నమో భగవతే దత్తాత్రేయ స్మరణ మాత్రమున సంతుష్టాయ 'Namo Bhagavathe Dattatreya' (a devotional YouTube Short)




https://youtube.com/shorts/Kg4iMWfcUyw


🌹 నమో భగవతే దత్తాత్రేయ స్మరణ మాత్రమున సంతుష్టాయ Namo Bhagavathe Dattatreya దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹


శ్రీ దత్తాత్రేయ స్తోత్రం - సర్వ కష్టాల నివారణకు - Sri Dattatreya Stotram For Removal of All Obstacles



https://youtube.com/shorts/LsjW9iImWhc


🌹 శ్రీ దత్తాత్రేయ స్తోత్రం - సర్వ కష్టాల నివారణకు - SRI DATTATREYA STOTRAM FOR ALL OBSTACLES REMOVAL 🌹

తప్పక వీక్షించండి

🍀 మార్గశీర్ష పూర్ణిమ దత్తాత్రేయ జయంతి, కోరల పూర్ణిమ. ఈ పౌర్ణమి నాడు దత్తుని పాలతో అభిషేకించి దత్త స్తోత్రం చదువుకుని, మనస్సులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయమును చేకూర్చుతాడు. శ్రీ దత్తడుని తలచి ఆయురారోగ్యములను, స్మరించి భోగభాగ్యములను పొందగలము. 🍀

ప్రసాద్‌ భరధ్వాజ



Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹



శ్రీ దత్తాత్రేయ స్వామి విశిష్టత - దత్త జయంతి - కోరల పౌర్ణమి విశిష్టత - విధానము Dattatreya Jayanthi - Korala Purnima Significance



https://youtu.be/dS-eUPJGPM8


🌹 శ్రీ దత్తాత్రేయ స్వామి విశిష్టత - దత్త జయంతి - దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం - కోరల పౌర్ణమి విశిష్టత - విధానము DATTATREYA JAYANTHI - KORALA PURNIMA SIGNIFICANCE 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

తప్పక వీక్షించండి



🍀 మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు కనుక ఈ పౌర్ణమిని దత్త జయంతిగా జరుపుకుంటాము. నేడు దత్తుని విశిష్టత తెలుసుకోవడం, ఆయనను స్మరించడం సాధకులకు ఎంతో విశేషమైన ఫలితాలను ఇస్తుంది. శ్రీ మహావిష్ణువు ఇరవై ఒక్క అవతారాల్లో దత్తావతారం ఆరోదని భాగవత పురాణం చెబుతోంది. దత్తరూపం అసామాన్యమైంది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్త్వాలు మూర్తీభవించి, ఆవిర్భవించినదే దత్తావతారం. శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింప జేయుటయే దత్తమూర్తి అవతార కార్యక్రమము. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః 🍀

ప్రసాద్‌ భరధ్వాజ



Like, Subscribe and Share
https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹

శ్రీ దత్తాత్రేయ జయంతి, శ్రీ అన్నపూర్ణ జయంతి, కోరల పౌర్ణమి శుభాకాంక్షలు, Greetings on Sri Dattatreya Jayanti, Sri Annapurna Jayanti Korala Pournami



🌹. శ్రీ దత్తాత్రేయ జయంతి, శ్రీ అన్నపూర్ణ జయంతి, కోరల పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి, Sri Dattatreya Jayanti, Sri Annapurna Jayanti Korala Pournami Greetings to All 🌹

4 December 2025

ప్రసాద్‌ భరధ్వాజ


🍀 దత్తాత్రేయ జయంతి విశిష్టత 🍀


దత్తాత్రేయని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. అత్రి మహాముని, మహా పతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందునా దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం.

దత్త జయంతి రోజున తెల్లవారు జామునే భక్తులు నదీస్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈ రోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగమార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాదవల్లభ చరిత్ర, నృసింహ సరస్వతి చరిత్ర, శ్రీదత్త దర్శనం వంటివి పారాయణ చేస్తారు. దత్తుని విశిష్టతను స్మరించుకుంటారు. ఈ రోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళలో భజనలు చేస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కురుపురం, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీపాద వల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు. అవధూత దత్త పీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయి వాటిలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి.


🍀 కోరల పౌర్ణమి విశిష్టత 🍀

హిందూ పురాణాల ప్రకారం, కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడట! దీని అర్థం- ఈ సమయంలో యముడు భూలోకంలోని భక్తులపై కరుణ చూపుతాడని, వారి కర్మ ఫలాలను పక్కకు నెట్టి, సకల వ్యాధులు, అనారోగ్య సమస్యలను తన కోరల శక్తితో తొలగిస్తాడని ప్రగాఢ నమ్మకం. ఈ అపమృత్యు భయాన్ని తొలగించినందుకు కృతజ్ఞతగా మార్గశిర పౌర్ణమి రోజున యమధర్మరాజును ప్రత్యేకంగా పూజిస్తారు.

కోరల పౌర్ణమి రోజున ఆచరించాల్సిన అత్యంత విశేషమైన ఆచారం ఒకటుంది. ఆ రోజున మినప రొట్టెలు (కుడుములు) తయారుచేసి, ఆ నైవేద్యాన్ని తల్లి కోరలమ్మకు సమర్పిస్తారు. ఆ తర్వాత, ఆ రొట్టెలో నుంచి ఒక చిన్న ముక్కను కొరికి, శునకాలకు వేస్తారు.శునకం సాక్షాత్తు కాలభైరవుడి వాహనం. యమధర్మరాజుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే, శునకానికి నైవేద్యం పెట్టడం ద్వారా కాలభైరవుడి అనుగ్రహం లభించి, సమస్త దరిద్రాలు, దోషాలు నివారించ బడతాయి అని అంటారు.

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ గౌరీశా విఘ్నేశా గజాననా Sri Gourisha Vignesha (a YT Short)



https://youtube.com/shorts/39t5eIANxUc


🌹 శ్రీ గౌరీశా విఘ్నేశా గజాననా  Sri Gourisha Vignesha 🌹

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


శ్రీ హనుమద్ వ్రతం - పూజా విధానం - వ్రత కధ | Hanuman Vratam / Pooja Vidhanam / Vrata Katha - Wed., December 3, 2025, Margasira Shukla Paksha, Trayodashi



https://youtu.be/WxhJRlB3jWc


🌹శ్రీ హనుమద్ వ్రతం - పూజా విధానం - వ్రత కధ | Hanuman Vratam / Pooja Vidhanam / Vrata Katha డిసెంబర్ 3 బుధవారం 2025, మార్గశిర శుక్లపక్షం, త్రయోదశి 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹Shri Hanumad Vratam - Pooja Method - Vrata Katha | Hanuman Vratam / Pooja Vidhanam / Vrata Katha Wednesday, December 3, 2025, Margasira Shukla Paksha, Trayodashi 🌹
Prasad Bharadwaja


🍀 శ్రీ రాముడు, పాండవులు చేసిన సకల కార్య సిద్ధిని విజయాలను ప్రసాదించే మహోత్రుష్టమైన వ్రతం - హనుమంతుని అనుగ్రహం, శత్రుజయం, కార్యజయం తథ్యం 🍀
🍀 A great auspicious fast that bestows the success and fulfillment of all the deeds done by Lord Rama and the Pandavas - Hanuman's grace, victory over enemies, victory over work 🍀


🔥 హనుమద్ వ్రతం హనుమద్ వ్రతం ఎందుకు చేస్తారు - విశిష్టత 🔥
🔥 Hanumad Vratam Why is Hanumad Vratam performed - Special features 🔥


🌻 పరాశర సంహిత దీని గురించి చెప్పింది. పదమూడు క్షేత్రములున్నాయి. వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు. వాటిలో పంపాతీరం ఒక పీఠం. వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో వున్న పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు, భార్య ద్రౌపదితో, సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు యిచ్చి భక్తిశ్రద్ధలతో సేవించాడు. వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు. అందరు భక్తీ శ్రద్ధలతో చేయవలసిన వ్రతం వుందని దాన్ని వివరించాడు. అది కార్య సిద్ధిని కలిగిస్తుందనీ , వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు. అదే శ్రీ హనుమద్ వ్రతం. దుష్ట గ్రహాల్ని, వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు, శ్రేయస్సు ఇస్తుందని దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు. పూర్వం ఈ వ్రతాన్ని శ్రీ కృష్ణుడు ద్రౌపదికి బోధించి , దగ్గర వుండి వ్రతం చేయించాడని దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు. కనుక ఇప్పటికీ మార్గశీర్ష మాసంలో శుద్ధ త్రయోదశి తిథి నాడు హనుమద్ వ్రతమును చేస్తారు. 🌻

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹


శ్రీ హనుమద్ వ్రతం - Hanuman Vratam - Wednesday, December 3, 2025, Margasira Shukla Paksha, Trayodashi

🌹శ్రీ హనుమద్ వ్రతం - Hanuman Vratam డిసెంబర్ 3 బుధవారం 2025, మార్గశిర శుక్లపక్షం, త్రయోదశి 🌹

🔥 హనుమద్ వ్రతం ఎందుకు చేస్తారు - విశిష్టత 🔥

ప్రసాద్ భరద్వాజ



పరాశర సంహిత దీని గురించి చెప్పింది. పదమూడు క్షేత్రములున్నాయి. వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు. వాటిలో పంపాతీరం ఒక పీఠం. చంద్రవంశంలో సోమదత్తుడు అనే ఒక రాజు జన్మించాడు. ఆయనకి రాజ్య భ్రష్టత్వము వచ్చింది. ఆ కాలంలో అప్పటికప్పుడు విజయం కలగాలంటే ఏ వ్రతము చేయాలి? అన్నారు. పంపానదీతీరంలో కూర్చొని మార్గశిర త్రయోదశినాడు చేసే వ్రతం అనుకోకుండా తిథి వచ్చింది. ఇప్పటికిప్పుడు విజయాన్ని ఇవ్వగలిగిన వ్రతం అది అని రాజుతో ఆ వ్రతం చేయించారు. రాజుగారు పరమ భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని చేశారు. హనుమద్ వ్రతం చేసిన ఉత్తర క్షణంలో హనుమయొక్క అనుగ్రహం కలిగి అపారమైన సైన్యం అక్కడికక్కడ దొరికింది. అరణ్యంలో ఉన్న వీరులందరూ తోడు వచ్చారు. తన రాజ్యాన్ని తాను పొందాడు. ఇలా వ్రతం చేశాడు, సాయంత్రానికి మూర్ధాభిషిక్తుడై పోయాడు. ఆనాటి నుంచి చంద్రవంశ ప్రభువైన సోమదత్తుడు చేసి ఫలితమును పొందిన మహోత్రుష్టమైన వ్రతము కనుక ఇప్పటికీ మార్గశీర్ష మాసంలో శుద్ధ త్రయోదశి తిథి నాడు హనుమద్ వ్రతమును చేస్తారు.

🌹🌹🌹🌹🌹


జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం - Pollution Control Day (a YT Short)


https://youtube.com/shorts/hyHtyMrUz-M

🌹 జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం - పర్యావరణ పరిరక్షణ మన భాధ్యత Pollution Control Day 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹

'శాంతాకారం భుజగశయనం సురేశం పద్మనాభం' (ఈ రోజు మత్స్య ద్వాదశి) / 'Shantakaram Bhujagasayanam Suresham Padmanabham' (Today is Matsya Dwadashi)



https://youtube.com/shorts/bSNNoKfErfI


🌹 శాంతాకారం భుజగశయనం సురేశం పద్మనాభం 🌹
🌹 Shantakaram Bhujagasayanam Suresham Padmanabham 🌹

ప్రసాద్‌ భరధ్వాజ
Prasad Bharadhwaja


🐋 ఈ రోజు మత్స్య ద్వాదశి. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మత్స్యావతారం మొదటి అవతారం. పరమ పవిత్రమైన వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మార్గశిర శుద్ధ ద్వాదశి రోజునే మత్స్యావతారం స్వీకరించాడని వ్యాస మహర్షి రచించిన మత్స్యపురాణం ద్వారా తెలుస్తోంది. మత్స్య ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని శాస్త్రవచనం.🐋

🐋 Today is Matsya Dwadashi. Matsya Avatar is the first incarnation of Lord Vishnu among the ten incarnations. It is known from the Matsya Puranam written by Vyasa Maharshi that Lord Vishnu took the form of Matsya Avatar on the day of Margashir Shuddha Dwadashi to protect the sacred Vedas. It is said in the scriptures that if Lord Vishnu is worshipped on the day of Matsya Dwadashi, all difficulties will be removed.🐋


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹

శ్రీ మత్స్య ద్వాదశి శుభాకాంక్షలు Happy Matsya Dwadashi

🌹🐬 శ్రీ మత్స్య ద్వాదశి శుభాకాంక్షలు అందరికి  🐬🌹
🍀🐋 మత్స్య ద్వాదశి విశిష్టత, పూజా విధానం, అఖండ ద్వాదశాదిత్య వ్రతం 🐋🌹
ప్రసాద్ భరద్వాజ


🌹🐬 Happy Matsya Dwadashi to everyone  🐬🌹
🍀🐋 Special features of Matsya Dwadashi, worship method, Akhanda Dwadashaditya Vratam 🐋🌹
Prasad Bharadwaja


మత్స్య ద్వాదశి శ్రీ విష్ణువు మత్స్య అవతారానికి అంకితం చేయబడింది . కొన్ని వర్గాల వారు కార్తీక మాసంలో చంద్రుడు క్షీణిస్తున్న 12వ రోజున మరియు మార్గశీర్ష మాసంలో చంద్రుడు వృద్ధి చెందుతున్న 12వ రోజున దీనిని పాటిస్తారు. కార్తీక మాసంలో మత్స్య ద్వాదశి 2025 తేదీ నవంబర్ 2. మార్గశీర్ష మాసంలో దీనిని పాటించే వారికి ఇది డిసెంబర్ 2, 2025 మంగళవారం న వస్తుంది.

నారాయణుడు మత్స్యావతారం దాల్చి వేదాలను ఉద్ధరించిన ఈ రోజు విష్ణ్వారాధన విద్యాప్రాప్తిని కలుగజేస్తుంది. అంతేకాక మత్స్యము ఐశ్వర్యకారకం. ఈ ద్వాదశి నాడు నారాయణుని వాసుదేవ నామంతో అర్చించడం వలన రక్షణ లభిస్తుంది. సూర్యారాధన ప్రధానమైన ఈ నెలలో ద్వాదశి తిథినాడు ‘ద్వాదశాదిత్య వ్రతం’ ఆచరిస్తే సూర్యానుగ్రహం లభిస్తుంది.


🌻 🐋 మత్స్య ద్వాదశి రోజున విష్ణువును ఇలా పూజిస్తే చాలు- సకల శుభాలు కలగడం ఖాయం! 🐋🌻

మార్గశిర మాసంలో ప్రతిరోజూ పండుగే! ప్రతి తిథి విశేషమైనదే! పరమ పవిత్రమైన మోక్షదా ఏకాదశి పండుగ మరుసటి రోజు జరుపుకునే మత్స్య ద్వాదశి ఈ ఏడాది 2 డిసెంబర్ 2025 నాడు వచ్చింది.


🐬 శ్రీహరి తొలి అవతారం మత్స్యావతారం 🐬

శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మత్స్యావతారం మొదటి అవతారం. పరమ పవిత్రమైన వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మార్గశిర శుద్ధ ద్వాదశి రోజునే మత్స్యావతారం స్వీకరించాడని వ్యాస మహర్షి రచించిన మత్స్యపురాణం ద్వారా తెలుస్తోంది. మత్స్య ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని శాస్త్రవచనం.


🍀 మత్స్య ద్వాదశి విశిష్టత 🍀

మత్స్య ద్వాదశి రోజున శ్రీహరి మత్స్యావతారము ధరించి హయగ్రీవ అనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించాడని నమ్ముతారు. మత్స్య ద్వాదశి నాడు శ్రీమహావిష్ణువు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.


🐬 మత్స్య ద్వాదశి పూజా విధానం 🐬

మానవ శరీరానికి పూయగల మంచి బంకమట్టి లేదా బురదను ఇంటికి తీసుకువస్తారు. తరువాత దీనిని హిందూ సూర్య దేవుడు సూర్యుడికి అర్పిస్తారు. తరువాత దీనిని శరీరానికి పూస్తారు. తరువాత భక్తుడు ఆదిత్య (సూర్యుడు) కు ప్రార్థనలు చేసి స్నానం చేస్తాడు. తదుపరి పూజ విష్ణువు యొక్క నారాయణ రూపానికి చేస్తారు.

నాలుగు పాత్రలను నీటితో నింపుతారు. వాటిలో తెలుపు లేదా పసుపు రంగు పువ్వులు వేస్తారు. పాత్రలను మూసివేసి వాటి పైన ఉంచుతారు. అవి ఇప్పుడు నాలుగు సముద్రాలను సూచిస్తాయి మరియు దానిని పూజిస్తారు. ఆ నీటిలో కొంచెం పసుపు పొడి వేసి ప్రార్థనలు చేయండి. ఆ నీటిని ఒక చెట్టు కింద పోయాలి. ఇది పాప విముక్తికి మరియు దుఃఖం తొలగిపోవడానికి సహాయపడుతుంది. సంపద మరియు ఆరోగ్య రక్షణ కోసం, తొమ్మిది రకాల ధాన్యాలను తీసుకొని, నీటిలో వేసి, చెట్టు కింద పోయాలి.

తదుపరి పూజ విష్ణువు మత్స్య అవతారానికి జరుగుతుంది. పసుపు రంగు లోహ మత్స్య మూర్తిని పూజిస్తారు. ఈ రోజున పసుపు రంగు ఆహారం, బట్టలు మరియు పాత్రలను దానం చేస్తారు.

హిందూ మతం ప్రకారం, జీవం నీటిలోనే ప్రారంభమైంది మరియు జీవం నీటి వల్లే ఉంది. రాక్షసుడిని నాశనం చేయడానికి మరియు రాక్షసుడు దొంగిలించిన వేదాలను తిరిగి పొందడానికి మత్స్య అవతారం అవతరించింది.

ఆ రోజున విష్ణువుకు చేసే ప్రార్థనలు మరియు పూజలు అన్ని రకాల దుఃఖాలను తగ్గించడంలో సహాయపడతాయని నమ్మకం. ఇది పాప విముక్తికి సహాయపడుతుంది. ఆ రోజు పూజలు కోరికలు నెరవేరడానికి మరియు కుటుంబ సభ్యుల మరియు సంపదను రక్షించడానికి సహాయపడతాయి.

ఆ రోజు దీపం వెలిగించాలంటే నెయ్యి, పసుపు కలిపిన దీపం వాడాలి.

ఆ రోజు సువాసన మల్లె పువ్వుల సువాసనగా ఉండాలి. కేసర మరియు బంతి పువ్వులు సమర్పించాలి.

బేసాన్ ఉపయోగించి తయారుచేసిన తీపి లేదా ఆహారాన్ని అందించాలి.

పూజ తర్వాత స్వీట్ పంచాలి.

మత్స్యావతారానికి అంకితమైన మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మంత్రం ఓం మత్స్యరూపాయ నమః॥

చేపలకు ఆహారం

కోరికలు నెరవేరడానికి, శాంతి, శ్రేయస్సు కోసం మత్స్య ద్వాదశి నాడు చేపలకు తినిపించండి. మత్స్య ద్వాదశి రోజున చెరువులలో, నదులలోని చేపలకు పిండి ముద్దలు ఆహారంగా సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వలన జాతక దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అనంతరం మత్స్య ద్వాదశి కథను చదువుకోవాలి.

🌹 🌹 🌹 🌹 🌹


గీతా మహాత్మ్యము Gita Mahathmyamu - వరాహ పురాణాంతర్గతం - గీతా జయంతి శుభాకాంక్షలు Greetings on Gita Jayanthi



https://youtu.be/7IS3DU3CsYM


🌹 గీతా మహాత్మ్యము Gita Mahathmyamu - వరాహ పురాణాంతర్గతం - గీతా జయంతి శుభాకాంక్షలు అందరికి  to all🌹

ప్రసాద్ భరద్వాజ



🍀 భగవద్గీత ఆవిర్భవించిన మార్గశిర శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. గీతా జయంతి అంటే భగవద్గీతను పూజించడం కాదు.. గీతను పఠించడం, మనిషిగా ఎలా జీవించాలో నేర్చుకోవడం.. అర్జునుడి ద్వారా సర్వజగత్తుకూ ఉపదేశించిన బ్రహ్మవిద్యాశాస్త్రమే భగవద్గీత. సచ్చిదానంద స్వరూపుడగు శ్రీ కృష్ణ పరమాత్మచే స్వయముగా అర్జుననుకు ఉపదేశింప బడినది. ఇది మూడు వేదముల సారము, పరమానంద మయినది, తన్నాశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానాన్ని కలుగ చేయును. గీతని పఠించి పిదప మహత్యమును ఎవరు పఠించకుందురో అట్టి వారి గీతా పఠనము వ్యర్ధమే (నిష్ఫలమే). అట్టివారి గీతాపఠనము శ్రమ మాత్రమేనని చెప్పబడినది. 🍀


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹

యధాయధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతః గీతా జయంతి శుభాకాంక్షలు Gita Jayanthi Greetings



https://youtube.com/shorts/YEOTOVhIwXc


🌹 యధాయధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతః గీతా జయంతి శుభాకాంక్షలు Gita Jayanthi Greetings 🌹
ప్రసాద్‌ భరధ్వాజ


🍀 పురాణాల ప్రకారం, మోక్షద ఏకాదశి రోజునే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి భగవద్గీత ఉపదేశించాడు. అందుకే భగవద్గీత పుట్టిన రోజుగా ఈ రోజు గీతా జయంతిని జరుపుకుంటారు.🍀


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹


మోక్షదా ఏకాదశి విశిష్టత / గీతా జయంతి ప్రాముఖ్యత Moksha Ekadasi - Gita Jayanthi Significance



https://youtu.be/5P1O1xoU_9E


🌹 మోక్షదా ఏకాదశి విశిష్టత, వ్రత విధానం, వ్రత కధ / గీతా జయంతి ప్రాముఖ్యత, నియమాలు, విధి విధానం / Moksha Ekadasi - Gita Jayanthi Significance 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


🍀 భారతీయ సంస్కృతిలో ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రతి నెల శుక్ల పక్షం (వృషణ దశ) మరియు కృష్ణ పక్షం (చీకటి పక్షం) సమయంలో వచ్చే ఏకాదశిలను విష్ణువును పూజించడానికి మరియు ఉపవాసం ఉండటానికి మంచి రోజులుగా పరిగణిస్తారు. ఈ ముఖ్యమైన తేదీలలో ఒకటి మోక్షద ఏకాదశి. దీనినే గీతా జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజు ఉద్దేశ్యం ఆధ్యాత్మిక శుద్ధి మాత్రమే కాదు, మోక్షాన్ని పొందడానికి మార్గం సుగమం చేయడం కూడా. మోక్షద అంటే ప్రలోభాలను నాశనం చేయడం, అందుకే ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని పిలుస్తారు. పురాణాల ప్రకారం, మోక్షద ఏకాదశి రోజునే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి భగవద్గీత ఉపదేశించాడు. అందుకే భగవద్గీత పుట్టిన రోజుగా ఈ రోజు గీతా జయంతిని జరుపుకుంటారు.🍀

Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹



గీతా జయంతి మరియు మోక్షదా ఏకాదశి శుభాకాంక్షలు / Greetings on Geeta Jayanti and Mokshada Ekadashi



🌹 గీతా జయంతి మరియు మోక్షదా ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 🌹
🍀 ప్రశాంత జీవన రహస్యమే గీతాసారం. అమృతగీతం భగవద్గీత 🍀
ప్రసాద్ భరద్వాజ

🌹 Happy Geeta Jayanti and Mokshada Ekadashi to all 🌹
🍀 The secret of a peaceful life is the essence of Geeta. Amrut Geeta Bhagavad Gita 🍀
Prasad Bharadwaja


గీకారం త్యాగరూపం స్యాత్ తకారమ్ తత్వబోధకమ్

గీతా వాక్య మిదమ్ తత్వం జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:

సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|

పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం - గీతామృతమ్మహత్||


మార్గశిర శుద్ధ ఏకాదశి "గీతాజయంతి". ఈ ఏకాదశిని "మోక్షద" ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశినాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది. ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి “భగవద్గీత” ను బోధించాడన్నది విశ్వాసం. అందువల్ల ఈ ఏకాదశి "గీతాజయంతి" అని కూడా వ్యవహారిస్తారు.

యుద్ధభూమిలో శ్రీ కృష్ణ భగవానునికి, అర్జునునికి మధ్య జరిగిన సంభాషణే భగవద్గీత. అయితే, దాని అసలైన సందేశం యుద్ధం గురించే కాదు, ప్రతిరోజూ వివేకవంతంగా ఎలా జీవించాలో తెలియజేయడం.

దాని అత్యంత ప్రధానమైన బోధన నిష్కామ కర్మ గురించి. అంటే ఫలితాలపై ధ్యాస ఉంచకుండా, శక్తిమేరకు కృషి చేయడం.

భగవద్గీతలోని 2వ అధ్యాయం, 47వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇలా బోధించాడు...''కర్మలు చేయుట యందు మాత్రమే నీకు అధికారముంది, వాటి ఫలితములందు ఎన్నడూ లేదు. నీ కర్మఫలములకు సృష్టికర్తవు నీవని భావించకు; అట్లని నిష్క్రియ పట్ల నీకు అనురక్తి కలగనీయకు.''

దీని అర్థం ఏమిటంటే: అది మీ ఉద్యోగమైనా, మీ కుటుంబాన్ని పోషించడం అయినా, లేదా ఏదైనా బాధ్యత అయినా, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కానీ ప్రతిఫలం గురించి, గుర్తింపు గురించి ఆందోళన చెందుతూ ఉండకండి. ''ఈ పని చేయడం వల్ల నాకేమి లభిస్తుంది'' అనే ఆందోళన ఒత్తిడిని మాత్రమే తెస్తుంది.

మీరు ఫలితంపై కాకుండా, కర్మపైనే దృష్టి సారించినప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది. అదే సమయంలో, సోమరిగా లేదా నిష్క్రియగా మారకండి.

48వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇలా సలహా ఇచ్చాడు...''ఓ ధనంజయ, యోగంలో నిమగ్నుడవై, సమస్త కర్మలను ఆచరించు. వాటి ఫలాలపై ఆసక్తిని త్యజించి, జయాపజయముల యందు సమభావం గలవాడవై ఉండు. ఈ మానసిక సమత్వమే యోగం.''

జీవితం ప్రశంసలను, నిందలను, విజయాన్ని, అపజయాన్ని తెస్తుంది. ఈ రెండు పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండాలని శ్రీ కృష్ణుడు మనకు బోధిస్తాడు. ఈ సమభావమే నిజమైన యోగం. అంటే ఆంతరంగిక శాంతిని బాహ్య కర్మాచరణతో అనుసంధానం చేయడం.

3వ అధ్యాయం, 30వ శ్లోకంలో, ఈ స్థితిని సాధించడానికి శ్రీ కృష్ణుడు కీలకమైన మార్గాన్ని తెలియజేశాడు.

''సమస్త కర్మలను నాకు అర్పించు! అహంకారం, ఆశలు విడచి, నీ మనస్సును ఆత్మపై కేంద్రీకరించి, ఆందోళన నుండి విముక్తుడవై, కర్మాచరణమనే యుద్ధంలో నిమగ్నమై ఉండు.''

సరళమైన మాటల్లో చెప్పాలంటే, మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అంకితం చేయండి. ఈ విధంగా జీవించడం అంటే ప్రపంచం నుంచి విరమించుకోవడం కాదు... కోరికలు, అహంకారం లేకుండా, అపేక్ష, తీవ్రమైన చింత లేకుండా, ప్రతి కర్మను ఆయనకు ఒక సమర్పణగా నిర్వర్తించడం. ప్రశాంతమైన జీవితానికి ఇదే ఏకైకమార్గం.

5వ అధ్యాయం, 10వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఒక అందమైన ఉపమానాన్ని అందించాడు:

''నీరు స్పృశించలేని తామరాకు వలె, కర్మలను నిర్వర్తించే యోగి, ఆసక్తిని త్యజించి, తన కర్మలను అనంతునికి సమర్పించడం ద్వారా, ఇంద్రియ బంధాలకు లోనుకాకుండా ఉంటాడు.''

బురదలో పెరిగినా దాని మలినం సోకని కమలం వలె, నిష్కామ కర్మను ఆచరిస్తూ, భగవంతునికి శరణాగతి చెందడం ద్వారా ప్రాపంచిక పోరాటాల మధ్య జీవిస్తూ కూడా ప్రశాంతంగా ఉండవచ్చు.

నిష్కామ కర్మ అంటే బాధ్యతల నుంచి పలాయనం కాదు, అది హృదయపూర్వకంగా- కార్యాలయాలలోను, మానవ సంబంధాలలోను, వ్యక్తిగత లక్ష్యాలలోను పనిచేయడం, కానీ ఫలితాల కోసం పాకులాడకుండా ఉండటం.

యుద్ధభూమి ప్రతీకాత్మకమే కావచ్చు, కానీ పోరాటం నిజమైనది-వ్యామోహానికీ స్వేచ్ఛకూ మధ్య, అహంకారానికీ శరణాగతికీ మధ్య, నిష్కామకర్మలోనే విజయం ఉందని గీత మనకు చూపిస్తుంది. ఎందుకంటే అది మాత్రమే శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలదు.

మహాభారతంలో భీష్మ పర్వంలో ఉన్న 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు మొత్తం భగవద్గీత 18 అధ్యాయాలు. ఒక్కో అధ్యాయాన్ని ఒక్కో యోగం అంటారు. 6 యోగాలని కలిపి ఒక షట్కం అని..1 నుంచి 6 అధ్యాయాలను కర్మ షట్కమని, 7 నుంచి 12 వరకు భక్తి షట్కం అని, 13 నుంచి 18 వరకు జ్ఞాన షట్కం అని అంటారు.


భగవద్గీతలో 18 అధ్యాయాలున్నట్లే

మోక్ష పధానికి 18 మెట్లు వున్నాయి.


అవి...

1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6.సరస్వతి 7. బ్రహ్మవిద్య 8, బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్థమాత్ర 12 చిదానంద 13. భవఘ్ని 14. భ్రాంతినాశిని 15. వేదత్రయి 16. పర 17. అనంత 18. తత్త్వార్థ జ్ఞాన మంజరి.

ఎవరైతే మోక్షస్థానాన్ని లక్ష్యంగా చేసుకున్నవారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి పరబ్రహ్మాన్ని పొందుతారు.

'కర్మ'… 'జ్ఞానం'గా మారటమే భగవద్గీతా సారాంశం. ఆ గీతా సుభాషితాల్లో కొన్ని..


1. మృత్యువు కేవలం శరీరం నుంచి ఆత్మను వేరు చేస్తుంది. ఆత్మకు చావు లేదు. ఆత్మ నిత్య సత్యమైంది. తనను తాను తెలుసుకోవడం, తనలోని అంతరాత్మను తెలుసుకోవడమే జ్ఞానం.

2. అభ్యాస, వైరాగ్యాల ద్వారా వస్తు ప్రపంచాన్ని వదలిపెట్టి, సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరుకోవడం యోగి అయిన వ్యక్తి లక్షణంగా ఉండాలి.

3. భగవంతుడిని చేరుకోవడానికి భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాలు ఉన్నాయి. వీటిలో ఏ మార్గం అనుసరించాలనేది భక్తుడి ఇష్టం. అంతిమ ఫలితం ఒకటే.

4. మనిషి కర్మ చేయకుండా ఉండలేడు. ఉండకూడదు కూడా. కాబట్టి, కర్మఫలితాన్ని అనుభవించక తప్పదు. అలాగని, కర్మ చేయటాన్ని విడిచిపెట్టకూడదు. కర్తవ్యాన్ని నిర్వహించి, ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలి.

5. సృష్టిలోని సమస్త ప్రాణులూ భగవంతుడి స్వరూపాలే. మనం చేసే అన్ని పూజలు, అర్చనలు, హోమాల ఫలితాలు భగవంతుడికే చెందుతాయి.

6. ప్రపంచంలోని జీవులన్నీ సత్వ, రజ, తమో గుణాలతో బంధించి ఉంటాయి. భగవంతుడి పాదాలను ఆశ్రయించిన వారికి ఈ బంధాల నుంచి విముక్తి కలుగుతుంది.

7. జయాపజయాలు, లాభనష్టాలు, సుఖదుఃఖాలు… అన్నీ భగవంతుడు ఇచ్చినవే. దేనికీ పొంగిపోకూడదు. విచారించకూడదు.

8. భక్తి, సాధన అనే పేర్లతో కాలక్షేపం పనికిరాదు. కర్తవ్యాన్ని విస్మరించడం ఏ మాత్రం తగదు. కర్మ చేయని వాడిని భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో అనుగ్రహించడు.

🌹🌹🌹🌹🌹

ఇంటి టైల్స్ చీల్చుకుని వెలసిన మారెమ్మ అమ్మవారు.. ఏపీలో ఆశ్చర్యకర ఘటన The Sanjeevarayanapalli Goddess (A story from Andra Pradesh)



🌹 ఇంటి టైల్స్ చీల్చుకుని వెలసిన మారెమ్మ అమ్మవారు.. ఏపీలో ఆశ్చర్యకర ఘటన 🌹

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో హిందూపూర్ పట్టణానికి సుమారు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంజీవరాయనపల్లి గ్రామం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సంఘటనకు వేదికగా మారింది.

ఈ గ్రామంలోని ఒక నివాస గృహంలో సాక్షాత్తు మారెమ్మ అమ్మవారు పుట్ట రూపంలో వెలిశారని, అనేక మంది భక్తులకు అద్భుతాలు చూపుతున్నారని స్థానికులు, సందర్శకులు విశ్వసిస్తారు. ఈ పుట్ట, సాధారణ నేలపై కాకుండా, ఇంట్లో వేసిన టైల్స్, సిమెంట్ ఫ్లోరింగ్‌ను చీల్చుకొని పైకి వచ్చి, నిరంతరం పెరుగుతూ ఉండటం విశేషం. సుమారు రెండు దశాబ్దాలుగా అంటే దాదాపు 20 సంవత్సరాలుగా ఈ దివ్యమైన పుట్ట పెరుగుదల కొనసాగుతోంది.

ఈ అమ్మవారి ఆవిర్భావానికి ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. ముందుగా ఈ కుటుంబం సొంతూరు కోనాపురమని, అక్కడ అమ్మవారు రాతి రూపంలో వెలశారని చెబుతారు. అప్పట్లో, ఆ కుటుంబానికి చెందిన ఓ పెద్దాయన పొలాలకి నీళ్ళు కట్టేందుకు వెళ్లినప్పుడు, ఆయనకు గజ్జల సౌండ్ వినిపించేదట. ఒకానొక సందర్భంలో అమ్మవారు తెల్ల చీర కట్టుకొని, బిస్తం పట్టుకున్న చిన్న పాప రూపంలో ప్రత్యక్షమై, తనను మారెమ్మ అని పరిచయం చేసుకొని, తనకు ఆలయం లేదని, ఎండకి ఎండుతున్నానని, వానకి నానుతున్నానని, గుడి కట్టించమని ఆదేశించిందట. ఆర్థిక స్తోమత లేకపోయినా, ఆ తాత ఊరూరా తిరిగి చందాలు పోగుచేసి, కోనాపురంలో అమ్మవారికి ఆలయం నిర్మించారని, అక్కడ గ్రామ జాతర కూడా నిర్వహించారని కుటుంబ సభ్యులు వివరించారు. ఆ తర్వాత కాలంలో, ఈ కుటుంబం పొలం అమ్మి సంజీవరాయనపల్లికి వచ్చి స్థిరపడిన తర్వాత, అమ్మవారు వారి ఇంట్లోనే పుట్ట రూపంలో తిరిగి వెలిశారు. మొదట్లో, దీనిని సాధారణ చెదల పుట్టగా భావించి, కుటుంబ సభ్యులు రెండు మూడు సార్లు తొలగించారట. అయితే, ఎంత తొలగించినా, మరుసటి రోజు ఉదయానికి అది తిరిగి అదే స్థానంలో పెరిగి ఉండటం, అదే సమయంలో కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ఇతర కష్టాలు ఎదుర్కోవడంతో, వారు దీనిని దివ్యశక్తిగా గుర్తించి పూజించడం ప్రారంభించారు. పుట్ట ప్రస్తుతం రెండు గదులలో వ్యాపించి, నిరంతరం పెరుగుతూ ఉంది. ఇది సిమెంట్ గోడలు, ప్లాస్టింగ్ మధ్య నుంచి కూడా విస్తరిస్తోంది.

ఈ ప్రాంతానికి చెందిన భక్తులకు సంజీవరాయనపల్లి అమ్మవారు ఒక శక్తివంతమైన దేవతగా మారారు. ప్రతి శుక్రవారం, మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి తరలివచ్చి, తమ కోరికలను అమ్మవారికి నివేదిస్తారు. ఆరోగ్య సమస్యలు, సంతానం లేని వారికి, ఇతర జీవన కష్టాలతో బాధపడుతున్న వారికి అమ్మవారి దర్శనం ద్వారా ఉపశమనం లభిస్తుందని, కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం ఉంది. భక్తులు తమ అనుభవాలను పంచుకుంటూ, అమ్మవారిని నమ్మిన వారికి తప్పక మంచి జరుగుతుందని చెబుతారు. సంతానం లేని దంపతులు అమ్మవారిని దర్శించి, ఒడిలో కూర్చున్న అమ్మవారు ఒంటి పైన వచ్చి నిమ్మకాయ, అక్షంతలు ఇచ్చి, తొమ్మిది ప్రదక్షిణలు చేయించి, కవర్లలో వేసి కట్టించుకుంటే పిల్లలు పుడతారని నమ్మకం. ఇలా సంతానం పొందిన వారు తమ ముక్కుబడులు తీర్చుకోవడానికి తిరిగి వస్తుంటారు. ఈ పుట్టను తొలగించినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందుల వల్ల, ప్రస్తుతం ఈ ఇంటిలోని రెండు గదులను పూర్తిగా అమ్మవారికి అంకితం చేశారు, వాటిని కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం లేదు. ఇది కేవలం ఒక ఇంట్లో వెలసిన దేవత కాదని, భక్తుల జీవితాల్లో వెలుగులు నింపే ఒక దివ్యశక్తి అని సంజీవరాయనపల్లి అమ్మవారు నిరూపించుకుంటున్నారు.

🌹🌹🌹🌹🌹

సూర్య నమస్కార స్తోత్రము Surya Namaskara Stotram



https://youtube.com/shorts/e4wu9d_w3GE


🌹ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర🌹

ప్రసాద్ భరద్వాజ

ఆదివారం తప్పక వీక్షించండి

🍀 సూర్య నమస్కార స్తోత్రము సూర్య భగవానుని రక్షణ కోసం ప్రార్థించే ఒక శక్తివంతమైన స్తోత్రం. ఇది ఆరోగ్యం, విజయం ఇస్తుందని, మరియు అన్ని కష్టాలను దూరం చేయడానికి సహాయపడుతుందని నమ్ముతారు, దీనిని ఆదివారం రోజున వింటే మంచిది.🍀





🌹Adi Deva Namastubhyam Prasida Mama Bhaskara🌹

Prasad Bharadwaja

Must watch on Sundays

🍀 Surya Namaskara Stotram is a powerful stotra that prays for the protection of Lord Surya. It is believed to give health, success, and help in warding off all difficulties, it is good to listen to it on Sundays.🍀



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


మోక్షదా ఏకాదశి - గీతా జయంతి / Moksha Ekadasi - Gita Jayanthi



https://youtu.be/5P1O1xoU_9E


🌹 మోక్షదా ఏకాదశి విశిష్టత, వ్రత విధానం, వ్రత కధ / గీతా జయంతి ప్రాముఖ్యత, నియమాలు, విధి విధానం / Moksha Ekadasi - Gita Jayanthi Significance 🌹

ప్రసాద్‌ భరధ్వాజ




🍀 భారతీయ సంస్కృతిలో ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రతి నెల శుక్ల పక్షం (వృషణ దశ) మరియు కృష్ణ పక్షం (చీకటి పక్షం) సమయంలో వచ్చే ఏకాదశిలను విష్ణువును పూజించడానికి మరియు ఉపవాసం ఉండటానికి మంచి రోజులుగా పరిగణిస్తారు. ఈ ముఖ్యమైన తేదీలలో ఒకటి మోక్షద ఏకాదశి. దీనినే గీతా జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజు ఉద్దేశ్యం ఆధ్యాత్మిక శుద్ధి మాత్రమే కాదు, మోక్షాన్ని పొందడానికి మార్గం సుగమం చేయడం కూడా. మోక్షద అంటే ప్రలోభాలను నాశనం చేయడం, అందుకే ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని పిలుస్తారు. పురాణాల ప్రకారం, మోక్షద ఏకాదశి రోజునే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి భగవద్గీత ఉపదేశించాడు. అందుకే భగవద్గీత పుట్టిన రోజుగా ఈ రోజు గీతా జయంతిని జరుపుకుంటారు.🍀


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



'శ్రీరామ' అనే దివ్య నామ స్మరణతో ఆరుగురు దేవతల ఆశీస్సులు లభిస్తాయని మీకు తెలుసా ? By chanting the divine name 'Shri Rama' ....


🌹 'శ్రీరామ' అనే దివ్య నామ స్మరణతో ఆరుగురు దేవతల ఆశీస్సులు లభిస్తాయని మీకు తెలుసా ?. 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 Did you know that by chanting the divine name 'Shri Rama', you can get the blessings of six gods? 🌹
Prasad Bharadwaja



శ్రీరామ నామం ఎంతో మధురం.. అని అంటూ ఉంటారు. కొందరు రామకోటి రాస్తూ శ్రీరాముడి ఆశీస్సులు పొందుతారు. శ్రీరామ అంటే కేవలం విష్ణు మాత్రమే కాదని సకల దేవతలు ఈ నామంలో ఉన్నాయని ఇప్పటికే చాలామంది ఆధ్యాత్మిక వాదులు పేర్కొన్నారు.

అయితే కొన్ని గ్రంథాలు, పురాణాల ప్రకారం ఈ నామములో ఆరుగురు దేవతలు కొలువై ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు శ్రీరామ నామ జపం చేయడం వల్ల ఆరుగురు దేవతలను పూజించినట్లు అవుతుందని అంటున్నారు. అంతేకాకుండా సమస్యలు, బాధలు ఉన్నప్పుడు శ్రీరామ నామం జపం చేయడం వల్ల అవి తొలగిపోతాయని కూడా చెబుతున్నారు. అసలు శ్రీరామ నామం లో ఉన్న ఆరుగురు దేవతలు ఎవరు? వారి పేర్లు ఏంటి?

శ్రీరామ అనగానే మనకు విష్ణువు అవతారమైన రాముడు గురించి మాత్రమే చర్చించుకుంటాం. కానీ శ్రీరామ అనే పదాన్ని మాత్రం ఆలయాలకు వెళ్లినప్పుడు పలుకుతూ ఉంటాం. అయితే శ్రీరామ అనే పేరును పలకడం రాముడిని గుర్తు చేసుకోవడం మాత్రమే కాకుండా ఆరుగురు దేవతలను స్మరించడం అని అంటున్నారు.

శ్రీరామ లో.. మొదటి శ్రీ అంటే లక్ష్మి తత్వం. శ్రీరామ నామంలో మొదటి అక్షరం సంపద, శాంతి, శ్రేయస్సు ప్రసాదించే లక్ష్మీదేవత ఉన్నట్లు చెబుతారు.

శ్రీరామ లో.. ర అంటే రుద్రశక్తి. శివుడి తత్వాన్ని ఈ అక్షరం సూచిస్తుంది. రామ నామంలో కూడా శివుడు కొలువై ఉన్నాడని ఈ పదం తెలుపుతుంది.

శ్రీరామ లో.. ర+అ=రా.. అంటే ఇందులో ఆ అక్షరం అగ్ని దేవుడిని సూచిస్తుంది. ప్రతి కార్యక్రమంలో అగ్ని దేవుడిని కొలుస్తుంటాం. శుద్ధి శక్తికి ప్రత్యేకగా అగ్నిదేవుడని కొలుస్తూ ఉంటాం. శ్రీరామ నామం జపించినప్పుడు అగ్నిదేవుడు కూడా ఉంటాడు.

శ్రీరామ లో.. చివరి అక్షరం మ లో ముగ్గురు దేవతలు కొలువై ఉన్నట్లు తెలుపుతున్నారు. అంటే బ్రహ్మ, విష్ణు తో పాటు ఆదిశక్తి స్వరూపిణి కూడా ఈ అక్షరం లో ఉన్నట్లు చెబుతారు.

ఇలా శ్రీరామలో ఆరుగురు దేవతలు ఉండడంవల్ల ప్రతిసారి శ్రీరామ అనే నామం జపించడం వల్ల వీరు సంతోషిస్తారని అంటున్నారు. వీరితోపాటు శ్రీరామ అని పేరు చెప్పగానే ముందుగా స్పందించేది హనుమంతుడు. విష్ణు సేవ కోసం శివుడే హనుమంతుడి రూపం లో వచ్చాడని కొన్ని పురాణాల్లో ద్వారా తెలుస్తుంది. అయితే శివుడితోపాటు పార్వతీ కూడా వస్తానని అంటుంది. కానీ హనుమంతుడు బ్రహ్మచర్య రూపం వల్ల పార్వతికి అడ్డు చెబుతాడు. అయినా కూడా శ్రీరామ అనే పదంలో ఆదిశక్తి స్వరూపిణి కొలువై ఉంటుందని శ్రీరామ నామం అనే పదం ద్వారా తెలుస్తుంది. ప్రతిరోజు మంచి మనసుతో కొన్నిసార్లు శ్రీరామ నామం జపించడం వల్ల ఈ దేవతల ఆశీస్సులు ఉంటాయని ఆధ్యాత్మిక పండితులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శ్రీరామ నామం జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి అనుకున్న పనులు కూడా పూర్తవుతాయని చెబుతున్నారు.

🌹🌹🌹🌹🌹

తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం / గోవిందరాజస్వామి ఆలయంలో విశేష వేడుకలు / Krittika Deepotsavam at Sri Kapileshwara Temple in Tirupati ....


🌹 తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం / గోవిందరాజస్వామి ఆలయంలో విశేష వేడుకలు 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Krittika Deepotsavam at Sri Kapileshwara Temple in Tirupati / Special celebrations at Govindaraja Swamy Temple 🌹
Prasad Bharadwaja


తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని డిసెంబర్‌ 3న సాయంత్రం భక్తిపూర్వకంగా కృత్తికా దీపోత్సవం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

ఈ మేరకు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. అధికారుల వివరాల ప్రకారం.. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు ఆలయంలో ప్రత్యేక దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముందుగా గర్భాలయంలో స్వామివారికి దీపారాధన చేసి, అనంతరం ఆలయ శిఖరంపై దీపారాధన నిర్వహించబడుతుంది.

తదుపరి రాత్రి 7.30 గంటలకు పుష్కరిణి వద్ద జ్వాలాతోరణం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనమివ్వనుంది. ప్రతి ఏడాది కృత్తిక నక్షత్రం సందర్భంగా నిర్వహించే ఈ వేడుకను పెద్ద సంఖ్యలో భక్తులు వీక్షించేందుకు వస్తారని అధికారులు తెలిపారు. కార్యక్రమాల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సరైన ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ పేర్కొంది.


🌻 తిరుపతి దివ్యోత్సవాలు.. గోవిందరాజస్వామి ఆలయంలో విశేష వేడుకలు 🌻

భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పండుగ లాంటి శుభవార్త చెప్పింది. డిసెంబర్ నెలలో తిరుపతిలోని టీటీడీ అన్నసంస్థలకు అనుబంధంగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

ఈ సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాల షెడ్యూల్‌ను ఇవాళ (శనివారం) టీటీడీ విడుదల చేసింది. డిసెంబర్ 4న సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం ఘనంగా జరగనుంది. ఇదే రోజు శ్రీ తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర వేడుక కూడా నిర్వహించనున్నారు. డిసెంబర్ 5న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకొని సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధి స్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. డిసెంబర్ 12, 19, 26 తేదీల్లో శుక్రవారాల సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారి మాడ వీధుల ఊరేగింపు జరగనుంది. డిసెంబరు 13న ఉత్తరా నక్షత్రం సందర్భంగా ఉభయ నాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామి సాయంత్రం 6 గంటలకు భక్తులను అనుగ్రహిస్తారు.

డిసెంబర్ 14న స్వామి వారి తిరువడి సన్నిధి ఉత్సవం భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారిని ఎదురు ఆంజనేయస్వామి సన్నిధికి వేంచేపు చేస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకి స్వామి, అమ్మవార్లు, ఆంజనేయ స్వామి వారి మాడ వీధుల ఊరేగింపు చేపడతారు. డిసెంబర్ 19న శ్రీ తొండరడిప్పడి ఆళ్వార్ తిరు నక్షత్రం నిర్వహించనున్నారు. డిసెంబర్ 23న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. డిసెంబరు 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, డిసెంబర్ 31న ముక్కోటి ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వివరాలు టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

🌹 🌹 🌹 🌹 🌹


శనివారం శ్రీ వేంకటేశ్వరుని అభిషేకం కర్పూర హారతి దర్శనం / Saturday Abhishekam of Lord Venkateswara and Karpura Aarti Darshan (a YT Short)



https://youtube.com/shorts/RacmOC1aaFQ


🌹 శనివారం శ్రీ వేంకటేశ్వరుని అభిషేకం కర్పూర హారతి దర్శనం 🌹
🌹 Saturday Abhishekam of Lord Venkateswara and Karpura Aarti Darshan 🌹
 

ప్రసాద్ భరద్వాజ

తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


తిరుమలలో డిసెంబర్ 2025 నెల విశేష పర్వదినాల తేదీలు.. Dates of special holidays in December 2025 in Tirumala..


🌹 డిసెంబర్‌ 2025 పండుగలు - పర్వదినాలు / తిరుమలలో డిసెంబర్ నెల విశేష పర్వదినాల తేదీలు.. 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 December 2025 Festivals - Holidays / Dates of special holidays in December in Tirumala.. 🌹
Prasad Bharadwaja



డిసెంబర్‌ 01 సోమవారం - గీతా జయంతి, మోక్షద ఏకాదశి

డిసెంబర్‌ 02 మంగళవారం - ప్రదోష వ్రతం

డిసెంబర్‌ 03 బుధవారం - జ్యేష్ఠ కార్తె

డిసెంబర్‌ 04 గురువారం - పౌర్ణమి, దత్త జయంతి

డిసెంబర్‌ 07 ఆదివారం - సంకటహర చతుర్థి

డిసెంబర్‌ 15 సోమవారం - మూల కార్తె, ఏకాదశి

డిసెంబర్‌ 16 మంగళవారం - ధనుర్మాస పూజ, ధనుర్మాసం ప్రారంభం

డిసెంబర్‌ 18 గురువారం - మాస శివరాత్రి

డిసెంబర్‌ 19 శుక్రవాంర - అమావాస్య

డిసెంబర్‌ 24 బుధవారం- క్రిస్మస్ ఈవ్

డిసెంబర్‌ 25 గురువారం - క్రిస్మస్

డిసెంబర్‌ 26 శుక్రవారం - స్కంద షష్టి

డిసెంబర్‌ 27 శనివారం - అయ్యప్ప స్వామి మండల పూజ

డిసెంబర్‌ 28 ఆదివారం - పూర్వాషాఢ కార్తె

డిసెంబర్‌ 30 మంగళవారం - పుష్య పుత్రాద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి


డిసెంబర్‌ 2025 పౌర్ణమి, ఏకాదశి తిథులు


పౌర్ణమి డిసెంబర్ 4వ తేదీ 8:38 AM నుంచి డిసెంబర్ 5వ తేదీ 4:44 AM వరకు

అమావాస్య డిసెంబర్ 19వ తేదీ 4:59 AM నుంచి డిసెంబర్ 20వ తేదీ 7:13 AM వరకు.



🍀 తిరుమలలో డిసెంబర్ నెల విశేష పర్వదినాల తేదీలు.. ఏ రోజు ఏంటి? 🍀

డిసెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే పర్వదినాలు, విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ అధికారులు విడుదల చేశారు. ప్రతి నెలలో శ్రీవారికి నివేదించే కార్యక్రమాలు, పండగలు, వివిధ విశేష ఉత్సవాలకు సంబంధించిన జాబితాను సంబంధిత నెల ప్రారంభానికి ముందే విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా డిసెంబర్‌లో నిర్వహించే పండగల జాబితాను విడుదల చేశారు. 2వ తేదీన మంగళవారం చక్రతీర్థ ముక్కోటితో డిసెంబర్ నెల విశేష ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు టీటీడీ అధికారులు. శ్రీవారి ఆలయంలో 4వ తేదీన గురువారం కార్తీక పర్వ దిపోత్సవాన్ని నిర్వహిస్తారు. అదే రోజున తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర ఉంటుంది. 5వ తేదీన శుక్రవారం తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం కార్యక్రమం జరుగుతుంది.

16న మంగళవారం నాడు ధనుర్మాసం ఆరంభమౌతుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో తిరుప్పావైని వినిపిస్తారు. ఈ మాసంలో తిరుప్పావై పాశురాలను పఠిస్తారు. ధనుర్మాసం ముగిసేంత వరకూ ఈ పాశురాలు తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణనాన్ని రెట్టింపు చేస్తాయి. 19వ తేదీ శుక్రవారం తొందార్పప్పోడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం ఉత్సవం ఉంటుంది. అదే రోజున శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమౌతాయి. డిసెంబర్ 29న సోమవారం శ్రీవారి ఆలయంలో చిన్న శాత్తుమొరను నిర్వహిస్తారు.

30వ తేదీ మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మొదలయ్యేది ఆ రోజే. జనవరి 8వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. అదే రోజున శ్రీమలయప్ప స్వామివారు.. దేవేరులతో కలిసి స్వర్ణ రథోత్సవం మీద ఊరేగుతారు. 31న బుధవారం నాడు వైకుంఠ ద్వాదశి ఉత్సవాలు, శ్రీవారి చక్రస్నానాన్ని నిర్వహిస్తారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో కేటాయించనున్నారు. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేస్తారు.

నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేది వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం ఉంటుంది. మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు నవంబర్ 27వ తేది ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేది సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్ లో ఏపీ గవర్నమెంట్ బాట్ లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్‌ డిప్ కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

🌹🌹🌹🌹🌹


కాలబైరవ అష్టమి శుభాకాంక్షలు Happy Kalabhairava Ashtami



🌹 కాలబైరవ అష్టమి శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 Happy Kalabhairava Ashtami to everyone 🌹
Prasad Bharadwaja



కాలబైరవ అష్టమి..అనుకున్న కోరిక నెరవేరాలంటే ఇలా చేయండి..! Kalabhairava Ashtami Do like this



https://youtube.com/shorts/xQ7KwP-Gwos?si=_AF0n35Z8WNW_UJ2


🌹కాలబైరవ అష్టమి..అనుకున్న కోరిక నెరవేరాలంటే ఇలా చేయండి..! Kalabhairava Ashtami Do like this 🌹

ప్రసాద్ భరద్వాజ

తప్పకుండా వీక్షించండి


🌹🌹🌹🌹🌹


శ్రీ కాలభైరవ అష్టకం - శ్లోక తాత్పర్యములు Sri Kalabhairava Ashtakam - Meaning of the verses



https://youtu.be/_VLqYNh-7bY


🌹 శ్రీ కాలభైరవ అష్టకం - శ్లోక తాత్పర్యములు 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

🌹 Sri Kalabhairava Ashtakam - Meaning of the verses 🌹
Prasad Bharadhwaja



మనోహరమైనది, జ్ఞ్యానమును, ముక్తిని కలిగించునది, అనేక పుణ్యములను పెంపొందించునది, శోకము, మోహము, దీనత్వము, కోపము, పాపములను నశింప చేయునది అగు కాలభైరవ అష్టకం ఈ వీడియోలో వీక్షించండి. కాలభైరవ పాద సన్నిధిని చేరుటకు దీనిని నిత్యము పఠించండి.

కాలభైరవం భజే!! కాలభైరవం భజే!!

కాశికాపురాధినాథ కాలభైరవం భజే!!

కాశికాపురాధినాథ కాలభైరవం భజే!!


🍀 కాలభైరవాష్టకం పఠించడం వల్ల లాభాలు 🍀

ప్రత్యేక రక్షణ - ఈ స్తోత్రం ప్రతికూల శక్తుల నుంచి మరియు చెడు ప్రభావాలనుంచి రక్షణ కవచం లాగా పనిచేస్తుంది.

భావనాత్మక స్వస్థత - భయం, ఆందోళన, మరియు ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతత మరియు భద్రతను కలిగిస్తుంది.

ఆధ్యాత్మిక ప్రగతి - కాలభైరవాష్టకం నిత్య పఠనం ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణం మెరుగవుతుంది మరియు దైవంతో ఉన్న అనుబంధాన్ని మరింతగా గాఢం చేస్తుంది.

ఆత్మవిశ్వాసం - కాలభైరవాష్టకం పఠించడం ద్వారా ధైర్యం మరియు బలంతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం సులభమవుతుంది.

🌹🌹🌹🌹🌹

కాలభైరవాష్టకం - Kalabhairava Ashtakam (a YT Short)



https://youtube.com/shorts/cGMvn6sVRjw


🌹 కాలభైరవాష్టకం - Kalabhairava Ashtakam   కాలభైరవ అష్టమి రోజు. చాలా శక్తిమంతమైనది..! 🌹

ప్రసాద్ భరద్వాజ


తప్పకుండా వీక్షించండి



Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam



🌹🌹🌹🌹🌹