తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 9 - పాశురాలు 17 & 18 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 9 - Pasuras 17 & 18



https://youtu.be/pv2gU4sBYds


🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 9 - పాశురాలు 17 & 18 Tiruppavai Pasuras Bhavartha Gita Series 9 - Pasuras 17 & 18 🌹

🍀 17వ పాశురం – గోకుల గృహ మేల్కొలుపు – అవతార గీతం, 18వ పాశురము - నీళాదేవి మేల్కొలుపు – అనుగ్రహ ఆశా గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

🍀 ఈ 17వ పాశురంలో, ద్వారాపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా, భవనంలోకి ప్రవేశించిన గోపికలు మొదట ఆ నారాయణునకే జననీ జనకులైన, యశోదా నందులను, బలశాలి బలరాముని, యదుకుల భూషణమైన కన్నయ్యను నిద్ర లేపుతూ వారి కృపను వేడుచున్నారు. 18వ పాశురంలో నంద గోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్ధించినను వారు తెరువక పోవుట చేత, నందుని కోడలూ, కృష్ణప్రియ అయిన నీళాదేవిని గోపికలంతా నిద్ర లేపుతున్నారు. కృష్ణుడు ఆమె ప్రేమకు కట్టుబడినవాడు కదా! నీళాదేవితో వెళితే స్వామి త్వరగా అనుగ్రహిస్తాడని వారి ఆశ. 🍀

తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


శుక్లాాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శుభ బుధవారం 'Suklam Bharadharam Vishnum Sasi Varnam' (a devotional YT Short)


https://youtube.com/shorts/BnLenONV3MY


🌹 శుక్లాాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శుభ బుధవారం Suklam Bharadharam Vishnum Sasi Varnam Prayer 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


16వ పాశురము - తిరుప్పావై భావార్థ గీత మాలిక / 16th Pasuram - Tiruppavai Bhavartha Gita



https://youtube.com/shorts/EZEL08sHKaU


🌹 16వ పాశురము - తిరుప్పావై భావార్థ గీత మాలిక - 16th Pasuram - Tiruppavai Bhavartha Gita 🌹

🍀 16వ పాశురము - ద్వార పాలకుని ఆహ్వానం – దర్శన దీక్ష గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 16వ పాశురంలో ఆనందముతో శ్రీ కృష్ణుని పొందే యోగ్యత కల గోపికలందరను మేలుకొని, కలిసి నంద గోప భవనమునకు వచ్చిరి. నందగోపుని భవన ద్వారమునకు వచ్చి ద్వార పాలకుని అర్ధించి లోనికి ప్రవేశించ దారి నివ్వమని ప్రార్ధిస్తున్నారు. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹


పుష్యమాసంలో శ్రీమహావిష్ణువుని, శనైశ్వరుణ్ణి ఆరాధిస్తే కష్టాలు తొలుగుతాయి Worshipping Lord Maha Vishnu and Lord Shani in the month of Pushya


🌹 పుష్యమాసంలో శ్రీమహావిష్ణువుని, శనైశ్వరుణ్ణి ఆరాధిస్తే కష్టాలు తొలుగుతాయి. 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

🌹 Worshipping Lord Maha Vishnu and Lord Shani in the month of Pushya alleviates difficulties. 🌹
Prasad Bharadwaj

పుష్యమాసం ప్రారంభమైంది. ఈ మాసంలో నెల పడతారు. కావున కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో శనిదేవుడిని ఆరాధిస్తే విశేష ఫలితాలు వస్తాయని అంటారు.

శ్రావణ మాసం మహాలక్ష్మీ, కార్తీక మాసం శివుడు, మార్గశిర మాసం విష్ణువు ఎలాగో ఈ పుష్య మాసంలో శనిదేవుడిని పూజించాలని పురాణాలు చెబుతున్నాయి. మరి ముఖ్యంగా ఏలిననాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి. శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తే ఆ ప్రభావం తగ్గుతుంది. అలాగే ఈ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం చేసి.. నువ్వులు దానంగా ఇస్తే మంచిది. శనిదేవుడికి నువ్వులతోపాటు బెల్లం ప్రీతిపాత్రమని చెబుతారు.

శని భగవానుడు ధర్మం, న్యాయం, సత్యంలను పరిరక్షిస్తుంటాడని పురాణాలు చెబుతున్నాయి. కోర్టు వివాదాల్లో బాధపడే వారు ఈ పుష్య మాసంలో శని దేవుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయని అంటారు. ఈ నెల రోజులు శనిదేవునికి నువ్వులు, బెల్లం నైవేద్యంగా సమర్పించి.. వాటిని స్వీకరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఇక ఈ మాసంలో శని భగవానుడితో పాటు పుష్యమాసం తొలి అర్థభాగం శ్రీమహా విష్ణువును పూజిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ మాసంలో సోమవారం శివుడిని మారేడు దళాలతో.. ఆదివారం సూర్యుడిని జిల్లేడు పూలతో ఆర్చిస్తారు. పుష్య మాసంలో శుక్ల పక్ష షష్ఠి రోజు శ్రీవల్లీదేవ సేన సమేత శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తారు.

ఈ మాసంలో సూర్యోదయ కాంతి యోగ చైతన్యాన్ని ప్రసరిస్తుంది. మకరరాశిలో సూర్యుడు ప్రవేశించే సమయం నుంచి ఉత్తరాయణ పుణ్య కాలం ఏర్పడుతుంది. ఈ పుణ్యకాలంలో దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా సూర్యుడి ప్రయాణం కొనసాగుతుంది. ఈ సమయంలో సూర్య కిరణాలు ప్రత్యేకమైన తేజస్సు కలిగి ఉంటాయి. ఈ సూర్య కాంతి వల్ల ప్రజలకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

🌹🌹🌹🌹🌹

వేకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఉత్థాన ఏకాదశి Vaikunta Ekadashi Uthana Ekadasi Mukkoti Ekadasi



https://youtube.com/shorts/ErcC8ZqlZIg


🌹 వేకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఉత్థాన ఏకాదశి VAIKUNTA EKADASHI UTHANA EKADASI MUKKOTI EKADASI 🌹


తప్పక వీక్షించండి.

గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹




శ్రీ విష్ణు అష్టకము Short 1 / Sri Vishnu Ashtakam -1 (a YT Short)


https://youtube.com/shorts/aZ0d1Fez-qI

🌹 శ్రీ విష్ణు అష్టకము Short 1 - భావార్ధ సహితం - Sri Vishnu Ashtakam -1 వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో 🌹

తప్పక వీక్షించండి.

గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

🍀🙏 విష్ణుం విశాలారుణ పద్మనేత్రం విభాంతు మీశాంబుజయోనిపూజితం|

సనాతనం సన్మతిశోధితం పరం పుమాంసమాద్యం సతతం ప్రపద్యే


విశాలమైన, ఎర్రని తామరల వంటి కన్నులు కలిగినవాడు, ప్రకాశించేవాడు, బ్రహ్మదేవునిచే పూజించబడినవాడు, సనాతనుడు, సన్మతులచేత పరిశోధించబడిన పరమాత్మ, ఆదిపురుషుడు అయిన ఆ విష్ణువును నేను నిత్యం శరణు పొందుతున్నాను. 🙏🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹


15వ పాశురము - తిరుప్పావై భావార్థ గీత మాలిక / 15th Pasuram - Tiruppavai Bhavartha Gita



https://youtube.com/shorts/ETxpHmDiYCw


🌹 15వ పాశురము - తిరుప్పావై భావార్థ గీత మాలిక - 15th Pasuram - Tiruppavai Bhavartha Gita 🌹

🍀 15వ పాశురము - స్నేహ సంభాషణ – భజన పిలుపు గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 15వ పాశురంలో పదవ గోపికను మేల్కొల్పు తున్నారు. దీనితో భగవద్ ఆలయమునకు చేరుకొనుటకు అర్హత కలుగుతుంది. ఇంతవరకు భగవద్భక్తుల విషయమున ప్రవర్తింప వలసిన విధానములు చెప్పి, భగవత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరించారు గోదామాత. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹


వైకుంఠ ఏకాదశి హృదయపూర్వక శుభాకాంక్షలు Heartfelt wishes on Vaikuntha Ekadashi


🌹 మీ అందరికి వైకుంఠ ఏకాదశి హృదయపూర్వక శుభాకాంక్షలు 🌹
ప్రసాద్‌ భరధ్వాజ


🌹 Heartfelt wishes to all of you on Vaikuntha Ekadashi 🌹
Prasad Bharadwaj



https://www.facebook.com/reel/873725698394751


వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు Happy Vaikuntha Ekadashi


🕉 ఈ పండుగ మీ అందరికి సమస్త సుఖ సంతోషాలను ఆయురారోగ్యాలను కల్పించాలని కోరుతూ.. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 🕉

ప్రసాద్‌ భరధ్వాజ



🕉 Wishing that this festival brings you all immense happiness, prosperity, and good health... Happy Vaikuntha Ekadashi to everyone. 🕉

Prasad Bharadwaj

Vaikuntha Ekadashi వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 2025



🌹 సర్వవ్యాపి అయిన వాసుదేవుడికి నమస్కరిస్తూ.. మీకు ముక్తిని, శాంతిని, జ్ఞానాన్ని, దైవిక రక్షణను ప్రసాదించాలని కోరుకుంటూ.. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹 Offering salutations to the all-pervading Vasudeva... wishing that He bestows upon you liberation, peace, knowledge, and divine protection... Happy Vaikuntha Ekadashi to all 🌹

Prasad Bharadwaj


🍀 ముక్కోటి ఏకాదశి - ఉత్తర ద్వారాన వైకుంఠనాథుడు. వైకుంఠ ఏకాదశి విశిష్టత. 🍀

🍀 Mukkoti Ekadashi - Lord Vaikunthanatha at the Northern Gate. The significance of Vaikuntha Ekadashi. 🍀

🌻 వైకుంఠం అంటే కుంఠములు లేని ప్రదేశం అని అర్థం. అంటే ఆందోళనలు, ఆత్రుతలు, ఆరాటాలు లేని ప్రదేశం అన్నమాట. అదే విష్ణుధామం. పరంధామం. 🌻

🙏 విష్ణు ప్రార్ధన 🙏


సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యమ్ ఋత సత్య నేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రసన్నా

ధ్వాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితమ్

లోకనాధం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిమ్

పాతాంబరం నీలవర్ణం శ్రీ వత్సపద భూషితమ్

గోవిందం గోకులానందం బ్రహ్మేద్వైరభి పూజితమ్

ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహా విష్ణువు, కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొని, శ్రీదేవి - భూదేవి సమేతంగా ఈ ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగి వచ్చాడట.

అప్పుడు ముక్కోటి దేవతలు ఉత్తరద్వారం చెంత నిలిచి స్వామి దర్శనం చేసుకున్నారని, ఈ కారణంగానే దీనిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారని పెద్దలు చెబుతారు. ఈ రోజున స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించు కోవడం వలన మోక్షం లభిస్తుందని విశ్వాసం..

ఉత్తరాయన ప్రారంభదినం కావడం మూలాన ఇది అత్యంత విశిష్ఠమైనది. ముక్కోటి అంటే ముప్పది మూడు కోట్ల దేవతలని ఉద్దేశించింది. అప్పటి నుంచి మూసి ఉన్న స్వర్గ ద్వారాలు ఈ ధనుర్మాసారంభం నుంచి తెరుచుకుంటాయని పురాణ వచనం. ఈ ఏకాదశినాడు విష్ణుమూర్తి గరుడ వాహనారూఢుడై ఉత్తరద్వారాన దర్శనమిస్తాడట. ఆ దివ్యసుందర రూపుని దర్శించుకోవడం కోసం దేవతలందరూ ఈ రోజున దివినుంచి భువికి దిగి వస్తారట. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు.

మన ఆరునెలలు దేవతలకు పగలు, మరో ఆరునెలలు రాత్రి. దీని ప్రకారం దేవతలందరూ వైకుంఠ ఏకాదశినాడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే చీకటి రాత్రి నుంచి వెలుగులు చిమ్మే పగటిలోకి వచ్చారన్నమాట. స్వర్గద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది. అందుకే విష్ణ్వాలయాలలో ఇవాళ ఉత్తరం వైపున ఉన్న ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదం.

భౌతిక జగత్తుకు అతీతంగా ఉండే వైకుంఠ ధామం నుంచి శ్రీమహావిష్ణువు లోకంలోకి దిగి వస్తే, ఆ రూపాన్ని అవతారం అంటారు. ధర్మ సంస్థాపనార్థం, భక్తజన రక్షణార్థం ఆ దేవదేవుడు దిగి వస్తాడు..

🌿 అంతరార్థం 🌿

వైకుంఠ ఏకాదశి రోజున మనం గుడిలో 'ఉత్తర ద్వారం' నుండి వెళ్తాము. దీనికి ఒక అంతరార్థం ఉంది - ఉత్తరం అంటే ఏమిటి?: 'ఉత్' అంటే ఎత్తు, 'తర' అంటే మరీ ఎత్తు. మన శరీరంలో అన్నిటికంటే ఎత్తైన భాగం తల (శిరస్సు). ద్వారం అంటే ఏమిటి?: మన తల లోపల (బ్రహ్మరంధ్రం వద్ద) ఒక అదృశ్య ద్వారం ఉంది. సాధారణంగా గుడి తలుపులకు రెండు రెక్కలు ఉన్నట్టే, అక్కడ కూడా ఒక ద్వారం ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది.

గుడిలో ఉత్తర ద్వారం గుండా వెళ్లి దేవుడిని ఎలా చూస్తామో, అలాగే యోగసాధన ద్వారా మన శరీరంలోని 'ఉత్తర ద్వారం' (బ్రహ్మరంధ్రం) తెరుచుకున్నప్పుడు, మన లోపలే ఉన్న పరమాత్మను దర్శించుకోవచ్చు. ఈ గొప్ప విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడమే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి యొక్క అసలు ఉద్దేశం.

🙏 వైకుంఠ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువును వివిధ శ్లోకాలతో పూజిస్తే ఎంతో శుభప్రదం ! 🙏

దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాన్యతః కరే

చక్రమూర్ధ్వకరే వామం గదా తస్యాన్యతః కరే

దధానం సర్వలోకేశం సర్వాభరణ భూషితం

క్షీరాబ్ధిశయనం ధ్యాయేత్ నారాయణం ప్రభుమ్


ఓం శ్రీ తులసీ ధాత్రీ సమేత లక్ష్మీ నారాయణాయ కార్తీక దామోదరాయ నమః ధ్యాయామి

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

మీకు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹

తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 8 - పాశురాలు 15 & 16 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 8 - Pasuras 15 & 16



https://youtu.be/wQDTV2QbUEw


🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 8 - పాశురాలు 15 & 16 Tiruppavai Pasuras Bhavartha Gita Series 8 - Pasuras 15 & 16 🌹

🍀 15వ పాశురము - స్నేహ సంభాషణ – భజన పిలుపు గీతం, 16వ పాశురము - ద్వార పాలకుని ఆహ్వానం – దర్శన దీక్ష గీతం. 🍀

తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 15వ పాశురంలో పదవ గోపికను మేల్కొల్పు తున్నారు. దీనితో భగవద్ ఆలయమునకు చేరుకొనుటకు అర్హత కలుగుతుంది. ఇంతవరకు భగవద్భక్తుల విషయమున ప్రవర్తింప వలసిన విధానములు చెప్పి, భగవత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరించారు గోదామాత. 16వ పాశురంలో ఆనందముతో శ్రీ కృష్ణుని పొందే యోగ్యత కల గోపికలందరను మేలుకొని, కలిసి నంద గోప భవనమునకు వచ్చిరి. నందగోపుని భవన ద్వారమునకు వచ్చి ద్వార పాలకుని అర్ధించి లోనికి ప్రవేశించ చూస్తున్నారు. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


14వ పాశురము Part 2- తిరుప్పావై భావార్థ గీత మాలిక / 14th Pasuram Part 2 - Tiruppavai Bhavartha Gita



https://youtube.com/shorts/vb6TeJsyBo8


🌹 14వ పాశురము Part 2- తిరుప్పావై భావార్థ గీత మాలిక - 14th Pasuram Part 2 - Tiruppavai Bhavartha Gita 🌹

🍀 మాటల జ్ఞాపకం – కార్యోన్ముఖ గీతం 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

🍀 14వ పాశురం ద్వారా మాట నిలబెట్టుకోవడం, సత్యం పాటించడం ఎంత ముఖ్యమో ఆండాళ్ వివరిస్తుంది. భక్తికి మాట, చేత ఒకటేనని ఈ పాశురం ద్వారా తెలియజేస్తుంది. 🍀


Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹




14వ పాశురము Part 1- తిరుప్పావై భావార్థ గీత మాలిక / 14th Pasuram Part 1 - Tiruppavai Bhavartha Gita Malika



https://youtube.com/shorts/nV70cOgDX-M?fe

🌹 14వ పాశురము Part 1- తిరుప్పావై భావార్థ గీత మాలిక - 14th Pasuram Part 1 - Tiruppavai Bhavartha Gita Malika 🌹

🍀 మాటల జ్ఞాపకం – కార్యోన్ముఖ గీతం 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

🍀 14వ పాశురం ద్వారా మాట నిలబెట్టుకోవడం, సత్యం పాటించడం ఎంత ముఖ్యమో ఆండాళ్ వివరిస్తుంది. భక్తికి మాట, చేత ఒకటేనని ఈ పాశురం ద్వారా తెలియజేస్తుంది. 🍀


Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹

శ్రీ పంచవక్త్ర మహాకైలాస మూర్తి ధ్యానం — ఐశ్వర్యం, సుఖశాంతుల కోసం / Meditation on Sri Panchavaktra Mahakailasa Murti




🌹 🔱 శ్రీ పంచవక్త్ర మహాకైలాస మూర్తి ధ్యానం సంపూర్ణ శివానుగ్రహం — ఐశ్వర్యం, సుఖశాంతుల కోసం 🔱 🌹

శుభ సోమవారం అందరికి

ప్రసాద్‌ భరధ్వాజ


🌹 🔱 Meditation on Sri Panchavaktra Mahakailasa Murti for complete divine grace of Lord Shiva — for prosperity, happiness and peace 🔱 🌹

Happy Monday to all

Prasad Bharadwaj




ధ్యాన శ్లోకము

ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరి నిభం చారుచంద్రావతంసం
రత్నాకల్పోజ్జ్వలాంగం పరశుమృగ వరాభీతి హస్తం ప్రసన్నం।

పద్మాసీనం సమంతాత్ స్తుత మమరగణైః వ్యాఘ్రచర్మాంబరం
విశ్వాద్యం విశ్వబీజం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం॥


స్ఫటికమువంటి నిర్మలమైన వర్ణం కలిగినవాడు, ఐదు ముఖాలతో — ప్రతి ముఖంలో మూడు నేత్రాలతో (మొత్తం 15 కళ్లతో), పది చేతులతో, చంద్రకళతో అలంకరించ బడిన కిరీటం ధరించి, రత్నభూషణాలతో మెరిసుతూ, అభయ వరద ముద్రలతో భక్తులను కాపాడుతూ, త్రిశూలం, పరశువు, ఖడ్గం, వజ్రం, అగ్ని, సర్పం, గంట, అంకుశం వంటి ఆయుధాలను ధరించి, సింహాసనంపై ప్రశాంతంగా ఆసీనుడై, దేవతలచే స్తుతింపబడే ఆ మహాసదాశివుని నేను సదా ధ్యానిస్తున్నాను.


🍀 పంచవక్త్ర మహాకైలాస మూర్తి — ఐదు ముఖాల అర్థం 🍀

దిక్కు - ముఖం - కృత్యం - అర్థం

ఊర్ధ్వం - ఈశానము - అనుగ్రహం మోక్షం, - కరుణ

తూర్పు - తత్పురుషం - తిరోధానం -మాయ, దాచుట

దక్షిణం - అఘోరం -సంహారం -లయం

పడమర - సద్యోజాతము - సృష్టి - సృష్టి శక్తి

ఉత్తరం - వామదేవుడు - స్థితి - రక్షణ, పోషణ




🌻 పంచవక్త్ర మహాకైలాస మూర్తి లక్షణాలు 🌻

పంచవక్త్రం — శివుని ఐదు కృత్యాలను ప్రతిబింబిస్తాయి.

త్రినేత్రములు — జ్ఞానం, కాల నియంత్రణ

దశభుజాలు — పది దిక్కులు, పది శక్తులు

స్ఫటిక వర్ణం — శుద్ధ జ్ఞాన స్వరూపం

సింహాసనం — స్థిరత్వం, అధికారం

చంద్రావతంసం — మనస్సుపై సంపూర్ణ నియంత్రణ, శాంత స్వభావం

వ్యాఘ్రచర్మాంబరం — వాసనలపై విజయం, వైరాగ్య బలం

పద్మాసనం — సమత్వం, ధ్యాన నిశ్చలత్వం

అభయ ముద్ర — భయ విమోచనం, ఆశ్రయ ప్రదానం

వరద ముద్ర — భక్తులకు కృపా ప్రసాదం

దేవగణ స్తుతి — పరమతత్త్వానికి లోకారాధన

విశ్వబీజం — సృష్టి, స్థితి, లయలకు మూలకారణం

పంచవక్త్ర మహాకైలాస మూర్తి అనేది రూపానికి పరిమితం కాని పరబ్రహ్మ తత్త్వం — భయం తొలగించే కరుణ, అజ్ఞానాన్ని దహించే జ్ఞానం, మోక్షానికి మార్గదర్శకుడు.


🙌 ధ్యాన ఫలితం 🙌


ఈ మహాకైలాస మూర్తిని నిత్యం ధ్యానం చేస్తే— సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుంది. ఐశ్వర్యం, సుఖం మరియు శాంతి పెరుగుతాయి. పాపాలు నశిస్తాయి. మనస్సు ప్రశాంతం అవుతుంది. అంతరంగ శక్తి అభివృద్ధి చెందుతుంది.

🌹🌹🌹🌹🌹


13వ పాశురము Part 2- తిరుప్పావై భావార్థ గీత మాలిక / 13th Pasuram Part 2 - Tiruppavai Bhavartha Gita



https://youtube.com/shorts/NGKzE5tRS8I


🌹 13వ పాశురము Part 2- తిరుప్పావై భావార్థ గీత మాలిక - 13th Pasuram Part 2 - Tiruppavai Bhavartha Gita 🌹

🍀 అవతార మహిమ – ప్రదోష శుద్ధి గీతం 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 13వ పాశురంలో అందమైన కళ్ళతో ఉండే గోపికను, నిద్రలో భగవంతునితో తన ఐక్యతను తలచుకుంటూ మోసపోకుండా, అవతార మహిమను గర్తించి, ప్రదోష శుద్ధి కొరకు మేల్కొని అందరితో కలిసి నోము చేయమని కోరడం ముఖ్య అంశం. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹

13వ పాశురము Part 1- తిరుప్పావై భావార్థ గీత మాలిక / 13th Pasuram Part 1 - Tiruppavai Bhavartha Gita



https://youtube.com/shorts/RENUP-Roc14

🌹 13వ పాశురము Part 1- తిరుప్పావై భావార్థ గీత మాలిక - 13th Pasuram Part 1 - Tiruppavai Bhavartha Gita 🌹

🍀 అవతార మహిమ – ప్రదోష శుద్ధి గీతం 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 13వ పాశురంలో అందమైన కళ్ళతో ఉండే గోపికను, నిద్రలో భగవంతునితో తన ఐక్యతను తలచుకుంటూ మోసపోకుండా, అవతార మహిమను గర్తించి, ప్రదోష శుద్ధి కొరకు మేల్కొని అందరితో కలిసి నోము చేయమని కోరడం ముఖ్య అంశం. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹

సర్ప దోషం నివారణకు తప్పక దర్శించాల్సిన 5 అద్భుత ఆలయాలు Temples to alleviate Sarpa Dosha (serpent affliction)


🌹🐍 సర్ప దోషం నివారణకు తప్పక దర్శించాల్సిన 5 అద్భుత ఆలయాలు 🐍🌹
ప్రసాద్‌ భరధ్వాజ

🌹🐍 5 amazing temples that must be visited to alleviate Sarpa Dosha (serpent affliction) 🐍🌹
Prasad Bharadwaj


1. శ్రీ కాళహస్తీశ్వర టెంపుల్ ఆలయం, ఆంధ్రప్రదేశ్: ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. సర్ప దోషంలో కీలకమైన రాహు, కేతువుల సంబంధానికి ప్రసిద్ధి చెందింది. కాల సర్ప దోషం యొక్క ప్రభావాలను తగ్గించడానికి ఇక్కడ రాహు-కేతు సర్ప దోష నివారణ పూజ నిర్వహిస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాళహస్తిలో ఉంది.

2. కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం, కర్ణాటక: ఈ ఆలయం కార్తికేయ అవతారమైన సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడింది. అతను పాములతో దగ్గరి సంబంధం కలిగి ఉంటాడు. సర్ప సంస్కార ఆచారంతో సహా సర్ప దోష నివారణలకు ఇది ఒక ప్రసిద్ధ గమ్యస్థానం. సర్ప దోష దుష్ప్రభావాల నుండి రక్షణ పొందడానికి భక్తులు పూజలు, ఆచారాలు నిర్వహిస్తారు. ఇది కర్ణాటకలోని సుబ్రమణ్య అనే గ్రామంలో ఉంది.

3. మహాకాళేశ్వర ఆలయం, ఉజ్జయిని: ఇది మరొక జ్యోతిర్లింగ ఆలయం. కాల సర్ప దోషలను దోషాలను తగ్గించడానికి పూజలు నిర్వహించడానికి ఇది ఒక శక్తివంతమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని ఉంది.

4. ఓంకారేశ్వర్ ఆలయం, మధ్యప్రదేశ్: నర్మదా నదిలోని ఒక ద్వీపంలో ఉన్న ఈ ఆలయం శివుడితో కూడా ముడిపడి ఉంది. కాల సర్ప దోష నివారణ పూజలు నిర్వహించడానికి ఇది ఒక ప్రసిద్ధ ఎంపిక. ఇది మధ్యప్రదేశ్‎లోని మాంధాత గ్రామంలో ఉంది.

5. త్రయంబకేశ్వర్ ఆలయం, మహారాష్ట్ర: కాల సర్ప దోష నివారణలకు ఇది అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. ఇది శివుడికి అంకితం చేయబడిన పురాతన ఆలయం. సర్ప దోష పూజను జ్ఞానవంతులైన గురువుల సహాయంతో ఇక్కడ నిర్వహిస్తారు. ఇది మహారాష్ట్రలో నాసిక్‎లో ఉంది.

🌹🌹🌹🌹🌹

తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 7 - పాశురాలు 13 & 14 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 7 - Pasuras 13 & 14


https://youtu.be/J304yKSXVyE

🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 7 - పాశురాలు 13 & 14 Tiruppavai Pasuras Bhavartha Gita Series 7 - Pasuras 13 & 14 🌹

🍀 13వ పాశురము - అవతార మహిమ – ప్రదోష శుద్ధి గీతం, 14వ పాశురము - మాటల జ్ఞాపకం – కార్యోన్ముఖ గీతం 🍀

తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 13వ పాశురంలో అందమైన కళ్ళతో ఉండే గోపికను, నిద్రలో భగవంతునితో తన ఐక్యతను తలచుకుంటూ మోసపోకుండా, అవతార మహిమను గర్తించి, ప్రదోష శుద్ధి కొరకు మేల్కొని అందరితో కలిసి నోము చేయమని కోరడం ముఖ్య అంశం. 14వ పాశురం ద్వారా మాట నిలబెట్టుకోవడం, సత్యం పాటించడం ఎంత ముఖ్యమో ఆండాళ్ వివరిస్తుంది. భక్తికి మాట, చేత ఒకటేనని ఈ పాశురం ద్వారా తెలియజేస్తుంది. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

12వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 12th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita



https://youtube.com/shorts/ZpJnQiHFveE


🌹 12వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 12th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita 🌹

🍀 గోసంపద సేవా మహిమ – వ్రత పిలుపు గీతం 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 ఈ 12వ పాశురం ద్వారా గోదాదేవి గోసేవా మహిమను, భగవంతుని సేవ యొక్క ప్రాముఖ్యతను, లోక బాధ్యతల కంటే భగవద్భక్తి ముఖ్యం అని, అజ్ఞానాన్ని వదిలి భగవంతునిపై భక్తితో మేల్కొని, అతనిని కీర్తించమని, నిత్యమైన ఆనందాన్ని పొందమని ప్రోత్సహిస్తుంది. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹


వెంకటేశ్వర స్వామి చుట్టూ ప్రదక్షిణలు Circumambulations around Lord Venkateswara


🌹 ఇక్కడ చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామికి, 7 వారాలు ఏడేసి సార్లు చొప్పున ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Devotees believe that performing circumambulations around Lord Venkateswara, who is in the form of sandalwood paste here, seven times a day for seven weeks will fulfill their wishes. 🌹

Prasad Bharadwaj


అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి.. ఆత్రేయపురం మండలంలో అదో కుగ్రామం. జనాభా కూడా 4000 మాత్రమే. అయితే ఆ ఊరి పేరు నేడు ఖండాంతరాలు దాటిపోతు వెలిగిపోతుంది.

ఎందుకంటే అక్కడ చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారు వెలిచి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ఉన్నారు. భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని చూపిస్తూ ప్రతిరోజు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించు కునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గోదావరి తీరప్రాంత నడుమ వాడపల్లి వెంకన్న భక్తులకు కటాక్షంగా మారాడు.. కోరిన కోరికలు తీర్చే చందన స్వరూపుడు వెంకన్నకు భక్తుల తాకిడి అమాంతం పెరుగుతోంది.

ఎక్కడా లేని విధంగా వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఎర్రచందనపు చెక్కతో చేతిలో గదను ధరించి ప్రత్యేకంగా ఉంటారు. రెండు దశాబ్దాల క్రితం ఏడాదికి ఒక్కసారే వాడపల్లి తీర్థం పేరున చుట్టుపక్కల గ్రామాల భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుండేవారు. నేడు స్వామి వారి మహిమాన్వితుడుగా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఉండటంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఒక్క శనివారమే 50 వేల నుంచి 70 వేల వరకు భక్తులు వస్తుండగా మిగతా రోజుల్లో 20వేలకు తగ్గకుండా స్వామివారి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు… ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతున్నాయని భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.

🌹🌹🌹🌹🌹

ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం విశిష్టత - Vaikunta Ekadashi Significance



https://youtu.be/p7XiTMQ-kCg


🌹 ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం విశిష్టత Vaikunta Ekadashi Significance వైకుంఠ ఏకాదశి 2025 తేదీ, తిథి, ఏమి చేయాలి? 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


🍀 విష్ణు పురాణం ప్రకారం.. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువుకి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆ ఇంట్లో సిరిసంపదలు నెలకొంటాయని, మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. అలాగే విష్ణు భక్తికి ప్రతీక జాగారం అని చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజు రాత్రి శ్రీమన్నారాయణ నామ సంకీర్తనలతో, భజనలతో, భాగవత కథలతో కాలక్షేపం చేస్తూ జాగరణ చేయడం వల్ల మోక్షం పొందవచ్చు అని శాస్త్రం చెబుతోంది. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


11వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 11th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita



https://youtube.com/shorts/yDrvIrMJ9vg

🌹 11వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 11th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita 🌹

🍀 గుణగణాల మెచ్చికతో మేల్కొలుపు గీతం 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 ఈ 11వ పాశురం ద్వారా ఆండాళ్, గోపికల చెలికత్తెను నిద్ర లేపుతూ, ఇంటికి ఐశ్వర్యాన్ని, పేరును నిలబెట్టే ఇల్లాలువి అంటూ, సోమరితనాన్ని విడనాడి, కుటుంబ బాధ్యతలను, భగవత్సేవను స్వీకరించాలని మహిళలకు పిలుపునిస్తుంది. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹



'సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే గౌరి' - Gauri Mata Prayer - 'Sarva mangala Mangalye'



https://youtube.com/shorts/6Kikab4LBIU


🌹 సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే గౌరి Gouri Mata Prayer - Sarva mangala Mangalye 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share


🌹🌹🌹🌹🌹


కలియుగంలో భగవన్నామ స్మరణమే మోక్షసాధనం / In the Kali Yuga, chanting the name of God is the means to salvation


🌹 కలియుగంలో భగవన్నామ స్మరణమే మోక్షసాధనం. భక్తి తత్త్వమే తరుణోపాయం. - నారద మహర్షి 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 In the Kali Yuga, chanting the name of God is the means to salvation. Devotion is the only way to liberation. - Sage Narada 🌹
Prasad Bhardwaj



నారద మహర్షి భూలోక పర్యటన చేస్తూ, చాలా పుణ్యక్షేత్రాలు సందర్శించి, యమునా తీరంలో సంచరిస్తున్న సమయంలో, కొంచెం దూరంలో ఒక యువతి ఖిన్నురాలై, దు:ఖిస్తూ కూర్చుంది. ఆమె ముందు ఇద్దరు వ్యక్తులు, చాలా నీరసంతో, అచేతనంగా పడి ఉన్నారు. ఆ యువతి వారికి సేవ చేస్తూ కూర్చొని, మేలుకొలపడానికి ప్రయత్నం చేస్తోంది. ఎవరైనా వచ్చి రక్షిస్తారేమోనని నాలుగు దిక్కులా చూస్తోంది. ఆ యువతి చుట్టూ కొంతమంది స్త్రీలు వింజామరలు వీస్తూ, ఆమెకు సేవ చేస్తున్నారు.

నారద మహర్షి చూసి, కుతూహలంతో, ఆమెను సమీపించి, "దేవీ! నువ్వు ఎవరివి? ఎందుకు దు:ఖిస్తూ ఉన్నావు? ఆ పడిపోయిన ముసలి వాళ్ళు ఎవరు? నీకు చుట్టూ ఉండి నీకు సేవ చేస్తున్న వీళ్ళు ఎవరు? అని అడగ్గానే, ఆ యువతి "మహాత్మా! మీరైనా నా బాధ తొలగించండి. తమరి దర్శనంవల్ల సమస్త పాపములు పటాపంచలై పోయాయి.

మహర్షీ! నా పేరు 'భక్తి'. ఈ ఇరువురు నా కుమారులు. వారి పేర్లు జ్ఞానము, వైరాగ్యము. కలి ప్రభావంతో వీరి అంగాలు శిథిలమయ్యాయి. నా చుట్టూ ఉన్న నన్ను సేవిస్తున్న వారు గంగ, యమున, తపతి, సరస్వతి మున్నగు పవిత్ర నదులే. స్త్రీ రూపంలో నన్ను ఆరాధిస్తున్నారు. సాక్షాత్తు దేవతలచే ఆరాధింపబడుతున్నా కూడా, నాకు సుఖ సంతోషాలు కరువైపోయాయి. నన్ను గౌరవించే వారే కరువై పోయారు.

తపోధనా! కలియుగ ప్రభావం వల్ల పాషాండులు నా అంగములన్నింటినీ భంగపరిచారు. అందువల్ల, నేను, నా కుమారులు తేజో విహీనులమై పోయాం. అచేతనత్త్వంతో అల్లాడుతున్నాము. వీరిద్దరి పరిస్థితి చూస్తే నా మనస్సు వికలమైపోతోంది. దు:ఖంతో విలవిలలాడుతున్నాము." అని చెప్పగానే, నారద మహర్షి, "సాధ్వీ! నా జ్ఞానదృష్టిచే నీ దు:ఖానికి గల కారణం పరిశీలించి చెపుతాను. నీకు మేలు చేకూరుతుంది." అని చెప్పి కొద్ది క్షణాలు ధ్యానంలో ఉండి, ఆమె బాధకు కారణం తెలుసుకొని, "దేవీ ! ఇది కలియుగం. అతి భయంకరమైనది.

సదాచారాలు లోపించాయి. ధర్మం లేదు. ప్రజలు మూఢులై, అజ్ఞానంతో, వంచకులై, దుష్కర్మలు చేస్తూన్నారు. కేవలం ధనార్జన పట్ల మమకారంతో జీవిస్తున్నారు. తమ జీవన విధానానికి ముఖ్యమైన భగవంతుని మర్చిపోతున్నారు. బాలా! నీ దు:ఖం దూరం కాగలదు. శ్రీ కృష్ణ భగవానుడు ఏనాడు ఈ భూలోకాన్ని వదిలి తన పరంథామానికి వెళ్ళాడో, ఆ నాటి నుండే కలి ప్రభావం చూపుతోంది. ఈ కలియుగంలో తపస్సు, యోగము చేత లభించని ఫలం కూడా శ్రీమన్నారాయణ కీర్తనము చేతనే సంపూర్ణంగా లభిస్తుంది.

సత్యయుగము, త్రేతాయుగం, ద్వాపర యుగములలో జ్ఞానము, వైరాగ్యం ముక్తికి సాధనాలై ఉన్నాయి. కానీ కలియుగంలో కేవలం "భక్తి"యే బ్రహ్మ సాయుజ్యము పొందుటకు ఏకైక మార్గం."

సుముఖీ! కలియుగంలో ప్రతీ ఇంటిలో, ప్రతీ వ్యక్తి యొక్క హృదయంలో నిన్ను నేను ప్రతిష్ఠించెదను. ధర్మములన్నటిని త్రోసిరాజని భక్తి దేవికి పట్టం కట్టేటట్లు, మహోత్సవ సంబరాల తీరుగా ప్రచారం చేస్తాను. అలా చేయని పక్షంలో నేను శ్రీ నారాయణ దాసుడును కానేకాదు. కాబట్టి నిన్ను ఆసరా చేసుకుని జీవించడం ఆవశక్యమై ఉంటుంది.

భగవన్నామస్మరణ చేయగానే నీ ద్వారానే ప్రజలు అదే భక్తులు శ్రీ కృష్ణ పరంథామం చేరుకొంటారు. భక్తి శ్రద్ధలతో ఉరకలు వేస్తూ ఆ శ్రీకృష్ణుని తలపోస్తూ ఉంటారు. భగవంతుడు దేనివల్ల వశుడు కాడు. కేవలం ఒక భక్తి అంటే నీ ద్వారానే వశుడు కాగలడు అని ప్రజల్లో భక్తిని కలిగించే మార్గాలు విశదీకరించాడు. అలా నారదుని మాటలు వినేసరికి ఆమెలో చైతన్యం వచ్చింది. కానీ కుమారులైన జ్ఞానము, వైరాగ్యం కదలక ఉంటే, నారదమహర్షి వారి చెవిలో భగవన్నామస్మరణ చేయగానే చైతన్యవంతులయ్యారు. ఇలా కలియుగంలో మనం ఎంతోకొంత భక్తి తత్త్వాన్ని కలిగి ఉన్నామంటే, మహాత్ములే కారణం. భగవన్నామ స్మరణ మాత్రమే ఈ యుగంలో మోక్షసాధనం.

🌹 🌹 🌹 🌹 🌹

తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 6 - పాశురాలు 11 & 12 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 6 - Pasuras 11 & 12



https://youtu.be/820TU-pI5jY


🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 6 - పాశురాలు 11 & 12 Tiruppavai Pasuras Bhavartha Gita Series 6 - Pasuras 11 & 12 🌹

🍀 11వ పాశురము - గుణగణాల మెచ్చికతో మేల్కొలుపు గీతం, 12వ పాశురం - గోసంపద సేవా మహిమ – వ్రత పిలుపు గీతం 🍀

తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 11వ పాశురంలో ఈ పాశురం ద్వారా ఆండాళ్, గోపికల చెలికత్తెను నిద్ర లేపుతూ, ఇంటికి ఐశ్వర్యాన్ని, పేరును నిలబెట్టే ఇల్లాలువి అంటూ, సోమరితనాన్ని విడనాడి, కుటుంబ బాధ్యతలను, భగవత్సేవను స్వీకరించాలని మహిళలకు పిలుపునిస్తుంది. 12వ పాశురం ద్వారా గోదాదేవి గోసేవా మహిమను, భగవంతుని సేవ యొక్క ప్రాముఖ్యతను, లోక బాధ్యతల కంటే భగవద్భక్తి ముఖ్యం అని, అజ్ఞానాన్ని వదిలి భగవంతునిపై భక్తితో మేల్కొని, అతనిని కీర్తించమని, నిత్యమైన ఆనందాన్ని పొందమని ప్రోత్సహిస్తుంది. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹



Christ Consciousness

 


10వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 10th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita


https://youtube.com/shorts/5r6v9HLDZKU


🌹 10వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 10th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita 🌹

🍀 10వ పాశురం – యోగనిద్రపై మధుర చమత్కార గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 ఈ 10వ పాశురంలో గోదాదేవి, కృష్ణుడిని పొందాలనే తన కోరికను, తోటి గోపికల ఆలస్యంతో విసుగు చెంది, తనను నిందించిన ఒక గోపికను మేల్కొన లేదేమని ప్రశ్నిస్తూ, అనుమానం వ్యక్తం చేస్తూ, పూజ పూర్తయి, యోగనిద్రను పొందావా అంటూ చతురతతో ఉత్తేజ పరిచే ప్రయత్నంగా కొనసాగుతుంది. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹


భగవద్గీత మత గ్రంథం కాదు.. యోగ గ్రంథం - వేదాంత గ్రంథం / The Bhagavad Gita is not a religious text; it is a text on yoga and Vedanta philosophy.



🌹 భగవద్గీత మత గ్రంథం కాదు.. యోగ గ్రంథం - వేదాంత గ్రంథం - మద్రాస్ హైకోర్టు 🌹

📚 ప్రసాద్ భరద్వాజ

భగవద్గీత , వేదాంతం, యోగాలను కేవలం ఒక మతానికి మాత్రమే పరిమితం చేయలేమని మద్రాస్ హైకోర్టు ఆసక్తికరమైన వార్తలు చేసింది.


భగవద్గీత, వేదాంతం, యోగా వంటి అంశాలను బోధించడం వల్ల ఒక సంస్థను.. మతపరమైన సంస్థగా ముద్ర వేయలేమని స్పష్టం చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) కింద ఒక ట్రస్ట్ దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో.. జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఈ కీలక తీర్పును వెలువరించారు. భగవద్గీత మతాలకు అతీతమైనదని.. భారతీయ సంస్కృతికి చిహ్నమని ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు పేర్కొంది.

కోయంబత్తూరుకు చెందిన అర్ష విద్యా పరంపర ట్రస్ట్.. వేదాంతం, సంస్కృతం, హఠయోగం వంటి అంశాలను బోధిస్తూ ప్రాచీన గ్రంథాల డిజిటలైజేషన్ పనులను నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ విదేశీ నిధులను పొందేందుకు 2021లో ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ దరఖాస్తును తిరస్కరిస్తూ.. ట్రస్ట్ కార్యకలాపాలు మతపరమైనవిగా కనిపిస్తున్నాయని.. ముందస్తు అనుమతి లేకుండా రూ. 9 లక్షల విదేశీ విరాళాలను పొందిందనే.. రెండు ప్రధాన కారణాలను చూపింది.

ఈ కేసును విచారించిన జస్టిస్ స్వామినాథన్.. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలను తప్పుపట్టింది. భగవద్గీత కేవలం ఒక మతానికి పరిమితమైనది కాదని.. అది ఒక మోరల్ సైన్స్ అని. భారతీయ నాగరికతలో ఒక భాగమని పేర్కొంది. అంతేకాకుండా యోగాను మతపరమైన కోణంలో చూడటం అమానుషమని వ్యాఖ్యానించింది. యోగా అనేది విశ్వవ్యాప్తమైనదని.. అలాగే వేదాంతం మన పూర్వీకులు అందించిన స్వచ్ఛమైన తత్వశాస్త్రమని తెలిపింది.

ఎఫ్‌సీఆర్ఏ చట్టం ప్రకారం ఒక సంస్థ మతపరమైనదా కాదా అని నిర్ణయించేటప్పుడు అధికారుల వద్ద కచ్చితమైన ఆధారాలు ఉండాలని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. కేవలం అలా కనిపిస్తోంది అనే అనుమానంతో దరఖాస్తును తిరస్కరించడం సరికాదని పేర్కొంది. 2021లో చేసుకున్న దరఖాస్తుపై 2024 అక్టోబర్‌లో చర్యలు తీసుకోవడం భావ్యం కాదని.. త్వరితగతిన, పారదర్శకంగా వ్యవహరించడం సుపరిపాలనలో ప్రాథమిక సూత్రమని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తుచేసింది.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తిరస్కరణ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. గతంలో జరిగిన నిబంధనల ఉల్లంఘనకు (రూ. 9 లక్షల విరాళం) సంబంధించి ట్రస్ట్ ఇప్పటికే జరిమానా కట్టి రాజీ పడినందున.. దాన్ని మళ్లీ కారణంగా చూపలేమని హైకోర్టు పేర్కొంది. ఈ దరఖాస్తును మళ్లీ కొత్తగా పరిశీలించి.. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆధ్యాత్మికత, మతం ఒకటి కాదని.. భారతీయ మూలాలను మతపరమైన కోణంలో మాత్రమే చూడటం సరికాదని ఈ తీర్పు ద్వారా కోర్టు స్పష్టం చేసింది. ఇది సాంప్రదాయ విద్య, యోగాను ప్రచారం చేసే అనేక సంస్థలకు ఊరటనిచ్చే అంశం.

🌹🌹🌹🌹🌹

నరనారాయణ అవతారాలు - బదరీనాథుని ఆవిర్భావం - బదరీనాథ్ క్షేత్రం. Nara-Narayana Incarnations - The Manifestation of Badrinath - The Badrinath Shrine.


🌹 నరనారాయణ అవతారాలు - బదరీనాథుని ఆవిర్భావం - బదరీనాథ్ క్షేత్రం పురాణగాధ. ఊర్వశి జననం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


బ్రహ్మ మానస పుత్రుడైన ధర్ముడికి దక్ష ప్రజాపతి తన పది మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేశాడు. ధర్మానికి అధిష్టాన దేవత అయిన ధర్ముడు తపస్సు చేసి విష్ణుమూర్తి అనుగ్రహం సంపాదించాడు. మహావిష్ణువు వరం కోరుకోమనగా శ్రీహరిని పుత్రుడిగా కావాలని కోరుకున్నాడు.తగిన సమయంలో జన్మిస్తాను అని వరమిచ్చి విష్ణువు అంతర్ధానమయ్యాడు.

కొంతకాలానికి ధర్ముడికి విష్ణువు "నరుడు నారాయణుడు" అనే నామాలతో ఇద్దరు కుమారులుగా జన్మించాడు. ధర్మదేవత ధర్ముడి పుత్రులైన నరనారాయణులు వేద విద్యలతో పాటు అధర్వణ వేదంలోని యుద్ద విద్యలు అభ్యసించారు. బ్రహ్మదేవుడు నరుడికి 'అజగవము' అనే ధనుస్సు, నారాయణుడికి 'శార్ఞగము"అనే ధనుస్సు అక్షయ తూణీరాలతో ప్రసాదించాడు.

నరనారాయణులు తపోదీక్ష స్వీకరించి హిమాలయాలలోని బదరికావనానికి వెళ్లి తపస్సు చేయసాగారు. బదరికా వృక్షములతో నిండి ఉండటం చేత ఆ వనానికి బదరికావనం అని పేరు వచ్చింది. బదరికాశ్రమం ఏర్పరచుకుని నరనారాయణులు లోకంలో ధర్మ సంస్థాపనకై చేస్తున్న తపస్సుకి వేయి సంవత్సరాలు గడిచాయి.

హిరణ్యకశిప సంహారం తరువాత రాజైన ప్రహ్లాదునికి చ్యవన మహర్షి ద్వారా సంవత్సరాల తరబడి ధర్మ సంస్థాపనకై తపస్సు చేస్తున్న మహర్షులు ఉండే ప్రదేశాలైన నైమిశారణ్యం, బదరికా వనం గురించి విన్నాడు. యజ్ఞ యాగాదులతో, నిరంతర తపస్సులతో తపోభూములుగా ప్రసిద్ధి కెక్కిన రెండు పుణ్యస్థలాలను దర్శించాలని బయలుదేరాడు.

మొదట నైమిశారణ్యం చేరిన ప్రహ్లాదుడు అక్కడి మహర్షులను దర్శించి ఆశీస్సులు పొందాడు. వారి ద్వారా నరనారాయణుల గురించి విని బదరికావనం బయలుదేరి వెళ్లాడు. బదరికాశ్రమంలో నిశ్చల ధ్యానంలో ఉన్న నరనారాయణులను దర్శించాడు. నారవస్త్రాలు ధరించి కృష్ణాజినాలపై తపస్సులో ఉన్న నర నారాయణుల ముందు ధనుస్సులు, అక్షయ తూణీరాలు (బాణాలు) ఉండటం గమనించి విస్మయం చెందాడు.

తపస్సు చేసేవారి వద్ద ఆయుధాలు ఉండటం ధర్మవిరుద్ధం అని భావించి ప్రహ్లాదుడు వారితో మీరు బ్రహ్మ వంశస్థులు, బ్రాహ్మణులైన మీరు మీ వర్ణాచారం ప్రకారం తపస్సు చేయాలి. మరి ఈ ధనుస్సులు బాణాలు ఎందుకు చేపట్టారు? ధర్మదేవత ధర్ముడి పుత్రులైన మీరు అధర్మంగా ఆయుధాలు చేపట్టడం తప్పు. ధర్మదేవత పుత్రులే అధర్ములైతే నేను సహించను. మీరు ఆయుధాలను తక్షణం వదిలేయండి" అని హెచ్చరించాడు.

నరుడు నవ్వి "ప్రహ్లాద మహారాజా! ధర్మ పరిరక్షణ కూడా బ్రాహ్మణుల విధ్యుక్త ధర్మంలో భాగము అని మీకు తెలియదా! వేదశాస్త్రాలతో పాటు యుద్దవిద్యలు మీవంటి వారికి నేర్పించేది మేమే అని మరచి పోయారు. సమస్త విద్యలకు ఆచార్యులమైన మేము తపస్సు చేయడానికి, ధనుస్సు ధరించడానికి అర్హులం, సమర్ధులం. అనవసర ప్రసంగం మాని మీరు మీ దారిన వెళ్ళండి" అని అన్నాడు.

మహావిష్ణువు ప్రియ భక్తుడైన ప్రహ్లాదునికి నరుడు చులకనకి ఆగ్రహం వచ్చింది. "మీరు మా తోటి యుద్దం చేయగల సమర్థులా? రండి!తేల్చుకుందాం" అని వారితో యుద్దానికి దిగాడు. సరేనని నరనారాయణులు ధనుస్సులు ధరించి యుద్దానికి దిగారు.

ప్రహ్లాదుడు, నరనారాయణుల మధ్య భీకర ధనుర్యుద్ధం మొదలైంది. బాణాలు శరపరంపరలుగా కురిశాయి. ఆకాశం బాణాలతో కమ్ముకుపోయింది. నారాయ ణుని ప్రియభక్తునికి, నారాయణుని అంశావతారాలైన నరనారాయణులకు నూరు సంవత్సరాలు యుద్దం జరిగింది. ప్రశాంత వాతావరణం కలిగిన బదరికావనం ధనుష్టంకార ధ్వనులతో, బాణాల శబ్దాలతో దద్దరిల్లి పోయింది.

తాపసులందరు యుద్దం ఆపేలా చేయమని వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుని ప్రార్ధించారు. మొరలాలకించిన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, ప్రహ్లాదుని చూసి "ప్రహ్లాదా! నరనారాయణులు నా అంశావతారులుగా జన్మించారు. జితేంద్రియులైన వీరు భవిష్యత్తులో ధర్మ సంస్థాపన కోసం జన్మించబోయే అవతార మూర్తులుగా ఉండటానికి ఈ జన్మలో ధనుర్విద్యలు అభ్యసించి ధనుర్భాణాలు ధరించారు. ఈ జన్మ లో తపస్సుతో, వచ్చే జన్మలో శస్త్రాస్త్రాలతో ధర్మ ప్రతిష్టాపన చేస్తారు కనుక నా అవతార మూర్తులతో యుద్దం తక్షణం విరమించి నీ రాజ్యానికి వెళ్లుము" అని ప్రబోధించాడు.

ప్రహ్లాదుడు నారాయణునితో పాటు నరనారాయణులకు నమ స్కరించి తన రాజ్యానికి వెళ్లి పోయాడు. నరనారాయణులు శ్రీమహావిష్ణువుకి నమస్కరించి "శ్రీమన్నారాయణా! నీవు "బదరీనాథుడు" గా ఇక్కడ స్వయంభువు మూర్తిరూపంలో వెలసి భక్తులకు నీ సుందర విగ్రహ దర్శనం కలిగించుము" అని ప్రార్ధించారు.

శ్రీహరి వారి ప్రార్థనకి సంతోషించి "నేను బదరీనాథుడిగా స్వయంభువునై ఇక్కడ అవతరిస్తాను. మీరు మీ జన్మాంతమున నాకు ఇరు వైపులా నర-నారాయణ పర్వతములుగా వెలసి నన్ను దర్శించే భక్తులను రక్షిస్తుంటారు. కలియుగాంతం వరకు ఈ ప్రదేశం బదరీనాథ్ క్షేత్రంగా ప్రసిద్ధి చెంది ఉంటుంది" అని వరమిచ్చి వెలిసాడు.

కొంతకాలానికి నరనారాయణులు దేహం వదలి నారాయణునిలో లీనమై పోయారు. వారి దేహాలు పర్వతాలుగా మారి బదరీనాథునికి ఇరువైపులా నర-నారాయణ గిరులుగా ప్రసిద్ధి చెందాయి. బదరీనాథుడు రెండు పర్వతాల మధ్య ఉన్నత ప్రదేశంలో ఉండి భక్తులకు దర్శన భాగ్యం ఇస్తున్నాడు.

🌹🌹🌹🌹🌹

9వ పాశురము part 2- తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 9th Pasuram Part 2 - Tiruppavai Pasuras Bhavartha Gita


https://youtube.com/shorts/hKbE8lbv-vQ


🌹 9వ పాశురము part 2- తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 9th Pasuram Part 2 - Tiruppavai Pasuras Bhavartha Gita 🌹

🍀 9వ పాశురం – స్నేహపూర్వక మేల్కొలుపు గీతం - part 2 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 9వ పాశురం ముఖ్య ఉద్దేశం, శ్రీకృష్ణుడి సుప్రభాత సేవకు, గోపికలను, వారి తల్లిదండ్రులను మేల్కొల్పడం. ఈ పాశురంలో ఆండాళ్ భగవంతుడితో ఉన్న అనుబంధాన్ని, భక్తిని వివరిస్తుంది. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹

9వ పాశురము part 1- తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 9th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita Series



https://youtube.com/shorts/wll2NJjHows


🌹 9వ పాశురము part 1- తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 9th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita Series 🌹

🍀 9వ పాశురం – స్నేహపూర్వక మేల్కొలుపు గీతం - part 1🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

🍀 9వ పాశురం ముఖ్య ఉద్దేశం, శ్రీకృష్ణుడి సుప్రభాత సేవకు, గోపికలను, వారి తల్లిదండ్రులను మేల్కొల్పడం. ఈ పాశురంలో ఆండాళ్ భగవంతుడితో ఉన్న అనుబంధాన్ని, భక్తిని వివరిస్తుంది. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹


మనిషి జీవిత ఐదు దశలను సూచించే అయ్యప్పస్వామి పంచ స్వరూపాలు Pancha Swarupa of Ayyappaswamy


🌹 మనిషి జీవిత ఐదు దశలను సూచించే అయ్యప్పస్వామి పంచ స్వరూపాలు 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

🌹 Pancha Swarupa of Ayyappaswamy representing the five stages of human life 🌹
Prasad Bharadwaja



శ్రితజనప్రియం స్వామి చించితప్రదం

శ్రుతి విభూషణం స్వామి సాధుజీవనం

శ్రుతి మనోహరం స్వామి గీతలాలసం

హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే


మనిషి జీవితాన్ని ఐదు దశలుగా మన పెద్దలు చెబుతుంటారు. ఈ ఐదు దశలకు ప్రాతినిధ్యం వహించే విధంగా అయ్యప్ప అవతారాలున్నాయి. ఆయన కేరళలో ఐదు చోట్ల ఈ ఐదు రూపాలలో దర్శనమిస్తున్నారు.


1. బాల్యం – కుళత్తుపుళా

2. యవ్వనం – ఆరియంగావు

3. గృహస్థాశ్రమం – అచ్చన్ కోవిల్

4. వానప్రస్థం – శబరిమల

5. ఏకాంతం – కాంతి మలై


1. కుళత్తుపుళా

పూర్వం కొట్టార్కర అనే ప్రాంతాన్ని పరిపాలించిన రాజు, ప్రస్తుతం మనకు కనబడుతున్న ఆలయాన్ని నిర్మించాడు. ఆయన వేటకోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు వచ్చిన వంటవాళ్ళు, మూడు రాళ్ళతో పొయ్యని పెట్టారట. అందులో ఒక రాయి కాస్త పెద్దదిగా ఉండడంతో, దాన్ని సరిగ్గా పెట్టేందుకు వాళ్ళు రకరకాలుగా ప్రయత్నించారు. కానీ, వారి వల్ల కాలేదు. సరే ఈ రాయిని పగుల గొడదామనుకొని, ఆ రాయిపై ఇంకొక రాయి వేసి కొట్టారు. కానీ పోయ్యకోసం వీళ్ళనుకున్న రాయి పగులకపోగా, వీళ్ళు తీసి కొట్టిన రాయి పగిలింది. అంతకంటే ఆశ్చర్యం. ఆ రాయి నుంచి రక్తం కారడం. వెంటనే ఈ విషయాన్నీ రాజుకు చెప్పగా రాజు వేద పండితులను, నంబూద్రిలను పిలిపించారు. విరుగగొట్టింది అయ్యప్ప విగ్రహం అని వారు చెప్పడంతో, జరిగిన అపరాధానికి మన్నించమని అయ్యప్పను వేడుకున్న రాజు, వెంటనే ఆ ప్రాంతంలో ఓ గుడిని కట్టించాడు. ఆ ప్రాంతమే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న కుళత్తుపుళా.

ఇక్కడ అయ్యప్ప బాలకునిగా వెలసినప్పటికి, ఎనిమిది ముక్కలుగా చేయబడ్డ ఆ రాళ్ళను గర్భ గృహంలో నేటికి చూడొచ్చు. పూజ చేసేటప్పుడు ఒక్కటిగా చేర్చబడే ఆ రాళ్ళు, పూజానంతరం దూరంగా జరుపబడు తుంటాయి. ఈ ఆచారం నేటికి కొనసాగుతోంది.

ఈ ఆలయంలో మకర విళక్కు, విషు పండుగలు గొప్పగా జరుపబడతాయి. కుళత్తుపుళా తిరువనంతపురం నుండి సుమారు 45 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఆలయానికి విరివిగా భక్తులు వస్తుంటారు.


2. అరియంగావు

బ్రహ్మచారి అయిన అయ్యప్పకు కల్యాణోత్సవం జరిగే ఒకే ఒక పుణ్యస్థలం అరియంగావు. ఇందుకొక కారణం ఉంది. ఈ ఆలయంలో అయ్యప్ప గృహస్థాశ్రమంలో వెలసి ఉన్నాడు. అయ్యప్ప పుష్పకళాదేవిని పరిణయమాడాడు. అయితే, ఘోటక బ్రహ్మచారి అయిన అయ్యప్పకు పెళ్ళెప్పుడు జరిగిందనే సందేహం కలుగుతుంది కదూ!

యోగనిష్ఠలో ఉన్న అవతారంలో ఆయనకు వివాహం జరగలేదు. శాస్తాకు మరొక అవతారంలో వివాహం జరిగిందట. ఈ కధనం ప్రకారం, ఓ సౌరాష్ట్రీయుడు పట్టు వస్త్రాలను నేసి, ట్రావెన్ కూర్ మహారాజుకు సమర్పించి, ఆయన నుంచి కానుకలను పుచ్చుకుంటుండేవాడు. అలా ఒకసారి ఆ వ్యాపారి తన కూతురు పుష్పకళని కూడా పిలుచుకొని వెళుతుండగా, ఆరియంగావు వచ్చేసరికి చీకటి పడింది. దాంతో వారు అక్కడున్న ఆలయంలో తలదాచుకున్నారు. మరునాడు ట్రావెన్ కూర్ బయలుదేరిన తండ్రితో పుష్పకళ, తనకు స్వామిని వదిలి కదలబుద్ధి కావడం లేదని, అందుకని తండ్రిని ట్రావెన్ కోర్ వెళ్ళి రమ్మని, ఆయన తిరిగి వచ్చేదాకా తను దేవాలయంలోనే ఉంటానని చెప్పింది. మరుమాట్లాడలేని ఆ వ్యాపారి ఆలయ మేల్ శాంతి (అర్చకుడు) దగ్గర పుష్పకళను వదలి రాజు దగ్గరకు బయలుదేరాడు. అలా వెళ్తున్నపుడు ఆ వ్యాపారి ఓ మదపుటేనుగు బారిన పడగా, ఓ యువకుడు అతడిని కాపాడతాడు. మెరుపులా దూసుకొచ్చి తన ప్రాణాలు కాపాడిన ఆ యువకునుకి, తన దగ్గరున్న పట్టువస్త్రంతో అలంకరించిన ఆ వ్యాపారి, ఏం కావాలో కోరుకోమ్మంటాడు. అప్పుడా యువకుడు నీ కూతురిని నాకిచ్చి పెళ్ళి చేయమని చెప్పి, అరియంగావు గుడిలో తనను కలుసుకోమని వెళ్ళిపోతాడు.

అరియంగావు గుడికి వచ్చిన ఆ వ్యాపారికి, ఎంత వెదికినా తన కూతురు కనబడదు. మేల్ శాంతి దగ్గర ఆరా తీస్తే, ఆమె స్వామిలో ఐక్యమైనట్లు చెబుతాడు. ఆ తెల్లవారుఝామున ఆలయ ద్వారాలు తెరచి, లోపలకి వెళ్ళిన పూజారి, వ్యాపారులకు ఆశ్చర్యం! అడవిలో తను ఇచ్చిన శాలువాతో ప్రత్యక్షమైన స్వామిని చూసి అ స్వామికి సాష్టాంగ పడతాడు. ఈ ఆలయములో స్వామివారి శ్రీకల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ ఊరికి తిరువనంతపురం నుంచి విరివిగా బస్సు సౌకర్యాలున్నాయి.


3. అచ్చన్ కోవిల్

శబరిమలలో వలె ఈ ఆలయానికి పద్దెనిమిది మెట్లున్నాయి. పూర్ణ, పుష్కళలతో అయ్యప్ప దర్శన మిస్తుంటాడు. ఈ ఆలయములో ప్రత్యేకత బంగారపు కత్తి. ఇది సాక్షాత్ దేవతలు భూమికి తీసుకువచ్చిన కత్తి అని చెప్పబడుతుంది.

మిగతా రెండు దశలకు శబరిమల, కాంతిమలై ప్రాతినిథ్యం వహిస్తున్నాయి.

🌹🌹🌹🌹🌹


తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 5 - పాశురాలు 9 & 10 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 5 - Pasuras 9 & 10



https://youtu.be/gkHMozj0JrQ


🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 5 - పాశురాలు 9 & 10 Tiruppavai Pasuras Bhavartha Gita Series 5 - Pasuras 9 & 10 🌹

🍀 9వ పాశురం – స్నేహపూర్వక మేల్కొలుపు గీతం, 10వ పాశురం – యోగనిద్రపై మధుర చమత్కార గీతం. 🍀

తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 9వ పాశురం ముఖ్య ఉద్దేశం, శ్రీకృష్ణుడి సుప్రభాత సేవకు, గోపికలను, వారి తల్లిదండ్రులను మేల్కొల్పడం. ఈ పాశురంలో ఆండాళ్ భగవంతుడితో ఉన్న అనుబంధాన్ని, భక్తిని వివరిస్తుంది. 10వ పాశురంలో గోదాదేవి, కృష్ణుడిని పొందాలనే తన కోరికను, తోటి గోపికల ఆలస్యంతో విసుగు చెంది, తనను నిందించిన ఒక గోపికను మేల్కొన లేదేమని ప్రశ్నిస్తూ, చతురతతో ఉత్తేజ పరిచే ప్రయత్నంగా కొనసాగుతుంది. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


8వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 8th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita Series



https://youtube.com/shorts/Nk1q0LPSEMU


🌹 8వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 8th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita Series 🌹

🍀 8వ పాశురం – ఉషోదయ జాగరణ గీతం 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 తిరుప్పావై ఎనిమిదవ పాశురంలో మనం అందరం కలిసి వెళ్ళడం వల్ల కృష్ణుడి అనుగ్రహం త్వరగా లభిస్తుందని, సమూహంగా వెళ్లి భగవంతుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలను, మరియు భక్తిలో ఐకమత్యం యొక్క ప్రాముఖ్యతను గోదాదేవి నొక్కి చెబుతుంది. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹


హనుమంతుడు సతీసమేతంగా Lord Hanuman with his consort



🌹 హనుమంతుడు సతీసమేతంగా ఉన్న ఆలయం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉందో తెలుసా? దాని స్థల పురాణం.🌹

శుభ మంగళవారం అందరికి

ప్రసాద్ భరద్వాజ




🌹 Do you know where the temple with Lord Hanuman along with his consort is located in the Telugu states? Its local legend. 🌹

Happy Tuesday to everyone

Prasad Bharadwaj




శ్రీరాముడి వీరభక్తుడు అయినా హనుమాన్ దేవాలయం ప్రతి గ్రామంలో తప్పనిసరిగా కనిపిస్తుంది. ధైర్యశాలి, దుష్టశక్తులను పారద్రోలే ఆంజనేయస్వామి అంటే చాలామందికి ఇష్టమే.

అందుకే ప్రతిరోజు ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే పనులు ప్రారంభించే వారు చాలామంది ఉన్నారు. అయితే ఏ దేవాలయంలోనైనా హనుమాన్ ఒక్కడే కనిపిస్తాడు. శివుడు, విష్ణువులు సతీసమేతంగా దర్శనం ఇవ్వగా.. హనుమాన్ మాత్రం ఒకరే దేవాలయంలో కొలువై ఉంటారు. అందుకే ఆ స్వామిని ఆజన్మ బ్రహ్మచారి అని అంటారు. అయితే హనుమాన్ బ్రహ్మచారి కాదు అని ఆ స్వామివారికి వివాహం జరిగిందని కొన్ని పురాణాల ప్రకారం తెలుస్తోంది. అంతేకాకుండా సతీ సమేతంగా హనుమాన్ ఓ ఆలయంలో కొలువై యున్నాడు.

హనుమంతుడు పక్కనే ఉంటే ధైర్యం మన చెంత ఉన్నట్లే. స్వయం శక్తితో శత్రువులను నాశనం చేసే బలశాలి అయినా ఆంజనేయ స్వామికి గురువు సూర్యుడు అన్న విషయం చాలామందికి తెలిసిందే. అయితే హనుమంతుడు ఆకాశంలో తిరుగుతూ సూర్యుడి వద్ద వేదాలన్నింటినీ నేర్చుకుంటాడు. తొమ్మిది రకాల వ్యాకరణాలను నేర్చుకోవాలన్న హనుమంతుడి కోరిక ఎనిమిది పూర్తి అయిన తర్వాత ఒక సంకటం వద్ద ఆగిపోతుంది. తొమ్మిదో వ్యాకరణం పూర్తి చేయాలంటే వివాహితుడై ఉండాలి. కానీ ఆంజనేయ స్వామి మాత్రం బ్రహ్మచారిగానే ఉండిపోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో త్రిమూర్తులు సూర్యభగవానుడికి ఒక మార్గం చెబుతారు.

త్రిమూర్తుల ఆలోచన మేరకు సూర్యుడు తన కిరణాల నుంచి సువర్చల అనే అమ్మాయిని సృష్టిస్తాడు. ఈ అమ్మాయిని హనుమంతుడు పెళ్లి చేసుకుంటాడు. వీరి వివాహం జేష్ట శుద్ధ దశమి రోజు జరిగినట్లు పరాశర సంహితలో తెలుపుతున్నాయి. అయితే ఈ అమ్మాయికి భౌతిక రూపం ఉండదు. కేవలం తేజస్సు మాత్రమే ఉంటుంది. అందుకే ఆంజనేయస్వామి ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉండిపోతాడు. సువర్చలను పెళ్లి చేసుకున్న తర్వాత హనుమంతుడు తొమ్మిదో వ్యాకరణం పూర్తిచేసి తపస్సుకు వెళ్లిపోతాడు. అయితే హనుమంతుడు సతీసమేతుడు అయినందున కొన్ని ఆలయాల్లో ఆంజనేయస్వామి కళ్యాణం జరిపిస్తారు.

హనుమంతుడు సతీసమేతంగా దర్శనం ఇచ్చే ఆలయం తెలంగాణలో ఒకటి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శ్రీ సువర్చల సహిత అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమంతుడు సతీసమేతంగా దర్శనం ఇస్తాడు. ఈ ఆలయాన్ని 2006 సంవత్సరంలో నిర్మించారు. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల వారు మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య తగాదాలు ఎక్కువగా ఉంటే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే పరిష్కారం అవుతుందని కొందరు నమ్ముతారు.

🌹🌹🌹🌹🌹

7వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 7th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita Series

https://youtube.com/shorts/PB747fTHCfU


🌹 7వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 7th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita Series 🌹

🍀 7వ పాశురం – భక్తి పూజకు సిద్ధమైన వైనం 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 ఈ పాశురంలో గోదాదేవి తన చెలికత్తెను మేల్కొలుపుతూ, భగవంతుని కీర్తించే సమయం ఆసన్నమైందని, త్వరగా లేచి రమ్మని పిలుస్తుంది. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹

“ఓం ప్రభవే నమః” – సర్వసృష్టికి మూలమైన శివతత్త్వానికి అర్పించే మహత్తర ప్రణామం - శివతత్త్వ మహిమ “Om Prabhavaaya Namaha” – A salutation to the Shiva principle



🌹 “ఓం ప్రభవే నమః” – సర్వసృష్టికి మూలమైన శివతత్త్వానికి అర్పించే మహత్తర ప్రణామం - శివతత్త్వ మహిమ 🌹

🍀 శుభ సోమవారం అందరికి 🍀
✍️ ప్రసాద్ భరద్వాజ



భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో శివుడు కేవలం ఒక దేవతగా మాత్రమే భావించబడలేదు. ఆయన సృష్టి అంతటినీ ఆవరిస్తూ, సృష్టి–స్థితి–లయ అనే త్రిముఖ కార్యాలను అంతర్లీనంగా నడిపించే పరమ సత్యంగా దర్శించ బడతాడు. శివతత్త్వం అనేది రూపం కంటే ముందున్న సారాంశం, ఆరంభానికి ముందున్న ఆది కారణం. అందుకే వేదాలు, ఉపనిషత్తులు, ఆగమాలు శివుణ్ణి “అనాదిః, అనంతః” అని కీర్తించాయి. ఈ మహత్తర తత్త్వాన్ని సంక్షిప్తంగా కానీ అత్యంత లోతుగా వ్యక్తపరచే నామమే “ఓం ప్రభవే నమః”

“ప్రభవుడు” అనే పదం ఉద్భవానికి మూలమైన వాడని అర్థాన్ని ఇస్తుంది. సృష్టి ఆరంభానికి ముందే ఉన్న చైతన్యశక్తి, కాలం–దేశం–కారణాలకు అతీతంగా నిలిచిన పరమాత్మ తత్త్వమే ప్రభవుడు. “ఓం ప్రభవే నమః” అని జపించడం అంటే, ఆ సర్వసృష్టికి మూలమైన పరమశక్తికి వినయపూర్వకంగా శరణాగతి చేయడం. ఈ నామం మనకు శివుడు ఒక వ్యక్తిగత దేవుడిగా మాత్రమే కాదు, విశ్వమంతటా వ్యాపించిన చైతన్యంగా ఉన్నాడని గుర్తు చేస్తుంది.

శివుడు సృష్టి, స్థితి, లయ అనే మూడు మహాశక్తులకు ఆధారభూతుడు. బ్రహ్మ సృష్టి చేస్తాడని, విష్ణువు పరిపాలిస్తాడని, రుద్రుడు లయ చేస్తాడని పురాణాలు చెబుతాయి. అయితే ఈ మూడు కార్యాల వెనుక పనిచేసే అంతర్ముఖ శక్తి శివతత్త్వమే. అందుకే ఆయనను “సర్వాధిపతి”, “మహేశ్వరుడు” అని పిలుస్తారు. విశ్వంలో కనిపించే ప్రతి కదలిక, ప్రతి పరిణామం ఆయన సంకల్పానికి ప్రతిబింబం. శాస్త్రాలు “ఆజ్ఞ లేకుండా అణువు కూడా కదలదు” అని చెప్పడం ద్వారా, శివుని సర్వనియంత్రణ శక్తిని స్పష్టంగా తెలియజేస్తాయి. కాలాన్ని సృష్టించిన వాడే కాలాన్ని నియంత్రించ గలడు కాబట్టి, శివుడు కాలాతీతుడు, సర్వకాలికుడు.

అంతటి మహిమ కలిగిన శివుడు, అదే సమయంలో అపారమైన కరుణకు నిలయము. అధికారమున్న చోట కఠినత్వం ఉంటుందని మనం భావించినా, శివుని విషయంలో అది పూర్తిగా విరుద్ధం. ఆయన భోళాశంకరుడు – సులభంగా ప్రసన్నుడయ్యే వాడు. భక్తి, విశ్వాసం, శరణాగతితో తనను చేరిన వారిని ఆయన ఎప్పుడూ నిరాశపరచడు. భక్త మార్కండేయుడిని మృత్యువు నుండి రక్షించిన ఘట్టం, గజాసురుడికి మోక్షాన్ని ప్రసాదించిన సంఘటన, కిరాతార్జునీయంలో అర్జునుడికి అనుగ్రహం – ఇవన్నీ శివుని కరుణకు నిలువెత్తు సాక్ష్యాలు.

శివుడు భక్తులకు కేవలం భౌతిక వరాలు మాత్రమే ఇవ్వడు. ఆయన అనుగ్రహం ప్రధానంగా అంతరంగిక మార్పును కలిగిస్తుంది. మనసులో ఉన్న అజ్ఞానం, భయం, అహంకారం, అస్థిరతలను క్రమంగా కరిగించి, శాంతి మరియు స్పష్టతను ప్రసాదిస్తాడు. అందుకే శివభక్తిని ఒక సాధారణ పూజా విధానంగా కాకుండా, జీవన మార్గాన్ని శుద్ధి చేసే సాధనగా భావిస్తారు. శివారాధన అంటే మన అంతరంగంలో ఉన్న మలినాలను విడిచిపెట్టి, శుద్ధ చైతన్యాన్ని అనుభవించే ప్రయాణం.

“ఓం ప్రభవే నమః” అనే నామం ఓంకారంతో ప్రారంభమవడం కూడా అత్యంత విశేషం. ఓంకారం సృష్టి యొక్క నాదరూపం. అదే మొదటి ధ్వని, అదే సమస్త మంత్రాలకు మూలం. ఆ ఓంకారానికి “ప్రభవుడు” అనే భావం జతకలిసినప్పుడు, అది సృష్టికి మూలమైన శక్తిని స్మరింపజేసే మహామంత్రంగా మారుతుంది. ఈ నామస్మరణ మనలో నిద్రించిన శక్తిని మేల్కొలిపి, కొత్త ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.

నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలు, అనిశ్చితులు, మానసిక ఒత్తిళ్లు మనల్ని కుంగదీసినప్పుడు, “ఓం ప్రభవే నమః” అనే జపం ఒక అంతర్గత ఆధారంగా నిలుస్తుంది. ఈ నామాన్ని భక్తితో జపించే వారికి శివుడు అంతరాత్మగా మార్గదర్శిగా నిలిచి, సరైన దిశను చూపుతాడని విశ్వాసం. శివుడు నిరాకారుడు అయినా, భక్తుల హృదయాల్లో సగుణరూపంగా నివసిస్తాడు. ఆయనను మనం ఎంత సాదాసీదాగా పిలిస్తే, అంత సులభంగా అనుభూతి చెందవచ్చు.

అందుకే “ఓం ప్రభవే నమః” అనేది కేవలం ఒక మంత్రం కాదు – అది శివతత్త్వానికి అర్పించే మహత్తర ప్రణామం. ఈ నామస్మరణ ద్వారా శివుని ఆది శక్తిని గుర్తు చేసుకుంటూ, మన జీవితాన్ని శాంతి, శక్తి, జ్ఞానం, వైర్యంతో నింపుకోవచ్చు. శివతత్త్వాన్ని అర్థం చేసుకోవడం అంటే, మనలోని పరమసత్యాన్ని తెలుసుకోవడం. ఆ మార్గంలో మనకు దివ్య దీపంలా వెలిగే నామమే – “ఓం ప్రభవే నమః”.

🌹 🌹 🌹 🌹 🌹

తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 4 - పాశురాలు 7&8 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 4 - Pasuras 7&8



https://youtu.be/E7vQ53MC3QA


🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 4 - పాశురాలు 7&8 Tiruppavai Pasuras Bhavartha Gita Series 4 - Pasuras 7&8 🌹

🍀 7వ పాశురం – భక్తి పూజకు సిద్ధమైన వైనం, 8వ పాశురం – ఉషోదయ జాగరణ గీతం 🍀


రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 ఏడవ పాశురంలో గోదాదేవి తన చెలికత్తెను మేల్కొలుపుతూ, భగవంతుని కీర్తించే సమయం ఆసన్నమైందని, త్వరగా లేచి రమ్మని పిలుస్తుంది. తిరుప్పావై ఎనిమిదవ పాశురంలో మనం అందరం కలిసి వెళ్ళడం వల్ల కృష్ణుడి అనుగ్రహం త్వరగా లభిస్తుందని, సమూహంగా వెళ్లి భగవంతుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలను, మరియు భక్తిలో ఐకమత్యం యొక్క ప్రాముఖ్యతను గోదాదేవి నొక్కి చెబుతుంది. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹



ఉర్సిద్ ఉల్కాపాతం - ఈ రోజు రేపు 21, 22 ఆకాశంలో జరిగే అద్భుతం Ursid Meteor Shower In Sky



https://youtube.com/shorts/z3_PGj_raqc


🌹 ఉర్సిద్ ఉల్కాపాతం - ఈ రోజు రేపు 21, 22 ఆకాశంలో జరిగే అద్భుతం
URSID METEOR SHOWER IN SKY 🌹



ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹



ప్రపంచ చీరల దినోత్సవం / World Saree Day

 








ప్రపంచ ధ్యాన దినోత్సవం శుభాకాంక్షలు Happy World Meditation Day


🌹 ప్రపంచ ధ్యాన దినోత్సవం శుభాకాంక్షలు అందరికి Happy World Meditation Day to All🌹

పనిచేయడం, విశ్రాంతి తీసుకోవడం జీవితంలో అత్యంత ప్రధాన విషయాలు. ఈ రెండింటి మధ్య సమతుల్యంతో నిలబడడమే ధ్యానం అంటే. ఆ ధ్యాన స్థితి పరమోతృష్ట జ్ఞానానికి పునాదే కాదు, అత్యున్నత గమ్యం కూడా.

ప్రసాద్ భరద్వాజ


సూర్యగాయత్రి - ఓం భాస్కరాయ విద్మహే - శుభ ఆదివారం. Surya Gayatri Om Bhaskaraya Vudmahe - Happy Sunday


https://youtube.com/shorts/rzw-xm1tsJg


🌹 సూర్యగాయత్రి - ఓం భాస్కరాయ విద్మహే - శుభ ఆదివారం. Surya Gayatri Om Bhaskaraya Vudmahe - Happy Sunday 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


6వ పాశురము - తిరుప్పావై భావార్థ గీత మాలిక 3 / 6th Pasura Tiruppavai Bhavartha Gita Series 3


https://youtube.com/shorts/BvPT_wYipbc


🌹 6వ పాశురము - తిరుప్పావై భావార్థ గీత మాలిక 3 - 6th Pasura Tiruppavai Bhavartha Gita Series 3 🌹

🍀 6వ పాశురం – ఆత్మజాగరణ గీతం 🍀

తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 6వ పాశురంలో గోదాదేవి ప్రకృతిలోని శబ్దాలు, యోగుల స్మరణల ద్వారా కృష్ణుని లీలలను గుర్తు చేస్తూ, తోటి గోపికను మేల్కొలపడం, భగవత్ సేవకు ప్రేరేపించడం ముఖ్య ఉద్దేశ్యంగా సాగుతుంది. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

ధనుర్మాసం విశిష్టత / The significance of Dhanurmasam



🌹 ధనుర్మాసం విశిష్టత - దైవ ఆశీస్సులను పొందడానికి చేసే భక్తి సాధనలకు ఉత్తమ సమయం. లౌకిక శుభకార్యాలకు విరామం. 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 The significance of Dhanurmasam - It is the best time for devotional practices to receive divine blessings. A period of pause for worldly auspicious events. 🌹

Prasad Bhardwaj



కాలచక్రంలో పంటలు పండించే భూమికి కూడా రుతువుల మార్పులో కొంతకాలం విశ్రాంతి అవసరమైనట్టే.. గ్రహగతుల రీత్యా శుభకార్యాలకు కాస్త విరామం ఇవ్వాల్సిన సమయం ఉంటుంది. ఉత్తరాదిన దీన్ని ఖర్మాస్ అని పిలిస్తే... తెలుగు నాట ‘ధనుర్మాసం’ అంటారు. ధనుర్మాసం దైవారాధనకు ఇది అత్యంత పవిత్రమైన సమయమే అయినా, శుభకార్యాలకు మాత్రం నిషిద్ధం.

ధనుర్మాసం 2025 డిసెంబర్ 16న ప్రారంభమైంది. హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుభకార్యాలకు విరామం ఇచ్చే కాలాన్ని సూచిస్తుంది. సూర్యదేవుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుందని జ్యోతిష్య నమ్మకం. ఈ కాలంలో సూర్యుని ప్రభావం తగ్గుతుందని విశ్వసిస్తారు. అందుకే ప్రధాన వేడుకలు, నూతన ప్రారంభాలను ఈ సమయంలో వాయిదా వేస్తుంటారు.

సూర్యుడు ప్రతి ఏటా రెండుసార్లు ధనస్సు లేదా మీన రాశులలోకి ప్రవేశించినప్పుడు ఈ కాలం వస్తుంది. ఈ రెండు రాశులకు అధిపతి గురుడు (బృహస్పతి). ఈ సమయంలో సూర్యుడు గురుగ్రహ ప్రభావంతో విశ్రాంతి తీసుకుంటాడని గ్రంథాలు, జ్యోతిష్య సంప్రదాయాలు చెబుతున్నాయి. ఈ మాసంలో శుభకార్యాలు చేయకూడదు. ఆధ్యాత్మిక సాధనలు, దానధర్మాలకు ఈ కాలం ఎంతో అనుకూలమైనది.

గ్రహ దోషాలను తగ్గించి, దైవ ఆశీస్సులను పొందడానికి ఈ సమయం ఉత్తమమని నమ్ముతారు. ముఖ్యంగా సూర్యదేవుడు, బృహస్పతి అనుగ్రహం కోసం చేసే పూజలు విశేష ఫలితాలనిస్తాయి. జ్యోతిష్యుల ప్రకారం డిసెంబర్ 16న తెల్లవారుజామున 4:26 గంటలకు సూర్యదేవుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమైంది. సూర్యుడు ఈ రాశిలో 2026 జనవరి 14 వరకు ఉంటాడు. ఆ తర్వాత మకర రాశిలోకి మారతాడు. ఈ మార్పుతో మకర సంక్రాంతి రోజున ధనుర్మాసం ముగుస్తుంది. అప్పటి నుంచి శుభకార్యాలకు అనుకూల ముహూర్తాలు తిరిగి వస్తాయి.

ధనుర్మాసం సమయంలో కొన్ని ప్రధాన శుభకార్యాలు, ప్రారంభోత్సవాలకు దూరంగా ఉండాలని సూచిస్తారు. వీటిలో వివాహాలు, నిశ్చితార్థాలు, పిల్లల నామకరణం, శిరోముండనం, ఉపనయనం వంటి సంస్కారాలు కూడా ఈ కాలంలో చేపట్టడం మంచిది కాదని చెబుతారు. కొత్త ఇల్లు కట్టుకోవడం లేదా గృహప్రవేశం చేయడం, కొత్త వ్యాపారం లేదా భాగస్వామ్యాన్ని ప్రారంభించడం, ఆస్తి కొనుగోళ్లు, వాహనాలు కొనడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం వంటివి కూడా ఈ కాలంలో నివారించాలి. ధనుర్మాసం సమయంలో ఇలాంటి కార్యకలాపాలను ప్రారంభించడం ఆలస్యాలకు, ఆటంకాలకు లేదా ప్రతికూల ఫలితాలకు దారితీస్తుందని జ్యోతిష్య నమ్మకం.

భౌతిక కార్యకలాపాలకు పరిమితులు ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక వృద్ధికి, దోష నివారణలకు ధనుర్మాసం చాలా ప్రయోజనకరమైన సమయం. ప్రతిరోజూ ఉదయం రాగిపాత్రలో నీరు, కుంకుమ, ఎర్రటి పువ్వులు, బియ్యం కలిపి సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వడం శ్రేష్ఠం. అలాగే, మంత్ర పఠనం, ధ్యానం, తపస్సు, దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.

వీలైతే గంగానదిలో లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది. ఆవులు, బ్రాహ్మణులు, పేదల సేవలో పాల్గొనడం శ్రేష్ఠం. ఈ కాలంలో కనీసం ఒకసారైనా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోయి, దైవ ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.

పండుగలకు అశుభకరమైనదిగా భావించినా, ధనుర్మాసం ఆధ్యాత్మికంగా శక్తివంతమైన సమయం. ఈ కాలంలో నిష్ఠతో కూడిన భక్తి, దానధర్మాలు, క్రమశిక్షణ దీర్ఘకాలిక శాంతి, స్థిరత్వం, సానుకూల మార్పులను తెస్తాయని జ్యోతిష్యులు పేర్కొన్నారు. ధనుర్మాసంలో భక్తులు తమ లౌకిక ఆకాంక్షలను తగ్గించుకుని, అంతర్ముఖులై విశ్వాసం మరియు ఆధ్యాత్మిక సమతుల్యతను పెంపొందించుకోవాలి.

🌹🌹🌹🌹


5వ పాశురము Part 1 తిరుప్పావై భావార్థ గీత మాలిక 3 / 5th Pasura Part1 Tiruppavai Bhavartha Gita Series 3



https://youtube.com/shorts/J9QZvhNSPH4


🌹 5వ పాశురము Part 1 తిరుప్పావై భావార్థ గీత మాలిక 3 - 5th Pasura Part1 Tiruppavai Bhavartha Gita Series 3 🌹

🍀 5వ పాశురం – కృష్ణలీలా గానము 🍀

తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 5వ పాశురం కృష్ణుడి అద్భుతమైన శక్తులను, ఉత్తర మధురలో జన్మించిన తీరును, యమునా నది తీరంలో ఆడిన ఆటలను గుర్తుచేస్తూ, అతనిని మేల్కొలపమని, తమ పాపాలను తొలగించి రక్షించమని తోడి బాలికలతో గోదాదేవి అభ్యర్థన. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


నేటి నుంచే పుష్యమాసం.. శనీశ్వరుడికి ప్రీతికర మాసం పుష్యమాసం Pushya Masam, loved by Lord Shani, begins today...



🌹 నేటి నుంచే పుష్యమాసం.. శనీశ్వరుడికి ప్రీతికర మాసం పుష్యమాసం 🌹

ప్రసాద్ భరద్వాజ



పుష్య మాసం పుణ్య మాసం. ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసి ఉంటాడు, అందుకే దీనికి పుష్య మాసం అని పేరు వచ్చింది. అటు శనిదేవుడి జన్మనక్షత్రం కూడా పుష్యమే.. అందుకే ఈ మాసం శని దేవునికి ప్రీతికరమైనది. ఆయనను పూజిస్తే కష్ఠాలు తొలగి శుభాలు కలుగుతాయని నమ్మకం. విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజిస్తే సౌందర్యం, శివుడిని మారేడు దళాలతో అర్చిస్తే ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్ర వచనం. ఈ నెలలో చేసే గింజంత దానమైనా అనంత పుణ్య ఫలాన్ని ఇస్తుందని అంటారు. నదీ స్నానాలు సూర్యారాధనతో ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితుల వాక్కు.

శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి వెలిగించడం వల్ల వెలువడే సుగంధభరితమైన పొగ మానసిక ప్రశాంతతను ఇచ్చి, మనలోని సోమరితనాన్ని, ప్రతికూల ఆలోచనలను పారద్రోలుతుందని పండితులు చెబుతున్నారు. 'ఆధ్యాత్మికంగా చూస్తే.. ఈ ధూపం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి ఈతిబాధలు తొలగిపోతాయి. అలాగే సకల దేవతల అనుగ్రహం లభించి, కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి. మనసు ఉల్లాసంగా మారి పనుల పట్ల ఉత్సాహం పెరుగుతుంది' అంటున్నారు.

శీతాకాలంలో వచ్చే పుష్య మాసం జపతపాదులు, ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది, ఈ మాసంలో పితృదేవతలను పూజిస్తే దోషాలు తొలగిపోతాయి. "పుష్య" అనే మాటకు పోషణ, శక్తి కలిగినది అని అర్థం. దీనిని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ లలోకూడా అనుసరిస్తారు.

పుష్య మాసం ఆధ్యాత్మిక పరంగా విశిష్టమైనదే కానీ వివాహాలు, గృహప్రవేశం, నిశ్చితార్థాలు మొదలైన కొన్ని రకాల కార్యాలకు ఆశుభకరమైన మాసంగా జ్యోతిష శాస్త్రం పరిగణిస్తోంది. పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయమని పండితులు చెబుతున్నారు.

ఈ నెల రోజుల పాటు శనైశ్చరుణ్ని పూజించిన వారికి ఆయన మేలు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. జాతకంలో ఏలినాటి శని ఉన్న వారు ఈ మాసంలో రోజూ ఉదయానే కాలకృత్యాలు తీర్చుకొని శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్ధించాలి. పౌర్ణమి రోజున తెల్లవారు జామునే లేచి శనికి తైలాభిషేకం చేయించి నవ్వులు దానమివ్వాలి. ఆ రోజు నువ్వులు, బెల్లం ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

పుష్యమాసం మొదటి పక్షం రోజులు శ్రీ మహా విష్ణువుని తులసీ దళాలతో పూజిస్తే మానసిక ప్రశాంత లభిస్తుంది. పుష్య సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతో, ఆదివారం రోజున సూర్యుణ్ణి జిల్లేడు పూలతో పూజించడం శ్రేష్టం.

🌹 🌹 🌹 🌹 🌹

తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 3 - పాశురాలు 5&6 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 3 - Pasuras 5&6



https://youtu.be/IB-Akw9x5H4


🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 3 - పాశురాలు 5&6 Tiruppavai Pasuras Bhavartha Gita Series 3 - Pasuras 5&6 🌹

🍀 5వ పాశురం – కృష్ణలీలా గానము, 6వ పాశురం – ఆత్మజాగరణ గీతం 🍀

తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 పాశురాలు అంటే చందో బద్ధంగా ఉన్న పాటలు అని అర్థం. 5వ పాశురం కృష్ణుడి అద్భుతమైన శక్తులను, ఉత్తర మధురలో జన్మించిన తీరును, యమునా నది తీరంలో ఆడిన ఆటలను గుర్తుచేస్తూ, అతనిని మేల్కొలపమని, తమ పాపాలను తొలగించి రక్షించమని తోడి బాలికలతో గోదాదేవి అభ్యర్థన. 6వ పాశురంలో, ప్రకృతిలోని శబ్దాలు, యోగుల స్మరణల ద్వారా కృష్ణుని లీలలను గుర్తుచేస్తూ, తోటి గోపికను మేల్కొలపడం, భగవత్ సేవకు ప్రేరేపించడం ముఖ్య ఉద్దేశ్యంగా సాగుతుంది. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

ధనుర్మాసంలో ఇంటి ముందు వేసే ముగ్గులు, గొబ్బెమ్మల అంతరార్థం, ప్రయోజనాలు The Meaning & Benefits of Rangoli Designs & Gobbi Emblems during Dhanurmasam



🌹 ధనుర్మాసంలో ఇంటి ముందు వేసే ముగ్గులు, గొబ్బెమ్మల అంతరార్థం, ప్రయోజనాలు 🌹

ప్రసాద్ భరద్వాజ



ఉదయాన్నే చలిలో లేచి ముగ్గులు ఎందుకు వేయాలి? గొబ్బెమ్మలు ఎందుకు పెట్టాలి? ఇది కేవలం సాంప్రదాయమా, లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ధనుర్మాసంలో ముగ్గులు వేయడం వలన లభించే ‘ధనుర్వాయువు’ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఏకాగ్రత పెరుగుదల వంటి అనేక శాస్త్రీయ అంశాలు దీని వెనుక ఉన్నాయి. ధనుర్మాసం నెల రోజులు ముగ్గులు వేయడం ఆచారం. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే.

గోదాదేవి ఆరాధన: ధనుర్మాసంలో గోదాదేవి శ్రీమహావిష్ణువును పతిగా పొందాలని ‘తిరుప్పావై’ వ్రతాన్ని ఆచరించింది. ఆ సమయంలో స్వామి వారికి స్వాగతం పలకడానికి, మార్గాలను పవిత్రం చేయడానికి అందమైన ముగ్గులు వేసే వారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆరాధనా భావనతోనే భక్తులు ముగ్గులు వేస్తారు.

గొబ్బెమ్మల విశిష్టత : ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలను గోదాదేవి అంశగా, శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు. ఈ గొబ్బెమ్మలను పసుపు, కుంకుమలతో అలంకరించడం వల్ల సాక్షాత్తూ మహాలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించి, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం.

భూత దయ (జీవ కారుణ్యం): ముగ్గులను బియ్యపు పిండితో వేయడం వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం ఉంది. చీమలు, పక్షులు వంటి చిన్న జీవులకు ఆహారం అందించడం (భూత యజ్ఞం) ద్వారా పుణ్యం లభిస్తుందని మన పెద్దలు చెబుతారు. ఇది పర్యావరణ స్పృహను మరియు జీవ కారుణ్యాన్ని తెలియజేస్తుంది.

ధనుర్మాస ముగ్గులు కేవలం సంప్రదాయమే కాదు, దీని వెనుక కొన్ని ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ధనుర్వాయువు పీల్చడం: ధనుర్మాసంలో తెల్లవారుజామున వచ్చే గాలిని ‘ధనుర్వాయువు’ లేదా బ్రహ్మ ముహూర్తపు స్వచ్ఛమైన గాలి అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముగ్గులు వేయడానికి ఉదయాన్నే లేవడం వల్ల ఈ స్వచ్ఛమైన గాలి శరీరానికి తగిలి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఏకాగ్రత మరియు మెదడు పనితీరు: చుక్కల ముగ్గులు, గీతలతో కూడిన సంక్లిష్టమైన ముగ్గులు వేయడం వల్ల మెదడుకు పని లభిస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచి, మానసిక ప్రశాంతతను మరియు ఉల్లాసాన్ని ఇస్తుంది.

ఈ ముగ్గులు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, కుటుంబ క్షేమానికి, అభివృద్ధికి చిహ్నం. ఇంటి ముందర ముగ్గు ఉంటే ఆ ఇల్లు కళకళలాడుతూ, లక్ష్మీప్రదంగా ఉంటుందని నమ్మకం. నెగటివ్ ఎనర్జీ (ప్రతికూల శక్తి) లోపలికి రాకుండా ఈ ముగ్గులు అడ్డుకుంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముగ్గు శుభప్రదమైన ప్రారంభానికి సంకేతం.

🌹🌹🌹🌹🌹

అమ్మోరు తల్లి నీ కన్న పెద్ద తల్లి లోకాన ఏడుంది కరుణించి కాపాడవే Ammoru Thali Protect Us



https://youtube.com/shorts/qFt7GrPW0mk


🌹 అమ్మోరు తల్లి నీ కన్న పెద్ద తల్లి లోకాన ఏడుంది కరుణించి కాపాడవే AMMORU THALI PROTECT US 🌹


ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

4వ పాశురము Part 2 - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 4th Pasuram Part 2 - Tiruppavai Pasuras Bhavartha Gita Malika


https://youtube.com/shorts/vpYwvJqMExY


🌹 4వ పాశురము Part 2 - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 4th Pasuram Part 2 - Tiruppavai Pasuras Bhavartha Gita Malika 🌹

🍀 4వ పాశురం part 2 - కరుణా వర్ష ప్రార్థన గీతం 🍀

తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేది ధనుర్మాస వ్రతం. మనలో కోరిక అంటూ కల్గితే చాలు ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి. దేవతలంతా సహకరిస్తారు. ఈ 4వ పాశురంలో మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాళ్ తల్లి. ఈ దివ్య తత్వాన్ని నారాయణ ఆని అంటారు. ఈ తత్వాన్ని మనం ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు. 🍀

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

ఈ ఏడాదిలో ఆఖరి అమావాస్య నేడు.. ఇలా పూజిస్తే పితృదేవతలకు ఆత్మ శాంతి Today is the last new moon day of this year...


🌹 ఈ ఏడాదిలో ఆఖరి అమావాస్య నేడు.. ఇలా పూజిస్తే పితృదేవతలకు ఆత్మ శాంతి 🌹

ప్రసాద్ భరద్వాజ

సంవత్సరంలో ఆఖరి అమావాస్య నేడు. శుక్రవారం తెల్లవారుజామున 4.59గంటల నుంచి శనివారం ఉదయం 7.12 గంటల వరకూ అమావాస్య తిథి ఉన్నట్లు పండితులు తెలిపారు.

ఈ అమావాస్య రోజున పూర్వీకుల ఆత్మలకు శాంతి కలిగేలా పూజించడం ద్వారా ఎంతో పుణ్యం దక్కుతుందని చెప్తున్నారు. అంతేకాదు.. ఈ రోజున అనేక శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి. శూలయోగం ఉదయం 3.47 గంటలకు ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ నక్షత్రం కూడా ఈ రోజుత సమానంగా ఉండటంతో పాటు.. సూర్యుడు, కుజుడు కూడా కలిసి ఉండనున్నారు. ద్రిక్ పంచాంగం.. అమావాస్య రోజున నదీస్నానం చేసి దాన ధర్మాలు చేయడం వల్ల పూర్వీకులు ఆనందిస్తారని చెప్తోంది. ఉదయం 5.19 గంటల నుంచి 6.14 గంటల్లోగా నదీస్నానం చేసి, దానం చేసేందుకు శుభసమయంగా ఉంది. జాతకంలో కాలసర్పదోష నివారణకు సైతం అమావాస్య రోజున ప్రత్యేకంగా పూజలు చేస్తారు.

అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేచి.. స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలాన్ని కలిపి చేయడం శుభప్రదం. ఆ తర్వాత దక్షిణం వైపు ముఖం చేసి.. పూర్వీకులను ప్రార్థించి, నీటిలో నల్లనువ్వుల్ని కలిపి.. ఆ నీటిని నేలపై నెమ్మదిగా పోయాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి కలుగుతుందని విశ్వాసం. సూర్యోదయం సమయంలో రాగికుండలో నీరు, ఎర్రచందనం, ఎర్రటి పువ్వుల్ని సమర్పించి సూర్యుడికి అర్పించాలి. ఆ తర్వాత రాగిచెట్టును పూజించి దీపం వెలిగించాలి. సాయంత్రం రాగి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించి ఏడుసార్లు ప్రదక్షిణ చేయాలి. బ్రాహ్మణుడికి ధాన్యాలు, దుస్తులు, దుప్పట్లు, నువ్వులు దానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని విశ్వాసం.

🌹🌹🌹🌹🌹


4వ పాశురము Part 1 - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 4th Pasuram Part 1 - Tiruppavai Pasuras Bhavartha Gita Malika



https://youtube.com/shorts/zKhf5pScldU


🌹 4వ పాశురము Part 1 - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 4th Pasuram Part 1 - Tiruppavai Pasuras Bhavartha Gita Malika 🌹

🍀 4వ పాశురం part 1 - కరుణా వర్ష ప్రార్థన గీతం 🍀

తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 తిరుప్పావై నాలుగో పాశురంలో గోదాదేవి విష్ణుమూర్తిని మేల్కొలపడానికి పాడుతూ, పరమ శివుడిని కూడా ప్రార్థిస్తుంది. ఓ త్రిలోకేశ్వరా! నీవు కూడా కైలాసంలో నిద్రపోతున్నావా? శ్రీమన్నారాయణుని పాదాల చెంత చేరాలని, గోపికలందరం నీకు నమస్కరిస్తున్నాం. పద్మనాభుడు తన చేతిలో చక్రాయుధం ధరించి, మెరుపులా మెరుస్తూ, శంఖంలా గంభీరంగా ఉన్నాడు. వెన్నెలలు కురిసే ఈ మార్గశిర మాసంలో మేము నీటిలో స్నానానికి వెళ్ళేందుకు, నీవు కూడా మేల్కొని, వర్షాలను కురిపించు అని ప్రార్ధిస్తుంది. 🍀

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

డిసెంబర్ 18న నేడు చివరి మాస శివరాత్రి. Today, December 18th, is the last monthly Shivaratri of the year.



🌹 🔱 డిసెంబర్ 18న నేడు చివరి మాస శివరాత్రి. నేటి రాత్రి మాసశివరాత్రి వ్రతం చేసి రాహు-కేతు దోషాల నుంచి విముక్తి పొందండి. 🔱🌹

ప్రసాద్ భరద్వాజ



ఈ ఏడాదిలో చివరి మాస శివరాత్రి డిసెంబర్ 18న అంటే నేడు వచ్చింది. ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థశి తిథిరోజు మాసశివరాత్రి వ్రతం చేస్తారు.మాస శివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు.

ఈ వ్రతం మహత్యం శివపురాణంలో కూడా ఉంది. లక్ష్మీదేవి, ఇంద్రాణి, సరస్వతి, గాయత్రి, సావిత్రి, సీత, పార్వతి కూడా మాసశివరాత్రి వ్రతం చేశారని పురాణాల్లో ఉంది.

మాఘమాసం కృష్ణ పక్ష చతుర్థశి తిథి.. డిసెంబర్ 18 గురువారం తెల్లవారుఝామున 2 గంటల 32 నిమిషాలకు మొదలవుతుంది.. సూర్యోదయం , సూర్యాస్తయమం వరకూ చతుర్థశి తిధి ఉంది. శివ పూజ కోసం ఈ రోజు రాత్రి 11.51 నుంచి రాత్రి 12.45 వరకు శుభ ముహూర్తం.


🌻 రాహు-కేతు అశుభతను దూరం చేసే మాస శివరాత్రి వ్రతం 🌻

రాహు-కేతు అశుభ ప్రభావం వల్ల జీవితంలో సంతోషం దూరమవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివుని పూజ చెయ్యడం వల్ల రాహు దోషం నుంచి విముక్తి లభిస్తుంది.అందుకే మాస శివరాత్రి రోజు నిశిత కాల ముహూర్తంలో శివునికి నీటితో అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది. ఎవరి కుండలిలో రాహు-కేతు మహాదశ ఉంటుందో..మాసశివరాత్రి రోజు పూజ చేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. ఇది రాహు-కేతు జానిత అన్ని రకాల దోషాలను సమాప్తం చేస్తుంది.


🔱 అసంభవాన్ని సంభవం చేసే మాసశివరాత్రి వ్రతం 🔱

మాస శివరాత్రి వ్రతం చెయ్యడం వల్ల ఎంత కష్టమైన పని అయినా సంపూర్ణం అవుతుందని..చేపట్టిన పనిలో అడ్డంకులు తొలగి పోతాయని భక్తుల విశ్వాసం.


🌿 మాస శివరాత్రి వ్రతం ఎలా చేయాలి? 🌿

మాసశివరాత్రి వ్రతం చేయాలని సంకల్పం తీసుకోండి..ఇంట్లో శివలింగానికి అభిషేకం చేయండి..లేదంటే ఆలయానికి వెళ్లిరండి..ఆలయంలో 11 ప్రదక్షిణలు చేయండి.

సాయంత్రం కూడా శివపూజ చేయండి. మహాశివరాత్రికి చేసినట్టే జాగరణ చేస్తే ఇంకా మంచిది. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ తర్వాత పండ్లు తీసుకోండి..మసరుటి రోజు ఉపవాసం విరమించండి.

"ఓం నమః శివాయ" మంత్రాన్ని 108 సార్లు జపించండి. శివ అష్టోత్తరం లేదా శివ తాండవ స్తోత్రం పఠించండి.రాత్రంతా జాగరణ చేసి శివనామస్మరణ చేయండి.

సంవత్సరానికి 12 మాస శివరాత్రులు వస్తాయి.. వీటిలో మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రినే మాఘ మహాశివరాత్రిగా జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజు పాటించే నియమాలనే ఈ మాస శివరాత్రి రోజు అనుసరించాలి. ఈ రోజు ఉపవాసం ఆచరిస్తే పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గ్రహదోషాల నివారణ కోసం, సంతానం, ఆరోగ్యం, వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగించుకునేందుకు కూడా మాసశివరాత్రి వ్రతం చేస్తారు.

🌹🌹🌹🌹🌹


'ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం' Maha Vishnu Stotram



https://youtube.com/shorts/nKUEL1S6nXw


🌹 ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం Maha Vishnu Stotram శుభ గురువారం 🌹


తప్పకుండా వీక్షించండి

ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹



3వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 3rd Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita Malika


https://youtube.com/shorts/dShNLpo8VrM


🌹 3వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 3rd Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita Malika 🌹

🍀 3వ పాశురం - హరి భక్తి దీక్షా గీతం 🍀




తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 2 - పాశురాలు 3&4 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 2 - Pasuras 3&4



https://www.youtube.com/watch?v=_wnD-_LyvB8


🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 2 - పాశురాలు 3&4 Tiruppavai Pasuras Bhavartha Gita Series 2 - Pasuras 3&4 🌹

🍀 3వ పాశురం - హరి భక్తి దీక్షా గీతం, 4వ పాశురం - కరుణా వర్ష ప్రార్థన గీతం 🍀


తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ



🍀 గోదాదేవి రచించిన 30 పాశురాలు ప్రతి ఒక్కరూ మంచి అలవాట్లతో జీవించాలని.. తోటివారికి సాయపడాలని.. భగవంతుడిని తప్పకుండా ఆరాధించాలని సూచిస్తాయి. ధనుర్మాసంలో ఒక్కో రోజు ఒక్కో పాశురం చొప్పున 30 రోజులు 30 పాశురాలు గానం చేస్తారు. మొదటి 5 పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై ముఖ్య ఉద్దేశం తెలియ జేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రార్థిస్తే సకాలంలో వానలు కురుస్తాయి, పంటలు పుష్కలంగా పండుతాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాగే శ్రీకృష్ణుడిని పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయని.. గోదాదేవి చెబుతుంది. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹