కార్తీక పౌర్ణమి ప్రత్యేకం - మహామృత్యుంజయ భస్మ అభిషేకం Karthika Pournami Special Bhasma Abhishek of Siva (a YT Short)



https://youtube.com/shorts/0ucV-7HuK_8


🌹 కార్తీక పౌర్ణమి ప్రత్యేకం - మహామృత్యుంజయ భస్మ అభిషేకం

Karthika Pournami Special Bhasma Abhishek 🌹




ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹


కార్తీక పౌర్ణమి రోజున శివలింగం అభిషేకం యొక్క ప్రాముఖ్యత! Importance of Abhishekam of Shiva Lingam on Karthik Pournami Day!



🌹🪔 కార్తీక పౌర్ణమి రోజున.. శివ లింగానికి అభిషేకం చేస్తే.. మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటుండదు..! 🪔🌹

ప్రసాద్ భరద్వాజ


🌹🪔 On the day of Kartik Purnima.. if you perform Abhishekam on Shiva Linga.. your house will never lack wealth..! 🪔🌹

Prasad Bharadwaja



కార్తీక పౌర్ణమి.. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే దారిద్ర్య బాధలు తొలగి ధన లాభం కలుగుతుందో, అప్పుల సమస్య నుంచి బయటపడచ్చో, సర్వ సంపదలు ఎలా సిద్ధిస్తాయో తెలుసుకుందాం.

కార్తీక పౌర్ణమి రోజున అందరూ సూర్యదయానికి ముందే చన్నీళ్లతో స్నానం చేయాలి. అలా చేయలేని వాళ్లు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి వీలుకాని ఎవరైనా సరే.. కార్తీ పౌర్ణమి రోజున.. స్నానం చేసేటప్పుడు గంగ యుమన సరస్వతి అని మూడుసార్లు అనుకుంటూ స్నానం చేయాలి. ఆ స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైనా సరే ఆవు పాలతో శివాభిషేకం చేసినట్లైతే.. జీవితంలో వారికి బంగారానికి, వెండికి లోటు ఉండదు. కావాల్సినంత బంగారం, కావాల్సినంత వెండి జీవితంలో కొనుక్కునే యోగం రావాలంటే కార్తీక పౌర్ణమి రోజున కచ్చితంగా ఆవు పాలతో శివ లింగానికి అభిషేకం చేయాలి.

కార్తీక పౌర్ణమి రోజున శివుడిని, లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజించినట్లైతే జన్మజన్మల దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, గొడవలు ఎక్కువగా ఉన్న వారు కార్తీక పౌర్ణమి రోజున ఆవు పాలతో చేసిన పాయం లక్ష్మీ నారాయణులకు నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో లక్ష్మీ నారాయణుల ఫోటో దగ్గర నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదా ఆలయంలో లక్ష్మీ నారాయణులకైనా నైవేద్యంగా సమర్పించొచ్చు. దాన్ని ప్రసాదంగా స్వీకరించడం, ఇతరులకు పంచి పెట్టడం ద్వారా కుటుంబకలహాలన్నీ తొలగిపోతాయి.

అష్ట దరిద్రాలు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల దరిద్ర్యం తొలగిపోవడంతో పాటు తొందరలోనే గృహ యోగం కలుగుతుంది. అరటి ఆకులో ఆవు పాల ప్యాకెట్, ఆవు పెరుగు ప్యాకెట్, ఆవు నెయ్యి ప్యాకెట్ దేవాలయంలో పంతులుకి దానం ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. సమస్త శుభాలు చేకూరతాయి. కార్తీక పౌర్ణమి రోజున అన్నదాం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి.


🪔 దీన్ని దానం చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం..! 🪔

కుబేరుడి దగ్గర ఉన్న నవ నిధులు మనం దానం చేసిన ఫలితం రావాలంటే కార్తీక పౌర్ణమి రోజున శివాలయ ప్రాంగణంలో మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించి, ఆ దీపాన్ని దానం ఇవ్వాలి. కార్తీక పౌర్ణమి రోజున దీప దానం చేస్తే కుబేరుడి దగ్గర నవ నిధులు దానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ దీప దానం వల్ల కోటి యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. కార్తిక పౌర్ణమి రోజున శివాలయంలో కొండెక్కిన దీపాన్ని వెలిగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.

కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించినా, దానం చేసినా కోటి యజ్ఞాలు చేసిన ఫలితం కలిగి సమస్యలన్నీ తొలగిపోతాయి. కార్తిక పౌర్ణమి రోజున తులసికోట దగ్గర ఉసిరక దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఉసిరికాయపైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో తడిపిన ఒత్తి వేసి కార్తీక పౌర్ణమి రోజున తులసి కోట దగ్గర ఉసిరిక దీపాలు వీలైనన్ని వెలిగించాలి. బియ్యం పిండితో చేసిన పిండి దీపాలు ఉసిరిక చెట్టు దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ వెలిగించాలి. తులసి కోటలో ఉసిరిక కొమ్మ ఉంచి లేదా తులసి కోట పక్కనే ఉసిరిక చెట్టు పెట్టుకుని.. ఉసిరిక లేదా పిండి దీపాలు ఇంటి ఆవరణలో వెలిగించుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీనారాయణులు ఆనంద తాండవం చేస్తారు.


🪔 జ్వాలా తోరణం దర్శనం చేసుకోవాలి..🪔

అలాగే సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం రావాలంటే 365 వత్తుల దీపాన్ని ఆవు నెయ్యిలో ముంచి వెలిగించాలి. అలాగే కార్తీక పౌర్ణమి రోజున దేవాలయంలో జ్వాలా తోరణం దర్శనం చేసుకోవాలి. శివాలయాల్లో జ్వాలా తోరణం నిర్వహిస్తారు. గడ్డిని తోరణాల్లా ఏర్పాటు చేసి నువ్వుల నూనెలో ముంచిన వస్త్రాలను ఆ గడ్డికి చుట్టి నిప్పంటించి పార్వతి పరమేశ్వరుల విగ్రహాలు అటు ఇటు మూడుసార్లు తిప్పుతారు. దీన్నే జ్వాలా తోరణం అంటారు. దీన్ని చూస్తేనే సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి.

🌹🌹🌹🌹🌹

కార్తీక పౌర్ణమి రోజున మీ రాశి ప్రకారం దానం చేయండి! Donation according to your zodiac sign on Kartik Purnima day!


🌹 కార్తీక పౌర్ణమి రోజు మీ రాశి ప్రకారం ఇవి దానం చేయడం మర్చిపోవద్దు! 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 Don't forget to donate these according to your zodiac sign on Kartik Purnima day! 🌹
Prasad Bharadwaj


కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం.

అంతే కాకుండా కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. అలాగే దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చన జరిపించిన సర్వశుభాలు ప్రాప్తిస్తాయని శాస్త్ర వచనం. ఈ క్రమంలో కార్తీక పౌర్ణమి రోజు ఆయా రాశుల వాళ్లు రాశి ప్రకారం దానం చేయాల్సినవి ఏమిటో తెలుసుకుందాం..

ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమిని జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈరోజున శివుడు, విష్ణు దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. శ్రీమహావిష్ణువు ఆలయాల్లో ధ్వజస్తంభం ఎదుట, తులసి కోట దగ్గర, దేవుడి సన్నిధిలో ప్రమిదల్లో, ఉసిరికాయల మీద, బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను పసుపు, కుంకుమ, పూలతో అంకరించి వెలిగించాలి. ఇక శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందా దీపం పేరుతో అఖండదీపాన్ని అలాగే ఆకాశదీపం పేరుతో ఎత్తయిన ప్రదేశంలో వేలాడదీస్తారు. అంతే కాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున పవిత్ర నదిలో స్నానం ఆచరించి కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల శుభఫలితాలను పొందొచ్చు. అయితే ఏ రాశి వారు ఎలాంటి వస్తువులు దానం చేయాలో తెలుసుకుందాం..


మేష రాశి - వృషభ రాశి

మేష రాశి వారు కార్తీక పౌర్ణమి రోజు బెల్లం, ఎర్రటి వస్త్రాలు, పప్పులు, ఎర్రటి పండ్లు దానం చేస్తే శుభఫలితాలు కలుగుతాయి. అలాగే శివకేశవుల అనుగ్రహం కూడా పొందొచ్చు. ఇక వృషభ రాశి వాళ్లు కార్తీక పౌర్ణమి రోజు దుప్పట్లు, పాలతో చేసిన స్వీట్లు, బియ్యం, నెయ్యి వంటివి దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్మకం.


మిథున రాశి - కర్కాటక రాశి

కార్తీక పౌర్ణమి రోజు మిథున రాశి వాళ్లు పెసలు, ఆకుపచ్చని కూరగాయలు, ఉసిరికాయలు, పచ్చ రంగు వస్త్రాలు దానం చేయడం చాలా మంచిది. అలాగే.. పిల్లలకు చదువుకు సంబంధించిన వస్తువులను దానం చేయడం కూడా శుభప్రదం. ఇక కర్కాటక రాశి వాళ్లు పాలు, బియ్యం, పంచదార, తెల్లని స్వీట్లు వంటి వాటిని దానం చేస్తే విశేష ఫలితాలను పొందడమే కాకుండా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.


సింహ రాశి - కన్యా రాశి

కార్తీక పౌర్ణమి రోజు సింహ రాశి వాళ్లు గోధుమలు, రాగి వస్తువులు, బెల్లం, నూతన వస్త్రాలు వంటి వాటిని దానం చేయడం శుభప్రదం. ఇక కన్యా రాశి వాళ్లు ఆకుపచ్చని వస్త్రాలు, పెసలు, ఆకుపచ్చ కూరగాయలు, నెయ్యి వంటివి దానం చేయడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు బట్టలు, బియ్యం, పంచదార వంటివి దానం చేయడం వల్ల అన్నీ విధాల శుభ ఫలితాలు కలుగుతాయి.


తుల రాశి - వృశ్చిక రాశి

కార్తీక పౌర్ణమి రోజు తులా రాశి వాళ్లు మినుములు, ఉలవలు, శనగలు, అరటి పండ్లు, పసుపు రంగు వస్తువులు వంటివి దానం చేయడం శుభప్రదం. వృశ్చిక రాశి వాళ్లు బెల్లం, ఎరుపు రంగు వస్త్రాలు, పప్పులు, ఎర్రటి పండ్లు వంటివి కార్తీక పౌర్ణమి రోజు దానం చేయడం మంచిది.


ధనుస్సు రాశి - మకర రాశి

కార్తీక పౌర్ణమి రోజు ధనుస్సు రాశి వాళ్లు కార్తీక పౌర్ణమి రోజు అరటిపండ్లు, పసుపు రంగు వస్త్రాలు, కుంకుమ పువ్వు, పసుపు వంటివి దానం చేయడం శుభప్రదం. ఇక మకర రాశి వాళ్లు నల్ల నువ్వులు, ఆవాల నూనె, మినప పప్పు, దుప్పట్లు, స్టీల్ సామాన్లు వంటివి దానం చేయడం శుభప్రదం.


కుంభ రాశి - మీన రాశి

కార్తీక పౌర్ణమి రోజు కుంభ రాశి వాళ్లు దుప్పట్లు, దుస్తులు, నువ్వులు వంటి వాటిని కార్తీక పౌర్ణమి రోజు దానం చేయడం మంచిది. ఇక మీన రాశి వాళ్లు పసుపు రంగు వస్త్రాలు, శనగపిండితో చేసిన లడ్డూలు, పసుపు వంటివి దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.


🌹🌹🌹🌹🌹

కార్తీక పౌర్ణమి : అప్పుల బాధలు తీర్చే ఉసిరి దీపం.. Karthika Pournami: The Basil lamp that alleviates debts..



🌹🪔 కార్తీక పౌర్ణమి : అప్పుల బాధలు తీర్చే ఉసిరి దీపం.. పౌర్ణమి నాడు ఈ ఒక్క పని చేయండి.. 🪔🌹
ప్రసాద్ భరద్వాజ


🌹🪔 Karthika Pournami: The Basil lamp that alleviates debts.. On Pournami day, just do this one thing.. 🪔🌹
Prasad Bharadwaj


కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. ఉసిరి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం, దీపం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనది. అందుకే ఈ దీపారాధన ధనం, ఆరోగ్యం ఇస్తుంది.

ఈ దీపం వెలిగించటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ధన స్థిరత్వం ఉంటుంది. దీర్ఘకాలంగా వెంటాడుతున్న అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ఉసిరి దీపం ఆయుష్షు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే, జాతకంలోని గ్రహ దోషాలు, పితృ దోషాలు తొలగిపోతాయి. సకల పాపాలు హరిస్తాయి.


🪔 ఉసిరి దీపం విధానం 🪔

పౌర్ణమి రోజు సాయంకాలం ఈ దీపాన్ని వెలిగించాలి.

ఉసిరి సిద్ధం: పూజకు రెండు తాజా ఉసిరికాయలు తీసుకోండి. వాటిని శుభ్రంగా కడగాలి. వాటిని మధ్యలో కోసి, లోపలి గుజ్జును తీసేసి, గిన్నెలా తయారుచేయాలి.

దీపారాధన: ఈ ఉసిరి గిన్నెల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి. కొత్త దూది వత్తిని ఆ నూనెలో ముంచి, ఉసిరి గిన్నెల్లో వేసి దీపం వెలిగించండి.

స్థానం: ఈ దీపాన్ని పూజా మందిరం ముందు లేదా తులసికోట దగ్గర పెట్టి పూజ చేయాలి. తులసికోట ముందు దీపం పెడితే విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి.

దీపం ఆరిపోయే వరకు దానిని కదపకుండా చూడండి. పూజ తర్వాత నైవేద్యం సమర్పించి, హారతి ఇవ్వండి.


🌻 చేయకూడని పొరపాట్లు 🌻

ఉసిరి దీపం వెలిగించేటప్పుడు ఈ తప్పులు చేయకూడదు.

పగిలిన ఉసిరి: పొరపాటున కూడా పగిలిన, దెబ్బతిన్న లేదా పురుగులు పట్టిన ఉసిరికాయలు వాడకూడదు. తాజా ఉసిరిని మాత్రమే ఉపయోగించాలి. పువ్వొత్తిని నిలబెట్టేందుకు ఉసిరికాయను పైన కట్ చేయడం వంటివి చేయడం అపరాధం అని గుర్తించగలరు.

దీపాన్ని కదపడం: దీపం వెలిగించాక, అది పూర్తిగా ఆరిపోయే వరకు దానిని ఎట్టి పరిస్థితుల్లో కదపవద్దు. మధ్యలో ఆర్పకూడదు.

విసర్జన: దీపం పెట్టిన తర్వాత ఉసిరిని చెత్తబుట్టలో వేయకూడదు. మరుసటి రోజు ఉదయమే దానిని తీసుకుని, శుభ్రమైన నదిలో, పారే నీటిలో లేదా మట్టిలో విసర్జించండి.

🌹🌹🌹🌹🌹

కార్తీక మాసం 15వ రోజు చేయవలసినవి. Things to do on 15th day of Kartika month



https://www.youtube.com/shorts/I-WleMqKKpY


🌹 కార్తీక మాసం 15వ రోజు చేయవలసినవి. Things to do on 15th day of Kartika month. 🌹

ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు Happy Kartika Purnima




🌹 కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి 🌹

🍀🪔 కార్తీక పౌర్ణమి విశిష్టత - ఈ రోజున 365 వత్తులతో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే 🪔🍀

ప్రసాద్ భరద్వాజ



🌹 Happy Kartika Purnima to everyone 🌹

🍀🪔 Significance of Kartika Purnima - On this day, performing lamp worship 365 times is equivalent to worshiping three crore (30 million) deities 🪔🍀

Prasad Bharadwaj



కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి. ఈ మాసంలో శివకేశవులను ఆరాధిస్తారు. ఈ పవిత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజుకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. దీనిని త్రిపురారి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు శివుడు త్రిపురాసురులను సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించినట్లు పురాణాలు చెబుతాయి. అందుకే ఈ రోజు చేసే పూజలు, దీపారాధనలు అనంతకోటి పుణ్యఫలాన్ని ఇస్తాయి.

కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజున చేసే ఒక్క దీపారాధన ఏడాది మొత్తం నిత్యం దీపం వెలిగించినంత పుణ్యాన్ని, శుభాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు ఈ రోజున 365 వత్తులతో దీపారాధన చేసి శివకేశవుల అనుగ్రహం పొందుతారు.


🪔 365 వత్తులు వెలిగించడానికి కారణం ఏమిటి? 🪔

సాధారణంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సంధ్యా దీపాన్ని వెలిగించడం హిందూ సంప్రదాయంలో భాగం. అయితే, ప్రస్తుత కలియుగ జీవనశైలిలో ప్రతి ఒక్కరూ నిత్యం దీపారాధన చేయడం సాధ్యపడదు. ఒకరోజు దీపం పెట్టి, మరోరోజు పెట్టకపోవడం వల్ల దోషాలు ఏర్పడతాయి.

నిత్య దీపారాధన ఫలితం: సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. రోజుకు ఒక వత్తి చొప్పున 365 వత్తులను కలిపి కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేస్తే, ఆ ఒక్కరోజు దీపం వెలిగించినా ఏడాది పొడవునా నిత్య దీపారాధన చేసిన ఫలం దక్కుతుంది.


🪔 దేవతల ఆహ్వానం: పురాణాల ప్రకారం, కార్తీక పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు దీపాలను వెలిగిస్తే భూమి పైకి వస్తారు. 365 వత్తులతో దీపారాధన చేసి వారిని ఆహ్వానించి, పూజలు చేయడం ద్వారా వారి ఆశీస్సులు లభిస్తాయి.


🪔 ఏం దోషాలు పరిహారమవుతాయి? 🪔

కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన, ముఖ్యంగా 365 వత్తుల దీపం వెలిగించడం వల్ల ఈ కింది దోషాలు, లోపాలు పరిహారం అవుతాయి:


🪔 నిత్య దీపారాధన లోపం: సంవత్సరం మొత్తం ఇంట్లో లేదా ఆలయంలో దీపాలు వెలిగించడంలో వచ్చిన లోపాలు, కుదరకపోయిన రోజులు ఉంటే, ఆ లోపం మొత్తం 365 వత్తుల దీపంతో పరిహారం అవుతుంది.


🪔 పాప క్షయం: కార్తీక పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనది. ఈ రోజున దీపారాధన చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది.


🪔 లక్ష్మీ కటాక్షం: దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. 365 వత్తులతో దీపం వెలిగించి, దానధర్మాలు చేయడం వలన లక్ష్మీదేవి సంతోషించి, భక్తులకు అష్ట ఐశ్వర్యాలు, సంపద కలుగుతాయి.


🪔 ముక్తి ప్రాప్తి: ఈ పవిత్ర దినాన శివాలయంలో దీపారాధన చేయడం ముక్కోటి దేవతలను పూజించినట్లే. ఈ దీపాలను చూసినవారి పాపాలు పటాపంచలై, జీవితానంతరం వారికి ముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.


🪔 ఎక్కడ, ఎలా వెలిగించాలని? 🪔

365 వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి, కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించడం శ్రేష్ఠం. ఈ దీపాన్ని


తులసి కోట వద్ద.

ఉసిరి చెట్టు కింద.

శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో వెలిగించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.


🪔 కార్తీక పౌర్ణమి దీపారాధన విధానం: 🪔


365 వత్తులు తయారుచేయడం: దారంతో లేదా దూదితో 365 చిన్న వత్తులను సిద్ధం చేసుకోవాలి.

దీపాన్ని సిద్ధం చేయడం: సాధారణంగా ఈ విశేష దీపారాధన కోసం ఉసిరికాయపై లేదా బియ్యప్పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించడం శ్రేష్ఠం.

దీపం వెలిగించడం: దీపంలో ఆవు నెయ్యి (శ్రేష్ఠం) లేదా నువ్వుల నూనె పోసి.. 365 వత్తులను ఒకే దీపంలో లేదా అనేక దీపాలలో ఉంచి భక్తిశ్రద్ధలతో వెలిగించాలి.


మంత్ర పఠనం:

365 వత్తులు అగరబత్తితో మాత్రమే వెలిగించాలి. ఇంటి యజమాని స్వయంగా వెలిగిస్తే అత్యుత్తమ ఫలితాలు… మంత్రం: వత్తులు వెలిగించిన తర్వాత అక్షింతలు చల్లుతూ "దామోదరం ఆవాహయామి" లేదా "త్రయంబకం ఆవాహయామి" అని ఉచ్చరించాలి. ఈ విధంగా కార్తీక పౌర్ణమిని ఆచరిస్తే శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం పొంది సర్వసౌఖ్యాలు కలుగుతాయి.


ఇతర విశేషాలు

కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తుల దీపారాధనతో పాటు.. ఈ కింద తెలిపిన ఆచారాలను పాటించడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.

జ్వాలాతోరణ దర్శనం: సాయంత్రం దేవాలయంలో వెలిగించే జ్వాలాతోరణాన్ని దర్శించడం వల్ల సకల పాపాలు హరించి.. పుణ్యం లభిస్తుందని నమ్మకం.

సత్యనారాయణ స్వామి వ్రతం: కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తేజజ మామూలు రోజుల కంటే కోటి రెట్లు ఎక్కువ ఫలం లభిస్తుంది.

నదీ స్నానం, దానం: ఈ రోజు పవిత్ర నదులలో స్నానం చేసి, పేదవారికి వస్త్ర దానం, ఆహార దానం లేదా బెల్లం దానం (లక్ష్మీ దేవికి సమర్పించడం) శుభప్రదం.


నదీ స్నానం, పూజా ముహూర్తాలు -

నదీ స్నానం: నవంబర్ 5 ఉదయం 4:52 నుంచి 5:44 వరకు (బ్రహ్మ ముహూర్తం)

పూజా ముహూర్తం: ఉదయం 7:58 నుంచి 9:00 వరకు

సాయంత్ర దీపారాధన: సాయంత్రం 5:15 నుంచి 7:05 వరకు.

🌹🌹🌹🌹🌹

కార్తిక పురాణం - 15 :- 15వ అధ్యాయము - దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపమందుట Kartika Purana - 15 :- Chapter 15 - By lighting the lamp ....


🌹. కార్తిక పురాణం - 15 🌹
🌻 15వ అధ్యాయము - దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపమందుట 🌻
📚. ప్రసాద్ భరద్వాజ


🌹 Kartika Purana - 15 🌹
🌻 Chapter 15 - By lighting the lamp, one attains a human form with the memory of being a mouse in a previous birth 🌻
📚 Prasad Bharadwaj


అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని - జనకా! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని, మరియొక యితిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను.

ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవులవద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, లేక, వినుట, సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును.

శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చిన యెడల, విశేషఫలము పొందగలరు. ఈ విధముగా నెలరోజులు విదువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీకశుద్ద త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము నుంచ వలెను.

ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసినయెడలను, లేక, ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు.

సరస్వతీ నదీతీరమున శిధిలమైన దేవాలయ మొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము జేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లుపెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులుజేసి, పండ్రెండు దీపములుంచి, స్వామిని పూజించుచు, నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుమూలలు వెదకి, తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నొట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీకమాస మగుటవలనను, శివాలయములో ఆరిపోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను.

ధ్యాన నిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచి చూడగా, ప్రక్కనొక మానవుదు నిలబడి యుండుటను గమనించి "ఓయీ! నీవెవ్వడవు? ఎందుకిట్లు నిలబడి యుంటివి?" అని ప్రశ్నించగా, "ఆర్యా! నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెదుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి యిక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో నుంది ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నొటకరచి ప్రక్కనున్న దీపంచెంత నిలబడి వుండగ, నా అదృష్టము కొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కాని, ఓ మహానుభావా! నేను యెందుకీ మూషికజన్మ మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు"మని కోరెను.

అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని, "ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ, ధనాశపరుడై దేవపూజలు, నిత్యకర్మలు మరచి, నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు, మంచివారలను, యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృత్తిచేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు, సమస్త తిను బండారములను కడుచౌకగా కొని, తిరిగి వాతిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక యితరులకు యివ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత యెలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించు చుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన, నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్తిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షముపొందు"మని అతనికి నీతులు చెప్పి పంపించెను.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి పంచదశాధ్యాయము - పదిహేనోరోజు పారాయణము సమాప్తము.


🌹కార్తీక మాసం 15వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- తరగబడిన వస్తువులు

దానములు:- కలువపూలు, నూనె, ఉప్పు

జపించవలసిన మంత్రం:-

'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'

🌹 🌹 🌹 🌹 🌹


కార్తీక మాసం 15వ రోజు పూజించ వలసిన దైవం Deity to be worshipped on the 15th day of Karthika month




🌹  కార్తీక మాసం 15వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



నిషిద్ధములు:- తరగబడిన వస్తువులు

దానములు:- కలువపూలు, నూనె, ఉప్పు

జపించవలసిన మంత్రం:-

'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'

🌹 🌹 🌹 🌹 🌹



🌹  Deity to be worshipped on the 15th day of Karthika month - Mantra to be recited - Donation - Offering 🌹

Prasad Bharadhwaja



Prohibited things:- Broken objects

Donations:- Lotus flowers, oil, salt

Mantra to be chanted:-

'Om Sri Tulasithathri Sametha Karthika Damodaraya Namah'

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ ఆంజనేయం శ్రీరామ ధూతం శిరసా నమామి - హారతి / Sri Anjaneyam Sri Rama Dhootam Sirasa Namami - Aarti



https://youtube.com/shorts/WYAZPfO6LbU


🌹 శ్రీ ఆంజనేయం శ్రీరామ ధూతం శిరసా నమామి - హారతి 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 Sri Anjaneyam Sri Rama Dhootam Sirasa Namami - Aarti 🌹
Prasad Bharadwaja


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹


వైకుంఠ చతుర్దశి కార్తీక మాసంలో విశేషమైనది Vaikuntha Chaturdashi is a special day in the month of Kartik



🌹 వైకుంఠ చతుర్దశి కార్తీక మాసంలో విశేషమైనది. 🌹

ప్రసాద్ భరద్వాజ



వైకుంఠ చతుర్ధశి రోజున శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వదలి వారణాసి వెళ్ళి పరమశివుడిని పూజించినట్లు కథనం. అందువలన ఈరోజున అందరూ శివాలయాలకు వెళ్ళి దీపం వెలిగించాలి. ఇలా ఆచరించిన వారికి శివ కేశవుల - నరనారాయణుల అనుగ్రహం వెంటనే కలుగుతుందని భక్తుల విశ్వాసం.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Vaikuntha Chaturdashi is a special day in the month of Kartik. 🌹

Prasad Bharadwaja

It is said that on the day of Vaikuntha Chaturdashi, Lord Vishnu left Vaikuntha and went to Varanasi to worship Lord Shiva. Therefore, everyone should go to Shiva temples on this day and light a lamp. Devotees believe that those who do this will immediately receive the blessings of Shiva, Keshav and Naranarayana.

🌹 🌹 🌹 🌹

కార్తిక పురాణం - 14 :- 14 వ అధ్యాయము : ఆబోతునకు అచ్చుబోసి వదులుట (వృషోసర్గము) Kartika Purana - 14 :- Chapter 14: Rituals to be performed during the month of Kartika



🌹. కార్తిక పురాణం - 14🌹

🌻. 14 వ అధ్యాయము : ఆబోతునకు అచ్చుబోసి వదులుట (వృషోసర్గము), కార్తీకమసములో విసర్జింపవలసినవి, కార్తీక మాస శివపూజా కల్పము. 🌻

📚. ప్రసాద్ భరద్వాజ



🌹. Kartika Purana - 14🌹

🌻. Chapter 14: Casting a spell on the abode (Vrishosarga), things to be discarded in Kartika month, Kartika month Shiva puja Kalpa. 🌻

📚. Prasad Bharadwaja



మరల వశిష్ఠులవారు, జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి.

ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానముచేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు.

వారికి కోటియాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలును తమ వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదలునో అని ఎదురుజూచుచుందురు. ఎవడు ధనవంతుడై యుండి పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియైననూ చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమున గురుచేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీకమాసమున తన శక్తికొలది దానము చేసి నిష్టతో వ్రతమాచరించి సాయంసమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధనచేసి ఆ రాత్రియంతయు జాగరముండి మరునాడు తమ శక్తికొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు.


🌻. కార్తీకమాసములో విసర్జింపవలసినవి 🌻

ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీకమాసమున నెలరోజులూ కూడా రాత్రులు భుజించరాదు, విధవ వండినది తినరాదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కూడదు చేసిన కల్లుతో సమానము బ్రహ్మదేవుడు చెప్పెను. కావున, వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యము వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.

ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. అటుల చేయనియెడల మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున బడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువునందుగాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.


గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ |

నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు ||

అని పఠించుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడుఓవలెను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరముననున్న సివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించవలెను.


🌻. కార్తీకమాస శివపూజాకల్పము 🌻


1. ఓం శివాయ నమః - ధ్యానం సమర్పయామి

2. ఓం పరమేశ్వరాయ నమః - ఆవాహనం సమర్పయామి

3. ఓం కైలాసవాసాయ నమః - నవరత్న సింహాసనం సమర్పయామి

4. ఓం గౌరీనాథాయ నమః - పాద్యం సమర్పయామి

5. ఓం లోకేశ్వరాయ నమః - అర్ఘ్యం సమర్పయామి

6. ఓం వృషభవాహనాయ నమః - స్నానం సమర్పయామి

7. ఓం దిగంబరాయ నమః - వస్త్రం సమర్పయామి

8. ఓం జగనాథాయ నమః - యజ్ఞోపవీతం సమర్పయామి

9. ఓం కపాలధారిణే నమః - గంధం సమర్పయామి

10. ఓం సంపూర్ణ గుణాయ నమః - పుష్పం సమర్పయామి

11. ఓం మహేశ్వరాయ నమః - అక్షతాన్ సమర్పయామి

12. ఓం పార్వతీనాథాయ నమః - ధూపం సమర్పయామి

13. ఓం తేజోరూపాయ నమః - దీపం సమర్పయామి

14. ఓం లోకరక్షాయ నమః - నైవేద్యం సమర్పయామి

15. ఓం త్రిలోచనాయ నమః - కర్పూర నీరాజనం సమర్పయామి

16. ఓం శంకరాయ నమః - సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

17. ఓం భవాయ నమః - ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

ఈ ప్రకారముగా కార్తీకమాసమంతయు పూజించవలెను శివసన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసినయెడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తినిబట్టి బ్రాహమణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము, వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీకమాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన, తులసీకోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన యెడల, వారికీ, వారివంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండి కూడా యీ వ్రతము నాచరించనివారును వంద జన్మలు నానాయోనులందునా జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, యెలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన యెడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి చతుర్దశాధ్యాయము - పద్నాలుగవరోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹


కార్తీక మాసం 14వ రోజు చేయవలసినవి Things to do on the 14th day of Kartik month (a YT Short)



https://youtube.com/shorts/SllretLqR-Q


🌹 కార్తీక మాసం 14వ రోజు చేయవలసినవి.🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 Things to do on the 14th day of Kartik month.🌹
Prasad Bharadwaja

(a YT Short)



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹


కార్తీక మాసం 14వ రోజు పూజించ వలసిన దైవం Deity to be worshipped on the 14th day of Karthika month




🌹  కార్తీక మాసం 14వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- ఇష్టమైన వస్తువులు, ఉసిరి

దానములు:- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె

పూజించాల్సిన దైవము:- యముడు

జపించాల్సిన మంత్రము:-

ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా

🌹 🌹 🌹 🌹 🌹





🌹 Deity to be worshipped on the 14th day of Karthika month - Mantra to be recited - Donation - Offering 🌹

Prasad Bharadhwaja



Prohibited things:- Favorite things, amla

Donations:- Sesame, iron, buffalo or buffalo

Deity to be worshipped:- Yama

Mantra to be chanted:-

Om Tilapriyaya Sarva Samhara Hetine Swaha

🌹 🌹 🌹 🌹 🌹



కార్తీక సోమవార ప్రత్యేక శ్రీ కాశీ విశ్వేశ్వర అలంకార దర్శనం Darshan of Sri Kashi Vishweshwara on Karthika Monday (a YT Short)



https://youtube.com/shorts/VAdsXtn5b3U


🌹 కార్తీక సోమవార ప్రత్యేక శ్రీ కాశీ విశ్వేశ్వర అలంకార దర్శనం 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Special decorative darshan of Sri Kashi Vishweshwara on Karthika Monday 🌹
Prasad Bharadwaja


Like, Subscribe and Share
https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹

నా తల్లివి నీవే నా తండ్రివి నీవే నా ఊపిరి నీవే శివయ్యా '...you are Shivayya' (a YT Short)



https://youtube.com/shorts/Dzdam7WbWag


🌹  నా తల్లివి నీవే నా తండ్రివి నీవే నా ఊపిరి నీవే శివయ్యా  🌹

ప్రసాద్ భరద్వాజ



🌹You are my mother, you are my father, you are my breath, you are Shivayya 🌹

Prasad Bharadwaja



Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



కార్తీక మాసంలో ధన దీపం వెలిగించాల్సిందే Light Dhana Deepam in the month of Kartika



🌹 ధన దీపం Dhana Deepam : ఖర్చులు తగ్గి సంపద పెరగాలంటే.. కార్తీక మాసంలో ధన దీపం వెలిగించాల్సిందే..! ధన దీపం వెలిగించే విధానం.. 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Dhana Deepam: To reduce expenses and increase wealth.. you should light the Dhana Deepam in the month of Karthika..! How to light the Dhana Deepam.. 🌹

Prasad Bharadwaja



కార్తీక మాసంలో అఖండ ధన లాభం కలగటానికి, అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి, ఖర్చులు తగ్గటానికి ధన దీపాన్ని లేదా లక్ష్మి దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో తెలుసుకుందాం.

ఐశ్వర్యం కలగాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా, అప్పులు తీరిపోవాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా, మొండి బాకీలు తొందరగా వసూలు కావాలన్నా కార్తీక మాసంలో తప్పకుండా ప్రతీ ఇంట్లో ధన దీపాన్ని వెలిగించాలి. కార్తీక మాసంలో వచ్చే ఏ రోజైనా ధన దీపాన్ని వెలిగించుకోవచ్చు. లేదా ప్రత్యేకంగా కార్తీక మాసంలో వచ్చే గురువారం లేదా శుక్రవారం రోజున ఈ ధన దీపాన్ని వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ ధనదీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందాం..

మీ ఇంట్లో పూజ గదిలో గజలక్ష్మి దేవి ఫోటో లేదా ధన లక్ష్మి దేవి ఫోటోకు దండం బొట్లు పెట్టి పీట ఏర్పాటు చేసుకోవాలి. పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, పీట మీద బియ్యం పిండితో ముగ్గులు వేయాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గులు అష్టదళ పద్మం ముగ్గు. 8 దళాలున్న పద్మం ముగ్గు అంటే లక్ష్మీ దేవికి ఇష్టం. స్వస్తిక్ గుర్తు ముగ్గు కూడా లక్ష్మీదేవికి ఇష్టం. కాబట్టి ఆ పీఠం మీద అష్ట దళ పద్మం ముగ్గు లేదా స్వస్తిక్ గుర్తు ముగ్గు వేయండి.

అలా ముగ్గులు వేశాక పీట మీద ఒక రాగి లేదా ఇత్తడి పళ్లెం ఏర్పాటు చేయాలి. అందులో 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత రాగి లేదా ఇత్తడి పళ్లెంలో బియ్యాన్ని కుప్పలాగా పోయాలి. అందులో చిటికెడు పసుపు, కుంకుమ వేయాలి. ఒక గులాబీ పువ్వు కూడా పెట్టాలి. కొన్ని రూపాయి నాణెలు కనీసం 11 నాణెలు ఆ బియ్యంలో ఉంచాలి.

రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకోవాలి. వాటికి కుంకుమ బొట్లు అలంకరించుకోవాలి. రాగి లేదా ఇత్తడి పళ్లెంలో ఉన్న బియ్యంలో మొదటి ప్రమిదను ఉంచాలి. అందులో మూడు యాలకులు, మూడు లవంగాలు, ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు పోయాలి. అలా పోసిన తర్వాత మొదటి ప్రమిదలో రెండవ చిన్న ప్రమిదను ఉంచాలి. ఆ రెండవ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి రెండూ లేదా మూడు ఒత్తులు వేసి ఏకహారతితో కానీ ఆగరబత్తితో కానీ వెలిగించాలి. దీన్నే ధన దీపం లేదా లక్ష్మీ దీపం అని పిలుస్తారు.

🌹🌹🌹🌹🌹

విశ్వేశ్వరుని పంచామృత అభిషేకం Panchamrit Abhishekam of Lord Vishweshwara (a YT Short)



https://youtube.com/shorts/G90ow7w9mZw



🌹 విశ్వేశ్వరుని పంచామృత అభిషేకం - నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ - కార్తీక సోమవారం 🌹

ప్రసాద్ భరద్వాజ



🌹 Panchamrit Abhishekam of Lord Vishweshwara - Namaste Astu Bhagavan Vishweshwara - Kartika Monday 🌹

Prasad Bharadwaja




Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



కార్తిక పురాణం - 13 : 13వ అధ్యాయము - సువీర చరిత్రము Kartika Purana - 13 : Chapter 13 - The Story of Suvira


🌹 కార్తిక పురాణం - 13 🌹
🌻 13వ అధ్యాయము - కన్యాదాన ఫలము - సువీర చరిత్రము 🌻
📚. ప్రసాద్ భరద్వాజ


🌹 Kartika Purana - 13 🌹
🌻 Chapter 13 - The Fruit of the Offering of the Bride - The Story of Suvira 🌻
📚. Prasad Bharadwaja



ఓ జనక చక్రవర్తీ! కార్తీకమాసములో యింకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై అలకి౦పుము.

కార్తీకమాసములో నదీస్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒక వేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షణ తా౦బూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన యెడల యెంతటి మహాపాపములు చేసియున్ననూ, అ పాపములన్నియు పోవును. ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించిననూ పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన౦దువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంత కన్న ముఖ్యమైనది కన్యాదానము. కార్తీకమాసమందు భక్తి శ్రద్దలతో కన్యాదానము చేసిన యెడల తాను తరించుటయే గాక తన పితృదేవతలను కూడ తరింపజేసినవాడగును. ఇందులకొక యితిహాసం గలదు. చెప్పెదను శ్రద్దగా అలకి౦పుము.


🌻 సువీర చరిత్రము 🌻

ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన "సువీరు"డను ఒక రాజుండెను. అతనికి రూపవతియను భార్యకలదు. ఒక సారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడయి, భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందోక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. అ బిడ్డను అతి గారాబముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన అ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికి శుక్ల పక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి నొందుచు, అతిగారబముతో పెరుగుచుండెను, ఆమె చూచు వారలకు కనులపండువుగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచినకొలదీ, బాలికకు నిండు యౌవనదశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికనుగాంచి ఆమె అందచందములకు పరవశుడై అ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకా రాజు "ఓ ముని పుత్రా! ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో నున్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన యెడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతు"నని చెప్పగా తన చేతిలో రాగి పైసాయైననూ లేకపోవుటచే బాలిక పైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోరతపమాచరించి, కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాది౦చెను. రాజు అ పాత్రను పుచ్చుకొని, సంతోషించి, తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరినీ అత్తవారింటికి పంపెను.

అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంత మంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్చగా ఖర్చుపెట్టుచూ భార్యతో సుఖముగా వుండెను. అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆరాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సురాగానే మరుల యెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచుచుండెను.

ఒకానొక సాధుపుంగవుడు తపతీనదీ తీరమునుండి నర్మదానదీ తీరమునకు స్నానార్ధమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని "ఓయీ! నీవెవ్వడవు? నీ ముఖ వర్చస్సుచూడ రాజవంశమునందు జన్మించిన వానివలె నున్నావు. నీవీ యరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి?" అని ప్రశ్నించగా, సువీరుడు "మహానుభావా! నేను వంగదేశమును నేలుచుండెడిది సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులాక్రమించుటచే భార్యాసమేతముగా నీ యడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు. పుత్రశోకముకంటె గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగము కంటే గొప్పసంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్ఠుడనియినందున యీ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు యిద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకిచ్చి, వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే యింత వరకు కాలక్షేపము చేయుచున్నాను" అని చెప్పగా,


కార్తిక పురాణం 13 - 2వ భాగం

"ఓ రాజా! నీవు యెంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మము లాలోచింపక కన్యనమ్ముకొంటివి. కన్యావిక్రయము మహాపాతకములలో నొకటి, కన్యను విక్రయించిన వారు 'అసిపత్రవన' మను నరకమనుభవింతురు. ఆ ద్రవ్యములతో దేవముని, పితృదేవతా ప్రిత్యర్ధము యే వ్రతము చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్యావిక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చికొని పెండ్లాడిన వారు చేయు గృహస్థధర్మములు వ్యర్ధమగుటయేగాక అతడు మహా నరకమనుభవించును. కన్యావిక్రయము జేసినా వారికీ యెట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే యున్నారు. కావున, రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తికొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు, ధర్మబుద్ధి గల వానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన యెడల గంగాస్నాన మొనరించిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయేగాక, మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలిగిపోవును" అని రాజునకు హితోపదేశము చేయగా అందుకా రాజు చిరునవ్వు నవ్వి "ఓ మునివర్యా! దేహసుఖము కంటె దానధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను సిరి సంపదలతోను సుఖముగా వుండక, చనిపోయిన తర్వాత వచ్చెడి యేదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడువమంటారా? ధనము, బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణి౦పగలరు కానీ ముక్కు మూసుకొని, నోరు మూసుకొని, బక్క చిక్కి శల్యమైయున్న వారిని లోకము గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాన, నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనమెవరిత్తురో వారికే యిచ్చి పెండ్లి చేయుదును కాని, కన్యాదానము మాత్రము చేయను" అని నిక్కచిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను.

మరి కొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొనిపోయి, యమలోకములో అసిపత్రవనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శ్రుతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతిచెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యావిక్రయము వలన ఆ శ్రుతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి.

అంతటా శ్రుతకీర్తి "నేనెరిగున్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు, యజ్ఞయాగాదులొనరించి యున్నాను. నాకీ దుర్గతి యేల కలిగె?"నని మనమునందుకొని నిండుకొలువు దీరియున్న యమధర్మరాజు కడకేగి, నమస్కరించి "ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు, ధర్మముర్తివి, బుద్దిశాలివి. ప్రాణకోటినంతను సమంగా జూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసియుండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు" అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శ్రుతకీర్తిని గాంచి "శ్రుతకీర్తి! నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీ వెటువంటి దురాచారములూ చేసియుండలేదు. అయిననేమి? నీ వంశియుడగు సువీరుడు తన జ్యేష్టపుత్రికను ధనమునకాశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకొనే వారి పూర్వీకులు యిటు మూడు తరములవారు అటు మూడు తరములవారున్ను వారెంతటి పుణ్యపురుషులైనను నరకమును భావించుటయే గాక, నీచ జన్మలెత్త వలసియుండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదునుగాన, నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీతీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా యాశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి, అచటకు పోయి ఆ కన్యను వేదపండితుడును శీలవంతుడునగు ఒక విప్రునకు కార్తీకమాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అటుల చేసిన యెడల నీవు, నీ పూర్వికులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కెగుదురు. కార్తీకమాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను, లేక విధివిధానముగా ఆబోతునకు వివాహమొనర్చినను కన్యాదాన ఫలమబ్భును. కనుక, నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటుల చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు, పోయిరమ్ము" అని పలికెను.

శ్రుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణకుటిరములో నివసించుచున్న సువీరుని భార్యను, కుమార్తెను చూచి, సంతోషపడి, ఆమెతో యావత్తు విషయములు వివరించి, కార్తీకమాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలసికొనెను.

కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను, పుణ్యము కలుగును. కార్తీకమాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు. విష్ణుసాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి త్రయోదశాధ్యాయము - పదమూడో రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹


కార్తీక మాసం 13వ రోజు పూజించ వలసిన దైవం Deity to be worshipped on the 13th day of Karthika month






🌹కార్తీక మాసం 13వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- రాత్రి భోజనం, ఉసిరి

దానములు:- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం

పూజించాల్సిన దైవము:- మన్మధుడు

జపించాల్సిన మంత్రము:-

ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా

🌹 🌹 🌹 🌹 🌹





🌹Deity to be worshipped on the 13th day of Karthika month - Mantra to be recited - Donation - Offering 🌹

Prasad Bharadhwaja



Prohibited things:- Dinner, Uddha

Donations:- Flowers like jasmine, jaji, etc., forest food

Deity to be worshipped:- Manmadhu

Mantra to be chanted:-

Om Sri Virisharaya Namah Swaha

🌹 🌹 🌹 🌹 🌹




క్షీరాబ్ది ద్వాదశి తులసి వివాహం పురాణం కధ Ksheerabdi Dwadasi Tulasi marriage (a YT Short)



https://youtube.com/shorts/evwy5tYKx8k



🌹 క్షీరాబ్ది ద్వాదశి తులసి వివాహం పురాణం కధ 🌹

Kshirabdi Dwadasi Tulasi marriage

ప్రసాద్ భరద్వాజ


(a YT Short)


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹


క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు Happy Kshirabdi Dwadashi

🌹 క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు అందరికి ...!! 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Happy Kshirabdi Dwadashi to everyone...!! 🌹

Prasad Bharadwaja



🌿 క్షీరాబ్ధి ద్వాదశి (చిలుకు ద్వాదశి) అంటే ఏమిటి.? 🌿

కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. శివ కేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే! అయితే ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశి (చిలుక ద్వాదశి) అత్యంత పవిత్రమైంది.

🌿 కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని ప్రారంభం చేసిన రోజు కనుక ఈ రోజును క్షీరాబ్ధి ద్వాదశి అని పిలుస్తారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరమథనం ప్రారంభించినది ఈరోజే.

🌸 అందుకే ఈ రోజుకి మధన ద్వాదశి అని, అమృతం కోసం సాగరాన్ని మందర పర్వతంతో చిలికారు కనుక చిలుక ద్వాదశి అని అంటారు. ఈ రోజునే దామోదరద్వాదశి, యోగీస్వర ద్వాదశి అని కూడా అంటారు.

🌿 ఉత్థానైకాదశి అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధ ఏకాదశినాడు తన యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశినాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్థాన ఏకాదశి అనే పేరు.

🌸 ఉత్థాన ఏకాదశి(నిన్న) నాడు శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. అందుచేతనే తులసి మొక్క వద్ద క్షీరాబ్ధి ద్వాదశి నాడు దీపములు వెలిగించి పూజలను జరపడం అనాదిగా వస్తున్న ఆచారం.

🌿 కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీ ధాత్రి (తులసికోట) దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు.

🌸 ఈ రోజున తులసి మొక్క వద్ద శ్రీమహావిష్ణువు స్వరూపంగా ఉసిరి మొక్కను ఉంచి పూజలు చేస్తారు.

🌸 క్షీరసాగర మధనములో జన్మించిన తేజోభరితమైన అమృతకలశాహస్తయై సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు దేవ దానవ సమక్షములో వివాహమాడుతాడు. అందుకనే కొన్ని ప్రాంతాలలో ఆచరమును బట్టి శ్రీ మహాలక్ష్మికి, శ్రీమన్నారాయుణునికీ వివాహము చేసెదరు.

🌹 🌹 🌹 🌹 🌹

కార్తిక పురాణం - 12 : 12వ అధ్యాయము - ద్వాదశి ప్రశంస - సాలగ్రామ దానమహిమ Kartika Purana - 12 : Chapter 12 - Praise of the 12th Day - Salagrama Danamahima


🌹. కార్తిక పురాణం - 12 🌹
🌻. 12వ అధ్యాయము - ద్వాదశి ప్రశంస - సాలగ్రామ దానమహిమ 🌻
📚. ప్రసాద్ భరద్వాజ


🌹. Kartika Purana - 12 🌹
🌻. Chapter 12 - Praise of the 12th Day - Salagrama Danamahima 🌻
📚. Prasad Bharadwaja


"మహారాజా! కార్తీకమాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీవ్రతమును గురించి, సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను విను"మని వశిష్ట మహాముని ఈవిధముగా తెలియచేసిరి.

కార్తీక సోమవారమునాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానముచేసి ఆచమనము చేయవలయును. తరువాత శక్తి కొలది బ్రహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసము౦డి, సాయంకాలము శివాలయమునకు గాని, విష్ణ్వాలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి, నక్షత్ర దర్శనము చేసికొని పిమ్మట భుజింపవలయును. ఈవిధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే గాక, మోక్షము కూడా పొందుదురు.

కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన యెడల నా వత్రమాచరించినచో నూరు రేట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ యేకాదశిరోజున, పూర్ణోపవాసముండి ఆ రాత్రి వివ్ష్ణ్వాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన, కోటి యజ్ఞముల ఫలితము కలుగును. ఈవిధముగా చేసిన వారాలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానముచేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన నెంత పుణ్యము కలుగునో దానికంటే నధికముగా ఫలము కలుగును. కార్తిక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయుణుడు శేషపానుపు నుండి లేచును గనుక, కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు యిష్టము.

అరోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రహ్మణునకు దానమిచ్చిన యెడల ఆయావు శరీర ముందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరాములు యింద్ర లోకములో స్వర్గ సుఖములందుదురు. కార్తీకశుద్ధ పాడ్యమి రోజున, కార్తిక పౌర్ణమిరోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశినాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టునుగాని, సాలగ్రామమునుగాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చినయెడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును.

దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు - శ్రద్దగా అలకింపుము.


🌻. సాలగ్రామ దానమహిమ 🌻

పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడా బెట్టుచు, తాననుభవించక, యితరులకు బెట్టక, బీదలకు దానధర్మములు చేయక, యెల్లప్పుడు పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విఱ్ఱ్వీగుచూ యేజీవికీ కూడా ఉపకారమైననూ చేయక "పరులద్రవ్యము నెటుల అపహరింతునా!"యను తలంపుతో కుత్సిత బుద్ది కలిగి కాలము గడుపుచుండెను.

అతడొకనాడు తన గ్రామమునకు సమీపమున నున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుయిచ్చెను. మరి కొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మనిని అడుగగా ఆ విప్రుడు "అయ్యా! తమకీయవలసిన ధనము ఒక నెలరోజుల గడువులో యివ్వగలను. మీ ఋణముంచుకోను. ఈజన్మలో తీర్చని యెడల మరుజన్మమున మీ యింట యేజంతువుగానో పుట్టి అయినా, మీ ఋణము తీర్చుకోగలను" అని సవినయముగా వేడుకోనెను.

ఆ మాటలకు కోమటి మండిపడి" అట్లు వీలులేదు. నాసొమ్ము నాకిప్పుడే యీయవలయును. లేనియెడల నీక౦ఠమును నరికి వేయుదును" అని ఆవేశం కొలదీ వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కొసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి, అక్కడనే యున్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసీ తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక, అప్పటి నుండి అ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపమావహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలూ పడుచూ మరి కొనాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకోనిపోయి రౌరవాది నరకకూపముల బడద్రోసిరి.

ఆ వైశునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి స౦పాదించిన ధనమును దానదర్మాలు చేయుచు పుణ్యకార్యము లాచరించుచు, నీడకొరకై చెట్లు నాటించుచు, నూతులు, చెరవులు త్రవ్వించుచు, సకల జనులను సంతోషపెట్టుచు మంచికీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంత కాలమునకు త్రిలోకసంచారియగు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి, త్రోవలో ధర్మవీరుని యింటికి వెంచేసిరి.

ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి, విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి, చేతులు జోడించి "మహానుభావా! నాపుణ్యం కొలదీ నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుడను. నాజన్మ తరించినది. నాయిల్లు పావనమైనది. శక్తి కొలదీ నే జేయు సత్కారములను స్వీకరించి తమరువచ్చిన కార్యమును విశధీకరింపుడు" అని సవినయుడై వేడుకొనెను.


🌹 🌹. కార్తిక పురాణం - 12

అంత నారదుడు చిరునవ్వు నవ్వి "ఓ ధర్మవిరా! నేను నీకోక హితవు చెప్పదలచి వచ్చితిని. శ్రీమహావిష్ణువునకు కార్తీకమాసంలో శుద్ధద్వాదశి మహాప్రితికరమైన దినము. అరోజున స్నాన, దాన, జపాదులు ఏవి చేసిననూ అత్యంత ఫలం కలుగును.

నాలుగు జాతులలో నేజాతివారైననూ - స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా, చోరుడైన, పతివ్రతమైనా, వ్యభిచారిణియైనా కార్తీకశుద్ద ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు వుండగా నిష్ఠగా ఉపవాసముండి, సాలగ్రామదానములు చేసిన యెడల వెనుకటి జన్మలందూ, ఈ జన్మమందూ చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా నరకమనుభవించుచున్నాడు. అతనిని వుద్ధరించుటకై నీవు సాలగ్రామదానము చేయక తప్పదు. అట్లుచేసి నీతండ్రి ఋణం తిర్చుకోనుము." అని చెప్పెను.

అంతట ధర్మవీరుడు "నారద మునివర్యా! మేడల వెనుకటి జనమలందు, ఈ జన్మ మందూ చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలో కాంలో మహానరక మనుభ వించుచునాడు. అత నిని వుద్దరించుటకై నివు సాలగ్రమదానము చేయక తప్పదు. అట్లు చేసి ని తండ్రి ఋణం తిర్చుకోనుము, అని చెప్పెను.

అంతట దర్మవిరుడు " నారద మునివర్యా! నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని, అటువంటి దానములు చేయగా నాతండ్రికి మోక్షము కలుగనప్పుడీ "సాలగ్రామ" మనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన యెట్లు వుద్ధరింపబడునాయని సంశయము కలుగుచున్నది. దీనివలన ఆకలిగొన్నవాని ఆకలితీరునా! దాహంగొన్న వానికి దాహం తీరునా? కాక, యెందులకీ దానము చేయవలయును? నేనీ సాలగ్రామదానము మాత్రము చేయజాల"నని నిష్కర్షగా పలికెను.

ధర్మవీరుని అవివేకమునకు విచారించి "వైశ్యుడా! సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిలకాదు. శ్రీహరి యొక్క రూపము. అన్నిదానములకంటె సాలగ్రామదానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తని గావింప నెంచితివేని, యీ దానముతప్ప మరొక మార్గము లేదు" అని చెప్పి నారదుడు వెడలిపోయాను.

ధర్మవీరుడు ధనబలము గలవాడై యుండియు, దానసామర్థ్యము కలిగియుండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంత కాలమునకు అతడు చనిపోయెను.

నారదుడు చెప్పిన హితభోధను పెడచెవిని పెట్టుటచేత మరణాంతర మేడు జన్మలయందు పులియై పుట్టి, మరి మూడు జన్మలందు వానరమై పుట్టి, ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి, పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి, పదిజన్మలు పందిగా జన్మించి యుండెను. అట్లు జరగిన తరువాత పదకొండవా జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టిగా ఆమెకు యౌవనకాలము రాగా ఆపేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను.

చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాల దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈవిపత్తు యెందువలన కలిగే నాయని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే అమెచేత సాలగ్రామదానము చేయించి "నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక" యని చెప్పించి సాలగ్రామ దానఫలమును ధారవోయిఒచెను. ఆరోజు కార్తీక సోమవారమగుట వలన అ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవిం, జన్మాంతరమున స్వర్గమున కరిగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యమూ సాలగ్రామదానము చేయుచు ముక్తినొందెను.

కావున, ఓ జనకా! కార్తీకశుద్ద ద్వాదశిరోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము యింతింత గాదు. ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ద్వాదశాధ్యాయము - పన్నె౦డో రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹

కార్తీక మాసం 12వ రోజు పూజించ వలసిన దైవం God to be worshipped on the 12th day of Karthika month



🌹 కార్తీక మాసం 12వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- ఉప్పు, పులుపు, కారం, ఉసిరి

దానములు:- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ

పూజించాల్సిన దైవము:- భూదేవీ సహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు

జపించాల్సిన మంత్రము:-

ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా

🌹 🌹 🌹 🌹 🌹




🌹 God to be worshipped on the 12th day of Karthika month - Mantra to be recited - Donation - Offering 🌹

Prasad Bharadhwaja


Prohibited things:- Salt, sour, pepper, amla

Donations:- Perfumes, self-cooked food, copper, Dakshina

Deity to be worshipped:- Lord Vishnu along with Bhudevi or Karthika Damodara

Mantra to be chanted:-

Om Bhurbhuvarvishnave Varahaya Karthika Damodaraya Swaha

🌹 🌹 🌹 🌹 🌹

నారాయణ నారాయణ జయ గోవింద హరే జయ గోపాల హరే Narayana Narayana Jai Govinda Hare Jai Gopala Hare (a YT Short)



https://youtube.com/shorts/vVP4df-ge5M


🌹 నారాయణ నారాయణ జయ గోవింద హరే జయ గోపాల హరే 🌹

🌹 Narayana Narayana Jai Govinda Hare Jai Gopala Hare 🌹


ప్రసాద్ భరద్వాజ


(a YT Short)


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


విష్ణుమూర్తి మేల్కొనే రోజు ఏకాదశి శుభాకాంక్షలు - Happy Ekadashi, the day when Lord Vishnu awakens (a YT Short)


https://youtube.com/shorts/6iCbJzaozIc


🌹 విష్ణుమూర్తి మేల్కొనే రోజు ఏకాదశి శుభాకాంక్షలు  - Happy Ekadashi, the day when Lord Vishnu awakens.🌹

ప్రసాద్ భరద్వాజ

(a YT Short)


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹