శ్రీ కనకదుర్గాదేవి నవవిధ మహా హారతి NavavVidha Harathi - Navavidha Maha Aarti of Sri Kanaka Durga Devi (a YT Short)



https://youtube.com/shorts/xAbrDY9ZqlI


🌹 శ్రీ కనకదుర్గాదేవి నవవిధ మహా హారతి NavavVidha Harathi 🌹

🌹 Navavidha Maha Aarti of Sri Kanaka Durga Devi 🌹

(a YT Short)



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹 🌹 🌹 🌹


కార్తీక మాసం 10వ రోజు చేయవలసినవి. Things to do on the 10th day of Karthika month. (a YT Short)



https://youtube.com/shorts/4FModcSwc4E


కార్తీక మాసం 10వ రోజు చేయవలసినవి.

Things to do on the 10th day of Karthika month.


(a YT Short)



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



చాలా అరుదైన శ్రీ లక్ష్మి కుబేర అమ్మవారి నిజ అభిషేకం హారతి Abhishekam Aarti of Goddess Lakshmi Kubera (A YT Short)



https://youtube.com/shorts/-qCTuPW9OvI


🌹 చాలా అరుదైన శ్రీ లక్ష్మి కుబేర అమ్మవారి నిజ అభిషేకం హారతి 🌹

🌹 Abhishekam Aarti of Goddess Lakshmi Kubera 🌹


  (A YT Short)



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹

అష్టలక్ష్మి స్తోత్రం - తాత్పర్యం - Ashta Lakshmi Stotram - FV 6 (A YT Video)



https://youtu.be/_6WhgnTqEyw


🌹 అష్టలక్ష్మి స్తోత్రం - తాత్పర్యం - ASHTA LAKSHMI STOTRAM - FV 6 - Prasad Bharadwaj 🌹

ప్రసాద్‌ భరధ్వాజ




Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹

కార్తీక పురాణం - 10 : 10 వ అధ్యాయము : అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము. Kartika Purana - 10 : Chapter 10: The story of Ajamila's previous birth


🌹. కార్తీక పురాణం - 10 🌹

🌻 10 వ అధ్యాయము : అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము. 🌻

📚. ప్రసాద్ భరద్వాజ


🌹. Kartika Purana - 10 🌹

🌻 Chapter 10: The story of Ajamila's previous birth. 🌻

📚. Prasad Bharadwaja



జనక ఉవాచ: 'వశిష్ఠా! ఈ అజామిళుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన యిలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూత లెందుకూరుకున్నారు? వాళ్లు యమునికి యేమని విన్నవించారు. అన్నీ సవిస్తరంగా చెప్పు.'

విశిష్ట ఉవాచ : నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమములో సమాధానాలు చెబుతాను విను. విష్ణుపారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి యిలా చెప్పసాగారు.

🌻. యమదూతల ఆరోపణము - యముని ఉపదేశము 🌻

'అయ్యా పాపాత్ముడునూ, దురాచారుడునూ, నిందిత కర్మాచరణపరుడూ అయిన అజామిళుని యందలి జీవుని తెచ్చే సమయంలో - విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి, అతనిని మానుంచి విడిపించి, తమతో వైకుంఠానికి తీసికొని వెళ్లారు. వాళ్లను యెదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము' అని కింకరులు చెప్పినది విని, రవంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్నీ అవలోకించినవాడై - కింకరులారా! కించిదపి పుణ్యవిహీనోపి - ఆ ఆజామిళుడనే పాపి, అంత్యకాలాన హరి నామస్మరణమును చేయడము వలన సమస్త పాపాలనూ నశింపచేసుకుని, విష్ణుప్రియుడై, విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా - తెలియక తాకినా దహించవలెనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులనూ అగ్నిదహించునో అదే విధముగా - దుష్టాత్ములై, మహిమను తెలుసుకోలేక పోయినా - ఆ శ్రీహరి యొక్క నామస్మరణమును చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడి పోతాయి. ఇక, భక్తిభావముతో స్మరించినవారు కేవలము కైవల్య పథగాములే అవుతారు' అంటూ సేవకులను ఎంతవరకూ చెప్పాలో అంతవరకూ మాత్రమే చెప్పి - యముడు మరింత పూర్వాలోచనా పరుడయ్యాడు.

🌻. అజామిళుని పూర్వజన్మ 🌻

అజామిళుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్రదేశములో శివార్చకుడుగా వుండేవాడు. ఆ జన్మలో కూడా స్నానసంధ్యాచరనాది రహితుడూ, దైవేతరచిత్తుడూ, దైవద్రవ్యాపహరి అయి వుండేవాడు. బ్రహ్మణుడయివుండి కూడా ఆయుధపాణియై, దుష్టులతో స్నేహమును చేస్తూ తిరిగేవాడు. అర్చకుడయివుండీ కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్చావిహారాలు చేసేవాడు. బహుభాషియై యవ్వనములో వుండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రహ్మణుడుండేవాడు, అతడు దరిద్రపీడితుడై- అన్నము కొరకై పట్టణములు, పల్లెలు తిరుగుతూ - యాయవార వృత్తిని అవలంబించి వున్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్తుజాలాన్నంతటినీ మోసుకునివచ్చి భార్యను పిలిచి - 'చాలా ఆకలిగా వుంది. సత్వరమే వంటచేయి. ముందు కాసిని మంచినీళ్లియ్యి. అవి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను' అన్నాడు. కాని, యౌవనమదాశ్రితయై వున్న ఆ యిల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ వుండిపోయింది. అందుకు కోపించిన భర్త, చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు.

తన కామపు ఆలోచనలకు అంతరాయమును కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది. అడలీ-బడలీవున్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెనూ, గృహాన్నీ వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్లి, భిక్షాటనతో బతకసాగాడు. మగడు యిల్లువదలి వెళ్లిపోవడంతో మరింత తెగించిన ఆ జారిణి - మగడు తెచ్చినవన్నీ సుష్ఠుగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకుని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని, తాంబూల చర్వణము చేస్తూ - ఒకానొక రజకుని యింటికి వెళ్లి - ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది. కాని, నీతిమంతుడైన ఆ రజకుడు. ఆమె కోరిన తప్పుడుపనికి అంగీకరించకపోవడంతో - వారిద్దరికి వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంచితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణజారిణి వీధినపడి రసికులను వెతుక్కుంటూ - పోతూ ఇతఃపూర్వం చెప్పబడిన ఈశ్వరాలయార్చకుని చూసి - సురత క్రీడలకాహ్వానించింది. బ్రహ్మణుడైన వీడు - ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా - అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిణి సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై - భర్తను వెతుక్కుంటూ వెళ్లి బ్రతిమాలి తెచ్చుకుని అది మొదలుగా అతని మాటలకు 'తు-చ' తప్పకుండా బ్రతుకసాగింది.


🌹. కార్తీక పురాణం - 10

ఇటువంటి పాపాలవలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాల ననుభవించి, అనుభవించి - సత్యనిష్ఠుడి కొడుకైన అజామిళుడుగా జన్మించి - కార్తీక పౌర్ణమినాటి శివసందర్శనం - అంత్యకాల హరిస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు.

ఆనాటి శివార్చకుని జన్మలో - ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిణి కూడా కొంతకాలానికి మరణించి, నరకానుభవమును పొంది - కన్యాకుబ్దములోని ఛండాల గృహములో బాలికగా జన్మించింది. కాని ఆ - పిల్ల - తండ్రి గండాన పుట్టడం వలన - వాళ్లా పిల్లను అడవిలో వదలివేశారు. ఆ వనాంతర్గామియైన ఒకా బ్రహ్మణుడా బాలిక అరణ్యరోదన విని, జాలిపడి, తనతో తీసికొని వెళ్లి, తన యింటి దాసీకి పెంపకానికిచ్చాడు. ఆ దాసీదాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామిళుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా! నువ్వడిగిన అజామిళుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకూ హరినామా స్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి వుంటుంది.

జనక నరపాలా! ఎవరిజిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరి చరణాల నాశ్రయించదో, ఎవరి చెవులు, శ్రీహరి సంకీర్తనల నాలకించవో వాళ్ల పాపాలు ఏ విధముగానూ కూడా నశించే అవకాశము లేదు. ఎవరైతే ఇతర చింతలన్నిటినీ విడిచి పెట్టి విష్ణువునే ధ్యానిస్తూ వుంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహము లేదు! మోక్షాసక్తులను మురహరి స్మరణ మేవిధంగా సూక్ష్మమార్గమో - అదే విధముగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మమార్గము కూడా మహొత్కృష్ట పుణ్యప్రదాయినియై - పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపజేసేశక్తి ఈ కార్తీక వ్రతాచరణకకు మాత్రమే వుండడము వలన, ఎవరైతే ఈ దివ్వవ్రతాన్ని ఆచరించరో, వాళ్లు నరక ప్రాప్తులవుతారని తెల్సుకో. పాపనాశనియైన ఈ కార్తీక మహత్మ్యన్ని శ్రద్దా భక్తులతో వినినప్పటికీ కూడా - వారు మోక్షార్హులే అవుతున్నారు. ఆసక్తులైనవారికి - పావన హృదయంతో యీ మహత్మ్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు.

ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే దశమోధ్యాయ స్సమాప్త:

🌹 🌹 🌹 🌹 🌹


కార్తీక మాసం 10వ రోజు పూజించ వలసిన దైవం Gods to be worshipped on the 10th day of Kartik month


🌹కార్తీక మాసం 10వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



నిషిద్ధములు:- గుమ్మడికాయ, నూనె, ఉసిరి

దానములు:- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె

పూజించాల్సిన దైవము:- దిగ్గజాలు

జపించాల్సిన మంత్రము:-

ఓం మహామదేభాయ స్వాహా

🌹🌹🌹🌹🌹





🌹Deity to be worshipped on the 10th day of Karthika month - Mantra to be recited - Donation - Offering 🌹

Prasad Bharadhwaja


Prohibited things:- Pumpkin, oil, amla

Donations:- Pumpkin, self-cooked food, oil

Deity to be worshipped:- Giants

Mantra to be chanted:-

Om Mahamadebhaya Swaha

🌹🌹🌹🌹🌹


లక్ష్మీ వల్లభ నారాయణుని దశావతారాలు The ten incarnations of Lakshmi Vallabha Narayana (a YT Short)



https://youtube.com/shorts/cqIZvmZru3A



🌹 లక్ష్మీ వల్లభ నారాయణుని దశావతారాలు 🌹

🌹 The ten incarnations of Lakshmi Vallabha Narayana 🌹

(a YT Short)


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹




కార్తీకంలో విష్ణుప్రీతికి ఈ 21 అవతారాలను ఒక్కసారి స్మరిస్తే చాలు In Kartika, just remembering these 21 avatars for Vishnu's devotion is enough (a YT Short)



https://youtube.com/shorts/1MBdyWFHEa0



🌹 కార్తీకంలో విష్ణుప్రీతికి ఈ 21 అవతారాలను ఒక్కసారి స్మరిస్తే చాలు. 🌹

🌹 In Kartika, just remembering these 21 avatars for Vishnu's devotion is enough. 🌹



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


ముకుందమాల స్తోత్రం - తాత్పర్యము Mukunda Mala Stotram



https://youtu.be/TIkDVyPMoC8


🌹 ముకుందమాల స్తోత్రం - తాత్పర్యము MUKUNDA MALA STOTRAM by Prasad Bharadwaj 🌹

శ్రీ కులశేఖర్ ఆళ్వార్ విరచితం

🎻. ప్రసాద్‌ భరధ్యాజ


Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹



కార్తీక పురాణం - 9 : 9 వ అధ్యాయము : విష్ణు పార్షద, యమదూతల వివాదము Kartika Purana - 9 : Chapter 9: Vishnu Parshada, Yamadootala dispute


🌹. కార్తీక పురాణం - 9 🌹

🌻 9 వ అధ్యాయము : విష్ణు పార్షద, యమదూతల వివాదము. 🌻

📚. ప్రసాద్ భరద్వాజ


🌹. Kartika Purana - 9 🌹

🌻 Chapter 9: Vishnu Parshada, Yamadootala dispute. 🌻

📚. Prasad Bharadwaja


యమదూతల ప్రశ్నలకు చిరునగవుమోము కలవారైన విష్ణుదూతలు యిలా భాషించసాగారు, 'ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు? పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి?'

విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమీయసాగారు. "సూర్యచంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యలూ దశదిశా కాలాలూ, వీనిని మానవుల యొక్క పాప పుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము.

ఓ విష్ణుదేవతలారా! శ్రద్ధగా వినండి - వేదమార్గాన్ని విడిచిన స్వేచ్చాచారులూ, సాధుజన బహిష్కృతులూ యమదండనార్హులు. బ్రహ్మణునీ, గురువునీ, రోగినీ పాదాలతో తాడించేవాడు - తల్లిదండ్రులతో కలహించేవాడూ, అసత్యవాదీ, జంతుహింసకుడూ, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడూ, డాంబికుడూ, దయారహితుడూ, పరభార్యాసంగాముడూ, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించేవాళ్లనీ, చేసినదానాన్ని బైటపెట్టుకునే వానినీ, మిత్రద్రోహినీ, కృతఘ్నులనీ, ఇతరుల పురుష సంతతిని చూసి యేడ్చేవానినీ, కన్యాశుల్కాలతో జీవించేవానినీ, వాపీకూప తటాకాది నిర్మాణాటంకపరులనీ, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడచినవానినీ, కేవలం భోజనం గురించే ఆలోచించేవానినీ, బ్రహ్మణాశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మాచేత దండించబడుతూంటారు. ఇక ఈ అజామిళుడంటారా? వీడు చేయని పాపమంటూ లేదు. బ్రహ్మణ జన్మమెత్తి, దాసీ సంగమ లోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికెలా అర్హుడు!"


యమదూతల సమాదానాన్ని విని - విష్ణుపార్షదులిలా చెప్పసాగారు.

"ఓ యమదూతలారా! ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన గాని దుస్సంగమాన్ని వదలి సత్సంగమములో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్యా జపహోమ తత్సరుడూ మీ యమలోక గమనానికి అర్హులు కారు.

ఓ యమదూతలారా! అసూయారహితులై, జపాగ్నిహోత్ర నిర్వాహకులై, సర్వ కర్మలనూ సగుణ బ్రహ్మార్పణము చేసేవారు - జలాన్నగోదాతలు. వృషోత్సర్జనా కర్తలూ యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత (గురువులు), పరోపకార శీలురు, హరిపూజాప్రియులు, హరినామ జాపకులూ, వివాహ - ఉపనయనాలను చేయించే వారూ - అనాథ ప్రేత సంస్కారకర్తా - వీళ్లెవరూ మీ యమదండనల కర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి, తత్తీర్థాన్ని పానము చేసే వాడూ - తులసీకాష్ఠ మాలికలను ధరించేవాడూ, వివేవాడూ - సూర్యుడు మేష - తులా - మకర సంక్రాంతులందుండగా ప్రాతఃస్నానమును ఆచరించేవాళ్లూ - వీళ్లెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసిగాని - తెలియకగాని హరినామ సంకీర్తనమును చేసే వాళ్లు - పాపవిముక్తులవుతారు. ఓ యమదూతలారా! ఇన్నిమాటలెందుకు? ఎవడైతే అవసానకాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు.

ఈ విధముగా సాగుతున్న యమ, విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామిళుడిలోని జీవుడు - తన శారీరక కృతదాసీ సాంగత్యాది పాపాలను తలంచుకుని దుఃఖిస్తూన్న జీవుడు - స్పృహామయుడై అచ్చెరువందాడు. "ఇదేమి ఆశ్చర్యం? ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతులు ఏమై పోయారు? నేనీ వైకుంఠములో యెలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామమెలా వచ్చింది? నాకీ వైకుంఠము ఎలా ప్రాప్తించింది?" అని తనలో తనే అనుకుంటూ హరిస్మరణమును చేయసాగాడు. కాబట్టి రాజా! కేవల హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది. కాగా- హరి ప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే యెంత పుణ్యం కలుగుతుందో వూహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు.

ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే నవమోధ్యాయ స్సమాప్త:

🌹 🌹 🌹 🌹 🌹

కార్తీక మాసం 9వ రోజు పూజించ వలసిన దైవం Gods to be worshipped on the 9th day of Kartik month

🌹కార్తీక మాసం 9వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹
ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి
దానములు:- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు
పూజించాల్సిన దైవము:- అష్టవసువులు -
పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః



🌹Gods to be worshipped on the 9th day of Kartik month - Mantra to be recited - Donation - Naivedyam 🌹
Prasad Bharadhwaja



Prohibited things:- Oily items, Udhu
Donations:- Your favorite Pitru Tarpanas
God to be worshipped:- Ashtavasu -
Pitru Devas
Mantra to be chanted:- Om Amrutaya Swaha - Pitru Devatabhyo Namah

షష్ఠి కవచము - సుబ్రహ్మణ్య స్వామి పంచామృత స్నానం హారతి Shashti Kavacham - Subrahmanya Swami Panchamruta Snana Aarti (a YT Short)



https://youtube.com/shorts/-JLTdwqzYwo


🌹షష్ఠి కవచము - సుబ్రహ్మణ్య స్వామి పంచామృత స్నానం హారతి 🌹

🌹Shashti Kavacham - Subrahmanya Swami Panchamruta Snana Aarti 🌹


(a YT Short)


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹



శుక్లాాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం Shuklambharadharam Vishnum Shashivarnam Chaturbhujam (a YT Short)



https://www.youtube.com/shorts/gWSBrLoQktE


🌹 శుక్లాాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 🌹

🌹 Shuklambharadharam Vishnum Shashivarnam Chaturbhujam 🌹


(a YT Short)




Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹



ఇరుముడి కట్టు శబరిమలైకి నీ అభిషేకం అయ్యప్పకి Irumudi Kattu, offering to Lord Ayyappa at Sabarimala


https://youtube.com/shorts/ARBdKHmzUoA


🌹 ఇరుముడి కట్టు శబరిమలైకి నీ అభిషేకం అయ్యప్పకి 🌹

Irumudi Kattu, offering to Lord Ayyappa at Sabarimala



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹

కార్తీక మాసం 8వ రోజు పూజించ వలసిన దైవం God to be worshipped on the 8th day of Karthika month


🌹కార్తీక మాసం 8వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం

దానములు:- తోచినవి - యథాశక్తి

పూజించాల్సిన దైవము:- దుర్గ

జపించాల్సిన మంత్రము:-

ఓం - చాముండాయై విచ్చే - స్వాహా

🌹 🍀 🌹 🍀 🌹 🍀




🌹God to be worshipped on the 8th day of Karthika month - Mantra to be recited - Donation - Naivedyam 🌹

Prasad Bharadhwaja



Prohibited things:- Onion, Uva, Alcohol, Meat

Donations:- Tochinavi - Yathashakti

God to be worshipped:- Durga

Mantra to be chanted:-

Om - Chamundaai Vichche - Swaha

🌹 🍀 🌹 🍀 🌹 🍀




కార్తీక పురాణం - 8 : 8 వ అధ్యాయము : శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం, అజామీళుని కథ. Kartika Purana - 8 : Chapter 8: Chanting the Name of Srihari and the Story of Ajamila

🌹. కార్తీక పురాణం - 8 🌹

🌻 8 వ అధ్యాయము : శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం, అజామీళుని కథ. 🌻

📚. ప్రసాద్ భరద్వాజ



🌹. Kartika Purana - 8 🌹

🌻 Chapter 8: Chanting the Name of Srihari and the Story of Ajamila. 🌻

📚. Prasad Bharadwaja



వశిష్టుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు: 'మహర్షీ! మీరు చెప్పినవన్నీ వినిన తరువాత నాకొక సందేహము కలుగుతోంది. వర్ణసాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేదత్రయోక్తాలయిన ప్రాయశ్చిత్తాలను చేసుకొననిదే పరిశుద్ధులు కారు' అని సమస్త ధర్మ శాస్త్రాలలోను ఘోషిస్తుండగా, కేవలం కార్తీక వ్రతాచరణా ధర్మలేశము చేతనే సమస్త పాపాలూ హరించుకుని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్మమేమిటి? ఇది యెలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్య మాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డళ్లతో కూడా కూలనేయ సాధ్యముగాని మహాపర్వతాన్ని కేవలము కొనవ్రేలి గోటితో కూల్చడము సాధ్యమవుతుందా? అగ్ని దగ్ధమవుతూన్న యింటిలో ఉన్నవాడు ఆ మంట మీద పురిషెడు నీళ్లు జల్లినంత మాత్రాన, అగ్ని ప్రమాదము తొలగిపోతుందా? ఏ మహానదీ ప్రవాహములోనో కొట్టుకుని పోయే వారిని ఓ పాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా ? తనకు తానై కొండచరియలలోని ఏ లతాసూత్రాన్నే పట్టుకున్నంత మాత్రము చేతనే నదీపాతవేగాన్నుంచి సంరక్షించబడతాడా? వశిష్ఠా! ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్లు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణము వలన పాపరహితులూ, పుణ్యాత్ములూ ఎలా అవుతారు ? వీటికి సమాధానమేమిటి ?

జనకుడి ప్రశ్నకు జ్ఞానహసమును చేస్తూ - ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు.


🌻. జనకుని ప్రశ్నలకు వశిష్ఠుని జవాబు

వశిష్ఠ ఉవాచ:

మంచి విమర్శే చేశావు మహారాజా! చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలేగాని, స్ధూలరూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అదిగాక, వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మసూక్ష్మాలను మనకందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను - స్వల్ప పుణ్యాలు గొప్పవిగానూ పరిణమిస్తూంటాయి. ధర్మాలన్నీ గుణత్రయముతో కూడుకుని స్వల్ప నల్పతలను సిద్ధింపచేసుకుంటాయి. మూల ప్రకృతియైన 'మహామాయ' కారణంగా సత్వర జస్తమస్సులనే మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మసూక్ష్మాలు. కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి.

తర్కము- దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దానధర్మాలు, ఇవన్నీ కూడా ధర్మము యొక్క స్ధూలస్వరూపాలు. ఇవి తమోగుణము వలన యేర్పడతాయి. వీటిల్లో - సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశకాలయోగ్యతాదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి. 'దేశము' అంటే పుణ్యక్షేత్రం, కాలము అంటే పుణ్యకాలము. యోగ్యత అంటే - పాత్రత. బ్రహ్మజ్ఞత కలవాళ్లు ఈ మూడింటినీ చింతించకుండా చేసే సర్వధర్మాలూ తమాసాలు - వీటివలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కరలేదు కదా! జనకరాజా! అన్నిటికి కర్మమే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికి మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరంచే ధర్మాలను పై మూడింటితో పోల్చుకుని ప్రయత్న పూర్వకముగానైనా ఆచరించాలి. ఈ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్నిస్తుంది. రాజా! పర్వతమంత యెత్తు కట్టెలను పేర్చి, వాటి మధ్య గురివింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే -ఆ అగ్నికణము ఆ కట్టెలనెలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లనెలా తొలగిస్తుందో, గుండిగెడు మురికినీళ్లను ఒక్క ఇండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో - అదే విధంగా తెలిసిగాని, తెలియకగాని పుణ్యకాలములో, పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తుల వలన ఆచిరంచే ధర్మము అనంత పాపాలనూ దగ్ధం చేసి, మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకుదాహరణగా ఒక కథ చెబుతాను విను.

🌻. అజామిళో పాఖ్యానము 🌻

బహుకాలం పూర్వం కన్యాకుబ్జక్షేత్రవాసీ, సార్ధక నామధేయుడూనైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామీళుడనే కుమారుడుండేవాడు. వాడు పరమ దురాచారుడు. దాసీ సాంగత్యపరుడు, హింసా ప్రియుడుగా వుండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములోని ఒకానొక దాడితో సాంగత్యమును పెట్టుకొని, తల్లిదండ్రులను మీరి ఆ దాసీ దానితోనే భోజన శయానాదులన్నిటినీ నిర్వర్తిస్తూ, కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడచిపెట్టి, కేవల కామాసక్తుడై ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులంతా అతనిని వదలివేశారు. కులము వాళ్లు వెలివేశారు. అందువలన యిల్లు వదలిపెట్టి పోవలసి వచ్చిన అజామిళుడు ఛండాలపువాడలోని ఒకానొక దాసీ దానితో కాపురము పెట్టి, కుక్కలనూ, మృగాలనూ ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బతికకే జనాలలో లీనమై, మధుమాంస సేవనా లోలుడై కాలమును గడపసాగాడు.


కార్తీక పురాణం - 8

ఇలా వుండగా, ఒకనాడతని ప్రియురాలైన దాసీది, కల్లు తాగడం కోసం తాడిచెట్టునెక్కి, కమ్మ విరగడం వలన క్రిందపడి మరణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు.

అప్పటికే ఆ దాసీ దానికి యవ్వనవతియైన కూతురు వుంది. మహాపాపాత్ముడూ, మహా కామాంధుడూ అయిన అజామిళుడు, తనకి కూతురు వరుసని కూడా తలచకుండా - ఆ పిల్లనే వరించి, ఆమెతోనే కామోపభాగాలనుభవించసాగాడు. కాముకుడైన అజామిళుడు, తన కూతురి యందే అనేక మంది బిడ్డలను పొందాడు. కాని వాళ్లందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా, కడగాపుట్టి మిగిలిన బిడ్డకు 'నారాయణ' అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా, నిదురిస్తున్నా ఏం చేస్తున్నాసరే - సతతం అతనినే స్మరించుకుంటూ 'నారాయణా - నారాయణా' అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ వుండేవాడు. కాలము గడచి అజామిళుడు కాలము చేసే సమయము ఆసన్నమైంది. అతడిలోని జీవుని తీసుకొని పోయేందుకుగాను - ఎర్రని గడ్డములు - మీసములు కలిగి, చేత దండపాశాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు.

వారిని చూస్తూనే గడగడలాడి పోయిన అజామిళుడు, ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక, ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటలలో మునిగి వున్న కుమారునికోసమై 'నారాయణా, ఓ నారాయణా! తండ్రి నారాయణా'! అని పలుమారులు పిలవసాగాడు.

ఆ పిలుపు అతడి కొడుకుకు వినబడలేదు. అతను రానూ లేదు. కాని చేరువకు వచ్చిన యమదూతలు ఆ 'నారాయణ' నామస్మరణను విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు - 'ఓ యమదూతలారా! అడ్డు తొలగండి. ఇతడు మాచే తీసుకొని పోబడదగినవాడేగాని, మీరు తీసుకొని వెళ్లదగిన వాడు కాదు' అని హెచ్చరించారు. వికసిత పద్మాలవలే విశాలమైన నేత్రాలు కలవాళ్లూ, పద్మమాలాంబర వసనులూ అయిన ఆ పవిత్ర విష్ణుపారిషదులను చూసి, విభ్రాంతులైన యమదూతలు 'అయ్యా! మీరెవరు? యక్ష గంధర్వ సిద్ద చారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందిన వారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసికొని వెళ్ళనున్న ఈ జీపుని మీరెందుకు తీసికొని వెడుతున్నారు?' అని అడగడంతో, విష్ణుదూతలులిలా చెప్పసాగారు.


ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే

అష్టమ అధ్యాయౌ స్సమాప్తః

🌹 🌹 🌹 🌹 🌹



శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం Sri Panchamukha Hanuman Stotram


https://youtu.be/yTxNXAqLr10


🌹 శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం 🌹

శత్రు బాధలు, పిశాచ బాధలు, ఆరోగ్య సమస్యలు వున్నవారు ప్రతినిత్యము అత్యంత శ్రద్ధతో శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం మూడుసార్లు పఠించిన, వారికి తప్పక శుభములు చేకూరగలవు. - గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

తప్పక వీక్షించండి. హనుమంతుని దివ్య ఆశీస్సులు పొందండి.





🌹 Sri Panchamukha Hanuman Stotram 🌹

Those who are troubled by enemies, spirits, or health problems, if they sincerely recite the Sri Panchamukha Hanuman Stotram three times daily, they will undoubtedly receive blessings. - Sung and composed by: Prasad BharadwajBe sure to watch. Receive the divine blessings of Hanuman.




Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


ప్రసిద్ధ "శైవక్షేత్రాలైన పంచారామాల" The famous "Pancharamas, the Shaivite sites"


🌹🔱 కార్తీక మాసంలో "ప్రసిద్ధ "శైవక్షేత్రాలైన పంచారామాల విశేషాలు" తెలుసుకుందాం 🔱🌹
ప్రసాద్‌ భరధ్వాజ


🌹🔱 Let's learn about the famous 'Shaiva temples of Pancharama' during the Kartika month 🔱🌹
Prasad Bharadwaj


🌺🔱ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధమైన "శైవక్షేత్రాలను", "పంచారామాలు' అని పిలుస్తారు. 'పంచారామాలు' ఏర్పడుటకు కారణం స్కందపురాణంలో ఇలా వివరించబడి యున్నది.

🌺🔱 The famous 'Shaiva temples' in Andhra Pradesh are called 'Pancharama'. The reason for the formation of 'Pancharama' is explained in the Skanda Purana.




🌺🔱పూర్వం.. తారకాసురుడు అను రాక్షసుడు, 'శివుని' గురించి ఘోర తపస్సు చేసి 'శివుని' ఆత్మలింగము సంపాదిస్తాడు. దీనితో వీర గర్వముతో, దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా, ఇందుకు దేవతలు, విష్ణుమూర్తిని ప్రార్ధించగా, 'శివపార్వతుల' వల్ల కలిగిన కుమారుడు "కుమారస్వామి" వల్లనే తారకాసురుని వధించుట సాధ్యపడుతుందని తెలిపి "కుమారస్వామిని" యుద్ధానికి పంపుతారు. యుద్ధము నందు "కుమారస్వామి", తారకాసురుని కంఠంలో గల 'ఆత్మలింగమును' చేధిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ 'లింగమును' చేధిస్తాడు. దీనితో తారకాసురుడు మరణిస్తాడు.

🌺🔱 చేధిoచే సమయంల్లో, ఆ.. 'ఆత్మలింగము' వేరై, ఐదు ప్రదేశములలో పడుతాయి. తరువాత వాటిని ఆ పడిన ప్రదేశాలలోనే దేవతలు లింగ ప్రతిష్ఠ కావించారు.. కనుక ఈ అయిదు 'క్షేత్రాలను', 'పంచారామాలు' అని పిలుస్తారు..

🕉 1. దాక్షారామము 🕉

పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని "భీమేశ్వరుడు" అని పిలుస్తారు. స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు మరిఇయు సగభాగం నలుపుతో ఉంటుంది.

ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన, భీముడు నిర్మించాడని పురాణాలలో చెప్పబడి యున్నది. అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతో మంది దేవతలు, రాజులు స్వామి వారిని దర్శించుకొని, తరించారని తన 'భీమేశ్వర పురాణంలో' చెప్పబడి యున్నది. ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ "మహాశివరాత్రి" పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.


🕉 2. అమరారామము 🕉

పంచారామల్లో రెండవదైన 'అమరారామము', గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీతీరమునందు వెలసినది. ఇక్కడ స్వామిని "అమరేశ్వరుడు" అని పిలుస్తారు. గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో, తెల్లగా మెరుస్తూ ఉంటుంది.

ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది. అమరేశ్వరుడైన 'ఇంద్రుడు' చేత ప్రతిష్టించి ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు అని పురాణాలలో చెప్పబడి యున్నది.


🕉 3. క్షీరారామము 🕉

క్షీరారామము, పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ 'శివుని' మూర్తిని "శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి" అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని త్రేతాయుగ కాలంలో 'సీతారాములు' కలిసి ప్రతిష్ఠించారట. ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది.

'శివుడు' తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమి నుండి పాలధార వచ్చిందట. క్షీరం అనగా పాలు, దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది. క్రమంగా 'క్షీరపురి' కాస్తా 'పాలకొల్లుగా' మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆలయం 125 అడుగుల ఎత్తులో '9' గోపురాలుతో కట్టబడింది.

🕉 4. సోమారామము 🕉

పంచరామాల్లో నాల్గవదైన "సోమారామము". పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని "సోమేశ్వరుడు" అని పిలుస్తారు. ఇచ్చట 'శివలింగానికి' ఒక ప్రత్యేకత ఉంది. మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే 'శివలింగం', అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.

ఇక్కడ స్వామిని 'చంద్రుడు' ప్రతిష్టించాడు. చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి 'సోమారామము' అని పేరు వచ్చింది.

🕉 5. కుమారభీమారామము 🕉

పంచారామాల్లో చివరిది, 5వది అయిన 'కుమారభీమారామము', తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు. ఇక్కడ స్వామిని "కాల బైరవుడు" అని పిలుస్తారు.

ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన, చాళుక్య రాజయిన భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి 'శివలింగం' సున్నపురాయితో చేసినదిలాగా ఉంటుంది. ఈ ఆలయంలో "మహశివరాత్రి" ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

🌹🌹🌹🌹🌹

జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర Hail Hanuman, the ocean of wisdom and virtues (a YT Short)



https://youtube.com/shorts/YBh3LbRlLOM



🌹 జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర 🌹

🌹 Hail Hanuman, the ocean of wisdom and virtues 🌹



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



కార్తీక మాసం 7వ రోజు పూజించ వలసిన దైవం The god to be worshipped on the 7th day of Kartika month


🌹కార్తీక మాసం 7వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



నిషిద్ధములు:- పంటితో తినే వస్తువులు, ఉసిరి

దానములు:- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం

పూజించాల్సిన దైవము:- సూర్యుడు

జపించాల్సిన మంత్రము:- ఓం. భాం. భానవే స్వాహా

🌹 🍀 🌹 🍀 🌹 🍀



🌹Gods to be worshipped on the 7th day of Karthika month - Mantra to be recited - Donation - Offering 🌹

Prasad Bharadhwaja



Prohibited things:- Things eaten with teeth, amla

Donations:- Silk, wheat, gold

God to be worshipped:- Sun

Mantra to be chanted:- Om. Bham. Bhanve Swaha

🌹 🍀 🌹 🍀 🌹 🍀


కార్తీక పురాణం - 7: అధ్యాయము 7: 7. శివకేశవార్చనా విధులు Kartika Purana - 7: Chapter 7: 7. Methods of Worshiping Shiva-Keshava


🌹. కార్తీక పురాణం - 7 🌹

అధ్యాయము 7

🌻 7. శివకేశవార్చనా విధులు. 🌻

📚. ప్రసాద్ భరద్వాజ


🌹. Kartika Purana - 7 🌹

Chapter 7

🌻 7. Methods of Worshiping Shiva-Keshava 🌻

📚. Prasad Bharadwaj



'ఓ జనక రాజేంద్రా! కల్మషఘ్నమైన కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చనా- దీప విధానాలను చెబుతాను విను.


🌻. పుష్పార్చనా ఫలదాన దీపవిధి - విశేషములు:


ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన కమలాసనియైన లక్ష్మిదేవి ఆ భక్తుల యిండ్ల స్ధిరావాస మేర్పరచుకుంటుంది. తులసీ దళాలతోగాని, జాజిపువ్వులతోగాని, మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి యీ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లవలె చెదరిపోతాయి. ఉసిరిచెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరిజూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీదళాలతో పూజిస్తారో, వారికి మించిన ధన్యులెవరూ ఉండరనడం అతిశయోక్తి కాదు.

బ్రాహ్మణ సమేతులై, ఉసిరిచెట్టు వున్న తోటలో - వనభోజనమును చేసేవారి మహాపాతకాలు సైతము మట్టిగలసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరిచెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువువలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసములో విష్ణ్వాలయములో మామిడాకుల తోరణం కడతారో, వాళ్లు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతోగాని, అరటి స్తంభాలతో గాని మండపము కట్టినవాళ్లు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండప్రణామమును చేసిన వాళ్లు అశ్వమేథ పుణ్యవంతులవుతారు. విష్ణువున కెదురుగా జప, హొమ దేవతార్చనలు చేసే వాళ్లు పితరులతో సహా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు. స్నానము చేసి తడిబట్టలతోనున్న వానికి పొడిబట్టని దానము చేసిన వాడు పదివేల అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి - పుష్పము పరాగమువలె యెగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజను చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది.

కార్తీకమాసమందు యే స్త్రీ అయితే బృందావనాన గోమయంతో అలికి, పంచరంగులతోనూ, శంఖ- పద్మ- స్వస్తికాదిరంగ వల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది. విష్ణు సన్నిధిలో నందా దీపాన్ని ఆర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయినోళ్ల అదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీకమాసములో శివుని జిల్లేడుపూలతో పూజించినవాడు దీర్ఘయువై, అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణ్వాలయములో మండపాన్ని అలంకరించినవారు హరి మందిరములో చిరస్దాయిగా వుంటారు. హరిని మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమై పోతాయి. తులసీ గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపాలన్నీ నాశనమై పోతాయి. భక్తియుక్తులై అన్నదానమును చేసే వారి పాపాలు గాలికి మంచుతునకలలా యెగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ నాలుగూ ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ వుంది. స్నాన దానాదులను నాచరింపనివారూ, లోభియై యధాశక్తిగా చేయని వారు నూరు జన్మలు కుక్కగా పుట్టి, తదుపరి నూరుపుట్టుకలూ శునకయోనిని జన్మిస్తారు.

కార్తీకమాసములో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని భేదించుకుని స్వర్గానికి వెడతారు. పద్మాలతో పూజించినవారు చిరకాలము సూర్యమండలములోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా! కార్తీక మాసములో యెవరైతే అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గధిపతులవుతారు. మాల్యములు - తులసీదళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక్క సూక్ష్మాన్ని చెబుతాను విను, అశక్తులయిన వాళ్లు.


శ్లో || కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ !

మాసస్నానేన యత్సుణ్యం తత్పుణ్యం లభతేనృప !!

శ్లో|| ఆద్యేంతియే తిథౌ మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ !

మాస స్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః !!


కార్తీకమాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు గాని, పూర్ణమనాడు గాని, అమావ్యానాడు గాని సంకల్పరహితముగా ప్రాతఃస్నాన మాచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది. 'ఆ పాటి శక్తి కూడా లేని వాళ్లు కార్తీకమాసము నెల రోజులూ ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా, వినినా కూడా స్నానఫలాన్ని పొందుతారు. ఇది కేవలం ఆశక్తులకే సుమా! మహీశా! కార్తీకమాసములో యితరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవారి పాపాలు నశించిపోతాయి.


🌹 🌹. కార్తిక పురాణం - 7

కార్తీకమాసము విష్ణుపూజార్ధమై యితరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు. తాము స్వయంగా సంకల్ప పూర్వకముగా విష్ణువును పూజించేవాళ్ళు అవ్యయ పదాన్ని పొందుతారు. కార్తీకమాసము సాయంకాలాలలో దేవాలయాలలో శివ - విష్ణుస్తోత్రాలను పఠించేవారు - కొంతకాలము స్వర్గలోకములో వుండి - అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతీ! కార్తీక మాసములో యెవరైతే హరిహరులను స్మరించకుండా వుంటారో వాళ్లు ఏడుజన్మలపాటు నక్కలుగా పుడతారనడంలో ఏమీ సందేహము లేదు.


ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే సప్తమోధ్యాయ స్సమాప్త:

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ కేశవ అష్టోత్తర శతనామావళీ (యమకృతం) Sri Shiva Kesava Ashtottar Shatanamavali (Yamakritam)





🌹 కార్తీక మాసంలో విశేష ఫలితాలను ఇచ్చే శ్రీ శివ కేశవ అష్టోత్తర శతనామావళీ (యమకృతం) - తప్పక పఠించండి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


🌹 Sri Shiva Kesava Ashtottara Shatanamavali (Yamakritam) which gives special results in the month of Kartika - Must watch and recite. 🌹

Prasad Bharadhwaja

🌹🌹🌹🌹🌹🌹



ఓం శ్రీ కాంతాయ నమః

ఓం శివాయ నమః

ఓం అసురనిబర్హణాయ నమః

ఓం మన్మధరిపవే నమః

ఓం జనార్థనాయ నమః

ఓం ఖండపరశవే నమః

ఓం శంఖపాణయే నమః

ఓం శశిశేఖరాయ నమః

ఓం దామోదరాయ నమః

ఓం త్రిపురసూదనాయ నమః|| 10



ఓం అంబుదరనీలాయ నమః

ఓం స్ధాణవే నమః

ఓం ఆనందకందాయ నమః

ఓం సర్వేశ్వరాయ నమః

ఓం గోవిందాయ నమః

ఓం భూతేశాయ నమః

ఓం గోపాలాయ నమః

ఓం గంగాధరాయ నమః

ఓం చాణూరమర్దనాయ నమః

ఓం చండికేశాయ నమః|| 20



ఓం కంసప్రణాశనాయ నమః

ఓం కర్పూరగౌరాయ నమః

ఓం గోపీపతయే నమః

ఓం శంకరాయ నమః

ఓం పీతవసనాయ నమః

ఓం గిరిశాయ నమః

ఓం గోవర్ధనోద్ధరణాయ నమః

ఓం బాలమృగాంక వర్ణాయ నమః

ఓం మాథవాయ నమః

ఓం భవాయ నమః|| 30



ఓం వాసుదేవాయ నమః

ఓం విషమేక్షణాయ నమః

ఓం మురారయే నమః

ఓం వృషభధ్వజాయ నమః

ఓం హృషీకపతయే నమః

ఓం భూతపతయే నమః

ఓం శౌరయే నమః

ఓం ఫాలనేత్రాయ నమః

ఓం కృష్ణాయ నమః

ఓం హరాయ నమః|| 40



ఓం గరుడధ్వజాయ నమః

ఓం కృతివసనాయ నమః

ఓం కల్మషారయే నమః

ఓం గౌరీపతయే నమః

ఓం కమరాయ నమః

ఓం శూలినే నమః

ఓం హరయే నమః

ఓం రజనీశకలావంతసాయ నమః

ఓం రమేశ్వరాయ నమః

ఓం పినాకపాణయే నమః|| 50



ఓం శ్రీరామాయ నమః

ఓం భర్గాయ నమః

ఓం అనిరుద్ధాయ నమః

ఓం శూలపాణయే నమః

ఓం నృసింహయ నమః

ఓం త్రిపథగార్ద్రజటాకలాపాయ నమః

ఓం మురహరాయ నమః

ఓం ఈశాయ నమః

ఓం రాఘవాయ నమః

ఓం ఉరగాభరణాయ నమః|| 60



ఓం పద్మనాభాయ నమః

ఓం ఉగ్రాయ నమః

ఓం మధుసూదనాయ నమః

ఓం పినాకపతయే నమః

ఓం యాదవే నమః

ఓం ప్రమధాదినాథాయ నమః

ఓం నారాయణాయ నమః

ఓం మృత్యుంజయాయ నమః

ఓం పురుషోత్తమాయ నమః

ఓం త్రిదశైకనాథాయ నమః|| 70



ఓం అచ్యుతాయ నమః

ఓం కామశత్రవే నమః

ఓం అబ్జపాణయే నమః

ఓం దిగ్వసనాయ నమః

ఓం చక్రపాణయే నమః

ఓం భూతేశాయ నమః

ఓం బ్రహ్మణ్యదేవాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం ముకుందాయ నమః

ఓం విశ్వేశ్వరాయ నమః|| 80



ఓం సనాతనాయ నమః

ఓం త్రినేత్రాయ నమః

ఓం రావణారయే నమః

ఓం శ్రీకంఠాయ నమః

ఓం ధర్మధురిణాయ నమః

ఓం శంభవే నమః

ఓం కమలాధీశాయ నమః

ఓం ఈశానాయ నమః

ఓం యదుపతయే నమః

ఓం మృడాయ నమః|| 90



ఓం ధరణీధరాయ నమః

ఓం అంధకహరాయ నమః

ఓం శార్జ్గపాణయే నమః

ఓం పురారయే నమః

ఓం విష్ణవే నమః

ఓం నీలకంఠాయ నమః

ఓం వైకుంఠాయ నమః

ఓం దేవదేవాయ నమః

ఓం మధురిపవే నమః

ఓం త్రిలోచనాయ నమః|| 100



ఓం కైటభరిపవే నమః

ఓం చంద్ర చూడాయ నమః

ఓం కేశినాశాయ నమః

ఓం గిరీశాయ నమః

ఓం లక్ష్మీ పతయే నమః

ఓం త్రిపురారయే నమః

ఓం వసుదేవ సూనవే నమః

ఓం త్ర్యక్షాయ నమః|| 108



ఇతి శ్రీ శివకేశవ అష్టోత్తర శతనామావళి ||

🌹🌹🌹🌹🌹

కాశీ విశ్వేశ్వరుని పంచామృత అభిషేకం The Panchamrit Abhishekam of Kashi Vishweshwara (a YT Short)



https://youtube.com/shorts/GHqy0Tc6DZU


🌹 కాశీ విశ్వేశ్వరుని పంచామృత అభిషేకం 🌹

🌹 The Panchamrit Abhishekam of Kashi Vishweshwara 🌹



Like and Share https://youtube.com/@ChaitanyaVijnaanam

ప్రసాద్ భరద్వాజ


కార్తీక మాసం 6వ రోజు పూజించ వలసిన దైవం The god to be worshipped on the 6th day of Kartika month


🌹కార్తీక మాసం 6వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

నిషిద్ధములు:- ఇష్టమైనవి , ఉసిరి

దానములు:- చిమ్మిలి

పూజించాల్సిన దైవము:- సుబ్రహ్మణ్యేశ్వరుడు

జపించాల్సిన మంత్రము:- ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా



🌹The god to be worshipped on the 6th day of Kartika month - Mantra to be performed - Donation - Offering 🌹

Prasad Bharadhwaja

Restrictions:- favorites , breath

Donations:- Chimmili

The God to be worshipped:- Subramanyeshwarudu

The mantra to be chanted:- Om Sum.Bram. Subrahmanyaya Swaha




007 - కార్తీక పురాణం - 6 : అధ్యాయము 6 : 6. దీపదాన విధి మహత్యం Kartika Puranam - 6 : Chapter 6 : 6. The significance of offering lamps


🌹. కార్తీక పురాణం - 6 🌹

అధ్యాయము 6

🌻 6. దీపదాన విధి మహత్యం, లుబ్ద వితంతువు స్వర్గమున కేగుట. 🌻

ప్రసాద్ భరద్వాజ



🌹. Kartika Puranam - 6 🌹

Chapter 6

🌻 6. The significance of offering lamps: even the miser attains heaven. 🌻

Prasad Bharadwaja


శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు రాజర్షీ, జనకా! ఈ కార్తీక మాసము ముప్పయి రోజులు కూడా - ఎవరైతే శ్రీమహావిష్ణువును కస్తూరీ, గంథాదులతోనూ, పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితము లభిస్తుంది. కార్తీక మాసములో సంధ్యావేళ విష్ణుసన్నిధిలో దీపారాధనమును చేసినా, దీపదానము చేసినా వారు విష్ణులోకాన్ని పొందుతారు. ప్రత్తిని శుభ్రపరచి దానితో వత్తిని చేసి, బియ్యప్పిండి లేదా గోధుమపిండితో ప్రమిదను చేసి ఆవునేతిని పోసి, ఆ ప్రతివత్తిని తడిపి వెలిగించి ఒకానొక సధ్భ్రాహ్మణుని ఆహ్వానించి, చివరి రోజున వెండి ప్రమిదను, భమిడి వత్తినీ చేయించి, వాటిని బియ్యపు పిండి మధ్యన వుంచి, పూజా నివేదనాదులను పూర్తిచేసి, బ్రహ్మణులకు భోజనము పెట్టి అనంతరము - తాము స్వయంగా


🌻. దీపదాన మంత్రము

మంత్రం :

సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంప చ్చుభావహం ! దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ!!

'జ్ఞానమునూ, సంపదలనూ,శుభములనూ కలిగించే దైవ, దీపదానాన్ని చేస్తున్నాను. దీని వలన నాకు నిరంతరము శాంతి, సుఖము లేర్పడుగాక' అని చెప్పుకుంటూ, పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసినవారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ ఈ దీపదానము వలన విద్య, జ్ఞాన, ఆయుర్వృద్ధి, అనంతరము స్వర్గభోగాలూ కలుగుతాయి. మనోవాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి. నిదర్శనార్ధమై ఒక కథను వినిపిస్తాను విను.



🌻. లుబ్ధ వితంతువు మోక్షమందుట 🌻

పూర్వం ద్రావిడ దేశములో ఒక అనాథ వితంతు వుండేది. ఆమె రోజూ భిక్షాటనమును చేసి, వచ్చిన దానిలో - మంచి అన్నమునూ, కూరలని విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తిపడుతూ డబ్బును వెనకేయసాగినది. ఇతరుల యిండ్లలో వంటపనులు, కుట్టుపనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ వుండేది. అదిగాక ద్రవ్యభిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జనాలగ్నమానసయైన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప యేనాడూ హరినామస్మరణ చేయడంగాని, హరికథనో, పురాణాన్నో వినడంగాని, పుణ్యతీర్ధ సేవనమునుగాని, ఏకాదశీ వుపవాసమును గాని చేసి యెరుగదు. ఇటువంటి లుబ్ధరాలింటికి దైవవశాన - శ్రీరంగ యాత్రీకుడైన ఒక బ్రహ్మనుడు వచ్చి - ఆమె స్ధితిని చూసి - ఆమెకు నరకము తప్పదని గుర్తించి, జాలిపడి - ఆమెను మంచి దారిలో పెట్టదలచి -

'ఓ అమాయకురాలా! నేను చెప్పేది శ్రద్దగా విని ఆలోచించుకో. ఈ కేవలము చీమూ - నెత్తురూ - మాంసమూ - ఎలుకలతో కూడుకుని సుఖదుఃఖ లంపటమై వున్నదే తప్ప, ఈ తోలు శరీరము వట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి - అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము. ఈ దేహము నశించగానే ఆ పంచభూతములు కూడా - ఇంటి కొప్పు మీద కురిసి నలుదిక్కులకూ చెదరిపోయే వాననీళ్లలా - చెదరిపోతాయి. నీటి మీద నురుగులాటి నీ తనువు నిత్యము కాదు. ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే - ఆశల అగ్నిలో పడే మిడతలవలె మసి కావడమే తప్ప మేలనేది లేదు. మోహాన్ని, భ్రమలనూ వదలి పెట్టు. దైవమొక్కడే శాశ్వతుడనీ, సర్వభూతదయకారుడనీ గుర్తించు. నిరతమూ హరిచరణాలనే స్మరించు. కామమంటే - కోరిక, కోపమంటే - దురాగ్రహం, భయమంటే - ఆత్మనాత్మీయ భంగత, లోభమంటే - ధనవ్యయచింత, మోహమంటే - మమతాహంకారాలు - ఇటువంటి ఈ ఆరింటినీ వదలిపెట్టు. నా మాటవిని, యికనుంచయినా కార్తీకమాసములో ప్రాతఃస్నానాన్ని ఆచరించు. విష్ణుప్రీతికై భగవదర్పణంగా దీపదానము చెయ్యి. తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు' అని హితవు చెప్పి, తనదారిన తాను వెళ్లిపోయాడు.

అతగాడి వచోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తను చేసిన పాపాలకై చింతించినది. తానుకూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించినది. అందుచేత ఆ సంవత్సరములో వచ్చిన కార్తీకమాసాననే వ్రతాచరణమును ప్రారంభించినది. సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ల స్నానమును, హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణము - ఈ విధముగా కార్తీక మాసము నెల రోజులూ ఆచరించి చివరిరోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది. తక్షణమే ఆమె బంధాలు నశించి పోయినదై, విగతాసువై విమానారూఢురాలై, శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందినది.

కాబట్టి 'రాజా! కార్తీకమాసములో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసిగాని, తెలియకగాని యెవరైతే దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను నశింప చేసుకొన్నవారే అవుతున్నారు. దీనిని వినినా, చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులవుతారు.

ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే షష్ఠోధ్యాయ స్సమాప్త:


🌹 🌹 🌹 🌹 🌹

రుద్ర నామములు రుద్రాయ నమో నమః Names of Rudra Rudraya Namo Namah



https://youtube.com/shorts/hE1H6HmSWgs


🌹 రుద్ర నామములు రుద్రాయ నమో నమః 🌹

కార్తీక మాసం సందర్భంగా



🌹 Names of Rudra Rudraya Namo Namah 🌹

On the occasion of the month of Kartik



(a YT Short)


'సూర్య నారాయణా ఆదిత్య రూపా నారాయణా' 'Surya Narayana Aditya Rupa Narayana' (a YT Short)



https://youtube.com/shorts/d81YuXFnwz8


🌹 సూర్య నారాయణా ఆదిత్య రూపా నారాయణా 🌹

🌹 Surya Narayana Aditya Rupa Narayana 🌹



Like and Share:  https://youtube.com/@ChaitanyaVijnaanam

ప్రసాద్ భరద్వాజ



కార్తీక మాసం 5వ రోజు పూజించ వలసిన దైవం The god to be worshipped on the 5th day of Kartika month


🌹కార్తీక మాసం 5వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- పులుపుతో కూడినవి

దానములు:- స్వయంపాకం, విసనకర్ర

పూజించాల్సిన దైవము:- ఆదిశేషుడు

జపించాల్సిన మంత్రము:- ఓం ఆదిశేషాయ నమః




🌹The god to be worshipped on the 5th day of Kartika month - Mantra to be performed - Donation - Offering 🌹

Prasad Bharadhwaja


Prohibitions:- the ones with sour

Donations:- Self-pampering, Visanakara

The god to be worshipped:- Adiseshudu

The mantra to be chanted:- Om Adiseshaya Namaha



006 - కార్తీక పురాణం - 5 : 5 వ అధ్యాయము : వనభోజన మహిమ, కిరాత మూషికములు మోక్షము నొందుట Kartika Purana - 5 : Chapter 5: The glory of the forest food, the salvation of the wild mice


🌹. కార్తీక పురాణం - 5 🌹

🌻 5 వ అధ్యాయము : వనభోజన మహిమ, కిరాత మూషికములు మోక్షము నొందుట. 🌻

📚. ప్రసాద్ భరద్వాజ



🌹. Kartika Purana - 5 🌹

🌻 Chapter 5: The glory of the forest food, the salvation of the wild mice. 🌻

📚. Prasad Bharadwaja



'ఓ శివధనుస్సంపన్నా! జనకరాజా! శ్రద్దగా విను. మనము చేసిన పాపాలన్నింటినీ- నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే వుంది. కార్తీకమాసములో విష్ణుసన్నిధిని ఎవరయితే భగవద్గీతా పారాయణమును చేస్తారో - వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి. అందునా పదీ - పదకొండు అధ్యాయాలను పారాయణ చేసేవారు - వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరయితే కార్తీకమాసంలో తులసీదళాలతోగాని, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణుపూజను చేస్తారో -వాళ్లు వైంకుఠానికి చేరి, విష్ణు సమభోగాల ననుభవిస్తారు. ఈ కార్తీకమాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే - ఏ పురాణాన్నయినా సరే ప్రవచించేవారు సర్వ కర్మబంధ విముక్తులవుతారు.


🌻. కార్తీక వనభోజనము

శ్లో" యః కార్తీకే సితే వనభోజన మాచరేత్

సయాతి వైష్ణవం ధామ సర్వపాపైః ప్రముచ్యతే !!


కార్తీకమాస శుక్లపక్షంలో వనభోజనము చేసినవారు - పాపవిముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజా, భోజన, తర్పణ ఫలాలతో - పాపీ క్షుద్ర ఛండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచి పెట్టుకు పోతుంది. కాబట్టి మహారాజా! కార్తీకమాస శుక్లపక్షంలో అన్నిరకాల వృక్షాలతో బాటుగా ఉసిరిచెట్టు కూడా వున్న తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామము నుంచి, గంధ పుష్పాక్షతాదులతో పూజించి, యధాశక్తి బ్రాహ్మణుల నాహ్వానించి గౌరవించి, వారితో కలసి భోజనము చేయాలి. ఇలాగున - కార్తీక మాసములో వనభోజనాన్ని యెవరయితే నిర్వహిస్తారో, వాళ్లు ఆయా కాలాలలో చేసిన సర్వపాపాల నుంచీ తెములుకుని, విష్ణులోకాన్ని పొందుతారు. జనకజనపతీ! ఈ కార్తీక మహాత్మ్యాన్ని భక్తిశ్రద్ధలతో విన్న బ్రహ్మణుడొకడు దుర్యోనీ సంకటము నుంచీ రక్షింపబడ్డాడు. కథ చెబుతాను విను.


🌻. దేవదత్తో పాఖ్యానము:

పూర్వం కావేరీ తీరములో దేవశర్మ అనే సద్భ్రాహ్మణుడుండేవాడు. అతనికొక పరమ దుర్మార్గుడయిన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి, అతగాడిని పాపవిముక్తుని చేయాలని సంకల్పించి 'నాయనా! రోజూ కార్తీక ప్రాతః స్నానాన్ని ఆచరించు. సాయంకాలమున హరి సన్నిధిలో దీపారాధనమును చేస్తూ వుండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివికా' అని చెప్పాడు.

కాని దుర్వర్తనుడయిన ఆ బ్రాహ్మణ పుత్రుడు - తానటువంటి కట్టుకథలను నమ్మననీ, కార్తీక వ్రతాన్ని ఆచరించననీ - తండ్రికి యెదురుతిరిగాడు. అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుడిని 'అడవిలోని చెట్టు తొర్రలో యెలుకవై పడివుండు' అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాలబడి, తనకు తరణోపాయం చెప్పమని కోరగా - ఆ తండ్రి ' నాయనా ! నీ వెప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణముగా వింటావో అప్పుడే నీ యెలుక రూపము పోతుం'దని - శాపవిముక్తి అనుగ్రహించాడు.


🌻. దేవదత్తునికి శాపవిముక్తి:


పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషికరూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యములో ఫలవంతమైనదీ - అనేక జంతువుల కాధారభూతమైనదీ అయిన ఒకానొక మహావృక్ష కోటరములో మనసాగాడు. ఇలా కొంతకాలము గడిచాక, ఒకానొకప్పుడు మహర్షియైన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానమాచరించి వచ్చి, ఆ యెలుక వున్న చెట్టు మొదలునందు దువిష్ణుడై తన పరివారానికి పరమపావనమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపించసాగాడు.

ఆ సమయంలో దయాహీనుడూ, పాపాలపుట్టా, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడూ అయిన ఒక కిరాతకుడాప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనమువల్ల ఉపకారమేగాని, అపకారము యేనాడూ జరుగదు. అదేవిధముగా, విశ్వామిత్రాది తపోబృంద దర్శనమాత్రం చేత - రవంత పశ్చాత్తప్తుడూ - జ్ఞానీ అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి 'అయ్యా ! మీరు చెప్పుకుంటున్న కథలేమిటి? అని వింటూంటే - నాకీ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యమేమిటో చెప్పండి' అనగానే, అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వమిత్రుడు - 'నాయనా! మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసములో యెవరయినా సరే తెలిసిగాని, తెలియకగాని స్నాన దాన జప తపః పురాణ శ్రవణాదును చేసినట్లయితే వారు వారి సర్వ పాపాలనుంచీ విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించేవాళ్లు జీవన్ముక్తులవుతారు' అని తెలియజేశాడు.


కార్తీక పురాణం - 5

ఈ విధముగా కిరాతకునికి చెబుతూన్న కార్తీక మహాత్మ్యాన్ని వినడమే తడవుగా - తొర్రలోనున్న యెలుక తన శాపగ్రస్తరూపాన్ని వదలివేసి, పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది - విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వవుగాధను వినిపించి, ఆ బుషులనుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలిపోయాడు.

అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహత్మ్యాన్ని కడకంటా తెలుసుకోవడం వలన - ఆ జన్మకి కిరాతకూడయ్యీ కూడా - దేహంతరాన ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఓ జనకరాజా! ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకముగా నయినాసరే కార్తీక వ్రతమాచరించాలి. లేదా, కనీసము కార్తీక మహాత్మ్యాన్నయినా భక్తి శ్రద్దలతో వినాలి.

ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్మ్యమందు. పంచమోధ్యాయ స్సమాప్త:

🌹 🌹 🌹 🌹 🌹

నవనాగ నామ స్తోత్రం - సర్ప సూక్తం - నాగ స్తోత్రం Navanaga Nama Stotram - Sarpa Suktam - Naga Stotram



https://youtu.be/W7z8M6_6yRo



🌹 నవనాగ నామ స్తోత్రం - సర్ప సూక్తం - నాగ స్తోత్రం 🌹

🐍 కలిదోష నివారణకు, సర్వ దోష విముక్తికి తప్పక పఠించ వలసిన స్తోత్రాలు 🐍



🌹 Navanaga Nama Stotram - Sarpa Suktam - Naga Stotram 🌹

🐍 Stotras that must be recited to prevent Kali Dosha and get rid of all sins 🐍


పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం పూజా విధులలో కొలుస్తారు. అవి అనంత, వాసుకి, శేష, పద్మ, కంబాల, కర్కోటకం, ఆశ్వతార, ధృతరాష్ట్ర, శంఖపాల, కలియా, తక్షక, పింగళ నాగులు. సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాముకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.

Like and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹

'నమో నాగరాజ నమో ఫణిరాజా నమో నమో నాగేంద్రా' 'Namo Nagaraja Namo Phaniraja Namo Namo Nagendra' (a YT Short)



https://youtube.com/shorts/qaqX0xb2mBQ


🌹 నమో నాగరాజ నమో ఫణిరాజా నమో నమో నాగేంద్రా 🌹


🌹 Namo Nagaraja Namo Phaniraja Namo Namo Nagendra 🌹


(a YT Short)


నాగులచవితి రోజున చేయవలసిన సర్ప ప్రార్థన Nagulu Prarthana (Snake prayer) to be performed on Nagula Chavithi day



https://youtube.com/shorts/oGkWiySUAlA


🌹 నాగులచవితి రోజున చేయవలసిన సర్ప ప్రార్థన. తప్పక వినండి. 🌹

🌹 Snake prayer to be performed on Nagula Chavithi day. Must listen. 🌹


(a YT Short)

ఆపదలను కష్టాలను తొలగించి, దోషాలను నివారించే The Navanaga Nama Stotram - Sarpa Suktham


https://youtu.be/mxNBm68X2I8


🌹ఆపదలను కష్టాలను తొలగించి, దోషాలను నివారించే, రక్షణను కల్పించే నవనాగ నామ స్తోత్రం - సర్ప సూక్తం. 🌹

🌹The Navanaga Nama Stotram - Sarpa Suktham, which removes obstacles and hardships, prevents faults, and provides protection. 🌹



🌹🍀. నాగుల చవితి శుభాకాంక్షలు అందరికి, Nagula Chavithi Good Wihses to All 🍀🌹

ప్రసాద్ భరద్వాజ


ఈ సందేశం నాగుల చవితి పర్వదినాన్ని గురించి వివరిస్తోంది. నాగుల చవితి పూజ విశిష్టతను, శరీరంలోని కాలనాగం పాత్రను, మనస్సులో ఉన్న కోపం, కామం మొదలైన పాపాలు ఎలా హరించ బడతాయో వివరిస్తుంది. శ్రీ మహావిష్ణువు శేషపాన్పుగా మారే ఆంతర్యమని కూడా తెలియజేస్తుంది. నవనాగ నామ స్తోత్రం, సర్ప సూక్తం వాచ్యముల విశేషాలు, వాటి ఫలితాలు ఇవ్వబడ్డాయి.

🌹🌹🌹🌹🌹


నాగుల చవితి శుభాకాంక్షలు Greetings on Nagula Chavithi


🐍. నాగులచవితి విశిష్టత 🐍

🌹🍀. నాగుల చవితి శుభాకాంక్షలు అందరికి, Nagula Chavithi Good Wihses to All 🍀🌹

ప్రసాద్ భరద్వాజ


కాలనాగము మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే 'శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలో గల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది.


🍀. నవనాగ నామ స్తోత్రం - సర్ప సూక్తం 🍀

అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం!

శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా!!


ఫలశృతి:

ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనామ్!

సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతః కాలే విశేషతః!


సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః!

సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీభవేత్!!


సర్ప దర్శనకాలే వా పూజాకాలే చ యః ఫఠేత్!

తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్‌!!


🙏ఓం నాగరాజాయనమః ప్రార్థయామి నమస్కరోమి🙏

ఇతి శ్రీ నవనాగ స్తోత్రం.

🐍🐍🐍🐍🐍




🌹. సర్ప సూక్తం 🌹


బ్రహ్మలోకేషు యేసర్పాః శేషనాగ పురోగమాః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


ఇంద్రలోకేషు యేసర్పాః వాసుకీ ప్రముఖాదయః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


కౌద్ర వేయాశ్చ యేసర్పాః మాతృభక్తి పరాయణాః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


ఇంద్రలోకేషు యేసర్పాః తక్షకా ప్రముఖాదయః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


సత్యలోకేషు యేసర్పాః వాసుకి నా సురక్షితాః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


మలయేచైవ యేసర్పాః కర్కోటక ప్రముఖాదయః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


పృథివ్యాం చైవ యేసర్పాః యే సాకేత నివాసినః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


గ్రామే యదివారణ్యే యేసర్పాః ప్రచరన్తిచ

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


సముద్ర తీరే యేసర్పాః యే సర్పా జలవాసినః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


రసాతలేఘ యేసర్పాః అనంతాది మహాబలాః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

🌹 🌹 🌹 🌹 🌹


005 - కార్తీక పురాణం - 4 : 4 వ అధ్యాయము : దీపారాధన మహిమ, శతృజిత్ కథ Kartika Purana - 4 ; Chapter 4: The glory of Deeparadhana, the story of Shatrujit


🌹. కార్తీక పురాణం - 4 🌹

🌻 4 వ అధ్యాయము : దీపారాధన మహిమ, శతృజిత్ కథ. 🌻

📚. ప్రసాద్ భరద్వాజ



🌹. Kartika Purana - 4 🌹

🌻 Chapter 4: The glory of Deeparadhana, the story of Shatrujit. 🌻

📚. Prasad Bharadwaja



జనకుడు అడుగుతున్నాడు: "హే బ్రహ్మర్షీ ! నువ్వింత వరకూ కార్తీక మహాత్మ్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో యీ వ్రత మాచరించాలో - ఏయే దానాలు చేయాలో కూడా తెలియజేయి."

వశిష్ట ఉవాచ: అన్ని పాపాలనూ మన్ను చేసేదీ, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేదీ అయిన యీ కార్తీక వ్రతానికి ఫలానా 'సంకల్పము' అనేది హాస్యాస్పదమయిన విషయము.

ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల వ్రత ధర్మాలనూ, తత్ఫలాలనూ చెబుతాను విను.

కార్తీక మాసపు సాయంకాలము శివాలయములో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది. శివాలయ గోపురద్వార, శిఖరాలయందుగానీ - శివలింగ సన్నిధినిగానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలూ అంతరించిపోతాయి. ఎవరయితే కార్తీకములో శివాలయములో ఆవునేతితోగాని, నువ్వులనూనెతో గాని, ఇప్ప - నారింజనూనెలతో గాని దీప సమర్పణ చేస్తారో - వాళ్లు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నయినా సమర్పించిన వాళ్లు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసము, కాంక్షతో గాని - నలుగురి నడుమా బడాయి కోసం గానీ దీపాన్నిచ్చే వాళ్లు కూడా శివప్రియులవుతారు. ఇందు కుదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను.


🌻. కార్తీక దీపారాధనా మహిమ

పూర్వము పాంచాలదేశాన్ని పరిపాలించే మహారాజొకడు, కుబేరుని మించిన సంపద కూర్చుకుని వున్నా, కుమారులు లేని కారణంగా క్రుంగిపోయినవాడై, కరంగపాణికై తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని - అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకుని, 'ఓ రాజా! ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పని లేదు. కార్తీక మాసములో శివప్రీతిగా వ్రతమాచరించి, బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే - నీకు తప్పక పుత్రక సంతానము కలుగుతుందని" చెప్పాడు. బుషి వాక్యమును శిరోధార్యముగా తలచి - ఆ పాంచాలుడు తన పట్టణము చేరి, కార్తీక వ్రతమాచరించి, శివప్రీతికై బ్రహ్మణులకు దీపదానములను చేశాడు. తత్ఫలముగా మహారాణి నెల తప్పి, యుక్తకాలములో పురుష శిశువును ప్రసవించింది. రాజ దంపతులా శిశువుకి 'శత్రుజిత్తు' అని పేరు పెట్టారు.


🌻. శత్రుజిత్తు చరిత్రము

ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్థమానుడై పెరిగి, యువకుడై, వీరుడై వేశ్యాంగనా లోలుడై, అప్పటికీ తృప్తి చెందక, పరస్త్రీరక్తుడై, యుక్తా యుక్త విచక్షణా నాస్తికుడై, శాస్త్ర దిక్కారియై, వర్ణసంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదరించుచు, స్వేచ్చాచారియై ప్రవర్తింపసాగేడు. అటువంటి సందర్భంలో -సౌందర్యరాశి సింహమధ్యమా, అరటి దోనెల వంటి తొడలు గలదీ, పెద్ద పెద్ద పిరుదులూ, కుచాలూ, కన్నులూ కలదీ, చిలుకవలే చక్కని పలుకులు గలదీయైన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య, శౌర్య, తేజో విరాజితుడైన యీ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడినది. తత్కారణముగా - ఆమె రోజూ రాత్రి తన భర్త నిద్రపోగానే - సంకేత స్ధలంలో రాజకుమారుని కలిసి - సురత క్రీడలలో సుఖించేది. రంకూ- బొంకూ దాగవు గదా! ఏదో విధంగా యీ సంగతి ఆ బాపనదాని భర్తకు తెలిసిపోయినది. అది మొదలు అతనొక కత్తిని ధరించి - ఈ రంకు జంటకు ప్రత్యక్షంగా చూసి, వారి గొంతు లుత్తరించాలని తిరుగుతున్నాడు. మహాకాముకురాలయిన జారిణిగాని, ఆ శత్రుజిత్తుగాని యీ సంగతి నెరుగరు.

రోజులిలా గడుస్తూ వుండగా ఒకానొక కార్తీక పూర్ణిమా సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్ధానముగా యెంచుకున్నారు. అపరరాత్రివేళ వాళ్లు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా వుంది. ఆ బాపనిది తన చీరచెంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడెక్కడినించో ఆముదమును తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీప్రమిదలో ఆ రెంటిని జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగములో లీనమయ్యారు.

ఈ విషయాన్ని ఆ బాపనదాని మొగుడెలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకుని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తునీ, అనంతరం తన భార్యనూ తెగనరికి - తాను కూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్లు ముగ్గురూ ఆ రాత్రి అక్కడికక్కడే విగతజీవులు కాగానే - పాశహస్తులైన యమదూతలూ - పవిత్రాత్ములైన శివదూతలూ - ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలా రాకుమారుడినీ, రంకులాడినీ తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలీ యమాయకపు బాపడిని తమతో నరకమువైపు లాగుకొనిపోసాగారు. అందుకచ్చెరుపడిన పారుడు - "ఓ శివదూతలారా! కానిపని చేసిన వారికి కైలాసభోగము - నా వంటి సదాచారుడికి నరక యోగమూనా?' అని ప్రశ్నించగా, అందులకా శివదూతలు - 'వీరెంత పాపాత్ములయినా - ఈ రోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి, శివాలయములో - అందునా - శిథిలాయములో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు గనక, వారి పాపాలూ, నేరాలూ నశించి పుణ్యాత్ములయ్యారు.

ఏ కారణం చేతనైనాసరే కార్తీక మాసములో అందునా పౌర్ణమినాడు, పైగా సోమవారమునాడు దేవాలయములో దీపారాధనము చేయడం వలన అత్యధిక పుణ్యాత్యులైన వీళ్లని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివీ, పాపాత్ముడివీ అయ్యావు. అందుకే, నీకు నరకము - వీరికి కైలాసము' అని చెప్పారు.

బ్రహ్మణుడికీ, శివపారిషదులకూ జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకుని, 'అయ్యలారా! దోషులము మేమైయుండగా, మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యము గాదు. కార్తీక మాసము దొడ్డదయితే, అందునా పూర్ణిమ గొప్పదయితే, సోమవారము మరీ ఘనమయనదయితే, దీపారధాన మరీ పుణ్యకరమైనదయితే మాతోబాటే కలసి మరణించిన ఆ బాపనికి కూడా కైలాసమీయక తప్ప'దని వాదించడం జరిగింది. తత్ఫలముగా - శత్రుజిత్తు తానూ, తన ప్రియురాలూ ఆచరించిన వత్తీ, తైలముల పుణ్యము తాముంచుకుని, ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునకు ధారపోయగా , శివదూతలా విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి - తమతో కైలాసానికి తీసికొనివెళ్ళారు.

కాబట్టి, ఓ మిధిలానగరాధీశ్వరా ! కార్తీకమాసములో తప్పనిసరిగా - శివాలయములోగాని, విష్ణ్వాలయంలో గాని దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్లు జ్ఞానులై, తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందునా, శివాలయములో చేసిన దీపారాధన విరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని - కార్తీక మాసము నెల పొడుగునా నువ్వు శివాలయములో దీపారాధన చెయ్యి.

ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్మ్యమందు చతుర్థాధ్యాయ స్సమాప్త:

🌹 🌹 🌹 🌹 🌹

ఓం శ్రీ మహా లక్ష్మి పాలయమాం Om Sri Maha Lakshmi Palayamam (a YT Short)



https://youtube.com/shorts/D7xsD11ZZWQ


🌹 ఓం శ్రీ మహా లక్ష్మి పాలయమాం 🌹

🌹 Om Sri Maha Lakshmi Palayamam 🌹


(a YT Short)

శ్రీ మహా లక్ష్మి నమోస్తుతే యోగ సంభూతే నమోస్తుతే Salutations to Goddess Maha Lakshmi, born of Yoga, salutations to you (a YT Short)



https://youtube.com/shorts/pJRh5sZs7WE


🌹 శ్రీ మహా లక్ష్మి నమోస్తుతే యోగ సంభూతే నమోస్తుతే 🌹

🌹 Salutations to Goddess Maha Lakshmi, born of Yoga, salutations to you 🌹

(a YT Short)


శ్రీ దుర్గా మాత పంచామృత అభిషేకం Panchamruta Abhishekam of Shri Durga Mata (a YT Short)



https://youtube.com/shorts/VEtlh3DSyK4


🌹 శ్రీ దుర్గా మాత పంచామృత అభిషేకం 🌹

🌹 Panchamruta Abhishekam of Shri Durga Mata 🌹




004 - కార్తీక పురాణం - 3 : 3వ అధ్యాయం Kartika Purana - 3 : Chapter 3


🌹. కార్తీక పురాణం - 3 🌹

🌻 3వ అధ్యాయం : కార్తీకస్నాన మహిమ, బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. 🌻

📚. ప్రసాద్ భరద్వాజ


🌹. Kartika Purana - 3 🌹
🌻 Chapter 3: The glory of Kartika Snana (holy bath in Kartika month), liberation for Brahma Rakshasas. 🌻
📚. Prasad Bharadwaj


బ్రహ్మర్షియైన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షియైన జనకునికి ఇంకా యిలా చెప్పసాగాడు; 'రాజా! స్నానదాన జప తపాలలో దేవినిగానీ, ఈ కార్తీకమాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా - అది అక్షయమైన ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖలలాసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో - ఆటువంటివాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు.


శ్లో" పౌర్ణమ్యాం కార్తీకేమాసి స్నానాందీస్తు నాచరన్ !

కోటిజన్మసు చండాలయోనౌ సంజాయతే నృప !!


శ్లో" క్రమాద్యోనౌ సముత్సన్నో భవతి బ్రహ్మరాక్షసః !

అత్త్రై వోదాహరంతీ మ మితిహాసం పురాతనమ్ !!


భావం: కార్తీక పౌర్ణమినాడు, స్నాన దాన జపోపవాసాలలో ఏ ఒక్కటీ కూడా ఆచరించని వాళ్లు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి, తుదకు బ్రహ్మ రాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను.


అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్త్వనిష్ఠుడనే బ్రహ్మణుడుండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పకులనివాడూ, అన్ని భూతములయందునూ దయాళువూ, తీర్థాటన ప్రియుడూ అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్రా సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యములో గోదావరీ తీరానగల ఒకానొక యెత్తయిన మర్రిచెట్టు మీద - కారు నలుపు కాయచ్చాయ గలవాళ్లూ, ఎండిన డొక్కలు కలవాళ్లూ, ఎర్రని నేత్రములు - గడ్డములూ కలవాళ్లూ, గ్రుచ్చబడిన ఇనుపతీగెలకుమల్లే పైకి నిక్కివున్న తలవెంట్రుకలతో, వికృత వదనార విందాలతో, కత్తులూ, కపాలాలూ ధరించి, సర్వజీవ భయంకరులుగా వున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు నాలుగు వైపులా కూడా పన్నెండు మైళ్ల దూరంలో యెక్కడా ప్రాణి సంచారమనేదే వుండేది కాదు. అటు వంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరము నుంచే చూసిన తత్వనిష్ఠుడు ఆదిరిపడ్డాడు. దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడినవాడై - శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు.



🌻. తత్వనిష్ఠుడి శరణాగతి

శ్లో" త్రాహి దేవేశ లోకేశ! త్రాహి నారాయ ణావ్యయ సమస్త భయవిధ్వంసిన్! త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ ! త్వత్తోహం జగదీశ్వర !!

అంటే - "దేవతలకూ, లోకాలకూ కూడా యజమానివయిన వాడా ! నారాయణా ! అవ్యయా! నన్ను కాపాడు. అన్నిరకాల భయాలనూ అంతము చేసేవాడూ! నిన్నే శరణుకోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వరా! నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగనివాడను. నన్ను కాపాడు రక్షించు" అని యెలుగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడ నుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి వదించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయము అతని వెనుకనే పరుగెత్తసాగినది. రక్కసులా పారునికి చేరువవుతున్న కొద్దీ, సాత్వికమైన విప్ర తేజస్సు కంటబడడం వలనా - తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతూన్న హరినామము చెవులబడుట వలనా - వెంటనే వారికి జ్ఞానోదయమయింది. అదే తడవుగా ఆ బాపని కెదురుగా చేరుకొని, దండ ప్రణామా లాచరించి, అతనికి తమ వలన కీడు కలుగబోదని నమ్మబలికి, 'ఓ బ్రాహ్మణుడా! నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి. అని పునః పునః నమస్కరించారు. వారి నమ్రతకు కుదుట పడిన హృదయముతో - తత్వనిష్ఠుడు 'మీరెవరు? చేయరాని పనులు వేనిని చేయడం వలన యిలా అయిపోయారు? మీ మాటలు వింటుంటే బుద్దిమంతుల్లా వున్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరముగా చెప్పండి. మీ భయబాధావళి తొలగే దారి చెబుతాను' అన్నాడు.



🌻. ద్రావిడుని కథ

పారుని పలుకులపై, ఆ రక్కసులలో ఒకడు తన కథనిలా వినిపించసాగాడు. 'విప్రోత్తమా! నేను ద్రావిడుడను. ద్రవిడ దేశమందలి మంధరమనే గ్రామాధికారినైన నేను, కులానికి బ్రహ్మణుడనే అయినా - గుణానికి కుటిలుడనీ, వంచనామయ వచః చమత్కారుడినీ అయి వుండేవాడిని. ణా కుటుంబ శ్రేయస్సుకై, అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువలకుగాని, బ్రాహ్మణులకు గాని యేనాడూ పట్టెడన్నమయినా పెట్టి ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడంచేత - నా కుటుంబము నాతో సహా ఏడు తరాల వాళ్లు అధోగతుల పాలయిపోయారు. మరణానంతరము దుస్సహమైన నరకయాతనల ననుభివించి చివరికిలా బ్రహ్మరాక్షసుడనయ్యాను. కృపాయత్త చిత్తుడవై - నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు' అన్నాడు.


🌻. ఆంధ్రదేశీయుని గాథ

రెండవ రాక్షసునిలా విన్నవించుకోసాగేడు - 'ఓ పవిత్రుడా! నేను ఆంధ్రుడను. నిత్యమూ నా తల్లిదండ్రులతో కలహించుచు, వారిని దూషించుచు వుండేవాడిని. నేను నా భార్యాపిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ, తల్లిదండ్రులకు మాత్రం చద్దికూటిని పడవేసే వాడిని. బందావ బ్రాహ్మణ కోటికేనాడూ ఒక పూటయినా భోజనము పెట్టక - విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికే వాడిని. ఆ శరీరము కాలంచేశాక నరకానపడి ఘోరాతి ఘోరమైన బాధలనుభవించి చివరి కిక్కడిలా పరిణమించాను. ఆ ద్రావిదునికివలెనే - నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము' అని అన్నాడు.




కార్తీక పురాణం - 3


🌻. పూజారి కథ

అనంతరం మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొఱపెట్టనారంభించాడు. 'ఓ సదాచార సంపన్నుడా! నేను ఆంధ్రదేశపు బ్రహ్మణుడను. విష్ణ్వాలయంలో పూజారిగా వుండేవాడిని. కాముకుడనూ, అహంభావినీ, కఠినవచస్కుడినీ అయిన నేను - భక్తులు స్వామి వారికర్పించే కైంకర్యాలన్నిటినీ - నా వేశ్యలకు అందచేసి, విష్ణు సేవలను సక్రమముగా చేయక గర్వముతో తెరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి, వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములనుభవించుచు పాపపుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి, అనంతరము యీ భూమిపై నానావిధహీన యోనులలోనూ, నానా నీచజన్మలనూ యెత్తి కట్టకడకీ బెట్టిదమయిన బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. ఓ సదాయుడా! నన్ను మన్నించి - మరలా జన్మించే అవసరం లేకుండా - మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా' అని ప్రార్ధించాడు.


🌻 బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట

తమ తమ పూర్వ భవకృత మహాఘరాశికి - ఎంతగానో పశ్చాత్తాప పడుతూన్న ఆ రక్కసులకు అభయమిచ్చి 'భయపడకండి - నాతో కలిసి కార్తీక స్నానానికి రండి. మీ సమస్త దోషాలూ నశించిపోతాయి' అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడా బ్రహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు - బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయముగా ముందు స్నానం చేసి, పిమ్మట రక్కసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరము


శ్లో" అముకానాం బ్రహ్మరాక్షసత్వ వివారణార్ధం !

అస్యాం కావేర్యాం - ప్రాతఃస్నాన మహం కరిష్యే !!


అనే సంకల్పములతో అతడు విధివిధానముగా స్నానం చేసి, తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా - వారు విగతదోషులూ - దివ్యవేషులూ అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు.

విదేహరాజా! అజ్ఞానము వలన కాని, మోహ - ప్రలోభాల వలన గాని, ఏ కారణము చేతనైనా గాని - కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీనదిలో స్నానమాచరించి, విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహముగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది. అందువల్ల - ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానమును తప్పకుండా చేయాలి. కావేరీలో సాధ్యము కాకపోతే గోదావరిలోనైనా, మరెక్కడయినా సరే - ప్రాతః స్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతః స్నానము చేయరో, వాళ్లు పది జన్మలు చండాలపు యోనులలో పుట్టి, అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు సుమా! కాబట్టి - ఎటువంటి మీమాంసతోటీ నిమిత్తం లేకుండా స్త్రీలుగాని, పురుషులుగాని కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలి.


ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్మ్యమందు త్రయీధ్యాయ స్సమాప్త:

🌹 🌹 🌹 🌹 🌹


కార్తీక మాసం 30 రోజులు - దైవం, మంత్రం, దానం, నైవేద్యం 30 days of Karthika month - Deity, Mantra, Donation, Offering


🌹 కార్తీక మాసం 30 రోజులు - పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


🌹 30 days of Karthika month - God to worship - Mantra to recite - Donation - Offering 🌹

Prasad Bharadhwaja



1వ రోజు:

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు.

దానములు:- నెయ్యి, బంగారం

పూజించాల్సిన దైవము:-స్వథా అగ్ని

జపించాల్సిన మంత్రము:- ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా




2వ రోజు:

నిషిద్ధములు:-తరగబడిన వస్తువులు

దానములు:-కలువపూలు, నూనె, ఉప్పు

పూజించాల్సిన దైవము:-బ్రహ్మ

జపించాల్సిన మంత్రము:-

ఓం గీష్పతయే - విరించియే స్వాహా




3వ రోజు:

నిషిద్ధములు:-

ఉప్పు కలిసినవి, ఉసిరి

దానములు:- ఉప్పు

పూజించాల్సిన దైవము:- పార్వతి

జపించాల్సిన మంత్రము:- ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా




4వ రోజు:

నిషిద్ధములు:- వంకాయ, ఉసిరి

దానములు:- నూనె, పెసరపప్పు

పూజించాల్సిన దైవము:- విఘ్నేశ్వరుడు

జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా




5వ రోజు:

నిషిద్ధములు:- పులుపుతో కూడినవి

దానములు:- స్వయంపాకం, విసనకర్ర

పూజించాల్సిన దైవము:- ఆదిశేషుడు

జపించాల్సిన మంత్రము:- (మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)




6వ రోజు:

నిషిద్ధములు:- ఇష్టమైనవి , ఉసిరి

దానములు:- చిమ్మిలి

పూజించాల్సిన దైవము:- సుబ్రహ్మణ్యేశ్వరుడు

జపించాల్సిన మంత్రము:- ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా




7వ రోజు:

నిషిద్ధములు:- పంటితో తినే వస్తువులు, ఉసిరి

దానములు:- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం

పూజించాల్సిన దైవము:- సూర్యుడు

జపించాల్సిన మంత్రము:- ఓం. భాం. భానవే స్వాహా




8 వ రోజు:

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం

దానములు:- తోచినవి - యథాశక్తి

పూజించాల్సిన దైవము:- దుర్గ

జపించాల్సిన మంత్రము:-

ఓం - చాముండాయై విచ్చే - స్వాహా




9వ రోజు:

నిషిద్ధములు:- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి

దానములు:- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు

పూజించాల్సిన దైవము:- అష్టవసువులు -

పితృ దేవతలు

జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః




10వ రోజు:

నిషిద్ధములు:- గుమ్మడికాయ, నూనె, ఉసిరి

దానములు:- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె

పూజించాల్సిన దైవము:- దిగ్గజాలు

జపించాల్సిన మంత్రము:-

ఓం మహామదేభాయ స్వాహా




11వ రోజు:

నిషిద్ధములు:- పులుపు, ఉసిరి

దానములు:- వీభూదిపండ్లు, దక్షిణ

పూజించాల్సిన దైవము:- శివుడు

జపించాల్సిన మంత్రము:-

ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ




12వ రోజు:

నిషిద్ధములు:- ఉప్పు, పులుపు, కారం, ఉసిరి

దానములు:- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ

పూజించాల్సిన దైవము:- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు

జపించాల్సిన మంత్రము:-

ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా




13వ రోజు:

నిషిద్ధములు:- రాత్రి భోజనం, ఉసిరి

దానములు:- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం

పూజించాల్సిన దైవము:- మన్మధుడు

జపించాల్సిన మంత్రము:-

ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా




14వ రోజు:

నిషిద్ధములు:- ఇష్టమైన వస్తువులు, ఉసిరి

దానములు:- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె

పూజించాల్సిన దైవము:- యముడు

జపించాల్సిన మంత్రము:-

ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా




15వ రోజు:

నిషిద్ధములు:- తరగబడిన వస్తువులు

దానములు:- కలువపూలు, నూనె, ఉప్పు

జపించవలసిన మంత్రం:-

'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'




16వ రోజు:

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది,ఎంగిలి, చల్ల

దానములు:- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము:- స్వాహా అగ్ని

జపించాల్సిన మంత్రము:- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః




17వ రోజు:

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు

దానములు:- ఔషధాలు, ధనం

పూజించాల్సిన దైవము:- అశ్వినీ దేవతలు

జపించాల్సిన మంత్రము:- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా




18వ రోజు:

నిషిద్ధములు:- ఉసిరి

దానములు:- పులిహార, అట్లు, బెల్లం

పూజించాల్సిన దైవము:- గౌరి

జపించాల్సిన మంత్రము:- ఓం గగగగ గౌర్త్యె స్వాహా




19వ రోజు:

నిషిద్ధములు:- నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి

దానములు:- నువ్వులు, కుడుములు

పూజించాల్సిన దైవము:- వినాయకుడు

జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా




20వ రోజు:

నిషిద్ధములు:- పాలు తప్ప - తక్కినవి

దానములు:- గో, భూ, సువర్ణ దానాలు

పూజించాల్సిన దైవము:- నాగేంద్రుడు

జపించాల్సిన మంత్రము:- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం




21వ రోజు:

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం

దానములు:- యథాశక్తి సమస్త దానాలూ

పూజించాల్సిన దైవము:- కుమారస్వామి

జపించాల్సిన మంత్రము:- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా




22వ రోజు:

నిషిద్ధములు:- పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి

దానములు:- బంగారం, గోధుమలు, పట్టుబట్టలు




పూజించాల్సిన దైవము:- సూర్యుడు

జపించాల్సిన

మంత్రము:- ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా




23వ రోజు:

నిషిద్ధములు:- ఉసిరి, తులసి

దానములు:- మంగళ ద్రవ్యాలు

పూజించాల్సిన దైవము:- అష్టమాతృకలు

జపించాల్సిన మంత్రము:-

ఓం శ్రీమాత్రే నమః, అష్టమాతృ కాయ స్వాహా




24వ రోజు:

నిషిద్ధములు:- మద్యమాంస మైధునాలు, ఉసిరి

దానములు:- ఎర్రచీర, ఎర్ర రవికెల గుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు

పూజించాల్సిన దైవము:- శ్రీ దుర్గ

జపించాల్సిన మంత్రము:-

ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా




25వ రోజు:

నిషిద్ధములు:- పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు

దానములు:- యథాశక్తి

పూజించాల్సిన దైవము:- దిక్వాలకులు

జపించాల్సిన మంత్రము:-

ఓం ఈశావాస్యాయ స్వాహా




26వ రోజు:

నిషిద్ధములు:- సమస్త పదార్ధాలు

దానములు:- నిలవవుండే సరుకులు

పూజించాల్సిన దైవము:- కుబేరుడు

జపించాల్సిన మంత్రము:- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా




27వ రోజు:

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, వంకాయ

దానములు:- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు

పూజించాల్సిన దైవము:- కార్తీక దామోదరుడు

జపించాల్సిన మంత్రము:- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా




28వ రోజు:

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ

దానములు:- నువ్వులు, ఉసిరి

పూజించాల్సిన దైవము:- ధర్ముడు

జపించాల్సిన

మంత్రము:- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా




29వ రోజు:

నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి

దానములు:- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము:- శివుడు (మృత్యుంజయుడు)

జపించాల్సిన మంత్రము:- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం,

ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్




30వ రోజు:

నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి

దానములు:- నువ్వులు, తర్పణలు, ఉసిరి

పూజించాల్సిన దైవము:- సర్వదేవతలు, పితృ దేవతలు

జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః




🙏🙏🙏🙏🏽🙏🏽🙏🏽🙏🙏




బ్రహ్మ విష్ణు శివ రూపాయ నమో దత్తాత్రేయ Namo Dattatreya (a YT Short)


https://youtube.com/shorts/LO5nmI69sgs


🌹బ్రహ్మ విష్ణు శివ రూపాయ నమో దత్తాత్రేయ 🌹

🌹Brahma Vishnu Shiva Rupaya Namo Dattatreya 🌹

(a YT Short)







కార్తీక మాసం రెండవ రోజు - కార్తీక విదియ The second day of the month of Kartika - Kartika Vidya



కార్తీక మాసం రెండవ రోజు - కార్తీక విదియ


The second day of the month of Kartika - Kartika Vidya


12 రాశుల పూర్వ జన్మ రహస్యాలు The secrets of the 12 zodiac signs' past lives



12 రాశుల పూర్వ జన్మ రహస్యాలు


The secrets of the 12 zodiac signs' past lives



003 - కార్తీక పురాణం 2వ అధ్యాయం - సోమవార వ్రత మహిమ Kartika Purana Chapter 2 - The Glory of Monday Fasting


🌹. కార్తీక పురాణం 2వ అధ్యాయం 🌹

🌻. సోమవార వ్రత మహిమ 🌻

📚. ప్రసాద్ భరద్వాజ



🌹. Kartika Purana Chapter 2 🌹

🌻. The Glory of Monday Fasting 🌻

📚. Prasad Bharadwaja



వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు ”జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసములో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే… కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబతాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.

”కార్తిక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతా ఉపవాసముండాలి.

నదీస్నానం చేసి, తమ శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి, సాయంత్రం నక్షత్రదర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉంటూ… ఆ రాత్రంతా జాగరణ చేసి, పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీస్నానమాచరించాలి. నువ్వులను దానం చేయాలి (తిలాదానం). తమ శక్తికొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత, తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి, సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాదికాలు నిర్వహించలేనివారు సైతం కనీసం ఉపవాసం ఉంటే… కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు.

ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసముంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.


🌻. కుక్క కైలాసానికి వెళ్లుట…

”పూర్వ కాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్టురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్హణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు, శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని ‘అపర బ్రహ్మ’ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో, కన్నుమిన్నుగానక పెద్దలను దూషించేది. అత్తమామలను, భర్తను తిట్టడం, కొట్టడం, రక్కడం చేసేది. పురుషసాంగత్యంతో వ్యభిచారిణియై… తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు, బట్టలు, పువ్వులు, ధరించి దుష్టురాలై తిరుగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా… ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కలవారంతా ఆమెను గయ్యాళి అని ఏవగించుకుంటూ… కర్కశ అని పేరుపెట్టి ఎగతాళి చేసేవారు.

ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా… ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతిరహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పారేసి, పైన చెత్తచెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురులేదని, అడ్డూఅదుపు ఉండదనే అహంకారం పెరిగి… ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడుచేసి, నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణసంకరురాలైంది.

అంతటితో ఆగకుండా… కన్యలు, పెళ్లైన మహిళలకు దుర్బుద్దులు నేర్పి, పాడుచేసి, విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది. ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడసాగింది. చేసిన పాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము, రక్తం కారుతూ, క్రమంగా కుష్టువ్యాధిబారిన పడింది. రోజురోజుకూ ఆమె శరీర పటుత్వం కృశించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమెకోసం వంతులవారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడామెవైపు కన్నెత్తికూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి, పురుగులు పడి చనిపోయింది.

బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరవు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని, విటులతో సుఖించినందుకు ఇనుపస్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనపగదలతో ఆమెను మోదాలని ఆదేశించారు.

పతివ్రతలను వ్యభిచారిణిలుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేచారు. తల్లిదండ్రులు, అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో, చెవిలో పోశారు. ఇనపకడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కంఉబీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒకత్తే కాకుండా, ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచజన్మలు ఎత్తుతూ, క్రిమికీటకాలుగా పుట్టి.. చివరకు పదిహేనో జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది.

కుక్కజన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికీ తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే.. తిట్టేవాడు తిడుతున్నారు. పిల్లలు తరుముతున్నారు. అయితే… ఒక బ్రాహ్మడు కార్తీక సోమవార వ్రతమాచరించి, ఉపవాసముండి, సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి, ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి, కాళ్లూచేతులు కడుక్కునేందుకు వెళ్లాడు.* *అయితే… ఆ కుక్క గబగబా వెళ్లి ఆ ఆహారాన్ని భుజించింది.

వ్రత నిష్ఠ గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపెంచిన బలియన్నం కావడం… కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసముండడం, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది.

వెంటనే ఆ కుక్క ‘విప్రోత్తమా… నన్ను కాపాడుము’ అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి. ‘రక్షించు… రక్షించు…’ అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు ‘ఎవరు నీవు? నీ వృత్తాతమేమిటి?’ అని ప్రశ్నించాడు. అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. పదిహేను జన్మల క్రింద సద్భ్రాహ్మణుడి భార్యయైన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్టువ్యాధితో దినదినగండంగా బతికి, చనిపోయిన తీరును, నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ‘ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి, ఇక్కడ పెట్టిన బలిఅన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా…! నాకు మహోపకరాంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి, నాకు మోక్షం కలిగించు’ అని ప్రార్థించింది.

దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు. అలాచేసిన వెంటనే… ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క తన జన్మను చాలింది, సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివసాన్నిథ్యాన్ని చేరుకుంది.”

ఇతి శ్రీ సాంద పురాణే తర్గత, వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే ద్వితీయ అధ్యాయం సమాప్తం.

🌹 🌹 🌹 🌹 🌹