✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 24 🌻
585. మానవుడు పరస్పరాశ్రితములైన యీ నాలుగు గోళములను దూకి తనదైన సత్యగోళములోనికి ప్రవేశించెను, ప్రవేశించును.
586. ఐదవ గోళము లేక, సప్తమ భూమిక ఏ గోళమును కాదు.లేక ఒక భూమికయును కాదు అని చెప్పుటలో పొరపాటు లేదు. అది భగవంతుని స్వీయ స్వత్వముయొక్క సత్యస్థితి.
587. అనంత జ్ఞాన శక్యానందముల సప్తమ భూమికలో జీవాత్మ భగవంతునిలో లీనమై, భగవంతుడే యగును. ఎల్లకాలముల యందు కాలమును అధిగమించి యుండును. అప్పుడతనికి శరీరమున్నను లేనట్లే పరిగణించబడును. సత్యధర్మము ననుసరించి పరమాత్మానుభూతి నొందిన కొద్దికాలములో ఈ స్థూలకాయము రాలిపోవును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
11 Jan 2021

No comments:
Post a Comment