సూర్య నమస్కార స్తోత్రము Surya Namaskara Stotram



https://youtube.com/shorts/e4wu9d_w3GE


🌹ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర🌹

ప్రసాద్ భరద్వాజ

ఆదివారం తప్పక వీక్షించండి

🍀 సూర్య నమస్కార స్తోత్రము సూర్య భగవానుని రక్షణ కోసం ప్రార్థించే ఒక శక్తివంతమైన స్తోత్రం. ఇది ఆరోగ్యం, విజయం ఇస్తుందని, మరియు అన్ని కష్టాలను దూరం చేయడానికి సహాయపడుతుందని నమ్ముతారు, దీనిని ఆదివారం రోజున వింటే మంచిది.🍀





🌹Adi Deva Namastubhyam Prasida Mama Bhaskara🌹

Prasad Bharadwaja

Must watch on Sundays

🍀 Surya Namaskara Stotram is a powerful stotra that prays for the protection of Lord Surya. It is believed to give health, success, and help in warding off all difficulties, it is good to listen to it on Sundays.🍀



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


మోక్షదా ఏకాదశి - గీతా జయంతి / Moksha Ekadasi - Gita Jayanthi



https://youtu.be/5P1O1xoU_9E


🌹 మోక్షదా ఏకాదశి విశిష్టత, వ్రత విధానం, వ్రత కధ / గీతా జయంతి ప్రాముఖ్యత, నియమాలు, విధి విధానం / Moksha Ekadasi - Gita Jayanthi Significance 🌹

ప్రసాద్‌ భరధ్వాజ




🍀 భారతీయ సంస్కృతిలో ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రతి నెల శుక్ల పక్షం (వృషణ దశ) మరియు కృష్ణ పక్షం (చీకటి పక్షం) సమయంలో వచ్చే ఏకాదశిలను విష్ణువును పూజించడానికి మరియు ఉపవాసం ఉండటానికి మంచి రోజులుగా పరిగణిస్తారు. ఈ ముఖ్యమైన తేదీలలో ఒకటి మోక్షద ఏకాదశి. దీనినే గీతా జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజు ఉద్దేశ్యం ఆధ్యాత్మిక శుద్ధి మాత్రమే కాదు, మోక్షాన్ని పొందడానికి మార్గం సుగమం చేయడం కూడా. మోక్షద అంటే ప్రలోభాలను నాశనం చేయడం, అందుకే ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని పిలుస్తారు. పురాణాల ప్రకారం, మోక్షద ఏకాదశి రోజునే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి భగవద్గీత ఉపదేశించాడు. అందుకే భగవద్గీత పుట్టిన రోజుగా ఈ రోజు గీతా జయంతిని జరుపుకుంటారు.🍀


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



'శ్రీరామ' అనే దివ్య నామ స్మరణతో ఆరుగురు దేవతల ఆశీస్సులు లభిస్తాయని మీకు తెలుసా ? By chanting the divine name 'Shri Rama' ....


🌹 'శ్రీరామ' అనే దివ్య నామ స్మరణతో ఆరుగురు దేవతల ఆశీస్సులు లభిస్తాయని మీకు తెలుసా ?. 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 Did you know that by chanting the divine name 'Shri Rama', you can get the blessings of six gods? 🌹
Prasad Bharadwaja



శ్రీరామ నామం ఎంతో మధురం.. అని అంటూ ఉంటారు. కొందరు రామకోటి రాస్తూ శ్రీరాముడి ఆశీస్సులు పొందుతారు. శ్రీరామ అంటే కేవలం విష్ణు మాత్రమే కాదని సకల దేవతలు ఈ నామంలో ఉన్నాయని ఇప్పటికే చాలామంది ఆధ్యాత్మిక వాదులు పేర్కొన్నారు.

అయితే కొన్ని గ్రంథాలు, పురాణాల ప్రకారం ఈ నామములో ఆరుగురు దేవతలు కొలువై ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు శ్రీరామ నామ జపం చేయడం వల్ల ఆరుగురు దేవతలను పూజించినట్లు అవుతుందని అంటున్నారు. అంతేకాకుండా సమస్యలు, బాధలు ఉన్నప్పుడు శ్రీరామ నామం జపం చేయడం వల్ల అవి తొలగిపోతాయని కూడా చెబుతున్నారు. అసలు శ్రీరామ నామం లో ఉన్న ఆరుగురు దేవతలు ఎవరు? వారి పేర్లు ఏంటి?

శ్రీరామ అనగానే మనకు విష్ణువు అవతారమైన రాముడు గురించి మాత్రమే చర్చించుకుంటాం. కానీ శ్రీరామ అనే పదాన్ని మాత్రం ఆలయాలకు వెళ్లినప్పుడు పలుకుతూ ఉంటాం. అయితే శ్రీరామ అనే పేరును పలకడం రాముడిని గుర్తు చేసుకోవడం మాత్రమే కాకుండా ఆరుగురు దేవతలను స్మరించడం అని అంటున్నారు.

శ్రీరామ లో.. మొదటి శ్రీ అంటే లక్ష్మి తత్వం. శ్రీరామ నామంలో మొదటి అక్షరం సంపద, శాంతి, శ్రేయస్సు ప్రసాదించే లక్ష్మీదేవత ఉన్నట్లు చెబుతారు.

శ్రీరామ లో.. ర అంటే రుద్రశక్తి. శివుడి తత్వాన్ని ఈ అక్షరం సూచిస్తుంది. రామ నామంలో కూడా శివుడు కొలువై ఉన్నాడని ఈ పదం తెలుపుతుంది.

శ్రీరామ లో.. ర+అ=రా.. అంటే ఇందులో ఆ అక్షరం అగ్ని దేవుడిని సూచిస్తుంది. ప్రతి కార్యక్రమంలో అగ్ని దేవుడిని కొలుస్తుంటాం. శుద్ధి శక్తికి ప్రత్యేకగా అగ్నిదేవుడని కొలుస్తూ ఉంటాం. శ్రీరామ నామం జపించినప్పుడు అగ్నిదేవుడు కూడా ఉంటాడు.

శ్రీరామ లో.. చివరి అక్షరం మ లో ముగ్గురు దేవతలు కొలువై ఉన్నట్లు తెలుపుతున్నారు. అంటే బ్రహ్మ, విష్ణు తో పాటు ఆదిశక్తి స్వరూపిణి కూడా ఈ అక్షరం లో ఉన్నట్లు చెబుతారు.

ఇలా శ్రీరామలో ఆరుగురు దేవతలు ఉండడంవల్ల ప్రతిసారి శ్రీరామ అనే నామం జపించడం వల్ల వీరు సంతోషిస్తారని అంటున్నారు. వీరితోపాటు శ్రీరామ అని పేరు చెప్పగానే ముందుగా స్పందించేది హనుమంతుడు. విష్ణు సేవ కోసం శివుడే హనుమంతుడి రూపం లో వచ్చాడని కొన్ని పురాణాల్లో ద్వారా తెలుస్తుంది. అయితే శివుడితోపాటు పార్వతీ కూడా వస్తానని అంటుంది. కానీ హనుమంతుడు బ్రహ్మచర్య రూపం వల్ల పార్వతికి అడ్డు చెబుతాడు. అయినా కూడా శ్రీరామ అనే పదంలో ఆదిశక్తి స్వరూపిణి కొలువై ఉంటుందని శ్రీరామ నామం అనే పదం ద్వారా తెలుస్తుంది. ప్రతిరోజు మంచి మనసుతో కొన్నిసార్లు శ్రీరామ నామం జపించడం వల్ల ఈ దేవతల ఆశీస్సులు ఉంటాయని ఆధ్యాత్మిక పండితులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శ్రీరామ నామం జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి అనుకున్న పనులు కూడా పూర్తవుతాయని చెబుతున్నారు.

🌹🌹🌹🌹🌹

తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం / గోవిందరాజస్వామి ఆలయంలో విశేష వేడుకలు / Krittika Deepotsavam at Sri Kapileshwara Temple in Tirupati ....


🌹 తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం / గోవిందరాజస్వామి ఆలయంలో విశేష వేడుకలు 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Krittika Deepotsavam at Sri Kapileshwara Temple in Tirupati / Special celebrations at Govindaraja Swamy Temple 🌹
Prasad Bharadwaja


తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని డిసెంబర్‌ 3న సాయంత్రం భక్తిపూర్వకంగా కృత్తికా దీపోత్సవం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

ఈ మేరకు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. అధికారుల వివరాల ప్రకారం.. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు ఆలయంలో ప్రత్యేక దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముందుగా గర్భాలయంలో స్వామివారికి దీపారాధన చేసి, అనంతరం ఆలయ శిఖరంపై దీపారాధన నిర్వహించబడుతుంది.

తదుపరి రాత్రి 7.30 గంటలకు పుష్కరిణి వద్ద జ్వాలాతోరణం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనమివ్వనుంది. ప్రతి ఏడాది కృత్తిక నక్షత్రం సందర్భంగా నిర్వహించే ఈ వేడుకను పెద్ద సంఖ్యలో భక్తులు వీక్షించేందుకు వస్తారని అధికారులు తెలిపారు. కార్యక్రమాల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సరైన ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ పేర్కొంది.


🌻 తిరుపతి దివ్యోత్సవాలు.. గోవిందరాజస్వామి ఆలయంలో విశేష వేడుకలు 🌻

భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పండుగ లాంటి శుభవార్త చెప్పింది. డిసెంబర్ నెలలో తిరుపతిలోని టీటీడీ అన్నసంస్థలకు అనుబంధంగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

ఈ సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాల షెడ్యూల్‌ను ఇవాళ (శనివారం) టీటీడీ విడుదల చేసింది. డిసెంబర్ 4న సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం ఘనంగా జరగనుంది. ఇదే రోజు శ్రీ తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర వేడుక కూడా నిర్వహించనున్నారు. డిసెంబర్ 5న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకొని సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధి స్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. డిసెంబర్ 12, 19, 26 తేదీల్లో శుక్రవారాల సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారి మాడ వీధుల ఊరేగింపు జరగనుంది. డిసెంబరు 13న ఉత్తరా నక్షత్రం సందర్భంగా ఉభయ నాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామి సాయంత్రం 6 గంటలకు భక్తులను అనుగ్రహిస్తారు.

డిసెంబర్ 14న స్వామి వారి తిరువడి సన్నిధి ఉత్సవం భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారిని ఎదురు ఆంజనేయస్వామి సన్నిధికి వేంచేపు చేస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకి స్వామి, అమ్మవార్లు, ఆంజనేయ స్వామి వారి మాడ వీధుల ఊరేగింపు చేపడతారు. డిసెంబర్ 19న శ్రీ తొండరడిప్పడి ఆళ్వార్ తిరు నక్షత్రం నిర్వహించనున్నారు. డిసెంబర్ 23న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. డిసెంబరు 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, డిసెంబర్ 31న ముక్కోటి ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వివరాలు టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

🌹 🌹 🌹 🌹 🌹


శనివారం శ్రీ వేంకటేశ్వరుని అభిషేకం కర్పూర హారతి దర్శనం / Saturday Abhishekam of Lord Venkateswara and Karpura Aarti Darshan (a YT Short)



https://youtube.com/shorts/RacmOC1aaFQ


🌹 శనివారం శ్రీ వేంకటేశ్వరుని అభిషేకం కర్పూర హారతి దర్శనం 🌹
🌹 Saturday Abhishekam of Lord Venkateswara and Karpura Aarti Darshan 🌹
 

ప్రసాద్ భరద్వాజ

తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


తిరుమలలో డిసెంబర్ 2025 నెల విశేష పర్వదినాల తేదీలు.. Dates of special holidays in December 2025 in Tirumala..


🌹 డిసెంబర్‌ 2025 పండుగలు - పర్వదినాలు / తిరుమలలో డిసెంబర్ నెల విశేష పర్వదినాల తేదీలు.. 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 December 2025 Festivals - Holidays / Dates of special holidays in December in Tirumala.. 🌹
Prasad Bharadwaja



డిసెంబర్‌ 01 సోమవారం - గీతా జయంతి, మోక్షద ఏకాదశి

డిసెంబర్‌ 02 మంగళవారం - ప్రదోష వ్రతం

డిసెంబర్‌ 03 బుధవారం - జ్యేష్ఠ కార్తె

డిసెంబర్‌ 04 గురువారం - పౌర్ణమి, దత్త జయంతి

డిసెంబర్‌ 07 ఆదివారం - సంకటహర చతుర్థి

డిసెంబర్‌ 15 సోమవారం - మూల కార్తె, ఏకాదశి

డిసెంబర్‌ 16 మంగళవారం - ధనుర్మాస పూజ, ధనుర్మాసం ప్రారంభం

డిసెంబర్‌ 18 గురువారం - మాస శివరాత్రి

డిసెంబర్‌ 19 శుక్రవాంర - అమావాస్య

డిసెంబర్‌ 24 బుధవారం- క్రిస్మస్ ఈవ్

డిసెంబర్‌ 25 గురువారం - క్రిస్మస్

డిసెంబర్‌ 26 శుక్రవారం - స్కంద షష్టి

డిసెంబర్‌ 27 శనివారం - అయ్యప్ప స్వామి మండల పూజ

డిసెంబర్‌ 28 ఆదివారం - పూర్వాషాఢ కార్తె

డిసెంబర్‌ 30 మంగళవారం - పుష్య పుత్రాద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి


డిసెంబర్‌ 2025 పౌర్ణమి, ఏకాదశి తిథులు


పౌర్ణమి డిసెంబర్ 4వ తేదీ 8:38 AM నుంచి డిసెంబర్ 5వ తేదీ 4:44 AM వరకు

అమావాస్య డిసెంబర్ 19వ తేదీ 4:59 AM నుంచి డిసెంబర్ 20వ తేదీ 7:13 AM వరకు.



🍀 తిరుమలలో డిసెంబర్ నెల విశేష పర్వదినాల తేదీలు.. ఏ రోజు ఏంటి? 🍀

డిసెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే పర్వదినాలు, విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ అధికారులు విడుదల చేశారు. ప్రతి నెలలో శ్రీవారికి నివేదించే కార్యక్రమాలు, పండగలు, వివిధ విశేష ఉత్సవాలకు సంబంధించిన జాబితాను సంబంధిత నెల ప్రారంభానికి ముందే విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా డిసెంబర్‌లో నిర్వహించే పండగల జాబితాను విడుదల చేశారు. 2వ తేదీన మంగళవారం చక్రతీర్థ ముక్కోటితో డిసెంబర్ నెల విశేష ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు టీటీడీ అధికారులు. శ్రీవారి ఆలయంలో 4వ తేదీన గురువారం కార్తీక పర్వ దిపోత్సవాన్ని నిర్వహిస్తారు. అదే రోజున తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర ఉంటుంది. 5వ తేదీన శుక్రవారం తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం కార్యక్రమం జరుగుతుంది.

16న మంగళవారం నాడు ధనుర్మాసం ఆరంభమౌతుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో తిరుప్పావైని వినిపిస్తారు. ఈ మాసంలో తిరుప్పావై పాశురాలను పఠిస్తారు. ధనుర్మాసం ముగిసేంత వరకూ ఈ పాశురాలు తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణనాన్ని రెట్టింపు చేస్తాయి. 19వ తేదీ శుక్రవారం తొందార్పప్పోడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం ఉత్సవం ఉంటుంది. అదే రోజున శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమౌతాయి. డిసెంబర్ 29న సోమవారం శ్రీవారి ఆలయంలో చిన్న శాత్తుమొరను నిర్వహిస్తారు.

30వ తేదీ మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మొదలయ్యేది ఆ రోజే. జనవరి 8వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. అదే రోజున శ్రీమలయప్ప స్వామివారు.. దేవేరులతో కలిసి స్వర్ణ రథోత్సవం మీద ఊరేగుతారు. 31న బుధవారం నాడు వైకుంఠ ద్వాదశి ఉత్సవాలు, శ్రీవారి చక్రస్నానాన్ని నిర్వహిస్తారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో కేటాయించనున్నారు. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేస్తారు.

నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేది వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం ఉంటుంది. మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు నవంబర్ 27వ తేది ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేది సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్ లో ఏపీ గవర్నమెంట్ బాట్ లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్‌ డిప్ కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

🌹🌹🌹🌹🌹


కాలబైరవ అష్టమి శుభాకాంక్షలు Happy Kalabhairava Ashtami



🌹 కాలబైరవ అష్టమి శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 Happy Kalabhairava Ashtami to everyone 🌹
Prasad Bharadwaja



కాలబైరవ అష్టమి..అనుకున్న కోరిక నెరవేరాలంటే ఇలా చేయండి..! Kalabhairava Ashtami Do like this



https://youtube.com/shorts/xQ7KwP-Gwos?si=_AF0n35Z8WNW_UJ2


🌹కాలబైరవ అష్టమి..అనుకున్న కోరిక నెరవేరాలంటే ఇలా చేయండి..! Kalabhairava Ashtami Do like this 🌹

ప్రసాద్ భరద్వాజ

తప్పకుండా వీక్షించండి


🌹🌹🌹🌹🌹


శ్రీ కాలభైరవ అష్టకం - శ్లోక తాత్పర్యములు Sri Kalabhairava Ashtakam - Meaning of the verses



https://youtu.be/_VLqYNh-7bY


🌹 శ్రీ కాలభైరవ అష్టకం - శ్లోక తాత్పర్యములు 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

🌹 Sri Kalabhairava Ashtakam - Meaning of the verses 🌹
Prasad Bharadhwaja



మనోహరమైనది, జ్ఞ్యానమును, ముక్తిని కలిగించునది, అనేక పుణ్యములను పెంపొందించునది, శోకము, మోహము, దీనత్వము, కోపము, పాపములను నశింప చేయునది అగు కాలభైరవ అష్టకం ఈ వీడియోలో వీక్షించండి. కాలభైరవ పాద సన్నిధిని చేరుటకు దీనిని నిత్యము పఠించండి.

కాలభైరవం భజే!! కాలభైరవం భజే!!

కాశికాపురాధినాథ కాలభైరవం భజే!!

కాశికాపురాధినాథ కాలభైరవం భజే!!


🍀 కాలభైరవాష్టకం పఠించడం వల్ల లాభాలు 🍀

ప్రత్యేక రక్షణ - ఈ స్తోత్రం ప్రతికూల శక్తుల నుంచి మరియు చెడు ప్రభావాలనుంచి రక్షణ కవచం లాగా పనిచేస్తుంది.

భావనాత్మక స్వస్థత - భయం, ఆందోళన, మరియు ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతత మరియు భద్రతను కలిగిస్తుంది.

ఆధ్యాత్మిక ప్రగతి - కాలభైరవాష్టకం నిత్య పఠనం ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణం మెరుగవుతుంది మరియు దైవంతో ఉన్న అనుబంధాన్ని మరింతగా గాఢం చేస్తుంది.

ఆత్మవిశ్వాసం - కాలభైరవాష్టకం పఠించడం ద్వారా ధైర్యం మరియు బలంతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం సులభమవుతుంది.

🌹🌹🌹🌹🌹

కాలభైరవాష్టకం - Kalabhairava Ashtakam (a YT Short)



https://youtube.com/shorts/cGMvn6sVRjw


🌹 కాలభైరవాష్టకం - Kalabhairava Ashtakam   కాలభైరవ అష్టమి రోజు. చాలా శక్తిమంతమైనది..! 🌹

ప్రసాద్ భరద్వాజ


తప్పకుండా వీక్షించండి



Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam



🌹🌹🌹🌹🌹




కాలబైరవ అష్టమి.. చాలా శక్తిమంతమైన రోజు..! Kalabhairava Ashtami.. A very powerful day..!



🌹 కాలబైరవ అష్టమి.. చాలా శక్తిమంతమైన రోజు..! అనుకున్న కోరిక నెరవేరాలంటే ఇలా చేయండి..! 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Kalabhairava Ashtami.. A very powerful day..! Do this if you want your wish to come true..! 🌹
Prasad Bharadwaja


నవంబర్ 28.. అష్టమి.. శుక్రవారం.. కాలబైరవ అష్టమి.. ఇది చాలా విశేషమైన రోజు. జీవితంలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఈ సమస్య ఇక తీరదు, దీనికి పరిష్కారం లేదు, ఇది ఇక అవ్వదు అనే సమస్య లేదా కోరికా ఏదైనా ఉన్నా..

అలాంటివి అవ్వాలని మనసార కోరుకుంటూ ఇలా చేయండి. సంధ్యా సమయంలో శివాలయం లేదా కాలబైరవుడి ఆలయానికి వెళ్లాలి. బూడిద గుమ్మడి కాయను సగం చేయాలి.

దానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టండి. అందులో నల్ల నువ్వుల నూనె వేసి తోక మిరియాలు వేసి వత్తి వేసి దీపాన్ని వెలగించాలి. ఆ దీపం వద్ద కూర్చుని కాలబైరవ అష్టకాన్ని 8సార్లు జపం చేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతందని.. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి తప్పకుండా ఊరట దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

నవంబర్ 28.. కాలబైరవ అష్టమి.. చాలా శక్తిమంతమైన రోజు అని.. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుందని పండితులు చెబుతున్నారు. అలాంటి ఈ రోజున మీరు ఏమనుకున్నా జరుగుతుందని వెల్లడించారు.

🌹 🌹 🌹 🌹 🌹

మార్గశిర లక్ష్మీవార వ్రతం - 5 గురువారాల లక్ష్మీపూజ విశేషాలు, విధానం - వ్రతకధ / Margasira Masam 5 weeks Lakshmi Pooja Vrat Details and Story



🌹 మార్గశిర లక్ష్మీవార వ్రతం - 5 గురువారాల లక్ష్మీపూజ విశేషాలు, విధానం - వ్రతకధ /
Margasira Masam 5 weeks Lakshmi Pooja Vrat Details and Story 🌹



🍀 శ్రీ మహాలక్ష్మీచే స్వయంగా చెప్పబడిన, సకల ఐశ్వర్యాలను ప్రసాదించే ఐదు వారాల అద్భుత వ్రతం, ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం. దీన్నే కొందరు గురువార లక్ష్మీపూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. ఈ వ్రతం, ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు, లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం. అప్పులూ.. కష్టాలు తీరుతాయి. ఈ వ్రతం చేసుకోలేని వారు కూడా దీని విశేషాలని తెలుసుకుని, వ్రత కధను విన్నా, చదివినా పూర్తి ఫలితం వస్తుందని చెప్పబడింది. ఈ వ్రతం వల్ల గత జన్మ పాపాలు, కర్మ దోషాలు తొలగి, మానసిక స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం పెరుగుతాయి.ఆర్థిక సమృద్ధి, ధనలాభం సిద్ధిస్తాయి. లక్ష్మీనారాయణుల దివ్య కృపా కటాక్షాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక ఉన్నతి, జీవితంలో స్థిరత్వం కలుగుతాయి. 🍀

ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


నమో భగవతే దత్తాత్రేయ Namo Bhagavathe Dattatreya























🌹 నమో భగవతే దత్తాత్రేయ స్మరణ మాత్రమున సంతుష్టాయ Namo Bhagavathe Dattatreya 🌹

🌹 Namo Bhagavathe Dattatreya, I am satisfied just by remembering him Namo Bhagavathe Dattatreya 🌹


శుభ గురువారం లక్ష్మివారం  Happy Thursday, Lakshmivaram

ప్రసాద్ భరద్వాజ
Prasad Bharadwaja



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


మార్గశిర లక్ష్మీవార (గురువారం) వ్రతం Margashir Lakshmivara (Thursday) Vratam



🌹 శ్రీ మహాలక్ష్మీచే స్వయంగా చెప్పబడిన, సకల ఐశ్వర్యాలను ప్రసాదించే ఐదు వారాల అద్భుత వ్రతం, ఈ మార్గశిర లక్ష్మీవార (గురువారం) వ్రతం. 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 This five-week miraculous fast, which is said by Sri Mahalakshmi herself, to bestow all wealth, is the Margashir Lakshmivara (Thursday) fast. 🌹

Prasad Bharadwaj



🍀 మార్గశిరమాసం గురువారం ( నవంబర్ 27) లక్ష్మీదేవి పూజ.. అప్పులూ.. కష్టాలు తీరుతాయి..! 🍀

🍀 Margashiramasam Thursday (November 27) Lakshmi Devi Puja.. Debts.. Difficulties will be solved..! 🍀




మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారం. విష్ణువుకు ఎంతో ఇష్టమైన మార్గశిరమాసం కొనసాగుతుంది. ఈ మాసంలో లక్ష్మీ దేవికి చేసే పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలుగజేస్తాయన్నది పండితులు చెబుతున్నారు.

మార్గశిర మాసం కేవలం పండుగలు మాత్రమే కాదు, ఈ మాసం వ్రతాలకు కూడా నిలయమే. అద్భుత వ్రతంగా పేరు పొందిన మార్గశిర గురువారం లక్ష్మీవ్రతం, హనుమద్వ్రతం వంటి వ్రతాలనూ ఈ మాసంలో ఆచరిస్తారు.

మార్గశిర మాసంలో ప్రతి గురువారం వరలక్ష్మీ వ్రతం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ మాసంలో లక్ష్మీ పూజ చెయ్యడం శుభప్రదంగా భావిస్తారు. ఈ వ్రతం చేస్తే ఆర్థికంగా బలపడతారని పండితులు చెబుతున్నారు.

ఈ ఏడాది ( 2025) మార్గశిర మాసం మొదటి గురువారం నవంబర్​ 27 వ తేది వచ్చింది. గురువారంను లక్ష్మీవారమని కూడా అంటారు. మార్గశిర మాసంలో గురువారాలలో చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో అన్ని గురువారాలలోనూ, ఈ పూజను ఆచరించడం సర్వ శ్రేష్టం. మార్గశిర మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఋణ సమస్యలు తొలగి, శ్రేయస్సు, సంపద. ఆరోగ్య భాగ్యం చేకూరతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.


🌴 మార్గశిర గురువారం లక్ష్మీవ్రతం 🌴

ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేదతీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారూ ఇళ్ళను గోమయం (ఆవుపేడ)తో అలికి, ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటుస్నానం చేసి, కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి. 4 వర్ణాలవారు కలిసి ఒక చోట చేరి, లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా, వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో..

మహర్షి ! ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతుహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నారు.

గురువారం చేసే ఈ పూజను లక్ష్మీపూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది. "లక్ష్మీ దేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు."

నారదుడు: మహనీయా! ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారో, వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి" అనగా.... పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు.

ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణుపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం. ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషితయై భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి.

విష్ణుమూర్తి కూడా ఆ వెనకాతలే పయనమై భూలోకానికి వచ్చి, ఒక ముసలి బ్రహ్మణ స్త్రీ రూపంలో ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి అవ్వా ! ఈ రోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ . ఇల్లు గోమయంతో అలికి ముగ్గుపెట్టలేదేంటి? అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ, అమ్మా ! ఆ వ్రతం ఏమిటి? ఏలా చేయాలి? నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడుగగా మహలక్ష్మీ మందహాసంతో ఈ విధంగా పలికింది.

మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి, ఇల్లు గోమయంతో అలికి, ముగ్గులు పెట్టి, లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో , బొమ్మలతో అందంగా తయారుచేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని, దానిని కడిగి దానిమీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలతపాత్రను ఉంచి, పసుపునీటితో కడిగిన పోకచెక్క(వక్క)ను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకుని, కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలతపాత్ర మీద పోయాలి. ఎరుపురంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి, ఎర్రని పూలతో పూజించి శ్రీమహాలక్ష్మిని తలచుకుని దీపారాధన చేయాలి. మొదటపాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా, నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవెధ్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం.


🌻 పఠించ వలసిన మంత్రాలు 🌻

ఓంశ్రీమహాలక్ష్మ్యై నమః.. అనే లక్ష్మీ మంత్రం 108 సార్లు.

ఓంశ్రీమహాలక్ష్మీవిద్మహే... విష్ణుపత్న్యైచాధీమహి ...తన్నోలక్ష్మీ ప్రచోదయాత్..లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని జపించండి.


లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది

రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిధి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్నే చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచి పెట్టకపోతే మాత్రం లక్ష్మికటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకుని, పది మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి, పసుపుకుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది.

ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి, పొయ్యి బూడిద తీయకపోయిన, ఇల్లు వాకిలి తుడవకున్నా ఆ ఇంట లక్ష్మీ నిలువదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడివస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో, కొడుతుందో, ఇల్లువాకిలి చిమ్మదో, అంట్లుకడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండువైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలువదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి, సంతానానికి హాని కలుగుతుంది.

అదే విధంగా గురువారం ఉడకని పదార్ధాలు, నిషిద్ధ పదార్ధాలు తినే ఇంట, ఆశుభ్రప్రదేశాలలో తిరగడం, అత్తమామాలను దూషించడం, సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు. భోజనము ముందు, తరువాత కాళ్ళు, చేతులు, ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ, ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా, అసంధర్భంగా, గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మీ ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో, గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీ ఉంటుంది. ఏ స్ర్తీ గురువారం దానధర్మాలు, పూజలు చేయదో, భర్తతో గోడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం, అమావాస్యా , సంక్రాంతి (ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది) తిధులలో నిషిద్ధ పదార్ధాలను తినే స్త్రీ యమపురికి (నరకానికి) పోతుంది.

జ్ఞానంతో స్త్రీ, పైన చెప్పబడ్డ 3 తిథులలో నిషిద్ధ పదార్ధములను తినకుండా, నక్తం (ఒంటిపూట, ఒకపొద్దు) ఉంటుందో, లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్రపౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మి అనుగ్రహం ఉంటుంది.

ప్రతి రోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహా పాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర, దక్షిణం దిక్కులకు కూర్చుని(ముఖం పెట్టి) భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తరువాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవంయందు, బ్రాహ్మణులయందు భక్తి విశ్వాసాలు లేనటువంటి , పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇళ్ళు స్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీ దేవి రాదు. నిత్యదరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది. అని లక్ష్మీ దేవి ఆ ముసలి బ్రాహ్మణస్త్రీకి వివరించి, ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసిరావడానికి బయలుదేరింది.

ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహ్యించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేదస్త్రీ ప్రతి రోజు ఇల్లును గోమయంతో అలికి , ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి , లక్ష్మీ దేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి, ధూపం వేసి, నైవేద్యాలు పెట్టి, పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మినే ఆరాధించేది ఆ పేద స్త్రీ. ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మీ ఆమె ఇంట పాదాలు మోపింది

ఓ భక్తురాలా ! నీ భక్తికి మెచ్చాను. వరం కోరుకో , ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీ దేవిని చూడడంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి "నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించేవరకు సకలసంపదలను అనుభవుస్తావు. మరణం తరువాత వైకుంఠానికి చేరుతావు అని వరాలిచ్చింది. నా వ్రతం విడువకుండా చేయి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు, భోగభాగ్యాలు, ఐదుగురు కూమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది. అంటూ మహర్షి పరాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు.

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్టి శుభాకాంక్షలు Greetings on Sri Subrahmanya Shashti Skanda Shashti



🍀 శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్టి శుభాకాంక్షలు అందరికి 🍀
ప్రసాద్ భరద్వాజ


🍀 Happy Sri Subrahmanya Shashti Skanda Shashti to everyone 🍀
Prasad Bharadwaja


శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అభిషేకం హారతి Subrahmanya Abhishek Harathi (a YT Short)



https://youtube.com/shorts/wGEidjz0drY


🌹 సుబ్రహ్మణ్య షష్టి నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అభిషేకం హారతి దివ్య దర్శనం Subrahmanya Abhishek Harathi 🌹

తప్పక వీక్షించండి



ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹




స్కందోత్పత్తి కధ – కుమారసంభవం గాధ SKANDOTHPATHI – story of Kumarasambhavam - Story of Creation


https://youtu.be/GnssM2GwmZA


🌹 స్కందోత్పత్తి కధ – కుమారసంభవం గాధ SKANDOTHPATHI – story of Kumarasambhavam - Story of Creation 🌹

🍀 శ్రీ సుబ్రహ్మణ్య స్కంద షష్టి శుభాకాంక్షలు అందరికి 🍀
ప్రసాద్‌ భరధ్వాజ

🐍 మార్గశిర మాసంలో శుక్ల పక్ష షష్టి రోజు.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినం సుబ్రహ్మణ్య షష్ఠిని భక్తులు జరుపుకుంటారు. సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతమే సృష్టి రహాస్యం. ఈ రోజున భక్తి శ్రద్ధలతో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించిన సమస్త కోరికలు నెరవేరతాయని అంటారు. పిల్లలు కావాలనే వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. ఈ రోజున ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం అయిన స్కందోత్పత్తి చదువుతారో లేదా వింటారో వారికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విశేష అనుగ్రహం కలుగుతుంది. మోక్ష మార్గం విశదం అవుతుంది. వారి పిల్లలు ఆపదల నుంచి రక్షింపబడతారు. నాగదోషాలు తొలగి పోతాయిని పండితులు చెబుతారు. 🐍

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam



🌹🌹🌹🌹🌹

ఉమామహేశ్వర కుమారగురవే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాధా Subrahmanyam Shanmukha Nadha (a devotional YouTube Short)



https://youtube.com/shorts/miybwBY40V4


🌹 ఉమామహేశ్వర కుమారగురవే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాధా Subrahmanyam Shanmukha Nadha 🌹

🍀 శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్టి శుభాకాంక్షలు అందరికి 🍀
ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


సుబ్రహ్మణ్య స్కంధ షష్ఠి విశిష్టత - Significance of Subramanya Shashti



https://youtu.be/B6liu2jsJDw


🌹 సుబ్రహ్మణ్య స్కంధ షష్ఠి విశిష్టత - పూజా విధానం - స్కంధ పుష్కరిణి - స్కందోత్పత్తి - ఆరు మహిమాన్వితమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు Subrahmanya Shashti Significance 🌹

🍀 శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్టి శుభాకాంక్షలు అందరికి 🍀
ప్రసాద్‌ భరధ్వాజ


🐍 మార్గశిర మాసంలో శుక్ల పక్ష షష్టి రోజు.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినం సుబ్రహ్మణ్య షష్ఠిని భక్తులు జరుపుకుంటారు. ఈ సుబ్రహ్మణ్య షష్టిని స్కంద షష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతమే షష్టి రహాస్యం. ఈ రోజున భక్తి శ్రద్ధలతో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించి స్కందోత్పత్తి కధను విన్నా చదివినా సమస్త కోరికలు నెరవేరతాయని అంటారు. ముఖ్యంగా పిల్లలు కావాలనే వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. ఈ ఏడాది నవంబర్ 26వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. ఈ రోజున ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం అయిన స్కందోత్పత్తి చదువుతారో లేదా వింటారో వారికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విశేష అనుగ్రహం కలుగుతుంది. పంచమి రోజు.. ఉపవాసం ఉండి షష్ఠి నాడు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే నాగదోషాలు తొలగి పోతాయిని పండితులు చెబుతారు. 🐍

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్టి శుభాకాంక్షలు Greetings on Sri Subrahmanya Shashti Skanda Shashti

🌹శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్టి శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

🌹Shri Subrahmanya Shashti Skanda Shashti greetings to everyone 🌹
Prasad Bharadhwaja


కార్తికేయాయ విద్మహే సుబ్రహ్మణ్యాయ ధీమహి తన్నః స్కందః ప్రచోదయాత్

ఓం సౌమ్ శరవణభవాయ నమః

నమస్తే నమస్తే మహాశక్తి పాణే |
నమస్తే నమస్తే లసద్వజ్రపాణే ||

నమస్తే నమస్తే కటిన్యస్త పాణే |
నమస్తే నమస్తే సదాభీష్ట పాణే ||


మార్గశిర శుద్ధ షష్టి నాడు ఈ స్తోత్రంతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని శరణు వేడినవారికి శక్తియుక్తుల్ని, ఐశ్వర్య ఆరోగ్యాలను, సర్పదోషాలు తొలగి సత్సంతానమును ఆ స్వామి ప్రసాదిస్తాడు.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జరుపుకుంటారు. సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతమే షష్టి రహాస్యం. సుబ్రహ్మణ్యుడిని శివపార్వతుల కుమారుడిగా భావిస్తారు. ఈ పండుగ హిందూ సంప్రదాయంలో ముఖ్యమైనది మరియు యుద్ధం, జ్ఞానం, విజయం యొక్క దేవుడిగా భావించే మురుగన్ (సుబ్రహ్మణ్యుడు) ఆరాధనకు అంకితం చేయబడింది. 26 నవంబర్ బుధవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి, ఆ రోజున ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం అయిన స్కందోత్పత్తి చదువుతారో లేదా వింటారో వారికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విశేష అనుగ్రహం కలుగుతుంది, దయచేసి సద్వినియోగం చేసుకోమని మనవి.

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజును కూడా "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు.

ఈ స్వామి ఆరాధన వల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని, పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు, వెండి, పూలు పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.

ఇటువంటి పుణ్యప్రదమైన "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము. వీలున్న వారందరూ తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించండి. పెళ్ళి కాని వారికి , సంతానం లేని వారికి ఇది అమృతతుల్యమైన అవకాశం. సుబ్రహ్మణ్యుని అనుగ్రహముతో వివాహ ప్రాప్తి, సత్సంతానం, వంశాభివృద్ధి , జ్ఞానము, తేజస్సు, పాప కర్మల నుండి విముక్తి కలుగుతుంది. కుండలినీ శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్యుని అనుగ్రహము అతి ముఖ్యము.


🐍. కాలసర్పదోషం ఉన్నవారికి సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం 🐍

జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు,కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజల వల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది, అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం స్కందుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని స్త్రీలు పూజల చేయడం మనం చూస్తూ వుంటాం. సంతానప్రాప్తిని కోరే స్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108 మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరం చేసి, సర్వశక్తుల్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం.

🌹 🌹 🌹 🌹 🌹

హనుమాన్ చాలీసా మంగళవారం వినడం అత్యంత పవిత్రం Hanuman Chalisa (a YT Short)



https://youtube.com/shorts/2jqjh1eIrD0


🌹హనుమాన్ చాలీసా మంగళవారం వినడం అత్యంత పవిత్రం Hear Hanuman Chalisa on Tuesday.🌹

🍀 తప్పకుండా వినండి వీక్షించండి 🍀


హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత - మానసిక మరియు శారీరక ప్రయోజనాలు: హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని దోషం నుండి విముక్తి లభించడంతో పాటు, అనారోగ్యాలు కూడా తగ్గుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇది కష్టాలను దూరం చేసే అద్భుతమైన స్తోత్రం.

ఆధ్యాత్మిక శక్తి: ఈ స్తోత్రం పఠించడం వల్ల భక్తి, విశ్వాసం పెరిగి, ధైర్యంగా ఉంటారని భావిస్తారు. పూర్తి భక్తితో జపించేవారికి హనుమంతుడి అనుగ్రహం కలుగుతుందని చెప్పబడింది.

కార్యసిద్ధి: హనుమంతుడిని ఆరాధించడం వల్ల పనులలో విజయం లభిస్తుందని నమ్మకం.

శత్రు రక్షణ: హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శత్రువుల నుండి రక్షణ లభిస్తుందని విశ్వాసం.

జనన మరణ బంధనాల నుండి విముక్తి: 108 సార్లు పారాయణం చేసే వ్యక్తి జనన మరణ బంధనాల నుండి విముక్తి పొంది, అంతిమంగా ఆనందాన్ని పొందుతాడని నమ్మకం.

ప్రసాద్ భరద్వాజ




Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹




త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం ఏకబిల్వం శివార్పణం Tridalam, Trigunakaram, Trinetrancha, Triayaudham, Ekabilvam, Shivarpanam (a devotional YouTube Short)



https://www.youtube.com/shorts/7jp8gaPAhdM


🌹 త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం ఏకబిల్వం శివార్పణం 🌹
🌹 Tridalam, Trigunakaram, Trinetrancha, Triayaudham, Ekabilvam, Shivarpanam 🌹



🍀 శ్రీ బిల్వస్తోత్రం సోమవారం వినడం, చదవడం అత్యంత శుభప్రదమని చెబుతారు. శ్రీ బిల్వస్తోత్రం అనేది శివార్పణంలో భాగంగా బిల్వపత్రం యొక్క ప్రాముఖ్యతను తెలిపే ఒక ప్రసిద్ధ శ్లోకం. దీని అర్థం, మూడు ఆకులు గల బిల్వపత్రం మూడు గుణాలకు (సాత్విక, రాజసిక, తామసిక) నిలయమని, శివుని మూడు కళ్ళకు, మూడు ఆయుధాలకు ప్రతిరూపమని, మూడు జన్మల పాపాలను హరిస్తుందని, అందువల్ల ఒక బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం చాలా పుణ్యమని చెబుతారు. 🍀

ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share
https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹

త్రిదళం బిల్వం శివార్పణం Tridalam Bilvam Shivarpanam (a YT Short)



https://youtube.com/shorts/5ydqj3va6ts


🌹 త్రిదళం బిల్వం శివార్పణం Tridalam Bilvam Shivarpanam 🌹

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


తిరుమల గిపిపై వెలసిన వెంకన్నా శుభ శనివారం Happy Saturday, Venkanna, who appeared on the Tirumala Hill (a YT Short)



https://www.youtube.com/shorts/Gcho90Fj-_M


🌹 తిరుమల గిపిపై వెలసిన వెంకన్నా శుభ శనివారం 🌹
🌹 Happy Saturday, Venkanna, who appeared on the Tirumala Hill 🌹


Prasad Bharadwaja
ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹



మార్గశిర మాసం - ముక్తికి మార్గం Margashira Masam - The path to liberation


🌹 నేటి నుంచి మార్గశిర మాసం ప్రారంభం - "మార్గశిర మాసం" - ముక్తికి మార్గం 🌹
🌻 మార్గశిర మాసం విశిష్టత 🌻
ప్రసాద్ భరద్వాజ


🌹 Margashira month begins from today - "Margashira month" - the path to liberation 🌹
🌻 Margashira month's special features 🌻
Prasad Bharadwaja


చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలసిన పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అంటారు.

ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం.

భగవద్గీతలోని విభూతియోగంలో - "మాసానాం మార్గశీర్షం"

మాసాల్లో తాను మార్గశిరమాసాన్నని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ.

ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని , సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది. అందువలన బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం , సంధ్యావందన జపధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి , అగ్నితేజము కూడా మన మనస్సును , బుద్ధిని వికసింపజేస్తాయి .

అందుకే.... మార్గశిర మాసంలో - ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుఝాముననే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి , శ్రీలక్ష్మిసమేత శ్రీమహవిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి.

ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి. శ్రీ విష్ణువుతో పాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో.


.. 🍀 "ఓం నమో నారాయణాయ'" 🍀

అనే మంత్రాన్ని స్మరించాలి .

ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసికొని , 'ఓం నమో నారాయణాయ' అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి. ఈ మార్గశిరమాసం ఎన్నో పుణ్యదినములకు నెలవు.

మార్గశిర శుద్ధ షష్ఠి - 'స్కంద షష్ఠి'.

శివకుమారుడైన కుమారస్వామి ఈరోజున తారకాసురున్ని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి.

తెలుగువారు దీన్ని ""'సుబ్రహ్మణ్య షష్ఠి'"" అని అంటారు

మార్గశిర శుద్ధ ఏకాదశి - 'వైకుంఠ ఏకాదశి'.

దీనినే 'మోక్ష్తెకాదశి' అని అంటారు .

ఆ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తరద్వారం నుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. తిరుపతి , శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆరోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశచిహ్నంగా భావిస్తారు.

మోక్షదా ఏకాదశి ... "గీతాజయంతి".

సమస్తమానవాళికి ధర్మ నిధి , భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి , సఫలైకాదశి అనికూడా పిలుస్తారు.

త్రిమూర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల సమైక్యస్థితి దత్తాత్రేయుడు.

ఈ "దత్తాత్రేయ జయంతి" ని మార్గశిరంలోనే శుక్లపూర్ణిమ నాడు జరుపుకుంటారు.

మార్గశిర శుక్ల త్రయోదశినాడు

"హనుమద్‌వ్రతం", "మత్స్యద్వాదశి", "ప్రదోష వ్రతం" ఆచరించడం పరిపాటి .


ఈ మాసంలోనే....

" అనంత తృతీయ , నాగపంచమి , సుబ్రమణ్యషష్టి , పరశురామ జయంతి , సంకటహర చతుర్ధి , ఫలసప్తమి , కాలభైరవాష్టమి , రూపనవమి , సఫలా ఏకాదశి , కృష్ణ (మల్ల) ద్వాదశి , యమదర్శన త్రయోదశి , ప్రదోష వ్రతం , శ్రీమహావిష్ణువు సూర్యుని రూపంలో ధనస్సు రాశిలో ప్రవేశించే పుణ్యవేళ ఈ మాసంలోనే ఈ ధనుస్సంక్రాంతినే "ధనుర్మాసం" అనిఅంటాము. తిరుప్పావై పారాయణము ప్రారంభమయ్యే పుణ్యవేళ ఇలాంటి ఎన్నో విశిష్టతలతో కూడిన మాసం

కావున శ్రీమన్నారాయణ్ణున్ని తరించి జన్మసార్ధకం చేసుకునేందుకు, భక్తి భావనను పెంపోదించుకొనుటకు దాన ధర్మాలను ఆచరింస్తూ పుణ్యఫలంను దక్కించుకొనేందుకు ఈ మార్గశిరం సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకారిగా నిలుస్తుంది.

ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

🌹 🌹 🌹 🌹 🌹

పోలిస్వర్గం పోలి పాడ్యమి శుభాకాంక్షలు భక్తులందరికి Polisvargam Poli Padyami Greetings to all the devotees



🌹 పోలిస్వర్గం పోలి పాడ్యమి శుభాకాంక్షలు భక్తులందరికి - పూజా విధానం, పురాణ గాధ 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Polisvargam Poli Padyami Greetings to all the devotees - Puja method, Purana Gadha 🌹

Prasad Bharadwaja



కార్తీకమాసం కార్తీక నవంబరు 20 అమావాస్యతో ముగుస్తుంది. ఆ మరుసటి రోజు నుంచి మార్గశిరమాసం ప్రారంభమవుతుంది.


అయితే మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమి అంటారు. ఈ రోజునే పోలి స్వర్గం అని ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీకమాసంలో నియమాలు పాటించి నిత్యం స్నానం, దీపం నియమాలు పాటించిన వారు... పోలిస్వర్గం రోజు వేకువజామునే దీపాలు నీటిలో వదలడంతో వ్రతం పూర్తైందని భావిస్తారు.

నెల రోజులు కార్తీక మాస నియమాలు అనుసరించిన వారికి పోలిస్వర్గం ముగింపు రోజు అయితే... నెలరోజులూ నియమాలు పాటించనివారు ఆ కార్తీక వ్రత ఫలితాన్ని పొందేందుకు పోలిస్వర్గం రోజు దీపాలు నదిలో విడిచిపెడతారు.

ఈ ఏడాది పోలిస్వర్గం ఎప్పుడు?

సాధారణంగా కార్తీకమాసం అమావాస్య తర్వాత మార్గశిర పాడ్యమి రోజుని పోలి పాడ్యమి అంటారు. ఈ రోజే దీపాలు విడిచిపెట్టి కార్తీకవ్రతాన్ని ముగిస్తారు. అయితే పోలిస్వర్గం ఈ ఏడాది శుక్రవారం వచ్చింది. శుక్రవారం రోజు అమ్మవారిని ఇంటినుంచి పంపించకూడదని అందుకే ఈ ఏడాది కార్తీక వ్రతం ముగింపు శుక్రవారం కాకుండా శనివారం అనుసరించాలంటున్నారు.

సాధారణంగా పోలి పాడ్యమి శుక్రవారం వచ్చినప్పుడు ఆ రోజు పోలమ్మను స్వర్గానికి పంపించరు. బదులుగా శనివారం చేస్తారు. శుక్రవారం లక్ష్మీదేవి రోజు.. పోలమ్మను లక్ష్మీదేవిగా భావిస్తారు... అందుకే పోలమ్మను స్వర్గానికి శనివారం పంపించాలని చెబుతారు కొందరు పండితులు. ఈ విషయంపై స్థానికంగా మీరు విశ్వసించే పండితులు చెప్పిన విధానం, ఇంటిపెద్దల సలహాలు అనుసరించడం మంచిది..


🍀 ఇంతకీ పోలిస్వర్గం అని ఎందుకంటారు? దీని వెనుకున్న పురాణ కథేంటి? ఈ రోజు ఏం చేయాలి? 🍀

🍁 పోలి పాడ్యమి కథ 🍁


పూర్వకాలంలో ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్లుండేవారు. వారిలో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు దైవభక్తి చాలా ఎక్కువ. కానీ ఆ భర్తే ఆమెకు శాపంగా మారింది. ఆ భక్తి చూసి అత్త ఓర్వలేకపోయింది..అందుకే నలుగురు కోడళ్లను ప్రేమగా చూసేది కానీ పోలిని బాధలు పెట్టేది. పూజలు చేయనిచ్చేది కాదు. కార్తీకమాసం రావడంతో నలుగురు కోడళ్లను తీసుకుని నిత్యం నదీ స్నానానికి వెళ్లి అక్కడ దీపాలు వెలిగించేది. చిన్న కోడలు నదికి రాకుండా ఇంట్లో పనులన్నీ చేయించేది. నిరాశచెందని పోలి..అత్త, నలుగురు తోడికోడళ్లు వెళ్లిపోయిన వెంటనే స్నానమాచరించి ఇంటి దగ్గరే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించేది. ఇంటి పెరట్లో ఉన్న పత్తిని తీసి ఒత్తి చేసి..వెన్న రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికంటా పడకుండా బుట్ట బోర్లించేది. నెలరోజులూ క్రమం తప్పకుండా దీపం వెలిగించింది పోలి. ఆఖరి రోజైన మార్గశిర పాడ్యమి రోజు కూడా అంతా నదికి వెళ్లారు. వారు తిరిగి వచ్చేసరికి ఇంటి దగ్గర కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆ రోజు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దీపం వెలిగించి కార్తీక దామోదరుడిని ప్రార్థించింది పోలి. వెంటనే స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవతలు పోలిని ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన అత్త, నలుగురు తోడికోడళ్లు ఇదేంటి, నెల రోజులు తాము భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే పోలిని తీసుకెళుతున్నారని. అందుకు పోలి చేసిన పూజల గురించి చెప్పారు దేవదూతలు. తాము కూడా పోలితో పాటూ స్వర్గానికి వెళ్లాలంటూ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పూజలు చేయడం కాదు. కల్మషం లేని భక్తితో పూజలు చేసినప్పుడే ఆ పూజలు ఫలిస్తాయని చెప్పారు దేవదూతలు.

కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పోలి పాడ్యమి రోజు దేవుడి దగ్గర, తులసి మొక్క దగ్గర దీపం వెలిగించుకుని ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గ ప్రాప్తి లభిస్తుందని కార్తీక పురాణంలో ఉంది. నెల రోజులు నియమాలు పాటించని వారు ఈ రోజు 30 వత్తులు వెలిగిస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని నమ్మకం. ఈ రోజు దీపదానం ఆచరిస్తే మంచి జరుగుతుంది.

పోలిస్వర్గం కథ పూర్తిగా..తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకునే కథ... కార్తీకమాసంలో నిత్యం దీపారాధన, పూజలు చేయడం కాదు..కల్మషం లేకుండా భగవంతుడిని ఆరాధించినప్పుడే మీకు జరగాల్సిన మంచి జరుగుతుందన్నది ఈ కథలో ఆంతర్యం.

🌹🌹🌹🌹🌹

పోలి స్వర్గం పాడ్యమి విశిష్టత The uniqueness of the heavenly world (a YT Short)



https://youtube.com/shorts/au7kbOVLM1g


🌹 పోలి స్వర్గం పాడ్యమి విశిష్టత 🌹
🌹 The uniqueness of the heavenly world 🌹


Prasad Bharadwaja
ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



మార్గశిర మాసం విశిష్టత - మార్గశిర మాసం - ముక్తికి మార్గం Margasira Masa Significance - Way To Moksha (A YT video)




https://youtu.be/BU8EqysDC5U


🌹 మార్గశిర మాసం విశిష్టత - మార్గశిర మాసం - ముక్తికి మార్గం MARGASIRA MASA SIGNIFICANCE - WAY TO MOKSHA 🌹

మార్గశిర మాసంలో వచ్చే అన్ని విశిష్ట పండుగల విశేషాలు, చేయవలసిన విధులు ఈ వీడియోలో తెలుసుకోండి. మృగశిర నక్షత్రం కలసి పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించే నెల మార్గశీర్ష మాసం. “మాసానాం మార్గశీర్షోహం” అని కృష్ణుడు స్వయంగా చెప్పాడు. కనుక మార్గశిర మాసం విష్ణుదేవుని రూపం. భాద్రపదంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తీకంలో శివుని, మార్గాశిరంలో విష్ణువును, పుష్యమాసంలో సూర్య భగవానుని ఇలా అయిదు మాసాలలో అయిదు దేవతా స్వరూపాలను అర్చిస్తూ పంచాయతన పూజా విధానాన్ని మన మహర్షులు సష్ట పరచారు.

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



పోలి స్వర్గం శుక్రవారమా? శనివారమా? - పోలి స్వర్గం పూజా విధానం, పురాణ గాధ Poli Swargam Pooja - Story (a YT Short)



https://youtu.be/5lQAYJrrCvE


🌹🪔 పోలి స్వర్గం శుక్రవారమా? శనివారమా? - పోలి స్వర్గం పూజా విధానం, పురాణ గాధ POLI SWARGAM POOJA - STORY 🪔🌹


🪔🪔🪔 కార్తీక మాసంలో నియమాలు పాటించి నిత్యం స్నానం, దీపం నియమాలు పాటించిన వారు... పోలిస్వర్గం రోజు వేకువజామునే దీపాలు నీటిలో వదలడంతో వ్రతం పూర్తైందని భావిస్తారు. నెల రోజులు కార్తీక మాస నియమాలు అనుసరించిన వారికి పోలిస్వర్గం ముగింపు రోజు అయితే... నెలరోజులూ నియమాలు పాటించనివారు ఆ కార్తీక వ్రత ఫలితాన్ని పొందేందుకు పోలిస్వర్గం రోజు దీపాలు నదిలో విడిచిపెడతారు. 🪔🪔🪔

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹



శివుని శక్తి - కృష్ణుని మాయ - ఇచ్చినా తీసుకున్నా పరీక్షే Shiva's Power - Krishna Maya All is Examination (a YT Short)




https://youtube.com/shorts/jCS-yCrf0js


🌹 శివుని శక్తి - కృష్ణుని మాయ - ఇచ్చినా తీసుకున్నా పరీక్షే Shiva's Power - Krishna Maya All is Examination 🌹

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


కార్తీక మాసం 30వ రోజు చేయ వలసినవి Things to do on 30th Day of Kartika Month (a YT Short)



https://youtube.com/shorts/J2ijxLPR_Kc


🌹 కార్తీక మాసం 30వ రోజు చేయ వలసినవి Things to do on 30th Day of Kartika Month 🌹

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹




కార్తీక పురాణం 30వ అధ్యాయము -కార్తీక వ్రత మహిమ్నా ఫలశ్రుతి / Karthika Puranam 30th Chapter Parayan (a YT Short)



https://youtu.be/uNon2HkwBRU


🌹 కార్తీక పురాణం 30వ అధ్యాయము -కార్తీక వ్రత మహిమ్నా ఫలశ్రుతి KARTHIKA PURANAM 30th CHAPTER PARAYAN 🌹

ప్రసాద్ భరద్వాజ




Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



కార్తీక అమావాస్య Kartik Amavasya



🌹 కార్తీక అమావాస్య - శుభ ముహూర్తం, పూజా విధానం, పితృ అనుగ్రహం పొందేందుకు జపించాల్సిన శక్తివంతమైన మంత్రం ఇదే! 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Kartik Amavasya - Auspicious time, method of worship, and this is the powerful mantra to chant to get ancestral blessings! 🌹
Prasad Bharadwaj


మన పూర్వీకులను స్మరించుకోవడానికి, వారిని పూజించడానికి కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, పితృదోషంతో బాధపడుతున్న వారు ఈ రోజున వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలి.

శుభ ముహూర్తం

దృక్ పంచాంగం ప్రకారం.. మార్గశిర మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తిథి ఈ ఉదయం 9:43 నిమిషాలకు ప్రారంభమౌతుంది. గురువారం మధ్యాహ్నం 12:16 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, కార్తీక అమావాస్యను గురువారం నాడు ఆచరిస్తారు. కొందరు మాత్రం అమావాస్య తిథి ప్రకారం నేడే దీన్ని జరుపుకొంటారు. కార్తీక అమావాస్య నాటి బ్రహ్మ ముహూర్తాన్ని అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణిస్తారు. తెల్లవారు జామున 5:01 నుండి 5:54 నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో పవిత్ర నదీ స్నానాలు చేయడం, దానధర్మాలు చేయడం శ్రేష్ఠమని పండితులు సూచిస్తున్నారు.


కార్తీక అమావాస్య శుభ ముహూర్తం - 2025

అమావాస్య తిథి ప్రారంభం: గురువారం ఉదయం 9:43 AM

తిథి ముగింపు: మధ్యాహ్నం 12:16 PM

బ్రహ్మముహూర్తం: తెల్లవారుజామున 4:00 AM - 5:54 AM


అమావాస్య రోజున బ్రహ్మముహూర్తంలో చేసిన పూజ, దానాలు, నది స్నానాలు అనేక రెట్లు పుణ్యఫలితాలను ఇస్తాయంటారు.


🍀 కార్తీక అమావాస్య పూజా విధానం - ఇలా చేసుకుంటే శుభ ఫలితాలు 🍀

1. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి.

2. వీలైతే నది స్నానం చేయడం ఉత్తమం.

3.రాగి పాత్రలో నీళ్లు, కొద్దిగా పాలు, సింధూరం, ఎర్ర పూలు వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి.

4.శివ-కేశవులను స్మరిస్తూ పుష్పాలు, పసుపు, కుంకుమ, చందనం, అక్షింతలు సమర్పించాలి.

5.నైవేద్యం పెట్టి దీపారాధన చేయాలి.


కార్తీక అమావాస్య నాడు తప్పక జపించాల్సిన శక్తివంతమైన మంత్రం

పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, పితృదోషాలను తగ్గించుకోవడానికి ఈ మంత్రం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు-


"ఓం పితృదేవతాయ నమః"

ఈ మంత్రాన్ని పవిత్రతతో, భక్తితో జపిస్తే పూర్వికుల ఆశీస్సులు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.


🍁 తర్పణాలు 🍁

పూజ తర్వాత, అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణం వదలాలి. గంగాజలాన్ని వినియోగించడం అత్యంత శ్రేష్టం. అది సాధ్యం కాని వాళ్లు నీరు, నల్ల నువ్వులు, పచ్చి పాలను రాగి లేదా ఇత్తడి పాత్రలో కలిపి శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. దక్షిణం వైపు ముఖం చేసి కూర్చుని, చేతిలో నీరు తీసుకుని, సంకల్పం చెప్పుకుని, మీ పూర్వీకులను స్మరిస్తూ నీటిని సమర్పించాలి. "ఓం పితృ దేవతాయై నమః" అనే మంత్రాన్ని జపించాలి. చివరగా, అవసరమైన వారికి ఆహారం లేదా ఆహార పదార్థాలను దానం చేయాలి.

అలాగే, సాయంత్రం తులసికోట దగ్గర పిండి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయని, పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు.

🌹🌹🌹🌹🌹

కార్తీక పురాణం - 30 :- 30వ అధ్యాయము - కార్తీక వ్రత మహిమ్నా ఫలశ్రుతి / Kartika Purana - 30 :- Chapter 30 - Kartika Vrata Mahimna Phalashruti


🌹. కార్తీక పురాణం - 30 🌹
🌻 30వ అధ్యాయము - కార్తీక వ్రత మహిమ్నా ఫలశ్రుతి 🌻
ప్రసాద్ భరద్వాజ


🌹. Kartika Purana - 30 🌹
🌻 Chapter 30 - Kartika Vrata Mahimna Phalashruti 🌻
Prasad Bharadwaja


నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు యింకను సంశయములు తీరనందున, సూతునిగాంచి,

"ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచారపరులై జీవించుచు సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్షసాధనకుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు వుత్తమదైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల వుపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము. కాన దీనిని వివరించి తెలియజేయు"మని కోరిరి.

అంత సూతుడా ప్రశ్న నాలకించి "ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్షముగా వివరించెదను.

కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీకమాసమున సూర్యభగవానుదు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీస్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చేయవలయును. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని, శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు యీ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండికూడా ఆచరించక గాని, లేక, ఆచరించువారలను యెగతాళి చేసినగాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియేగాక అట్తివారు నూరుజన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.

కార్తీక మాసములో కావేరి నదిలోగాని, గంగా నదిలోగాని, అఖండ గౌతమినదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ యిహమందు సర్వసుఖములను అనుభవించుటయే గాక, జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు.

సంవత్సరములోవచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము వుత్తమోత్తమమైనది అధిక ఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మలనుండి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మలేక, వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రతమాచరించవలెననెది కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీకమాసమన్న కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును.

కాన, ప్రతిమానవుదు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారు కార్తీకశుద్ద పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈనె, అరోజులు ధనవంతుడైనను, బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోక మబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్థప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము- ముప్పదవ(ఆఖరి రోజు) పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹కార్తీక మాసం 30వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹
ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి

దానములు:- నువ్వులు, తర్పణలు, ఉసిరి

పూజించాల్సిన దైవము:- సర్వదేవతలు, పితృ దేవతలు

జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా మమ సమస్త పితృదేవతాభ్యో నమః

🌹 🌹 🌹 🌹 🌹

కార్తీక పురాణం - 29 :- 29వ అధ్యాయము - అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి ప్రాణము Kartika Purana - 29 :- Chapter 29 - Ambarisha worships Durvasa


🌹. కార్తీక పురాణం - 29 🌹
🌻. 29వ అధ్యాయము - అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి ప్రాణము 🌻
ప్రసాద్ భరద్వాజ

🌹. Kartika Purana - 29 🌹
🌻. Chapter 29 - Ambarisha worships Durvasa - Dwadashi Prana 🌻
Prasad Bharadwaja


అత్రి మహాముని అగస్త్యులవారితో యీ విధముగా - సుదర్శన చక్రము అంబరీషునక భయమిచ్చి వుభయులను రక్షించి, భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువ నారంభించెను.

ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండ ప్రణామములాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, "ఓ మునిశ్రేష్టా! నేను సంసార మార్గమందున్న యొక సామాన్య గృహస్తుడను. నా శక్తి కొలది నేను శ్రీ మన్నారాయణుని సేవింతును, ద్వాదశశీ వ్రతము జేసుకోనుచు ప్రజలకు యెట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ యెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానించితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించి నన్నును, నా వంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు, మీరు దయార్ద్ర హృదయులు, ప్రధమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ వుపకారమును మరువలేకున్నాను.

మహానుభావా! నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవచేసినను యింకను ఋణపడియుందును. కాన, ఓ పుణ్యపురుషా! నాకు మరల నర జన్మ రాకుండా వుండేటట్లును, సదా, మీ బోటి మునిశ్రేష్ఠుల యందును - ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గలవాడనై యుండునట్లును నన్నాశీర్వదించు"డని ప్రార్ధించి, సహాపంక్తి భోజనమునకు దయ చేయుమని ఆహ్వానించెను.

ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్ధించుచున్న అంబరీషుని ఆశీర్వదించి "రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు. తండ్రితో సమానుడవైనావు.

నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు అయుక్షిణము కలుగును.అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిక యీ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర యేకాదశి వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగ జేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక, మరొకటి యగునా?" అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి, అతని భక్తిని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి, సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను.

ఈ వృత్తాంతమంతయు కార్తిక శుద్ధ ద్వాదశీ దినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహామునీ! ద్వాదశీ వ్రత ప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై వుండును. కనుకనే, ఆరోజుకంతటి శ్రేష్టతయు, మహిమ గలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము యితర దినములలో పంచ దానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ యేకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్ల హరి నామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశినాడు తన శక్తి కొలది శ్రీమన్నారయణునకు ప్రీతీ కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు యీ వ్రత ప్రభావము వలన పటాపంఛలై పోవును. ద్వాదశీ దినము శ్రీమన్నానరయుణుకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశ ఘడియలు తక్కువగా యున్నను. ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను.

ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసమేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో, అట్టి వారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి అత్యంత ప్రీతీకరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయింప కూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగ జేసిన యే కొంచము పుణ్యమైనను, అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును.

అందులకే యీ కార్తీకమాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి.

ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును - అని అత్రిమహాముని అగస్త్యనకు బోధించిరి.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనత్రింశోధ్యాయము - ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹కార్తీక మాసం 29వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹
ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి

దానములు:- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము:- శివుడు (మృత్యుంజయుడు)

జపించాల్సిన మంత్రము:- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శైల పంచ నందీశ్వర ఆలయ రహస్యం / Pancha Nandiswara Alayam Srisailam (a YT Short)



https://youtube.com/shorts/j1YT6wZAOhc


🌹 శ్రీ శైల పంచ నందీశ్వర ఆలయ రహస్యం Pancha Nandiswara Alayam Srisailam 🌹

ప్రసాద్ భరద్వాజ




Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹


చిదంబర రహస్యం అంటే ఏమిటో మీకు తెలుసా Chidambara Rahasyam (a YT Short)




https://youtube.com/shorts/GJAstZzT_oI


🌹 చిదంబర రహస్యం అంటే ఏమిటో మీకు తెలుసా Chidambara Rahasyam 🌹
ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

కార్తీక మాసం 28వ రోజు చేయవలసినవి / Things to do on 28th Day of Kartika Month (a YT Short)



https://youtube.com/shorts/5Y2KcagG7JM


🌹 కార్తీక మాసం 28వ రోజు చేయవలసినవి
Things to do on 28th Day of Kartika Month 🌹

ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


కార్తీక పురాణం 28వ అధ్యాయము / Karthika Puranam 28th Chapter Parayan (a YT Short)



https://www.youtube.com/watch?v=yL1O3En-Ze8


🌹 కార్తీక పురాణం 28వ అధ్యాయము - విష్ణు సుదర్శన చక్ర మహిమ KARTHIKA PURANAM 28th CHAPTER PARAYAN 🌹

ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


కార్తిక పురాణం - 28:- 28వ అధ్యాయము - విష్ణు సుదర్శన చక్ర మహిమ / Kartika Purana - 28:- Chapter 28 - The Glory of Vishnu's Sudarshana Chakra



🌹. కార్తిక పురాణం - 28 🌹
🌻. 28వ అధ్యాయము - విష్ణు సుదర్శన చక్ర మహిమ 🌻
ప్రసాద్‌ భరధ్వాజ

🌹. Kartika Purana - 28 🌹
🌻. Chapter 28 - The Glory of Vishnu's Sudarshana Chakra 🌻
Prasad Bharadhwaja



జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుక ముందు లాలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.

అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి "అంబరీషా, ధర్మపాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము, నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి, కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది. నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధి౦చితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి తపశ్శాలినైనను, యెంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు"మని అనేక విధాల ప్రార్ధఒచగా, అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి,

"ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మన:పూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో, తెలియకయో తొందరపాటుగా యీ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను యీతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు, ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని, ముందు నన్నుచంపి, తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే యీ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు, నీ శక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.

నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణు వేడిన యీ దుర్వాసుని రక్షింపుము" అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి

"ఓ భక్తాగ్రేశ్వరా ! అంబరీషా! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను - దేవతలందరు యెకమైకూడ - చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే, ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీవ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్టవలెనని కన్ను లెఱ్ఱజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.

ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని, శక్తిలో నా కంటె యెక్కువేమియుగాదు. సృషి కర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను, కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించువారలు యెటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు.

ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు" మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, " నేను దేవ గో, బ్రాహ్మణాదుల యుందును, స్త్రీలయందును, గౌరవము గలవాడను.

నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవలెననియే నా యభిలాష. కాన, శరణుగోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేక మైననూ నీ శక్తీకి, తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ - గో - బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి, తనకుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన, నీకివే నా మన:పూర్వక నమస్కృతులు" అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను.

అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలింగన మొనర్చి "అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరు పఠింతురో, యెవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో, యెవరో పరులను హింసించక - పరధనములను ఆశపడక - పరస్త్రీలను చెరబెట్టిక - గోహత్య - బ్రాహ్మణహత్య - శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి, యిహమందును పరమందును సర్వసౌఖ్యములతోడ తులతూగుదురు. కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను, నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు యీ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు." అని చెప్పి అతని నాశీర్వదించి, అదృశ్యమయ్యెను.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹కార్తీక మాసం 28వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ

దానములు:- నువ్వులు, ఉసిరి

పూజించాల్సిన దైవము:- ధర్ముడు

జపించాల్సిన

మంత్రము:- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా

🌹 🌹 🌹 🌹 🌹


కార్తీక మాసం సోమవారం విశిష్టత పరిహారాలు // Significance of Karthika Masam Somavaram - Remedies



https://www.youtube.com/watch?v=1-jjrSAApKU


🌹 కార్తీక మాసం సోమవారం విశిష్టత పరిహారాలు
Significance of Karthika Masam Somavaram - Remedies 🌹


తప్పక వీక్షించండి


ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹



ఓం నమః శివాయ, కార్తీక సోమవారం శుభాకాంక్షలు // Om Namah Shivaya, Happy Karthika Monday



https://youtube.com/shorts/PkIGPBYV608


🌹 ఓం నమః శివాయ కార్తీక సోమవారం శుభాకాంక్షలు 🌹
ప్రసాద్ భరద్వాజ

Om Namah Shivaya Happy Karthika Monday
Prasad Bharadwaj 


Like, Subscribe and Share

కార్తీకమాసం చివరి సోమవారం ( నవంబర్ 17).. // Last Monday of Kartik month (November 17)..



🌹 కార్తీకమాసం చివరి సోమవారం ( నవంబర్ 17).. చేయాల్సిన పరిహారాలు ఇవే..!సిరి సంపదలకు లోటే ఉండదు..! 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Last Monday of Kartik month (November 17).. Here are the remedies to be done..! There will be no shortage of wealth..! 🌹

Prasad Bharadwaja




ఈ ఏడాది ( 2025) నవంబర్​ 17 కార్తీకమాసం చివరి సోమవారం. ఈ 30 రోజులకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్నా.. కార్తీక సోమవారం చివరి సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంది.

ఈ రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే దరిద్రాలన్నీ తొలగిపోవడం ఖాయమని పండితులు చెబుతున్నారు.

పురాణాల ప్రకారం కార్తీక మాసంలో దేవతలంతా కలిసి దివికి దిగి వచ్చి దేవతల దీపావళి జరుపుకుంటారని నమ్మిక. ముఖ్యంగా కార్తీకమాసంలో వచ్చే సోమవారాల్లో శివుడిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం పొంది సకల పాపాలు తొలగిపోయి అదృష్టం కలిసివస్తుంది.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది (2025) కార్తీక మాసం చివరి సోమవారం నవంబరు 17 అవుతుంది. కార్తీకమాసంలో చివరి సోమవారం కనుక ఈ రోజుకు ప్రత్యేకత ఎక్కువ.ఈ రోజు కొన్ని రకాల పనులు చేయడం వల్ల భక్తులకు సిరి సంపదలు, విద్య, ఆరోగ్యం, సంతోషం కలుగుతాయని నమ్ముతారు.


🌻 కార్తీక మాసం చివరి సోమవారం చేయాల్సిన పరిహారాలు. 🌻

కార్తీకమాసం అంతా గుడికి వెళ్లకపోయినా ఈ మాసంలో వచ్చే చివరి సోమవారం తప్పకుండా శివుడి గుడికి వెళ్లాలి.

ఉదయాన్నే ఇంటినీ, ఒంటినీ శుభ్రం చేసుకుని శివుడి దగ్గర నెయ్యితో దీపం వెలిగించాలి.

శివక్షేత్రానికి వెళ్లి ఆయనకు ఇష్టమైన బిల్వ పత్రాలను సమర్పించాలి.

నీటితో లేదా పాలు, పెరుగు, తేనె, పంచామృతం వంటి వాటితో పరమేశ్వరుడికి అభిషేకం చేయించాలి.

గంగాజలం, చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు దక్కుతాయి.

కార్తీకమాసం చివరిసోమవారం రోజున మీ స్తోమతను బట్టి అన్నదానం, వస్త్రదానం వంటి పుణ్యకార్యాలు చేయాలి.

ప్రతి రోజూ దీపారాధన చేసే అలవాటు, వీలు లేని వారు కార్తీకమాసంలో పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించని వారు ...చివరి సోమవారం రోజున 365 వత్తులు, లక్ష వత్తులతో దీపాలు వెలిగించాలి.

కార్తీక సోమవారం రోజున శివుడి వాహనం నంది కనుక ఆవుకు ఆహారం తినిపించాలి.

ఆలయంలో ఉండే ద్వజ స్తంభానికి పూజలు చేసి దీపం వెలిగించాలి.

కార్తీకమాసంలో చివరి సోమవారం కనుక నవంబర్​ 17న ఉపవాస దీక్ష చేపట్టి రోజంతా శివనామస్మరణ చేయాలి.



🍀 🪔 కార్తీక మాసం ఆఖరి సోమవారం.. ఇలా పూజిస్తే ఎన్నో ప్రయోజనాలు! 🪔🍀

కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివారాధనకు అంకితం చేయబడినప్పటికీ, ఆఖరి కార్తీక సోమవారం అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది.

ఈ ఒక్క రోజు నిష్ఠగా వ్రతం ఆచరిస్తే, ఏడాది పొడవునా చేసిన వ్రత ఫలం, కోటి సోమవారాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటు స్నానం చేయాలి. కార్తీక మాసంలో నదీ స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది. నదికి వెళ్లలేనివారు ఇంటి వద్దే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం లేదా ఏదైనా పవిత్ర నదీ జలం కలుపుకోవచ్చు. శుభ్రమైన, కొత్త వస్త్రాలు ధరించాలి. సాధ్యమైతే, రోజు మొత్తం నిష్ఠగా ఉపవాసం ఉండటం ఉత్తమం. అలా ఉండలేనివారు పాలు, పండ్లు లేదా అల్పాహారం తీసుకోవచ్చు.

సూర్యాస్తమయం తర్వాత నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఆహారం తీసుకోకుండా ఉండటాన్ని 'నక్తం' అంటారు. రాత్రి పూజ పూర్తయ్యాక ఉపవాసాన్ని విరమించాలి. ఇంట్లోని పూజామందిరాన్ని శుభ్రం చేసి, తులసికోట దగ్గర మరియు శివుడి పటాల ముందు దీపారాధన చేయాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి.

365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం ఈ రోజున ప్రత్యేక ఫలాన్ని ఇస్తుంది. ఇది ఏడాది పొడవునా దీపాలు వెలిగించినంత ఫలితం ఇస్తుందని విశ్వాసం. శివలింగానికి పూజ చేయడం ఈ రోజు ప్రధానం. పంచామృతాలతో (పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర) అభిషేకం చేయాలి. గంధపు నీటితో కూడా అభిషేకం చేయవచ్చు. మారేడు దళాలు (బిల్వ పత్రాలు), తెల్లటి పువ్వులు, జిల్లేడు పువ్వులు, అక్షతలతో శివుడిని భక్తితో పూజించాలి. పాయసం లేదా పులిహోర వంటి నైవేద్యాలను సమర్పించాలి. భక్తి శ్రద్ధలతో 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరీ మంత్రాన్ని, లేదా శివ అష్టోత్తరం, శివ సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది.

సూర్యాస్తమయం తరువాత వచ్చే ప్రదోష కాలం శివారాధనకు అత్యంత ముఖ్యమైన సమయం. ఈ సమయంలో మరోసారి దీపారాధన చేసి, వీలైతే శివాలయాన్ని సందర్శించి, అక్కడ కూడా దీపాలు వెలిగించాలి. ఆఖరి సోమవారం నాడు 365 మందికి దానధర్మాలు చేయడం వల్ల కూడా ఏడాది పొడవునా చేసిన వ్రత ఫలితం దక్కుతుందని చెబుతారు.

🌹🌹🌹🌹🌹

కార్తీక మాసం 27వ రోజు చేయవలసినవి // Things to do on 27th Day of Kartika Month



https://youtube.com/shorts/wjhtB4t4uxE


🌹 కార్తీక మాసం 27వ రోజు చేయవలసినవి Things to do on 27th Day of Kartika Month 🌹
ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹