🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 11 🌹🌻. 9. శ్రీ మహాకాళి దేవి - 9వ శక్తి పీఠం - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 11 🌹
🌻. 9. శ్రీ మహాకాళి దేవి  - 9వ శక్తి పీఠం - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్  🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌴.  శ్రీ మహాకాళీ: దేవి దివ్యస్తుతి 🌴
త్రిపురాసురసంహర్తా మహాకాలోత్రవర్తతే |
యస్యాట్టహాస సందగ్ధం దుస్సహంతత్ పురత్రయం |
పురీసాస్యాదుజ్జయినీ మహాకాళీ చ సామతా |
ఉజ్జయిన్యాం మహాకాళీ భక్తానామిష్టదా స్దా ||9  ఉజాయిని మహాకాళీ

9. ఉజ్జయిన్యాం మహాకాళీ:
మహామంత్రాధి దేవతాం ధీగంభీరతాం|
మహా కాళీ స్వరూపిణీం. మాం పాలయమాం||

ఎక్కడైతే స్త్రీమూర్తి గౌరవింపబడుతుందో, అదే దేవతల స్థానం. ఎప్పుడైతే స్త్రీకి అవమానం జరుగుతుందో ఆ అజ్ఞానాన్ని ద్రుంచే విజ్ఞాన స్థానమే కాళీ నిలయం.

ధర్మగ్లాని జరిగే వేళ దేవతల ప్రార్థనతో అంబిక నవదుర్గ రూపాలలో దుష్ట శిక్షణకై బయలుదేరింది. ఆ నవదుర్గ రూపాలలో అతి భీకరమైనదీ కాళీ స్వరూపం.

మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌కు 55 కి|| మీ|| దూరంలో క్షిప్రానదీ తీరంలో ఉజ్జయినీ క్షేత్రం ఉన్నది. ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే. 

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర లింగం, మహాకాళీ శక్తి పీఠం ఉన్న శక్తి ప్రదేశమే ఉజ్జయిని. 

సతీదేవి మోచేయి పడిన ఈ ప్రాంతానికి అష్టాదశ శక్తి పీఠలలో ఒక విశిష్ఠ స్థానం ఉంది. అదేమిటంటే ఈ క్షేత్రాన్ని భూమికి నాభిగా పేర్కొంటారు. ప్రతి 12 సం||లకు ఒకసారి ఇక్కడ “కుంభమేళా” ఉత్సవం జరుగుతుంది.

ఇక్కడి స్వామివారైన మహాకాళేశ్వరునకు కన్నులుండటం అనగా శివలింగానికి కన్నులుండటం విశేషం.

ఈ ఉజ్జయిని కుశస్థలి, కనకశృంగి, పద్మావతి, కుముద్వతి, అమరావతి, విశాల అనే పేర్లతో కాల పరిస్థితులను బట్టి మారింది. సప్తమోక్ష పురలలో ఒకటి ఈ ఉజ్జయిని.

అదిగో చూడండి ! మహాకాలుని ఎదుట మహాకాళి ఆనంద తాండవం చేస్తోంది. ఒక్కసారి ఆ ఆదిదంపతులను స్మరించి మనసుతో ఆ ఆనంద తాండవాన్ని తిలకించండి.

అప్పుడు మనకి లభించేది సత్ + చిత్ ఆనంద మోక్షపురి. అదే ఉజ్జయిని, (విజయవంతమైన) మహాపురి, శివపురి.

సప్త మోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణానికి 50కి.మీ దూరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహాకాళి ఆలయం ఉన్నాయి.

🌻. స్థలపురాణం.
పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధం చేస్తాడు.కానీ బ్రహ్మదేవుని వరం కారణంగా అంధకాసురుని రక్తం ఎన్ని చుక్కలు నేలను తాకితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తారు.

అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుధ్ధభూమిలో ప్రవేశించి తన పొడవైన నాలుకను చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment