. అవి చేయకపోతే శిక్షణగా వుండే శిక్షలు తప్పవు. (Certain mandatory rituals as per Garuda Purana)



🌹 గరుడ పురాణం ప్రకారం జీవితంలో తప్పని సరిగా చేయవలసిన కర్మలు. అవి చేయకపోతే శిక్షణగా వుండే శిక్షలు తప్పవు. 🌹

ప్రసాద్ భరద్వాజ



హిందూ ధర్మంలో గరుడ పురాణానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది మరణానంతర జీవితాన్ని, పాపపుణ్యాలు, మనిషి చేసే కర్మల ఫలితాల గురించి ఎంతో వివరంగా చెబుతుంది. ముఖ్యంగా జీవితంలో మనం చేయాల్సిన కొన్ని కర్తవ్యాలను నిర్లక్ష్యం చేస్తే, మరణానంతరం తీవ్ర శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని గరుడ పురాణం చెబుతుంది. అందుకే ఈ పురాణంలో చెప్పిన నియమాలు, ధర్మాలు తెలుసుకోవడం అవసరమని పండితులు చెబుతుంటారు. మనిషి ప్రవర్తన, ఆచరణే అతని భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఈ గ్రంథం వివరిస్తోంది.

గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రుల సేవ చేయడం ప్రతి ఒక్కరి ప్రధాన కర్తవ్యం. తల్లిదండ్రులను అవమానించడం, వృద్ధాప్యంలో వారిని పట్టించుకోకపోవడం పెద్ద పాపంగా గరుడ పురాణం చెబుతోంది. అలాంటి వారు యమలోకంలో కఠిన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని ఈ పురాణంచెబుతోంది. తల్లిదండ్రులే మనకు మొదటి దేవుళ్లు అని, వారికి సేవ చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని గరుడ పురాణం స్పష్టంగా తెలియ జేస్తుంది. జీవితంలో ఎంత బిజీగా ఉన్నా, వారిని గౌరవంగా చూసుకోవాలని ఈ గ్రంథం బోధిస్తుంది.

ఇంకా దానధర్మాలకు కూడా గరుడ పురాణంలో పెద్ద ప్రాధాన్యం ఉంది. సంపాదించిన ధనాన్ని పూర్తిగా స్వార్థానికి మాత్రమే ఉపయోగించడం పాపమని, అవసరమైన వారికి సహాయం చేయడం ధర్మమని చెబుతుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టకపోవడం, దాహంతో ఉన్నవారికి నీళ్లు ఇవ్వకపోవడం తీవ్రమైన అపరాధంగా పరిగణిస్తారని గరుడ పురాణం చెబుతోంది. దానం చేయడం వల్ల మన పాపాలు తగ్గుతాయని, మంచి ఫలితాలు లభిస్తాయని గరుడ పురాణం సూచిస్తుంది.

స్త్రీల పట్ల గౌరవం చూపకపోవడం కూడా ఘోరమైన పాపంగా గరుడ పురాణం చెబుతోంది. భార్యను, స్త్రీలను అవమానించడం, హింసించడం వల్ల జీవితంలోనే కాక మరణానంతరం కూడా కష్టాలు ఎదురవుతాయని నమ్మకం. అలాగే గురువుల పట్ల అవమానంగా ప్రవర్తించడం, వేదాలు,శాస్త్రాలను తక్కువగా చూడడం కూడా పాపకర్మలుగా చెబుతుంది ఈ పురాణం. గురువు చూపిన మార్గాన్ని అనుసరించడం వల్లే జీవితం సరైన దారిలో సాగుతుందని గరుడ పురాణం వివరిస్తుంది.

అయితే గరుడ పురాణంలో చెప్పిన శిక్షలు, నరకాలు మనిషిని భయపెట్టడానికి మాత్రమే కాదని, ధర్మ మార్గంలో నడిపించడానికే అని పండితులు చెబుతారు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు వస్తాయనే కర్మ సిద్ధాంతాన్ని ఇది బలంగా చెబుతుంది. శాస్త్రీయంగా చూసినా, మంచి ప్రవర్తన, మానవత్వం, బాధ్యతాయుతమైన జీవనం మన జీవితాన్ని సుఖమయం చేస్తాయి. గరుడ పురాణం బోధించే ధర్మాలను ఆచరిస్తే ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా శాంతి లభిస్తుందనే నమ్మకం ఉంది.

గరుడపురాణం ఒక వ్యక్తి తన కర్మను సరిదిద్దకునే మార్గం చూపిస్తుంది. ఈ పురాణంలో ఇటువంటి విధానాలు, జీవన నియమాలు స్పష్టం చేశారు. దీనిని అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన కష్టాలన్నిటినీ అధిగమించ గలడు. ఈ పురాణం విష్ణువు పై భక్తి, జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని చదివి దాని నుండి నేర్చుకొని వారి జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. గరుడ పురాణంలో చెప్పినటువంటి విషయాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఇది మనల్ని అన్ని కష్టాల నుండి కాపాడుతుంది. అలాగే, మన వ్యక్తిత్వాన్ని పెంచుతుంది.

ఒక వ్యక్తి జీవితాన్ని మెరుగుపర్చడానికి ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనదని గరుడ పురాణంలో చెప్పారు. ఈ ఉపవాసం పూర్తి భక్తి, శ్రద్ధతో చేస్తే, అది ఖచ్చితంగా ఫలితమిస్తుందని ఇందులో పేర్కొన్నారు. ఉపవాసం పాటించే వ్యక్తి అన్ని కష్టాల నుండి బయటపడతాడు. అంతే కాకుండా అతను జీవితంలోని అన్ని ఆనందాలను పొందుతాడు. చివరికి అతను మోక్ష మార్గంలో పయనిస్తాడు.

🌹🌹🌹🌹🌹