గురు పూర్ణిమ 2026 ఎప్పుడు? జూలై 28 లేదా 29న? సరైన తేదీ, పూజా విధానం, శుభ ముహుర్తం, ప్రాముఖ్యత తెలుసుకోండి. (When is Guru Purnima 2026?)




https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2208001529986316


🌹 గురు పూర్ణిమ 2026 ఎప్పుడు? జూలై 28 లేదా 29న? సరైన తేదీ, పూజా విధానం, శుభ ముహుర్తం, ప్రాముఖ్యత తెలుసుకోండి. 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹🕉️ When is Guru Purnima 2026? July 28 or 29? Learn the correct date, worship procedure, auspicious timing, and significance. 🕉️🌹

Prasad Bharadwaja



తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది ఆషాఢ మాసం శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా ఆషాఢ పూర్ణిమ అంటారు. ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది.

ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై 29న బుధవారం నాడు గురు పూర్ణిమ వచ్చింది. ఈ సందర్భంగా పూజా విధానం, శుభ ముహుర్తం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.

హిందూ మత విశ్వాసాల ప్రకారం, పౌర్ణమి తిథి అత్యంత శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. ఈ పవిత్రమైన రోజు శ్రీహరికి అంకితం ఇవ్వబడింది. మరోవైపు పురాణాల ప్రకారం, మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురు పూర్ణిమ రోజే జన్మించాడు. వ్యాస మహర్షి నాలుగు వేదాలను రచించి ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ణానాన్ని అందించడం వల్ల, తనను అందరూ గురువుగా భావిస్తారు. అందుకే ఆయన జన్మదిన సందర్భంగా గురు పూర్ణిమను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు గురువులతో పాటు వేద వ్యాస మహర్షిని పూజిస్తారు. అలాగే పవిత్రమైన నదుల్లో స్నానం ఆచరిస్తారు. ఉపవాస దీక్షను చేపడతారు. ఈరోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి కచ్చితంగా శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరి జాతకంలో అయితే గురు స్థానం బలంగా ఉంటుందో వారు గురు పూజ వల్ల మంచి ప్రయోజనాలను పొందే అవకాశం పుష్కలంగా ఉంటుందని పండితులు చెబుతారు.

ఈ నేపథ్యంలో గురు పూర్ణిమ వేళ శుభ ముహుర్తం ఎప్పుడు, పూజా విధానం, గురు పూర్ణిమ కథ, ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి.గురు పూర్ణిమ ఎప్పుడంటే..

ఈ ఏడాది జూలై 28వ తేదీ అంటే మంగళవారం సాయంత్రం 6:18 గంటలకు పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే 29 జూలై 2026 బుధవారం రాత్రి 8:05 గంటలకు పూర్ణిమ తిథి ముగుస్తుంది. సూర్యోదయ సమయంలో ఏర్పడే ఉదయ తిథి ప్రకారం, జూలై 29న బుధవారం నాడు గురు పూర్ణిమ జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తారు.

బ్రహ్మ ముహుర్తం : తెల్లవారుజామున 4:17 గంటల నుంచి ఉదయం 4:59 గంటల వరకు

శుభ ముహుర్తం : ఉదయం 10:46 గంటల నుంచి మధ్యాహ్నం 12:27 గంటల వరకు

అమృత ఘడియలు : ఉదయం 7:22 గంటల నుంచి ఉదయం 9:04 గంటల వరకు

లాభ ముహుర్తం: సాయంత్రం 5:32 గంటల నుంచి సాయంత్రం 7:14 గంటల వరకు

ఈ సమయాల్లో పవిత్ర స్నానాలు ఆచరించడం, దానధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు.

గురు పౌర్ణమి వేళ చంద్రుడి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల జాతకంలో ఉన్న దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

ఈ పర్వదినాన ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం.


గురు పూర్ణిమ ప్రాముఖ్యత

మన దేశంలో పూర్వ కాలం నుంచి గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. గురువు ద్వారా ప్రతి ఒక్కరి జీవితం మెరుగవుతుందని చాలా మంది నమ్ముతారు. అందుకే తల్లిదండ్రుల తర్వాత గురువుదే గొప్ప స్థానంగా భావిస్తారు. గురువు అనుగ్రహం ఉండే వ్యక్తులందరూ జీవితంలో తప్పక విజయం సాధిస్తారని చాలా మంది నమ్ముతారు. గురు పూర్ణిమ రోజే శివయ్య తన జ్ఞానాన్ని అందరికీ పంచారని పురాణాలలో పేర్కొనబడింది. బౌద్ధ మతంలోనూ బుద్ధుడు గురు పూర్ణిమ రోజున తన అనుచరులకు ఉపన్యాసం ఇచ్చారని పండితులు చెబుతారు.

✍ ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹



ఆధ్యాత్మిక ప్రగతికి పంచ సూత్రాలు
Five Principles for Spiritual Progress

https://youtu.be/GQv0zD_Exro



🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment