తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 7 - పాశురాలు 13 & 14 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 7 - Pasuras 13 & 14


https://youtu.be/J304yKSXVyE

🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 7 - పాశురాలు 13 & 14 Tiruppavai Pasuras Bhavartha Gita Series 7 - Pasuras 13 & 14 🌹

🍀 13వ పాశురము - అవతార మహిమ – ప్రదోష శుద్ధి గీతం, 14వ పాశురము - మాటల జ్ఞాపకం – కార్యోన్ముఖ గీతం 🍀

తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 13వ పాశురంలో అందమైన కళ్ళతో ఉండే గోపికను, నిద్రలో భగవంతునితో తన ఐక్యతను తలచుకుంటూ మోసపోకుండా, అవతార మహిమను గర్తించి, ప్రదోష శుద్ధి కొరకు మేల్కొని అందరితో కలిసి నోము చేయమని కోరడం ముఖ్య అంశం. 14వ పాశురం ద్వారా మాట నిలబెట్టుకోవడం, సత్యం పాటించడం ఎంత ముఖ్యమో ఆండాళ్ వివరిస్తుంది. భక్తికి మాట, చేత ఒకటేనని ఈ పాశురం ద్వారా తెలియజేస్తుంది. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

12వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 12th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita



https://youtube.com/shorts/ZpJnQiHFveE


🌹 12వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 12th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita 🌹

🍀 గోసంపద సేవా మహిమ – వ్రత పిలుపు గీతం 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 ఈ 12వ పాశురం ద్వారా గోదాదేవి గోసేవా మహిమను, భగవంతుని సేవ యొక్క ప్రాముఖ్యతను, లోక బాధ్యతల కంటే భగవద్భక్తి ముఖ్యం అని, అజ్ఞానాన్ని వదిలి భగవంతునిపై భక్తితో మేల్కొని, అతనిని కీర్తించమని, నిత్యమైన ఆనందాన్ని పొందమని ప్రోత్సహిస్తుంది. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹


వెంకటేశ్వర స్వామి చుట్టూ ప్రదక్షిణలు Circumambulations around Lord Venkateswara


🌹 ఇక్కడ చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామికి, 7 వారాలు ఏడేసి సార్లు చొప్పున ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Devotees believe that performing circumambulations around Lord Venkateswara, who is in the form of sandalwood paste here, seven times a day for seven weeks will fulfill their wishes. 🌹

Prasad Bharadwaj


అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి.. ఆత్రేయపురం మండలంలో అదో కుగ్రామం. జనాభా కూడా 4000 మాత్రమే. అయితే ఆ ఊరి పేరు నేడు ఖండాంతరాలు దాటిపోతు వెలిగిపోతుంది.

ఎందుకంటే అక్కడ చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారు వెలిచి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ఉన్నారు. భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని చూపిస్తూ ప్రతిరోజు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించు కునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గోదావరి తీరప్రాంత నడుమ వాడపల్లి వెంకన్న భక్తులకు కటాక్షంగా మారాడు.. కోరిన కోరికలు తీర్చే చందన స్వరూపుడు వెంకన్నకు భక్తుల తాకిడి అమాంతం పెరుగుతోంది.

ఎక్కడా లేని విధంగా వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఎర్రచందనపు చెక్కతో చేతిలో గదను ధరించి ప్రత్యేకంగా ఉంటారు. రెండు దశాబ్దాల క్రితం ఏడాదికి ఒక్కసారే వాడపల్లి తీర్థం పేరున చుట్టుపక్కల గ్రామాల భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుండేవారు. నేడు స్వామి వారి మహిమాన్వితుడుగా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఉండటంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఒక్క శనివారమే 50 వేల నుంచి 70 వేల వరకు భక్తులు వస్తుండగా మిగతా రోజుల్లో 20వేలకు తగ్గకుండా స్వామివారి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు… ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతున్నాయని భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.

🌹🌹🌹🌹🌹