Showing posts with label Bhishma Ekadashi. Show all posts
Showing posts with label Bhishma Ekadashi. Show all posts

భీష్మ ఏకాదశి నాడు శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము వినండి Listen to Vishnu Sahasranama on Bhishma Ekadashi Day


https://youtube.com/shorts/FRT3EKjwrKg

🌹భీష్మ ఏకాదశి నాడు శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము వినండి
Listen to Vishnu Sahasranama on Bhishma Ekadashi Day 🌹

ప్రసాద్‌ భరధ్వాజ.

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


భీష్మ - జయ ఏకాదశి విశిష్టత, ముహూర్తం, పూజ, భీష్మ కధ Bhishma - Jaya Ekadashi Significance


🌹 భీష్మ - జయ ఏకాదశి విశిష్టత, ముహూర్తం, పూజ, భీష్మ కధ Bhishma - Jaya Ekadashi Significance 🌹
ప్రసాద్ భరద్వాజ



నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా
వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం

''శ్రీమన్నారాయణుని పాదకమలాలకు నమస్కారం. దేవదేవుని నిరంతరం పూజిస్తూ, ఆ పవిత్ర నామాన్ని జపిస్తూ, నిర్మలమైన మనసుతో, అవ్యయమైన ఆయన తత్వాన్ని స్మరిస్తున్నాను'' - అనేది ఈ శ్లోకానికి అర్ధం.

హిందూ ధర్మంలో ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షం ఏకాదశి రోజున విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మాఘ మాసం శుక్ల పక్షం ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి జరుపుకుంటారు.

మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుప్రీతికరమైన మహాపర్వం. ఈరోజున నారాయణార్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని 'భీష్మ ఏకాదశి" అని పిలుస్తారు.

ఈ ఏడాది ( 2026) భీష్మ ఏకాదశిని జనవరి 29 న జరుపుకుంటారు. హిందూ పంచాగం ప్రకారం భీష్మ ఏకాదశి మాఘమాసం శుక్ల పక్షం 11వ రోజున వస్తుంది. ఈ రోజున ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. . .!


🍀 భీష్మ ఏకాదశి శుభ ముహూర్తం 🍀

ఏకాదశి తిథి ప్రారంభం: జనవరి 28 సాయంత్రం 4.35 గంటలకు

ఏకాదశి తిథి ముగింపు: జనవరి 29 మధ్యాహ్నం 01:55 గంటలకు.

జనవరి 29 వ తేదీ సూర్యోదయం నాటికి ఏకాదశి ఉన్న కారణంగా ఆరోజే భీష్మ ఏకాదశి వ్రత నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఉపవాస దీక్షను పాటిస్తారు. అలాగే శ్రీ మహా విష్ణువును, లక్ష్మీ దేవిని పూజిస్తారు.

దక్షిణ భారతీయులు భీష్మ ఏకాదశి అంటే.. ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి అంటారు. భీష్ముడు ఉత్తరాయణ పుణ్య కాలంలో తనువు చాలించాడు. భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్ర నామాన్ని బోధించిన పవిత్రమైన తిథిని జయ ఏకాదశి అంటారు. ఆరోజు భీష్ముడికి తర్పణం చేసి మహా విష్ణువుని పూజించిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఆరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. భీష్మ ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైనదని నమ్ముతారు. ఆ రోజు ఉపవాసం ఉంటే బ్రహ్మ హత్య పాపం నుంచి కూడా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు.


⚜️ భీష్మ ఏకాదశి పూజా విధానం. ⚜️

భీష్మ ఏకాదశి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఆ తరువాత పీటపై పసుపు రంగు కొత్త గుడ్డను ఉంచి కొద్దిగా బియ్యం పోసి వాటిపై తమలపాకు పెట్టి..విష్ణుమూర్తి.. లక్ష్మీ దేవి విగ్రహాలను లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి.

సంకల్పం చెప్పుకుని ఉపవాస దీక్ష చేపట్టి, విష్ణువును పూజించండి.

షోడశపచార పూజలు చేసి పసుపు.. కుంకుమ.. గంధం సమర్పించండి. పూలలో పసుపురంగు పూలు ఉండే విధంగా చూసుకోండి.

విష్ణు సహస్రనామం చదవండి. లేకపోతే శ్రద్దగా.. భక్తితో వినండి. అలాగే లక్ష్మీ దేవిని పూజించండి. తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి.. ధూప .. దీప.. నైవేద్యం సమర్పించండి. పాలు.. కొబ్బరితో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి.

రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేయడం వల్ల అపరిమితమైన పుణ్యం లభిస్తుంది.

మరుసటి రోజు (ద్వాదశి) పేదలకు దానధర్మాలు చేసిన తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి.

ఒక సందర్భంలో మహాశివుడు ''విష్ణు సహస్రనామం ఎలాంటి కష్టాల నుండి అయినా కాపాడుతుందని, సర్వవిధాలుగా రక్షిస్తుందని'' పార్వతీదేవికి చెప్పి, ''ఒకవేళ విష్ణు సహస్రనామం గనుక పారాయణం చేయలేకపొతే కనీసం

''శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే''

శ్లోకాన్ని మూడుసార్లు ఉచ్చరించినట్లయితే అంతే ఫలితం కలుగుతుంది'' అంటూ వివరించాడు.

ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. అవకాశం లేకపోతే ''శ్రీరామ రామ...'' శ్లోకాన్ని మూడుసార్లు భక్తిగా జపించండి.


🌻 భీష్ముని జన్మ వృత్తాంతం 🌻

గంగామాత స్త్రీరూపంలో గర్భధారిణియై వసువులను కుమారులుగా కన్నది. అలా వాళ్ళు మనుష్యులై జన్మించారు. జలరూపంలో ఆమె వాళ్ళను మళ్ళీ తనలోకి తీసేసుకున్నది. అంటే గంగాదేవి జగన్మాత్రు స్వరూపిణి కాబట్టి ఆమె గర్భవాసాన జన్మించిన తరువాత ఎవరికీ పాపం ఉండదు. అయితే ఏ కారణం చేతనో ఆమె గర్భాన ఎనిమిదవవాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ఆమెను వారించాడు. అందుకని ఆ పిల్లవాడిని ఆయననే పెంచుకోమని అప్పగించి ఆమె వెళ్ళిపోయింది. అలా శంతనుడి చేత శాపవిముక్తుడు కాకుండా నివారింపబడిన భీష్ముడు పెరిగి పెద్దవాడయినాడు. ఆయన బోధించిన విజ్ఞాన సంపద, ఆయన బోధించిన ప్రతి వాక్యము అనాదికాలం నుంచీ వచ్చినటువంటి సత్యానికి అతి సన్నిహితంగా ఉంటుంది. సత్యాన్ని అది ధరించి ఉంటుంది.

🌹🌹🌹🌹🌹

జయ - భీష్మ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి శుభాకాంక్షలు Greetings on Jaya-Bhishma Ekadashi & on Vishnu SahasraNama Jayanti


🌹 ఈ ఏకాదశి మీకు మంగళాలు, మోక్షాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ జయ - భీష్మ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి శుభాకాంక్షలు మీకు మరియు అందరికి,

Jaya - Bhishma Ekadashi, Vishnu SahasraNama Jayanti Greetings to You and All 🌹

ప్రసాద్ భరద్వాజ




బీష్మాష్టమి శుభాకాంక్షలు Greetings on Bhishma Ashtami

🌹 బీష్మాష్టమి శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 Happy Bhishma Ashtami to everyone 🌹
Prasad Bharadwaj



భీష్మాష్టమి - భీష్మ అష్టమి వ్రత కథ. Bhishma Ashtami - Vratam Katha.


🌹 భీష్మాష్టమి..విష్ణు నామం స్మరిస్తే పుణ్యఫలాలు మీ సొంతం - భీష్మ అష్టమి వ్రత కథ.. 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Bhishma Ashtami.. If you remember Lord Vishnu's name, the sacred benefits are yours - Bhishma Ashtami Vrat Katha.. 🌹
Prasad Bharadwaj


ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం 'భీష్టాష్టమి' జరుపుంటారు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మాఘ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ రోజునే కురుక్షేత్రంలో భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండి ఉత్తరాయన పుణ్యకాలం వరకు వేచి చూసి మాఘ మాసం శుద్ధ అష్టమి నాడు తన శరీరాన్ని విడిచి పెట్టాడు.

అందుకే భీష్మ పితామహుని నిర్యాణం పొందిన ఈ దినం భీష్మాష్టమిగా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజున దానధర్మాలతో పాటు తర్పణాలు విడిచి పెడతారు.

తర్పణం ఎవరు చేయాలి?

ఈ మాసంలో వచ్చే శుక్ల పక్ష అష్టమిని 'భీష్మాష్టమి'గా జరుపుకుంటారు. . సాధారణంగా పితృ తర్పణాలు తండ్రి లేని వారు మాత్రమే ఇస్తుంటారు, కానీ భీష్మాష్టమి రోజున తండ్రి బతికున్న వారు కూడా తర్పణాలు వదలొచ్చు. ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి ఇవ్వవలసి వుంటుంది. భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా జీవించి కడపట మహావిష్ణు సన్నిధిలో అతనిని కన్నుల పండువుగా కాంక్షించుచు ముక్తిని పొందిన గొప్ప జీవి. ఈ ప్రక్రియను అందరు భీష్మ తర్పణం అని అంటారు. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మ పితామహుడు అంపశయ్యపై నుంచి దేహత్యాగం చేసిన రోజుగా దీనిని భావిస్తారు.

ఈ పవిత్ర దినాన భీష్మునికి తర్పణాలు వదలడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. మాఘ శుద్ధ అష్టమి(భీష్మాష్టమి) రోజునే భీష్ముడు మోక్షం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన ఆయనకి తర్పణం సమర్పిస్తే ఉత్తమ సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 'తండ్రి బతికున్న వారు కూడా ఈ తర్పణం సమర్పించవచ్చు. తెలుపు దుస్తులతో విష్ణుమూర్తిని ఆరాధిస్తే పుణ్యఫలాలు లభిస్తాయి' అని సూచిస్తున్నారు.


🍀 భీష్మ అష్టమి వ్రత కథ.. 🍀

పురాణాల ప్రకారం.. భీష్మ పితామహుడు హస్తినాపూర్ మహారాజు శంతనుడు, గంగా మాత దంపతుల ఎనిమిదవ కుమారుడు. అతని పేరు అసలు పేరు దేవవ్రతుడు. దేవవ్రతుడు గంగా మాత ద్వారా పెరిగాడు. తరువాత అతను మహర్షి పరశురాముడి నుంచి శాస్త్రాలను, గురు బృహస్పతి నుంచి రాజనీతి శాస్త్రాన్ని నేర్చుకున్నాడు. విద్య పూర్తి చేసిన తర్వాత, గంగా మాత దేవవ్రతను అతని తండ్రి మహారాజు శంతనుడికి అప్పగించింది. ఆ తర్వాత అతన్ని హస్తినాపుర యువరాజుగా ప్రకటించారు.

ఈ సమయంలో, శంతనుడు రాజు సత్యవతి అనే స్త్రీ ప్రేమలో పడ్డాడు. కానీ, సత్యవతి తండ్రి తన కుమార్తె కొడుకు మాత్రమే హస్తినాపుర సింహాసనాన్ని వారసత్వంగా పొందుతాడని షరతు పెట్టాడు. పరిస్థితిని గమనించిన దేవవ్రతుడు తన తండ్రి కోసం తన రాజ్యాన్ని వదులుకున్నాడు. తన తండ్రి ఆనందం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ కఠినమైన ప్రతిజ్ఞ అతనికి భీష్ముడు అనే పేరును సంపాదించి పెట్టింది.

దేవవ్రతుడు చేసిన ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీనిని చూసిన శంతనుడు రాజు భీష్ముని పట్ల చాలా సంతోషించి, అతనికి ఇష్టానుసారంగా మరణం అనే వరం ఇచ్చాడు. దీని అర్థం భీష్ముడు కోరుకోకపోతే మరణం రాదని. మహాభారత యుద్ధంలో కౌరవులకు ఆయన మొదటి సైన్యాధిపతి. ఆయన నాయకత్వంలో కౌరవ సైన్యం 10 రోజులు పోరాడింది.

అర్జునుడు శిఖండి రూపాన్ని కవచంగా చేసుకుని.. భీష్ము పితామహుడిపై బాణాల వర్షం కురిపించాడు. శిఖండిగా అర్జునుడిని చూసిన భీష్ముడు ఆమె స్త్రీ అని తెలుసుకుని తన ఆయుధాలను అతని ముందు ఉంచాడు. తరువాత, భీష్ముడు అర్జునుడి బాణాలకు గాయపడి మంచం మీద పడిపోయాడు. అయితే, ఆ సమయంలో సూర్యుడు దక్షిణ దిశలో ఉన్నాడు. కాబట్టి భీష్ముడు తన ప్రాణాలను వదులుకోలేదు.

ఉత్తరాయణంలో సూర్యభగవానుడి రాక కోసం ఎదురుచూస్తూ భీష్ముడు 58 రోజులు బాణాల మంచంపై పడుకున్నాడు. మాఘ మాసంలోని ప్రకాశవంతమైన పక్షం ఎనిమిదవ రోజున ఆయన తుది శ్వాస విడిచాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యాకాలంలో ప్రాణాలు వదిలి తన కోరికను తీర్చుకున్నాడు.

🌹🌹🌹🌹🌹

జయ ఏకాదశి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి Jaya Ekadashi & Bheeshma Ekadashi Greetings to All



జయ ఏకాదశి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 

Jaya Ekadashi Bheeshma Ekadashi Greetings to All




🌹భీష్మ  ఏకాదశి 🌹 

🍀 భీష్మ ఏకాదశి అని ఎందుకంటారు ? 🍀

మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. బీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం.

కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికాలుడుతు గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించారు.

మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" 
కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం ఇస్తాడు. అందుకే నా మనసు అక్కడికి వెళ్లిపోయింది, మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మశాస్త్రాలను అవపోశణం పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది, ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోడానికి రండి' అని భీష్మపితామహుడి చెంతకు తీసుకు వచ్చాడు. సుమారు మూడు పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు, ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది, కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకున్నాడు.

తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు. అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. అలాంటి వాళ్లు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాపిస్తుంది.  భీష్ముడు తనకి మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి పాపం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి కలగదట. ఇంతకీ భీష్మపితామహుడు చేసిన దోషం ఏంటంటే ? పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా ఏమీ చేయలేక పోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువైన వసిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినపుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు.

కురుసభలో వస్త్రాపహరం జరుగుతుంటే అతి పరాక్రమవంతులైన అయిదుగురు భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కనబెట్టారు. కృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. కాబట్టే అలా చేసినందుకు కౌరవులను మట్టు పెట్టాడు. పాండవులకూ కూడా అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునుడితో చెప్పాడట. ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పాడేశాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలా ఉన్నారే తప్ప, ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చేయమంటున్నాంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడట.

భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే, పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని ప్రశ్నించిదట. అందుకు భీష్ముడు 'అవును తల్లీ! నా దేహం నా అధీనంలో లేదు, అది ధుర్యోదనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా, నా దేహం నా మాట వినలేదని అన్నాడు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నానని చెప్పాడు. కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు, పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్వజించాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోడానికే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాందించి ధర్మసూత్రాలను చెప్పించాడు.

నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పొచ్చుకదా అని భీష్ముడు ప్రశ్నించాడు. నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదని కృష్ణుడు బదులిచ్చాడు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల తన సారాన్ని చెప్పగలదా! అందులో పండిన మొక్క చెబుతుంది ఎంత సారమో. అలాగే అనుభవజ్ఞుడవైన

నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పనయోగ్యమవుతుంది. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు. అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత ఆయనే నేరుగా చెప్పాడు, విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. కాబట్టి విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది.
🌹🌹🌹🌹🌹



భీష్మ - జయ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి, Bhishma - Jaya Ekadashi, Vishnu Sahasra Nama Jayahti


🍀. భీష్మ - జయ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి శుభాకాంక్షలు, Bhishma - Jaya Ekadashi, Vishnu Sahasra Nama Jayahti Good Wishes to All 🍀

ప్రసాద్ భరద్వాజ

కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేలకొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణంకోసం వేచి ఉన్నాడు. తన నిర్యాణానికి సమయం నిర్ణయించుకున్నాడు. 58 రోజులు అంపశయ్యపై పవళించి మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదించాడు. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని ''భీష్మ ఏకాదశి'', ''మహాఫల ఏకాదశి'', ''జయ ఏకాదశి'' అని అంటారు.

ఉత్తరాయణ పుణ్య తిథికోసం వేచిచూస్తోన్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుని వేయి నామాలతో కీర్తించాడు. అదే ఇంటింటా భక్తిప్రపత్తులతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం. అనంతరకాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం.

విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశినాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలూ హరిస్తాయి. పుణ్యగతులు లభిస్తాయి.

నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా

వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం

''శ్రీమన్నారాయణుని పాదకమలాలకు నమస్కారం. దేవదేవుని నిరంతరం పూజిస్తూ, ఆ పవిత్ర నామాన్ని జపిస్తూ, నిర్మలమైన మనసుతో, అవ్యయమైన ఆయన తత్వాన్ని స్మరిస్తున్నాను'' - అనేది ఈ శ్లోకానికి అర్ధం.

ఒక సందర్భంలో మహాశివుడు ''విష్ణు సహస్రనామం ఎలాంటి కష్టాల నుండి అయినా కాపాడుతుందని, సర్వవిధాలుగా రక్షిస్తుందని'' పార్వతీదేవికి చెప్పి, ''ఒకవేళ విష్ణు సహస్రనామం గనుక పారాయణం చేయలేకపొతే కనీసం


''శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే''

- అనే శ్లోకాన్ని మూడుసార్లు ఉచ్చరించినట్లయితే అంతే ఫలితం కలుగుతుంది'' అంటూ వివరించాడు.

ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. అవకాశం లేకపోతే ''శ్రీరామ రామ...'' శ్లోకాన్ని మూడుసార్లు భక్తిగా జపించండి.

🌹 🌹 🌹 🌹 🌹