రామ మంత్రమే తారకం బహు శక్తి ముక్తి సంధాయకం Chanting Ram Mantra Gives Every Thing (YT Short)



https://youtube.com/shorts/hVfG7s2Lmgk?f


🌹  రామ మంత్రమే తారకం బహు శక్తి ముక్తి సంధాయకం రామ నామమే అమృతం
Chanting Ram Mantra Gives Every Thing  🌹


ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe And Share


🌹 🌹 🌹 🌹 🌹


"త్రిశూలం" మూడు కొనలు దేనికి సంకేతం? What do the three prongs of the "Trishul" symbolize?



🌹 "త్రిశూలం" మూడు కొనలు దేనికి సంకేతం? 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 What do the three prongs of the "Trishul" symbolize? 🌹
Prasad Bharadwaj


మహా కైలాస దర్శనం (Maha Kailasa Darshan)



మహా కైలాస దర్శనం (Maha Kailasa Darshan)
---------------------

కైలాసం ! Kailasa!

అది ఒక ఆధ్యాత్మిక శివభావనా నగరం !
It is a spiritual city of Shiva-consciousness!

ఊహించినంత మాత్రమున ముక్తి నొసగే ఊర్ధ్వస్థలి అది!
It is an exalted realm that grants liberation merely upon being contemplated!


నిర్గుణ రూపంతో ఉన్న నిటలాక్షుని వలె

కైలాస పర్వతం కూడా

హృదయాంతరాళంలో ఊహించదగిన సంకేత శైవభూమి !

ఊహకందని హిమగిరీశృంగంపై శివ భావన చేయడం ఒక రుద్రాభిషేకమే !

ప్రస్తుతం కైలాస నగరాన్ని ఊహాలోకంలో కల్పించి ఎదురుగా నిలిచిన ఒక శివభక్తునితో "అదిగో చూడు ! కన్నులు మూసుకుని హృదయాకాశంలో సుస్పష్టంగా చూడవచ్చు ,

'ముందుకు పద ! ' అంటూ ఆ శివప్రస్థానం వైపు దారి చూపడమే ఈ గ్రంథ ఉద్దేశ్యం !

దీంట్లో మార్గదర్శనం చేసేవారు ఒకరు , ప్రయాణించేవారు మరొకరు !

హిమాలయ ప్రాంతానికి సమీపంలో ఉండి "అదిగో అల్లంతదూరంలో కనిపించేదే కైలాస నగరం !

దానిని చేరాలంటే ఇలా వెళ్ళు ! "

అంటూ తొలత "మానస సరోవరాన్ని " దర్శింప చేస్తాడు !

అక్కడి విశేషాలు వివరిస్తూ అక్కడి నుండి హిమాలయ పర్వత పాద ప్రదేశానికి తీసుకువెళ్తాడు !

"అక్కడే దేవతలు మొదలైన వారు భూమిపై కాలు మోపే ప్రదేశం !'అంటూ చెబుతూ ,అక్కడి నుండే కైలాస మహాప్రస్థానం ప్రారంభం అవుతుందని వివరిస్తూ ముందుకు కదులుతారు .

మాత్రా చందస్సులో సాగే ఈ కైలాస వర్ణనను చదువుతూ హృదయంలో ఒక మహోన్నతమైన శివానుభూతిని అందరూ పొందాలని ఆశిస్తూ ....

మీ

భాను

----------

ప్రథమావరణం

(మానస సరోవరమండలం)

---------

1

అదిగదిగొ కైలాస

మదె మహా శివపురము

అర్థనారీశ్వరుని

ఆనంద మందిరము !

2

అదియె శంభుని నగము

అది శాంభవీ జగము

బ్రహ్మాండ నాయకుని

భవ్య నటనాంగణము

3

అదియె వెన్నెల కొండ

అది వేల్పులకు అండ

అణువణువు శివముగా

వెలుగు వన్నెలు నిండ

4

శివుడు తాండవమాడ

గళమెత్తి పాడునట

శివ శరీరిణి కూడి

శివమెత్తి ఆడునట

5

అట గిరీ నిర్ఝరుల

పరుగులే మురిపించు

అచట మేఘ శ్రేణి

మెరుపులే కురిపించు

6

కనులు అరమోడ్పులై

అశృవులు వర్షించు

హృదయ మరవిందమై

వికసించి వినుతించు

7

ముదిత హృదయుండవై

ముందు ముందుకు సాగు

ముక్తినాథుని చేరి

మోక్ష పదమే వేడ

8

శంభు పర్వతమదిగొ

శాంభవికి గర్వమది

శివ రూప సర్వమది

భువనైక పర్వమది

9

అటుచూడు మటుచూడు

ఆనందకర పదము

అచట కొలువై నిలిచె

అమల శీతల హ్రదము

10

భవ్యమై హృదయాంత

రంగమే ఉప్పొంగ

భువికి చేరెను వడిగ

బ్రహ్మమానస గంగ

11

అటుచూడు మటు పక్క

రమణీయమౌ హొయలు

రాజ హంసల ఠీవి

రాచ నడకల వగలు

12

కలువ పూవులు ఇచట

కనక కాంతుల మెరియు

బ్రహ్మ కమలము లిచట

భాగ్య రాశులు కురియు

13

నగములూ శృంగములు

నయన పర్వము గూర్చు

విహగములు వింతగా

విహరించి రమియించు

14

నరులునూ కిన్నరులు

రుషులు కింపురుషులూ

స్నానములు కావించు

సత్య లోకపు జలము

15

వేదనాదము లిచట

వినువీధి వినిపించు

విశ్వ సోయగమిచట

విరివాన కురిపించు

16

అమరమౌ అతులమౌ

విమలమౌ విశదమౌ

జలపు బిందువు కూడా

అమృత సింధూ సమము

17

సోహ మంచును వాయు

శ్వాసలను బంధించి

మౌనులును యోగులను

ధ్యానములు జేతురిట

18

కమల పూవుల ధూళి

రేణువులు దశ దిశల

కాకలీ గీతముల

కావ్యములు వినిపించు

19

విరులిచట విచ్చుకొని

వింత కాంతులు చిమ్ము

జల సిరుల సవ్వడులు

జపమేదొ జపియించు

20

ప్రకృతి కాంతే మురిసి

పరవశము చెందునట

ప్రణవ నాదము చేసి

ప్రణతులర్పించునట

21

నింగి నేలల మధ్య

నిండు తెరలను పరచి

సందె కాంతులు విరిసి

సైయాటలాడునట

22

రంగు పక్షుల గుంపు

నింగి చిత్రము పేర్చ

భృంగ పంక్తులు వంపు

రంగ వల్లులు గూర్చు

23

ఇచటి వెలుగుల జిలుగు

బ్రహ్మ ప్రభావమట

ఇచట భూతల కణము

భస్మాంగ దేహమట

24

పూర్వ సంధ్యా తరుణ

పుణ్య కాలమ్ములో

పుడమి చుక్కల సురులు

పూని ఇటు వత్తురట

25

జల కణము స్పర్షించ

పలకరించును సరసు

జలదరించును తనువు

పులకరించును మనసు

26

ఉదయ భానునికిచట

ఉదకార్ఘ్యములనిచ్చి

పితృ తర్పణములిచ్చి

పితరులను మెప్పించు

27

శతరుద్రియము తోడ

సర్వేశ్వరుని గొలిచి

సకల జన కళ్యాణ

సౌఖ్యమును కాంక్షించు

28

ముక్కోటి దేవతలు

మురిసి తడిసెదరిచట

మూడు మున్కలు వేసి

మోకరిల్లుము స్వామి !

29

పద పదము వేదమయ

పదమాత్మగా నెంచి

పరమేశ్వరా యనుచు

పాడి ముందుకు సాగు !

---------------------

ద్వితీయావరణం

------------------------

( గిరిపాద మండలం)


1

కదిలి ముందుకు సాగు

కమనీయ హిమగిరుల

పాద సన్నిధి అదిగొ

పరమ పెన్నిధి అదిగొ

2

దివి నుండి తారకలు

భువికి చేరుదురిచట

దిక్పతులు సతులతో

దిగి వత్తురిచ్చటికి

3

గంధర్వ గాయకులు

గరళ కంఠుని చూడ

గగన మార్గము వీడి

నగము చేరుదురిచట

4

అప్సరో భామినులు

అవని చేరుదురిచట

నాగ కన్యలు మురిసి

నర్తింతు రిచ్చటే

5

యక్ష పరమాంగనల

పదధూళి రేగునిట

కిన్నరాంగన పాద

కింకిణిలు మోగునిట

6

ఇచట రేగిన ధూళి

కణ కణము శివమయము

శీర్షమందున దాల్చి

సిద్ధి కోరుచు కదులు

-------

తృతీయావరణం

------------------------

( గో మండలం)

1

గోలోక మది చూడు

గోధూళి తో నిండు

గోమయము దారులట

గోపాల బాలురట

2

చిత్ర మయ వర్ణములు

చపలతర కర్ణములు

గంగడోలుల చిన్ని

గోబాల బాలికలు

3

వేదమాతయె వేయి

రూపములు గొన్నట్లు

ధర్మదేవత కోటి

దేహములు గన్నట్లు

4

గోశరీరము నందు

కోటి సురకాంతులట

కణ కణము సురలోక

గణముతో సమమంట

5

నతులలో నుతులతో

శృతులతో కృతులతో

గో గణము నర్చించి

కోరి ముందుకు సాగు

---------

చతుర్థావరణం

(తపో మండలం)

---

1

శత కోటి వర్షములు

శమదమాదుల తోడ

తప మాచరించేటి

తత్త్వదర్శుల చూడు

2

మౌనులును యోగులను

శౌనకాదుల చేరి

సత్సంగ సభ చేయు

సాధు వర్తన భూమి

3

యజ్ఞాగ్ని శిఖలచట

విజ్ఞాన జ్యోతులట

హోమ ధూమము లచట

క్షామ నాశినులంట

4

నిత్యాగ్ని హోత్రములు

నిరతాన్న దానములు

నిటలాక్ష సేవనలు

నియతి తప్పనినేల

5

భద్ర వాటిక లోన

భస్మ ధారణ చేసి

సోమ పానము చేసి

స్తోత్ర గానము చేయు

6

హర హరా మహ దేవ

పరమేశ్వరా యనుచు

మునులనే మదిదలచి

మునుముందుకై సాగు

7

అది తపోలోక మట

ఆది మునులే అచట

అవి యాగ భూములట

హవిషా వితర్దులట

8

అచటి ధూళులు కూడ

అగ్ని శిఖలకు సమము

అచట కురిసెడి వాన

అమృతాభిషేకమ్ము

9

అచట పెరిగిన గరిక

రుద్ర జటలకు సమము

అటవాయు నిస్వనము

అఖిల వేద స్వరము

10

అచట లతలే సోమ

రసము వర్షించునట

అచటి చిరు కొమ్మలే

స్రుక్కులట స్రువములట

11

ప్రతిఎండు పుల్లయును

హవనాగ్ని సమిధ యట

ప్రతి వృక్ష పత్రమ్ము

వ్యజనైక పాత్రమట

12

అట యోగి పుంగవులు

ఆది యుగముల నుండి

వాయువును బంధించి

ఆయవును గలవారు

-----

పంచమావరణం

(బిల్వ మండలం )

-------

1

ఆది భిక్షువు చెంత

అడవి ఐనది పుడమి

అడుగడుగు శివతరువు

తడబడక నడువుమట

2

లక్షయోజన పరిధి

వృక్ష బిల్వములచట

మోక్షపథ గాములకు

ముక్తి దాతలు అవియె

3

వనములుపవనములూ

వేలకొలదులు అచట

ఏకబిల్వపు తరువు

లేడేడు వనములట

4

అచటే త్రి బిల్వములు

లక్షోపలక్షలట

పంచ బిల్వ శ్రేణి

కోటి శత కోటులట

5

నవ బిల్వ తరువులే

వేల వేలుగ నుండు

బహుబిల్వ దళ వృక్ష

బాహుళ్యములు ఎన్నొ

6

శతబిల్వముల తోడ

శంకరుని అర్చించు

శాంతి నొందును మనసు

సౌఖ్యమొందును తనువు

------

షష్టావరణం

(నక్షత్ర మండలం)

-------




1

నక్షత్ర మండలము

నభపు ప్రభలే ఇచట

కలలొ కాంచని కాంతి

ఇలలొ వెలుగును ఇచట

2

మిల మిలల తారకలు

మిన్ను దిగి వచ్చునట

మంచు కొండకు మణుల

హారతులు నిచ్చునట

3

ఇంపైన నక్షత్ర

పటలమ్ము నిటలాక్షు

ఇంటి ముంగిట రంగ

వల్లికలు దిద్దునట

4

సప్తర్షి మండలము

స్వర్ణ కాంతులు చిందు

ధృవ తారకా గతులు

దురితములు తొలగించు

5

తరళ తర తారకలు

వెలుగు జిలుగులు గూర్చి

హిమ గిరీశుని కంఠ

సుమమాలికై నొప్పు

6

నతులతో నక్షత్ర

మండలము నర్చించి

నడిచి ముందుకు సాగు

నయన పర్వము నీకు

------

సప్తమావరణం

(భాను మండలం)

1

అచట ముందుకు సాగ

అగుపించు బింబములు

భాను మండల భవ్య

భాస్వద్విడంబములు

2

ద్వాదశార్కులు శీత

కిరణాలు ప్రకటించ

కోటి విద్యుత్ ప్రభలు

కోరి చేరిన నేల

3

చిత్తమంతయు శివుని

చింతించి ధ్యానించ

వేయి కిరణాలిచట

వెన్నెలలు కురిపించు

4

అరుణ కిరణుడు ఇచట

అమృతమే వర్షించి

కరుణ చూపెడి నేల

గరళ కంఠుని లీల

5

హిమగిరీ శృంగమున

సుమములద్దినయట్లు

మలయ వాయువు గంధ

మలర వీచినయట్లు

6

చందనపు వృక్షములు

గంధ మలదినయట్లు

మరు మల్లియలు విరిసి

మత్తు గొల్పినయట్లు

7

సప్త కిరణము లిచట

గుప్తశక్తుల నిచ్చు

హేమ కాంతికి దివ్య

ధామమై కనిపించు

8

మింట మండెడు రేడు

చంటి పిల్లడువోలె

కంటి కింపును గూర్చు

మంటప శృంగమదె

9

అఖిల భానుల కచట

అర్ఘ్య మిచ్చుచు సాగు

అవని పరమాత్మగా

అగుపించు శివుడతడు

10

పార చూడుము అతడె

ప్రత్యక్ష పరమాత్మ

పాప సంచయ మెల్ల

పెకిలించు బ్రహ్మాత్మ

11

శివుని మది భావించి

చిత్తమును బంధించి

కదిలిముందుకు సాగు

కామితార్ధము దలచి

-------

అష్టమావరణం

( ది క్ మండలం)

-----

1

కనులముందదె కనుము

కమనీయ లోకమును

ఇంద్రాది దేవతల

ఇలలోని స్వర్గమును

2

హిమ సానువుల నిండ

సుమ సౌరభము మెండు

కల్ప వృక్షపు వనము

కలదు శతయోజనము

3

కామధేనువు లచట

కామనలు తీర్చునట

కార్య సాధన కోరు

కదిలి ముందుకు చేరు

4

అష్ట దిక్పాలకుల

స్పష్టముగ దర్శించు

విశ్వనాథుని చేర

వినతులను వినిపించు

5

తూర్పు దిక్ శృంగమున

దేవేంద్రుడే అచట

దేవసభ చేయునట

దేదీప్యమాన ముగ

6

ఆగ్నేయ పర్వతము

అగ్ని దేవాలయము

ఆజ్యముల నర్పించి

ఆహుతుల నందించు

7

దక్షిణ శృంగమున

ధర్మ దేవత యముడు

దర్శించినంతనే

దయచూపు ధార్మికుడు

8

నైరుతీ నగమదే

నిరుతి నిలయమ్మదే

పాప వంశోద్భవుల

పుణ్య నిలయమ్మదే !

9

వరుణ దేవుని యద్రి

కరుణనే కురిపించు

వర్షధారల తడవ

హర్ష ముప్పొంగునిట

10

వాయవ్య పర్వతము

వాయు దేవుని నేల

అఖిల లోకశ్వాస

అందించు సురుడతడు

11

ఉత్తరపు దిశ చూడ

యది కుబేరాద్రి ఆ

యక్ష రాజుకు మొక్క

రక్షణను కల్పించు

12

ఈశాన్య శృంగమది

ఈశ్వరుని లింగమది

శత రుద్రియము చదివి

నత శీర్శుడవు కమ్ము

13

అష్ట విధ సిద్ధులను

అచట సాధించుకొని

కృత్తివాసుని చేర

చిత్తమున ధ్యానించు

14

కష్టములు నష్టములు

మరచి కొండల నెక్కి

ఇష్టముగ ఈశ్వరుని







తలచి ముందుకు సాగు

-------

నవమావరణం

(గ్రహ మండలం)

---------

1

అదిగదిగొ హిమఖండ

సోపాన పంక్తులవి

అచట శీర్శము వంచి

అవని సంస్పర్షించు

2

సప్త సోపానములు

సంధ్యా మరీచికలు

సుప్త చైతన్యములు

శుద్ధ ప్రదీప్తములు

3

నవ నవోజ్వల గోళ

నవ రత్న కాంతులతొ

నవ మహా గ్రహపతులు

అవని చేరుదు రిచట

4

ఏడు గుర్రము లెక్కి

ఏడేడు లోకాలు

భ్రమియించు భానుడట

భాస్వత్ ప్రతాపుడట

5

వెన్నెలలు కురిపించు

వన్నెచిన్నెల వాడు

మదిని ఆకర్షించు

మనసున్న చందురుడు

6

కుంకుమాంగుడు కుజుడు

కల్లోల కారకుడు

కష్ట జీవి ని చేరి

ఇష్ట సిద్ధిని గూర్చు

7

బుధుడతడు సద్బుద్ధి

సౌమ్య సద్గుణ శీలి

భూరి విద్వత్ తేజ

భువన మోహనశాలి !

8

గురువులకు గురువైన

దేవగురువే అతడు !

అతులమేధోశక్తి

అమర తేజోద్దీప్తి

9

సౌందర్య కారకుడు

సరస ప్రదీపకుడు

సుకళాధి పోషకుడు

శుభుడు శుక్రుడు అతడు

10

మందగతి మార్గణుడు

గుణ దోష కారకుడు

శని దేవ సంస్తుతుడు

శమ కరుడు శుభకరుడు

11

మాయా మహోత్సాహి

మోహకుడు రాహువట

పట్టు విడుపుల రేడు

పరమ పూజ్యుడు అతడు

12

ముక్తి ప్రదాయకుడు

యుక్తి ప్రచోదకుడు

కేతు ఛాయా దేహి

కైవల్య పద గేహి

13

మననున్న గ్రహములను

మదిలో సమర్చించి

కోర్కెలన్నియు విడిచి

కోరి ముందుకు సాగు

----------------------

దశమావరణం

( ప్రమధ గణ మండలం)

1

శత కోటి శృంగములు

శాక్తేయ కుడ్యములు

అష్ట దిగ్ద్వారములు

అఖిల ప్రమోదములు

2

ప్రమథ గణములు నిలిచి

పాలనను చేతురట

వారి ఆనతి లేక

గాలి అయినా చొరదు

3

మణి మయోజ్వల దివ్య

మాణిక్య భిత్తికలు

చలిత విలసల్లలిత

భరితాభ్ర భంజికలు

4

తూర్పుద్వారపు రక్ష

కూర్పు నందీశ్వరుడు

అమిత విక్రమశాలి

అతులరక్షణ శీలి

5

ఆగ్నేయద్వార పతి

అరి భయంకరుడంట

అతి మహా కాలుడట

అగ్ని ముఖ రూపుడట

6

దక్షిణ ద్వారమున

దక్షణా కవచమై

మూడు కాళ్ళ భృంగి

ముందుండి కాచునట

7

నైరుతీ ద్వారమున

నాయకుడు భద్రుడట

చీమయైనా నిలిచి

చేర వెరచును ఇచట

8

పడమట ద్వారమున

పార్వతీ పుత్రుడగు

వీరగణపతి నిలిచి

విష్నుములు తొలగించు

9

వాయవ్య ద్వారమున

వల్లీ సమేతుడై

సుబ్రమణ్య స్వామి

బల్లెమై రక్షించు

10

ఉత్తర ద్వారపతి

విత్తమంతకు విభుడు

ధన కుబేర స్వామి

దక్షుడై పాలించు

11

ఈశాన్య ద్వారమున

ఈశాన భైరవుడు

కాశికాపురివోలె

కాచి రక్షణ సేయు

12

ఇష్ట సిద్ధుల నిచ్చు

ఈశ్వరుడి రూపములు

వ్యష్టియౌ వేదములు

అష్ట శివ ద్వారములు

13

ఆ ద్వార తోరణము

లన్ని మొక్కుచు సాగ

సిద్ధి యోగులు గాంచు

శ్రీ సభా భవనములె

------

ఏకాదశావరణం

( అభిషేక మంటపం )

1

అది రుద్ర భవనమట

అతి భద్ర హవనమట

ఏకాదశేశ్వరులు

ఏకమై వత్తురిట

2

ఆసభా భవనమున

అంతటా కనిపించు

అపురూప కుండములు

అభిషేక భాండములు

3

పదకొండు రుద్రులిట

ప్రత్యక్ష రూపులుగ

పానవట్టము జేరి

పరవశింతురు చూడు

4

అమర శివ రుత్వికుల

నమక చమకపు గతులు

అఖిల గాయక గాన

రస ఝరీ సంస్తుతులు

5

ఎచట వింటే అచట

ప్రణవైకనాదములు

ఎచట ఉంటే అచట

శ్రవణ ప్రమోదములు

6

శివగణాలన్నిచట

శంకరా మహ దేవ

హరహరా యని యంచు

గళమెత్తి పాడుదురు

7

స్వర్ణ కుంభములతో

పూర్ణ గంగా జలము

కరమెత్తి పోతురట

గరళ కంఠుని పైన

8

శంఖములు డంకములు

సందోహలయమౌను

శివ సభా భవనమ్ము

శృతి సుధామయమౌను

9

అతిరుద్ర స్వరములే

చెలగి అంబరమయ్యె

అభిషిక్త ధారలే

తరలి అంబుధి అయ్యె

10

రుద్ర మూర్తుల చేరి

రుక్కులతొ సేవించి

నడిచి ముందుకు సాగు

నయన పర్వము గలుగు

-------

ద్వాదశావరణం

(తాండవ మంటపం )

--------

ఆనంద తాండవమంటపం

------------

1

కొంత ముందుకు చేర

కోటి కాంతులు చిందు

శివ నాట్య భవనమది

శాక్తేయ హవనమది

2

నాట్య భవనము నడుమ

నటనా విలాసుడగు

అర్థనారీశ్వరుని

ఆనంద తాండవము

3

సిద్ధులును సాధ్యులును

రుద్రులును భద్రులును

శివ తాండవపు వేళ

శివమెత్తి వత్తురట

4

కోటి శివ గణములును

కోలాటమాడుదురు

పరమ పురుషునిజేరి

పదము కలిపెదరిచట

5

నందీ భృంగీ చండీ

నర్తనము గావించు

నారదుడు తుంబురుడు

కీర్తనల సేవించు

6

తాళములు తప్పెట్లు

వాయించి మురిసేరు

డంకాలు డమరులూ

నినదించి ఎగిరేరు

7

వీణా నినాదముల

వేడుకల తనిసేరు

బూర కొమ్ముల నూది

శూరులై రగిలేరు

8

శివుడు తాండవ వేళ

శివమెత్తి ఆడునట

శివ శక్తితో కూడి

చిందేసి పాడునట

9

కిన్నెరలు వాయించు

కన్నెలెందరొ అచట

రాగ మాలిక లల్లు

రమ్య భామినులచట

10

ఘలు ఘల్లుమని కాలి

యందెలే మోగంగ

భస్మాంగ దేహుడికి

డెందమే ఉప్పొంగు

1 1

పదము పదమూ కలిసి

పరమేష్టి సతితోడ

గళము గళమూ కలిసి

కీర్తనలు పాడునట

1 2

విసరద్విరూపాంగ

వికళా ప్రదర్శనము

విగళజ్జటా జూట

విశిఖా ప్రభంజనము

13

తతగిణీ తోం అనుచు

తనిసి నాట్యము చేయ

తాండవానందమున '

తన్మయులె అందరును

14

అచట శీతాచలము

అధిక కోలాహలము

భవ నాట్య మందిరము

భువనైక మోహనము

---------------

సంధ్యా తాండవ మంటపం

----------

1

అచటనొక తెర తీయు

అసుర సంధ్యా సమయ

కుటిలాంగ నర్తనలు

నిటలాక్ష కీర్తనలు

2

రుద్ర భూముల పైన

విద్రావ నర్తనలు

ఛిద్ర దేహుల వీర

భద్రావతారములు

3

కరములో కంకాళ

వికటాట్టహాసములు

వెరువు అరుపులు లేక

వినవోయి కనవోయి

4

మస్తకములే లేని

హస్తకాపాలికలు

న్యస్తోర్ధ్వ దైహికులు

వ్యస్తాధి మోహితులు

5

భగ్న ప్రదేహులట

నగ్నైకరూపులట

చిత్ర రూపులు కూడి

చిందేసి ఆడెదరు

6

వికృతాధి వేషములు

వేరు వేరుగ నుండు

ప్రళయ ప్రహాసములు

తీరు తీరుగ నుండు

7

పాపాల భైరవులు

ధూపాల తాంత్రికులు

బేతాళ రూపులను

కాపాల మాంత్రికులు

8

ప్రేతలును భూతములు

ప్రీత చిత్తులె అచట

శవ గాత్రులయినట్టి

శివ మాత్రులందరును

9

ఆపాద మస్తకము

గాలిలో కదిలేరు

అసలు దేహము వదిలి

ధూళి లో ఎగిసేరు

10

ఛిద్ర దేహము లున్న

భద్ర మూర్తులు వారు

చితి నాట్యములు సలుపు

క్షుద్ర శక్తులు వారు

11

వికటాట్టహాసములు

వింతైన వేశములు

వికలాధిఘోషణలు

వికృతాభి భాషణలు

12

కోటి రుద్రులు చేరి

కోలాటములు చేయ

కోర్కె తీరగ చూసి

కోరి ముందుకు సాగు

13

హృదయ మందానంద

మందిరము నిర్మించి

వేద వేద్యుని శివుని

మదిలో ప్రతిష్ఠించి

14

భూఖండ కైలాస

పుణ్య లోకము వైపు

పదమంటు పదమెత్తి

పయనమగుమా !స్వామి

-------

త్రయోదశావరణం

(శివ సభామండపం )

-------

1

సాగి ముందుకు చేర

శివసభా భవనమది

సకల దేవానంద

సల్లాప మందిరము

2

బ్రహ్మ విష్ణువు శివుడు

భాషింతురట చేరి

భస్మాధి గాత్రునే

భూషింతురట కోరి

3

విశ్వ కళ్యాణ ప్ర

నాళికలు వేతురిట

నశ్వత్ప్రపంచాగ్ని

కేళికలు చేతురిట

4

చరరాశి స్థిర రాశి

పరిణామ ఫలచర్చ

జగతిలో విలసిల్లు

జనన మరణపు చర్చ

5

విశ్వలోకానంత

వివిధ విధముల చర్చ

సకల ధర్మాధర్మ

సందోహముల చర్చ

6

పాప పుణ్యపు చర్చ

పరమ లోకపు చర్చ

సుకృత విధముల చర్చ

వికృత హృదయుల చర్చ

7

విశ్వ కళ్యాణముల

విరచించు మదిరము

బ్రహ్మాది దేవతల

ప్రవచనా మంటపము

8

ఎచట చూచిన అచట

శివ సభా ప్రాంగణము

ఎదలో సమర్చించి

కదిలి ముందుకు సాగు

--------

చతుర్దశావరణం

(విలాస మంటపం )

---------

1

లక్ష్మీ సరస్వతుల

హాస్య ప్రచంద్రికలు

లలితా మహా దేవి

లాస్య ప్రహేళికలు

2

ముగ్గురమ్మల ముద్దు

లీలా వితర్దికలు

ముల్లోక సంబంధ

ముచ్చట్ల వేదికలు

3

శివ కేళిభవనమది

సిద్ధ గణ రక్షితము

రాజేరాజేశ్వరుల

రమ్య లీలాస్థలము

4

శివ వృక్ష రాజములు

శివ లతా కుంజములు

శివ సరస్సులు అచట

శివమయము అంతటను

5

విభ్రమము గలిగించు

భ్రమర ఝంకారములు

భువనైక మోహినికి

భూపాల రాగములు

6

అట పాచికల తోట

అచట గవ్వల గద్దె

పరమ పద సోపాన

వలయ దివ్య క్రీడ

7

వనమాలికా క్రీడ

చలదూర్మికా క్రీడ

పద నిర్మిత క్రీడ

జల డోలికా క్రీడ

8

వలయ నృత్య క్రీడ

అలరు చందన క్రీడ

జలజ బంధ క్రీడ

మలయ గంధ క్రీడ

9

అమర క్రీడానంద

మంబరము నంటునట

అఖిల లోకేశునికి

అర్చలే అవి అచట

10

ఆరు రుతువులు అచట

బారులే తీరునట

అచట వర్షములెపుడు

హోరుగా కురవవట

11

శీత వాయువు ఎపుడు

జోరుగా వీచదట

చింత నిప్పుల ఎండ

తీరు అసలుండదట

12

గూఢో పగూఢములు

గుహ్య ప్రకాశికలు

కేళీ విలాసములు

బాలా విహారములు

13

లీలా వినోదములు

వీణా నినాదములు

శృంగార గీతములు

శుద్ధోపహారములు

-----


పంచదశావరణం

(శ్రీ చక్ర మంటపం )

-------------

1

కదిలి ముందుకు సాగ

కమనీయ కల్పమది

రాజేశ్వరీ హృదయ

రమణీయ ద్వీపమది

2

అట చుట్టు సంద్రమట

అమృత ప్రబంధమట

మకరములు మీనములు

నికర ప్ర సాంద్రమట

3

సాగరము మధ్యలో

సప్త యోజన ఘటిత

ప్రాకార కుడ్యములు

ప్రాలేయ భిత్తికలు

4

నాలుగు ద్వారములు

నయన మనోహరములే

భువనైక మోహినీ

భక్త గణ పరములే

5

అట చూడ వృక్షములు

ఆకాశమంటునట

వన సుందరీ కృపా

వర్షాభ్ర దీప్తులట

6

దశ యోజనాకర్ణ

దేవతా వృక్షములు

గగనాన వెదజల్లు

గంధ ప్రసూనములు

7

చంపకాశోకములు

సాగంధికా తతులు

చాంపేయ వకుళములు

సౌవీర చూతములు

8

శింశుపా వృక్షములు

శివమల్లి తాళములు

కాదంబ కాశ్మీర

కాంతార భూజములు

9

హంస కారండములు

గండభేరుండములు

శుకములు పికములూ

సుందరాలాపములు

10

అటు చూడు మటు చూడు

ఆరుప్రాకారములు

రుతు రాజ్య విక్రమపు

రక్షణా చక్రములు

11

అవి దాటి అటు చూడు

అష్ట దిక్కుడ్యములు

అమరాధిపాలికలు

సమర ప్రహేళికలు

12

పద్మ రాగపు మణుల

ప్రాకార మంటపము

వీర నారీ మణులు

పాలించు ప్రాంగణము

13

రథములూ గజములూ

తురగములు సిద్ధమట

యుద్ధ భేరీ నివహ

క్రుద్ధ సన్నద్ధులట

14

గోమేదికా మణుల

కోటి ప్రాకారములు

అరుణార్ణకాంతి మయ

తరుణీ మణులె అచట

15

సద్వజ్ర ప్రాకార

భిత్తికలు పాలించు

భువనేశ్వరీ దేవి

భవనైక రక్షకులు

16

వైడూర్య ప్రాకార

కైవారములు దాట

అష్ట మాత్రుకలచట

ఇష్టపాలికలంట

17

ఇంద్రమణి ప్రాకార

మింద్ర నీలపు కాంతి

నిండి వెలుగులు ఎగిసి

నింగి కెగెసేనచట

18

ముత్యాల కుడ్యములు

మరకతపు కుడ్యములు

ప్రా వాళ కుడ్యములు

పర రత్న కుడ్యములు

19

కుడ్య కుడ్యము నడుమ

కుసుమైక వనములూ

వనము వనమూ నడుమ

నదములూ హ్రదములూ

20

కొంత దూరము సాగ

చింతా మణీ గృహము

శివసతీ హృదయైక

చిత్కళా మంటపము

21

కదలి ముందుకు సాగ

కమనీయ హర్మ్యములు

కామేశమానసపు

రమణీయ సౌధమలు

22

అదిగదిగొ శ్రీ చక్ర

భవన విద్యుత్ కాంతి

లలితా మహా దేవి

లావణ్య వర భూమి

23

చింతామణీ గృహము

చిత్కళా శోభితము

త్రిపురా మహాదేవి

అపర మానస గృహము

24

లలితా మహాదేవి

లావణ్య మందిరము

యోగినీ గణ దివ్య

లాలిత్య సుందరము

25

పంచ బ్రహ్మాసనము

పైన శంభుడు ఉండు

అతని వామాంకమున

పైన శాంభవి ఉండు

26

అచటే మహా కోణ

తంత్రైక తేజమట

అదియే జగన్మూల

మంత్రైక బీజమట

27

షట్ చక్ర నిష్టితము

శత రుద్ర విష్ఠితము

త్రి జగన్‌ మహా దేవి

త్రైలోక్య మోహనము

25

అర్ధ నారీశ్వరుని

ఆహార్య చిత్రమది

మాహేశ్వరీ హృదయ

మాధుర్య పాత్రమది

26

త్రిపురాంబికా దేవి

స్వపురమున కేతెంచె

త్రినయనార్థాంగియై

ప్రణయినిగ శోభించె

28

వాగ్దేవతా గణము

వాక్కులతొ భూషించి

నక్షత్ర కాంతులతొ

అక్షరార్చన చేసె

29

రదనచ్చద స్వచ్ఛ

రత్నహాసాన్వితాం

నవ నీల మణి విద్ధ

నాసా మహోజ్వలాం

30

మాణిక్య రత్న మయ

మకుటాంశివాం భవాం

లలితాం భజే యంచు

వర్ణనల నుతియించి

31

శ్రీ మాతృమూర్తివని

శ్రీ మహారాజ్ఞివని

సింహాసనేశ్వరివి

చిత్కళా రూపివని

33

దేవకార్యముకొరకు

నీవె వచ్చితివనుచు

వేయి నామములతో

వేడ్కగా పాడిరట

34

రాజేశ్వరీ దేవి

రాజ్య వల్లభ ధాత్రి

రాజత్ కృపా సాంద్ర

రమ్య లీలా మూర్తి

35

తాటంక యుగళీ సు

కర్ణ భూషాన్వితాం

రదనచ్చద స్వచ్ఛ

రత్నహాసాన్వితాం పరాం

36

నవ నీల మణి విద్ధ

నవ్యోజ్వల ప్రభాం

స్వర్ణ మయ మాణిక్య

మకుటాన్వితాం శివాం

37

మధుర కీర్తన చేసి

మదిలోనె భావించి

కదులు ముందుకు మహా

కైలాస గిరి వైపు

------------------

శోడషావరణం

-------------------

(మహా కైలాస మంటపం )

1

అడుగు ముందుకు వేయ

ఆనంద మందిరము

ఆవనిపై కైలాస

శివ మహా మంటపము

2

కను మూసి కనుమయ్య

కైలాస శంకరుని

కణ కణము తానైన

కైవల్య కింకరుని

3

కనులు చెదిరే దివ్య

కమనీయ కాంతులట

హృదయమందానంద

కావ్యాను భూతులట

4

అష్ట నందులు శివుని

ఇష్ట వాహనములవి

కైలాస మంటపపు

కై వార పాలకులు

5

నందీశ్వరుడు నంది

నందికేశ్వర విభుడు

నందికేరుడు నంది

నాథుడచ్చట నుండు

6

నందివర్ధనుడునూ

నందిముఖులను గూడి

నందీ మహారాజు

నలుదిక్కులను కాచు

7

మిరుమిట్లు గొలిపేటి

మింటి చుక్కల బోలు

కోటి రుద్రులు అచట

కోరి నడిచే నేల

8

పంచ ముఖ పరమేశ

పంచతత్త్వము లచట

ప్రతి అణువులో నిండు

పరమ శివ కాంతులవి

9

వీరభద్రులు అచట

విశ్వ యాగము చేయ

నిజ రుద్రమూర్తినే

భజియింతు రట చేరి

10

మౌన ముద్రను దాల్చి

మంత్ర సాధన చేసి

మాహేశ్వరుని గొలుచు

మౌనులెందరొ అచట

11

సిద్ధులును సాధ్యులను

బ్రహ్మలును విష్ణులును

కోటి తపములు చేసి

కోరి చేరే స్థలము

12

పరమేశ రూపులగు

పార్థివేశ్వరులనే

ప్రతి అణువులో గాంచ

పరవశము పొందెదవు

13

వేదమే ఓంకార

నాదమై వినిపించ

ఎదలోయలో ప్రతి

ధ్వానమై నినదించు

14

మంద్ర స్వరప్రోక్త

మంత్రమై వినిపించు

పంచాక్షరీ జపము

పరమ పుణ్యప్రదము

15

కోటి రుద్రులు వీర

భద్రులును సిద్ధులును

ఆరాధనలు చేసి

ఆనంద మొందుదురు

16

హిమ శృంగ స్తంభముల

సుమ లతా కుంజములు

అరుణార్ణకుసుమములు

అర్కేందు పత్రములు

17

నాల్గు వేదాలవలె

నలువైపులా గిరులు

గిరులపై హర పత్ని

తీర్చి పేర్చిన తరులు

18

వెలుగు జిలుగుల నడుమ

వెలుగు మంటపమదిగొ

మంటపము మధ్యలో

వేదికా స్థలమదిగొ

19

అచట పరివేష్టించె

అపర పరమేశ్వరుడు

అది రాజరాజేశు

డర్ధనారీశ్వరుడు

20

విష్ణు దేవుడు శివుని

వేయి నామాలతో

భజియించునట చేరి

భక్తి భావము తోడ

21

అచట బ్రహ్మానంద

సంద్రమే ఉప్పొంగు

అచట అమృతపు ధార

గంగయై ప్రవహించు

22

బ్రహ్మకొక యుగమునట

అచట నిలిచిన క్షణము

అచట శివ దర్శనము

విశ్వ సంవీక్షణము

23

అరుణ వర్ణపు కాంతి

కరుణ కురిపించగా

శుక్లవర్ణము శుద్ధ

శాంతినే గలిగించు

24

అచట వీచును విమల

మలయ మారుత తతులు

అవియె వినిపించు శివ

మధుర మానస కృతులు

25

అతని కను సైగతో

కృశియించు లోకములు

ఆమె కొన చూపుతో

నశియించు శోకములు

26

శాంభవీ దంత రుచి

శంభు సరసన చేర

శర్వ నయనపు కాంతి

శర్వాణి చేరెనట

27

నిటలాక్షు డుండేటి

స్ఫటిక వేదిక అదియె

పరమేశ మోహినీ

పరమాసనమ్మదియె

28

చంద్ర శిలలకు అమృత

చందనము పూయించి

ధవళతరమాల్యములు

అవిరళ సుమార్చనలు

29

రాజ రాజేశ్వరుని

రాజ్య వేదిక పైన

రస రమ్య గీతికా

కుసుమాల పూజించు

30

హృదయమే ఉప్పొంగి

ఉద్వేగమే పొంద

శంభో మహాదేవ

యని పిలువు గొంతెత్తి

31

కన్నీటి జలధార

కడలిగా మారగా

ఆది దేవుని చేరి

అభిషేక జలమౌను

32

కైలాస వాసినం

కమనీయ విగ్రహమ్

రాజేశ్వరం భజే

రాజేశ్వరీ విభుమ్

3 3

పంచ వక్త్రం శివం

పర భూషణాన్వితం

పరమ శివ శంకరం

ఫణి భూషణం భజే

3 4

సాంద్ర భానుద్యుతిం

చంద్ర శీతాన్వితం

మహాఉగ్ర నేత్రం

భజే అగ్ర పూజ్యం

35

అర్ధ నారీశ్వరం

అర్ధ చంద్రాన్వితం

పూర్ణ యోగీశ్వరం

పూర్ణ తేజం భజే

36

భజే భాను దీప్తిం

భజే బ్రహ్మ మూర్తిం

భజే విశ్వనాథం

భజేహం సతీశం

37

కైలాస వాసినం

కమనీయ విగ్రహం

రాజ రాజేశ్వరం

రుద్ర రూపంభజే !

------

---చొప్పకట్ల భాను

నీ అండ చేర నే రాలేను రామా, నా కొండకే నీవు రావయ్యా రామా Hanuaman Song (YT Short 2)



https://youtube.com/shorts/cHZF593Pzhk


🌹 నీ అండ చేర నే రాలేను రామా, నా కొండకే నీవు రావయ్యా రామా శ్రీకృష్ణాంజనేయ యుద్ధం
 Short 2 
Hanuaman Song 🌹



ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹


Kodanda Rama – The Divine Symbol of Dharma Protection and the Glory of the Bow-Bearing Maryada Purushottama



Facebook:
https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2153278598791943


🌹🏹 Kodanda Rama – The Divine Symbol of Dharma Protection and the Glory of the Bow-Bearing Maryada Purushottama 🌹

✍️ Prasad Bharadwaj



In Sanatana Dharma, Lord Sri Rama is not merely an incarnation of God but an eternal model of righteous living who practiced and demonstrated Dharma through every aspect of his life. He is revered as “Maryada Purushottama” — the Supreme Ideal Person — because every action of his life stands as a symbol of truth, righteousness, duty, and noble ideals. Among the many divine manifestations of Sri Rama, the form of Kodanda Rama holds a unique and powerful place, inspiring spiritual devotion among millions of devotees. This form is not merely that of a warrior; it is a harmonious embodiment of Dharma, compassion, valor, and profound spiritual principles.

The word “Kodanda” refers to the divine bow carried by Lord Rama. This celestial weapon is not merely an instrument of warfare; rather, it symbolizes the protection of righteousness, the destruction of evil, and the establishment of truth. In Sanskrit, “Ko” signifies something elevated or divine, while “Danda” means a weapon or power. Therefore, Kodanda may be understood as a “great divine bow endowed with supreme power.” It is not an ordinary weapon but a representation of Lord Rama’s divine will and cosmic purpose. Significantly, Rama never wielded it for personal anger, selfish desires, or revenge; it was used solely for the protection of Dharma.

Mythologically, the Kodanda played a vital role throughout the life of Lord Rama. One of the most celebrated episodes is the Swayamvara of Goddess Sita in the kingdom of Mithila. King Janaka had declared that only the person capable of lifting and stringing the mighty bow of Lord Shiva would win the hand of Sita in marriage. Many kings and great warriors attempted the challenge but failed. Sri Rama, with humility and serenity, lifted the bow effortlessly, and as he attempted to string it, the mighty bow broke with a thunderous sound. This event was not merely a display of physical strength; it was a manifestation of divine destiny and a revelation of the power aligned with Dharma.

Later, while accompanying Sage Vishwamitra into the forests, Lord Rama used his Kodanda to destroy evil forces and protect the righteous. He defeated Tataka, subdued Maricha and Subahu, destroyed Khara and Dushana, and ultimately ended the arrogance and tyranny of Ravana. Yet there is a profound lesson within these battles: Lord Rama never desired war for its own sake. He took up arms only when Dharma required protection. Therefore, the Kodanda is not simply a symbol of battle; it represents restrained power, courage rooted in righteousness, and the readiness to defend truth whenever necessary.

Spiritual scriptures also reveal deeper yogic symbolism hidden within the form of Kodanda Rama. According to yogic philosophy, the Kodanda (bow) symbolizes the human body, the bowstring represents the mind, and the arrow signifies concentration and focused awareness. The ultimate target is the realization of the Supreme Truth or God. Just as an unstable bowstring cannot direct an arrow toward its destination, an unstable mind cannot lead a person toward life’s true purpose or spiritual evolution. Thus, Kodanda Rama teaches humanity the importance of self-control, disciplined thought, and unwavering focus upon the path of righteousness.

Across India, Kodanda Rama is worshipped in numerous sacred temples. In holy places such as Bhadrachalam in Telangana, Ontimitta in Andhra Pradesh, and Rameswaram in Tamil Nadu, Lord Rama is worshipped in his divine Kodanda form along with Goddess Sita and Lord Lakshmana. Devotees believe that worshipping this sacred form grants courage, peace, devotion, and spiritual strength in life.

The form of Kodanda Rama also conveys a profound message for humanity. One may possess power but should never become arrogant. One may possess courage but should never become cruel. One may possess authority but should never become unjust. One may have love but should never neglect duty. The bow in the hands of Kodanda Rama is not meant to create fear; it exists to protect Dharma.

Thus, Kodanda Rama is not merely a divine figure holding a bow. He is the eternal embodiment of truth, the living manifestation of righteousness, and the guiding light for an ideal life. His Kodanda symbolizes the awakening of inner courage, self-discipline, and unwavering faith within every individual. Through his divine form, Lord Rama reminds humanity that those who stand steadfast on the path of truth and righteousness will always remain under divine protection.


॥ Sri Rama Jayam ॥

✍️ Prasad Bharadwaj


🌹🌹🌹🌹🌹

కోదండ రాముడు – ధర్మరక్షణకు దివ్య ప్రతీక, మర్యాదా పురుషోత్తముని కోదండ మహిమ (Kodanda Rama)



Facebook:
https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2153273178792485

🌹🏹 కోదండ రాముడు – ధర్మరక్షణకు దివ్య ప్రతీక, మర్యాదా పురుషోత్తముని కోదండ మహిమ 🌹
✍️ ప్రసాద్ భరధ్వాజ


సనాతన ధర్మంలో భగవాన్ శ్రీరాముడు కేవలం ఒక అవతారపురుషుడు మాత్రమే కాదు; ధర్మాన్ని ఆచరించి చూపిన జీవనాదర్శం. ఆయనను “మర్యాదా పురుషోత్తముడు” అని పిలవడం వెనుక గల కారణం, ఆయన జీవితంలోని ప్రతి కార్యం సత్యం, ధర్మం, కర్తవ్యం మరియు ఆదర్శాలకు ప్రతీకగా నిలవడమే. ఆ శ్రీరాముని అనేక దివ్యరూపాలలో “కోదండ రాముడు” అనే రూపం అత్యంత విశిష్టమైనది, శక్తివంతమైనది, భక్తులకు ఆధ్యాత్మిక స్పూర్తినిచ్చేది. ఈ రూపం కేవలం యోధుని స్వరూపం కాదు; అది ధర్మరక్షణ, కరుణ, పరాక్రమం మరియు ఆధ్యాత్మిక తత్త్వాల సమ్మేళనంగా భావించబడుతుంది.

“కోదండ” అనేది శ్రీరాముడు ధరించిన దివ్య ధనుస్సుకు పేరు. ఈ దివ్యాయుధం కేవలం యుద్ధ సాధనం మాత్రమే కాదు; అది ధర్మరక్షణకు, దుష్టశిక్షణకు మరియు సత్య స్థాపనకు ప్రతీకగా నిలిచింది. “కో” అంటే ఉన్నతమైనది లేదా దివ్యమైనది, “దండ” అంటే ఆయుధం లేదా శక్తి అని సంస్కృతంలో అర్థం. అందువల్ల “కోదండం” అంటే “దివ్యశక్తి కలిగిన మహా ధనుస్సు” అని భావించవచ్చు. ఈ ధనుస్సు సాధారణ విల్లు కాదు; అది శ్రీరాముని దైవ సంకల్పానికి ప్రతిరూపం. ఆయన చేతిలో అది ఎప్పుడూ వ్యక్తిగత కోపం, స్వార్థం లేదా ప్రతీకారం కోసం ప్రయోగించబడలేదు; ధర్మం కోసం మాత్రమే ఉపయోగించబడింది.

పౌరాణికంగా శ్రీరాముని జీవితంలో కోదండం అత్యంత కీలక పాత్ర పోషించింది. మిథిలానగరంలో రాజు జనకుడు తన కుమార్తె సీతాదేవి స్వయంవరానికి ఏర్పాటు చేసిన పరీక్ష అందరికీ తెలిసిందే. మహాదేవుని దివ్య ధనుస్సును ఎత్తి దానికి తాడు కట్టగలిగినవారే సీతాదేవిని వివాహం చేసుకోవాలని నిర్ణయించబడింది. ఎన్నో రాజులు, మహాయోధులు విఫలమైన ఆ సందర్భంలో శ్రీరాముడు ఎంతో వినయంతో ఆ ధనుస్సును ఎత్తి తాడు ఎక్కించే ప్రయత్నం చేయగా అది మహాశబ్దంతో విరిగిపోయింది. అది కేవలం శారీరక బలం కాదు; దైవ సంకల్పం మరియు ధర్మానికి అనుకూలంగా ఉన్న శక్తి యొక్క ప్రత్యక్ష రూపం.

విశ్వామిత్ర మహర్షితో అరణ్యానికి వెళ్లిన శ్రీరాముడు తన కోదండంతో తాటకను సంహరించాడు, మారీచుడు మరియు సుబాహువులను జయించాడు, ఖరుడు మరియు దూషణులను సంహరించాడు, చివరకు రావణాసురుని అహంకారాన్ని అంతం చేశాడు. ఈ యుద్ధాలన్నింటిలో ఒక గొప్ప విశేషం ఉంది. శ్రీరాముడు ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదు; కానీ ధర్మరక్షణ కోసం అవసరమైనప్పుడు మాత్రమే ఆయుధాన్ని ఎత్తాడు. అందువల్ల కోదండం కేవలం యుద్ధానికి ప్రతీక కాదు; అది నియంత్రణలో ఉన్న శక్తి, అహింసలోని ధైర్యం మరియు అవసరమైనప్పుడు ధర్మయుద్ధానికి సిద్ధంగా ఉండే సంకల్పానికి ప్రతీకగా భావించబడుతుంది.

కోదండ రాముని రూపంలో ఆధ్యాత్మిక మరియు యోగిక రహస్యాలు కూడా దాగి ఉన్నాయని శాస్త్రాలు వివరిస్తాయి. యోగ తత్త్వం ప్రకారం కోదండం మానవ శరీరాన్ని సూచిస్తే, విల్లు తాడు మనస్సును సూచిస్తుంది; బాణం ఏకాగ్రతకు ప్రతీకగా భావించబడుతుంది. లక్ష్యం పరమాత్మ సాక్షాత్కారం. విల్లు తాడు స్థిరంగా లేకపోతే బాణం లక్ష్యాన్ని చేరలేనట్లే, మనస్సు స్థిరంగా లేకపోతే జీవుడు తన జీవిత లక్ష్యాన్ని లేదా ఆధ్యాత్మిక పురోగతిని సాధించలేడు. అందుకే కోదండ రాముడు మనిషికి మనస్సును నియంత్రించుకోవడం, ధర్మాన్ని అనుసరించడం మరియు లక్ష్యాన్ని మరవకుండా జీవించడం నేర్పిస్తాడు.

భారతదేశంలోని అనేక పవిత్ర క్షేత్రాలలో కోదండ రాముని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. తెలంగాణలోని భద్రాచలం, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట మరియు తమిళనాడులోని రామేశ్వరం వంటి అనేక దేవాలయాల్లో శ్రీరాముడు సీతాదేవి మరియు లక్ష్మణస్వామితో కలిసి కోదండాన్ని ధరించిన దివ్యస్వరూపంలో దర్శనమిస్తారు. భక్తులు ఈ రూపాన్ని దర్శించడం ద్వారా జీవితంలో ధైర్యం, శాంతి, భక్తి మరియు ఆధ్యాత్మిక శక్తిని పొందుతారని విశ్వసిస్తారు.

శ్రీరాముని కోదండధారి రూపం మనిషికి ఒక గొప్ప జీవనసత్యాన్ని కూడా బోధిస్తుంది. శక్తి ఉండాలి కానీ అహంకారం ఉండకూడదు; ధైర్యం ఉండాలి కానీ క్రూరత్వం ఉండకూడదు; అధికారము ఉండాలి కానీ అధర్మం ఉండకూడదు; ప్రేమ ఉండాలి కానీ కర్తవ్యాన్ని మరవకూడదు. కోదండ రాముడు చేతిలోని ధనుస్సు భయపెట్టడానికి కాదు; ధర్మాన్ని కాపాడటానికి. అందుకే కోదండ రాముడు కేవలం విల్లు ధరించిన దేవతారూపం కాదు; ఆయన సత్యానికి శాశ్వత ప్రతీక, ధర్మానికి జీవరూపం, ఆదర్శ జీవనానికి మార్గదర్శి.


॥ శ్రీరామ జయం ॥

✍️ ప్రసాద్ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹

చూడయా నీ దయ ఉంటే చాలయా Prayer of Shiva (YT Short)


https://youtube.com/shorts/i9o8cc-4N3s

🌹 ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నేమయ్యా ఈశ్వరా మరుజన్మ రాకుండ చూడయా నీ దయ ఉంటే చాలయా
Prayer of Shiva 🌹


ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

గంగా దసరా - బంగారు మా తల్లి గంగమ్మ తల్లి Ganga Dussehra - Ganga Mata Prayer (YT Short)


https://youtube.com/shorts/Zrbaf1cc0jE

🌹గంగా దసరా పసుపు కుంకుమ తోటి మెరిసేటి మా తల్లి బంగారు మా తల్లి గంగమ్మ తల్లి
Ganga Mata Prayer 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹



శ్రీవారి ఆలయ మాడ వీధులకు వేదాల పేర్లు / Vedas names for Srivari temple mada streets - Tirumala Tirupati temple



Facebook:
https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2152475885538881



🌹 శ్రీవారి ఆలయ మాడ వీధులకు వేదాల పేర్లు - ప్రసిద్ధ భాగవతుల పేర్లు మిగితా వీధులకు పెట్టనున్న తిరుమల తిరుపతి దేవస్థానం - టిటిడి సమాచారం 🌹

ప్రసాద్ భరద్వాజ


గంగా దసరా - కలియగమున కల్పతరువు నీడ నీవని కనులు / Ganga Dusshera - Ganga Mata Song (YT Short)



https://youtube.com/shorts/YXHSYeTtb00


🌹 గంగా దసరా - కలియగమున కల్పతరువు నీడ నీవని కనులు తుడుచు కామధేనువు తోడు నీవని శుభము కూర్చు గంగాదేవి
Ganga Mata Song 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share


🌹🌹🌹🌹🌹

Ganga Dussehra – The Divine Descent of Goddess Ganga: Mythological Glory, Spiritual Significance



Facebook:
https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2152414915544978


🌹🌊 Ganga Dussehra – The Divine Descent of Goddess Ganga: Mythological Glory, Spiritual Significance, and Sacred Merit 🌊🌹
✍️ Prasad Bharadwaj


In Sanatana Dharma, rivers are not viewed merely as flowing streams of water; they are regarded as manifestations of divine consciousness and sacred currents of spiritual energy flowing upon the Earth. Among the many holy rivers of India, the River Ganga holds the highest place. The very name “Ganga” evokes feelings of purity, devotion, liberation, and divinity in the hearts of devotees. The waters of the Ganga are considered equivalent to divine nectar in Hindu tradition. The sacred day on which Goddess Ganga descended to Earth is celebrated as Ganga Dussehra.

Every year, Ganga Dussehra is observed on the Dashami (tenth day) of the Shukla Paksha in the month of Jyeshtha. The term “Dussehra” here signifies the destruction of ten sins. According to the Puranas, this is the day when Goddess Ganga descended upon the Earth. It is believed that taking a holy bath in the Ganga or even remembering Goddess Ganga with devotion can cleanse a person of ten kinds of sins.

The story behind the descent of Goddess Ganga is one of the most sacred and spiritually significant narratives in Hindu mythology. According to the Puranas, King Sagara of the Ikshvaku dynasty performed the Ashwamedha Yajna. Out of jealousy, Indra stole the sacrificial horse and hid it in the hermitage of Sage Kapila. While searching for the horse, King Sagara’s sixty thousand sons mistakenly suspected and insulted Sage Kapila. Due to their ignorance and arrogance, they were reduced to ashes by the fire of the sage’s divine anger.

Later, to grant liberation to the souls of his ancestors, Bhagiratha, a descendant of King Sagara, undertook severe penance. First, he pleased Lord Brahma and obtained permission to bring Goddess Ganga to Earth. However, Brahma warned that the Earth could not withstand the tremendous force of Ganga’s descent from the heavens. Therefore, Bhagiratha performed intense penance to please Lord Shiva.

Moved by the devotion and determination of Bhagiratha, Lord Shiva received Goddess Ganga into his divine matted locks and gently released her onto Earth, controlling her powerful flow. Because of this divine event, Goddess Ganga came to be known by names such as Shivajataviharini (She who dwells in Shiva’s locks), Tripathagamini (She who flows through the three worlds), and Bhagirathi. Bhagiratha then guided the sacred river to the place where his ancestors’ ashes rested, and through the touch of Ganga’s holy waters, they attained liberation.

This event is not merely a mythological tale; it carries a profound spiritual message. Bhagiratha’s long and difficult penance symbolizes determination, unwavering resolve, devotion toward one’s ancestors, and selfless service. Goddess Ganga is often regarded as a symbol of divine wisdom flowing through creation. Spiritual teachers explain that true Ganga Snanam (holy bathing in the Ganga) occurs when ignorance, ego, and sinful tendencies within the mind are washed away and replaced by the light of wisdom.

On the day of Ganga Dussehra, devotees take a holy bath in sacred rivers early in the morning. Those who do not live near the Ganga may perform a ritual bath at home while remembering Goddess Ganga and chanting.

“Gange cha Yamune chaiva Godavari Saraswati।
Narmade Sindhu Kaveri Jalesmin Sannidhim Kuru॥”

Charity performed on this day is considered highly auspicious. Scriptures mention that donating water, fruits, clothes, umbrellas, footwear, beverages, and food yields immense spiritual merit. Since Ganga Dussehra falls during the intense summer season of Jyeshtha, offering drinking water to those suffering from heat and thirst is regarded as a particularly noble act.

Ganga Dussehra is not merely a festival; it is a symbol of both physical and spiritual purification. Just as the waters of the Ganga cleanse physical impurities, this sacred occasion reminds us to purify our hearts from negative thoughts, hatred, arrogance, selfishness, and inner impurities.

In modern times, the protection and preservation of rivers have become extremely important. Ancient Indian culture worshipped rivers as divine mothers. However, due to pollution and human negligence, many rivers today are losing their sacred purity. Thus, Ganga Dussehra also serves as a reminder of our responsibility to protect nature and preserve water resources for future generations.

On this sacred day commemorating the descent of Goddess Ganga, let us remember her with devotion and pray for inner purification.

“Devi Sureshwari Bhagavati Gange Tribhuvana Tarini Tarala Tarange।
Shankara Mouli Viharini Vimale Mama Matirastam Tava Pada Kamale॥”


May the blessings of Mother Ganga bring peace, purity, prosperity, and divine grace to all beings across the world. 🙏🌊

✍️ Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹


గంగా దసరా – గంగా దేవి అవతరణ దినోత్సవం: పురాణ మహిమ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు పుణ్యకాల విశిష్టత (Ganga Dussehra – The Divine Descent of Goddess Ganga)



https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2152412782211858


🌹🌊 గంగా దసరా – గంగా దేవి అవతరణ దినోత్సవం: పురాణ మహిమ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు పుణ్యకాల విశిష్టత 🌊🌹

✍️ ప్రసాద్ భరద్వాజ


సనాతన ధర్మంలో నదులను కేవలం జల ప్రవాహాలుగా మాత్రమే చూడరు; వాటిని దైవ చైతన్య స్వరూపాలుగా, భూమిపై ప్రవహించే పవిత్ర శక్తి ప్రవాహాలుగా భావిస్తారు. భారతదేశంలోని అనేక పవిత్ర నదులలో గంగా నది అత్యున్నత స్థానం పొందింది. "గంగా" అనే పేరు వినగానే మనసులో పవిత్రత, భక్తి, మోక్షం, దివ్యత్వం వంటి భావనలు మేల్కొంటాయి. గంగా జలాన్ని హిందూ సంప్రదాయంలో అమృతంతో సమానంగా పరిగణిస్తారు. అలాంటి గంగా దేవి భూమిపై అవతరించిన మహత్తర దినాన్ని "గంగా దసరా"గా జరుపుకుంటారు.

ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాస శుక్ల పక్ష దశమి తిథినాడు గంగా దసరా పర్వదినం వస్తుంది. "దసరా" అనే పదం ఇక్కడ "పది పాపాలను నశింపజేయడం" అనే అర్థాన్ని సూచిస్తుంది. ఈ రోజున గంగా దేవి భూమిపై అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. గంగా జలంలో స్నానం చేయడం లేదా గంగాను స్మరించడం ద్వారా మనిషి చేసిన పది రకాల పాపాలు నశిస్తాయని విశ్వాసం.

గంగా దేవి అవతరణ వెనుక ఉన్న కథ అత్యంత పవిత్రమైనది మరియు ఆధ్యాత్మికమైనది. పురాణాల ప్రకారం ఇక్ష్వాకువంశ రాజైన సగర చక్రవర్తి అశ్వమేధ యాగం నిర్వహించాడు. దేవేంద్రుడు అసూయతో యాగాశ్వాన్ని దొంగిలించి మహర్షి కపిలుని ఆశ్రమంలో దాచాడు. ఆ గుర్రం కోసం వెతుకుతూ వచ్చిన సగరుని అరవై వేల మంది కుమారులు మహర్షి కపిలుని అనుమానించి అవమానించారు. వారి అజ్ఞానం, అహంకారం వల్ల కపిల మహర్షి కోపాగ్నితో వారు బూడిదగా మారిపోయారు.

తరువాత వారి ఆత్మలకు విముక్తి కలిగించేందుకు సగరుని వంశంలో జన్మించిన భగీరథుడు ఘోర తపస్సు చేశాడు. మొదట బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకొని గంగాదేవిని భూమిపైకి తీసుకురావడానికి అనుమతి పొందాడు. కానీ గంగా దేవి స్వర్గం నుంచి నేరుగా భూమిపైకి దిగితే ఆమె ఉద్ధృత ప్రవాహాన్ని భూమి భరించలేదని బ్రహ్మ సూచించాడు. అందువల్ల భగీరథుడు పరమశివుని గురించి కఠిన తపస్సు చేశాడు.

భక్తుని తపస్సుకు మెచ్చిన మహాదేవుడు గంగాదేవిని తన జటాజూటంలో ధరించి, ఆమె ప్రవాహాన్ని నియంత్రించి మెల్లగా భూమిపైకి విడుదల చేశాడు. అందువల్ల గంగా దేవి "శివజటాజూట విహారిణి", "త్రిపథగామిని", "భగీరథి" వంటి పేర్లతో ప్రసిద్ధి చెందింది. అనంతరం భగీరథుడు గంగను తన పూర్వీకుల భస్మరాశి ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లగా, గంగ జల స్పర్శతో వారికి మోక్షం కలిగింది.

ఈ సంఘటన కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు; ఇందులో గొప్ప ఆధ్యాత్మిక సందేశం కూడా దాగి ఉంది. భగీరథుడు చేసిన దీర్ఘ తపస్సు పట్టుదల, సంకల్పబలం, పితృభక్తి మరియు పరహిత భావాన్ని సూచిస్తుంది. గంగాదేవి దివ్య జ్ఞాన ప్రవాహానికి ప్రతీకగా భావించబడుతుంది. మనస్సులోని అజ్ఞానం, అహంకారం, పాప భావనలు తొలగిపోయి జ్ఞానప్రకాశం కలిగితేనే నిజమైన గంగా స్నానం జరిగినట్లని ఆధ్యాత్మిక గురువులు వివరిస్తారు.

గంగా దసరా రోజున భక్తులు ఉదయం పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. గంగా నది దగ్గర నివసించని వారు ఇంట్లోనే నీటిలో గంగానామస్మరణ చేసి స్నానం చేయడం కూడా పుణ్యప్రదంగా భావిస్తారు. "గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి। నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు॥" అనే మంత్రాన్ని జపిస్తూ స్నానం చేస్తారు.

ఈ రోజున దానం చేయడం అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా నీరు, పండ్లు, వస్త్రాలు, గొడుగులు, చెప్పులు, పానీయాలు, అన్నదానం వంటి దానాలు చేయడం వల్ల విశేష పుణ్యఫలితం లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటాయి. జ్యేష్ఠ మాసంలో తీవ్రమైన వేసవి కాలం ఉండటంతో దాహంతో బాధపడేవారికి నీరు అందించడం మహాదానంగా చెప్పబడింది.

గంగా దసరా కేవలం ఒక పండుగ మాత్రమే కాదు; అది భౌతిక మరియు ఆధ్యాత్మిక పవిత్రతకు ప్రతీక. గంగా నది ఎలా తన జలాలతో మలినాలను శుభ్రపరుస్తుందో, అలాగే మన హృదయంలోని చెడు ఆలోచనలు, ద్వేషం, అహంకారం, స్వార్థం వంటి మలినాలను కూడా తొలగించుకోవాలని ఈ పర్వదినం మనకు సందేశం ఇస్తుంది.

నేటి కాలంలో నదుల పరిరక్షణ అత్యంత అవసరమైంది. మన పురాతన సంస్కృతి నదులను దేవతలుగా ఆరాధించింది. కానీ ఆధునిక కాలంలో కాలుష్యం, నిర్లక్ష్యం కారణంగా అనేక నదులు తమ పవిత్రతను కోల్పోతున్నాయి. గంగా దసరా మనకు ఒక ఆధ్యాత్మిక సందేశంతో పాటు ప్రకృతిని, జల వనరులను సంరక్షించాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది.

గంగాదేవి భూమిపైకి అవతరించిన ఈ పవిత్ర దినాన మనమందరం ఆమెను స్మరించి, అంతరంగ పవిత్రతను కోరుకుంటూ ప్రార్థిద్దాం.


"దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరలతరంగే।

శంకరమౌళి విహారిణి విమలే

మమ మతిరాస్తాం తవ పదకమలే॥"


గంగా మాత అనుగ్రహంతో సమస్త లోకాలకు శాంతి, పవిత్రత, మంగళం కలగాలని ప్రార్థన. 🙏🌊

✍️ ప్రసాద్ భరద్వాజ

🌹🌹🌹🌹🌹


గంగా దసరా గంగా దేవి అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు అందరికి Greetings on Ganga Dussehra



Facebook:
https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2152410318878771


🌹 గంగా దసరా గంగా దేవి అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు అందరికి
Ganga Dussehra – The Divine Descent of Goddess Ganga - Greetins to All. 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

జాతీయ సోదరుల దినోత్సవ శుభాకాంక్షలు / Greetings on National Brothers Day



Facebook:
https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2151607775625692


🌹 జాతీయ సోదరుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికి
National Brothers day Greetings to All 🌹

ప్రసాద్ భరద్వాజ


అష్టాదశ పురాణములు ఎందుకు చదవాలి? Why Should We Read the Eighteen Puranas?



Facebook:


🌹 అష్టాదశ పురాణములు ఎందుకు చదవాలి? 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Why Should We Read the Eighteen Puranas? 🌹
Prasad Bharadwaj


రవి ఆదిత్య స్తోత్రము Ravi Aditya Stotram With Meaning (YT Short)



https://youtube.com/shorts/XDHxipIYFng


🌹 రవి ఆదిత్య స్తోత్రము Short 1 -
Ravi Aditya Stotram With Meaning 🌹


🍀 రవి ఆదిత్య స్తోత్రం ఆయురారోగ్యాన్ని, పాపక్షయాన్ని, జ్ఞానోదయాన్ని, భయ నివారణను ప్రసాదించేది. నవగ్రహ స్తోత్రములలో ప్రధాన భాగమైన ఈ స్తోత్రం సర్వ కోరికలను తీర్చే, సర్వసిద్ధులను ప్రసాదించే మహాశక్తివంతమైన స్తోత్రము. 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

అమ్మా భవానీ లోకాలనేలే ఓంకార రూపమా Durga Mata Vratham Day - Durgamma Song (YT Short)



https://youtube.com/shorts/OjxMgzUnSnQ


🌹 అమ్మా భవానీ లోకాలనేలే ఓంకార రూపమా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా Durga Mata Vratham Day - Durgamma Song 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


తిరుపతి గోవింద రాజ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభ శుభాకాంక్షలు Greetings on Tirupathi Govinda Raja Swamy Brahmotsvalu



https://youtube.com/shorts/rDne-DVT158


🌹 తిరుపతి గోవింద రాజ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభ శుభాకాంక్షలు
Tirupathi Govinda Raja Swamy Brahmotsvalu Greetings 🌹


ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹




Tirupati Sri Govinda Raja Swamy Brahmotsavams 2026


Facebook:
https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2150785582374578


🌹 Tirupati Sri Govinda Raja Swamy Brahmotsavams 2026 – Divine Grandeur, Historical Significance, and a Spiritual Celebration 🌹
✍️ Prasad Bharadwaj

In Sanatana Dharma, temple festivals are not merely traditional rituals; they symbolize devotion, culture, Vedic heritage, and divine consciousness. Among such sacred celebrations, the annual Sri Govinda Raja Swamy Brahmotsavams, held at the historic Sri Govinda Raja Swamy Temple situated in the heart of Tirupati, occupy a special place. Every year, these grand festivities immerse thousands of devotees in spiritual bliss, and this year the celebrations are being conducted magnificently from May 23 to May 31 for nine days. The entire city of Tirupati has already transformed into a divine spectacle with colorful floral decorations, dazzling illuminations, and a spiritually charged atmosphere.

On the evening prior to the commencement of the festivities, the sacred ritual of Ankurarpanam (Beejavapanam) was performed with Vedic chanting and auspicious traditional music. This ceremony marked the ceremonial beginning of the Brahmotsavams in a highly traditional manner. Ankurarpanam is considered a sacred ritual symbolizing the beginning of a divine event, wherein seeds are sown as an auspicious act, signifying prosperity and invoking the blessings of the celestial deities.

The Sri Govinda Raja Swamy Temple is one of the most ancient Vaishnava temples in Tirupati. Historical records indicate that the temple was consecrated around 1130 AD by Sri Ramanujacharya, the great propagator of the Sri Vaishnava tradition. According to sacred beliefs, Sri Govinda Raja Swamy is considered the elder brother of Lord Venkateswara of Tirumala. Devotees believe that during Lord Srinivasa's marriage to Goddess Lakshmi, Govinda Raja Swamy was entrusted with the responsibility of measuring and safeguarding the immense wealth borrowed from Kubera. After continuously measuring the wealth, the Lord is believed to have become tired and rested upon Adisesha, using the measuring vessel as a pillow beneath His head. Therefore, devotees traditionally consider it auspicious to have the darshan of Govinda Raja Swamy before or during their Tirumala pilgrimage.

The word Brahmotsavam itself carries profound spiritual significance. According to ancient scriptures, these are divine celebrations first performed by Lord Brahma himself to glorify the greatness of the Supreme Lord before the world. It is believed that during these festivities, even the celestial beings and divine entities descend to participate in the celebrations.

On the first day of the Brahmotsavams, May 23, the sacred Dwajarohanam ceremony will be performed in the Mithuna Lagna, during which the Garuda flag will be ceremonially hoisted atop the temple flagstaff. This ritual signifies inviting all celestial beings to witness and participate in the divine festivities. Following Dwajarohanam, Lord Govinda Raja Swamy will bless devotees with His first Vahana Seva on Pedda Sesha Vahanam during the night procession through the temple streets.

One of the most significant aspects of the Brahmotsavams is the Vahana Sevas. Every day, devotees receive the divine blessings of the Lord through different sacred vehicles from 7:00–9:00 AM and 7:00–9:00 PM. Each vehicle represents a unique spiritual message and symbolism.

On May 24, the Lord will grace devotees on Chinna Sesha Vahanam in the morning and Hamsa Vahanam in the evening. The Hamsa (swan) symbolizes wisdom and discrimination. On May 25, Simha Vahanam will take place in the morning, representing courage, strength, and divine power, while the evening procession will feature the Muthyapu Pandiri Vahanam, beautifully adorned with pearl decorations.

On May 26, devotees will witness the Lord on Kalpavriksha Vahanam in the morning and Sarvabhoopala Vahanam in the evening along with Goddess Lakshmi. The Kalpavriksha symbolizes divine compassion and the fulfillment of devotees' wishes.

One of the grandest highlights of these nine-day festivities will occur on May 27, which features the much-awaited Garuda Seva. In the morning, the Lord will appear in the enchanting Mohini Avataram on a palanquin, while the night procession of Garuda Vahanam, considered the most important attraction of the Brahmotsavams, will take place with great splendor. Thousands of devotees from various parts of the country gather to witness this sacred event. Since Garuda is the divine vehicle of Lord Vishnu, this procession holds exceptional importance. Devotees believe that witnessing Garuda Seva grants divine blessings and removes sins.

On May 28, the Lord will appear on Hanumantha Vahanam in the morning and Gaja Vahanam in the evening. On May 29, devotees will receive darshan on Suryaprabha Vahanam in the morning and Chandraprabha Vahanam in the evening. These processions symbolize light, peace, wisdom, and spiritual growth in life.

As the festivities approach their conclusion, Rathotsavam will be celebrated grandly on the morning of May 30. Thousands of devotees will pull the grand temple chariot with immense devotion while chanting the divine name of Govinda throughout the streets of Tirupati. The Ashwa Vahanam procession will take place during the night.

On the final day, May 31, 2026, the sacred Chakrasnanam ritual will be conducted in the temple Pushkarini. This ritual is considered equivalent to the sacred concluding bath performed after a grand yajna. Devotees believe that taking a holy dip during this auspicious occasion washes away sins and grants divine merit. Later in the evening, Dwajavarohanam will formally conclude the Brahmotsavams in a sacred and auspicious manner.

The Tirumala Tirupati Devasthanams (TTD) has made extensive arrangements for devotees during these festivities. Considering the summer heat, facilities such as shaded shelters, drinking water arrangements, and uninterrupted distribution of free prasadam have been organized. In addition, under the guidance of the Hindu Dharma Prachara Parishad and Annamacharya Project, devotional music concerts, Harikathas, Kolatam performances, and various spiritual cultural programs are being conducted daily.

The Sri Govinda Raja Swamy Brahmotsavams are not merely temple celebrations; they represent a magnificent confluence of devotion, culture, tradition, and divine experience. Every devotee participating in these sacred festivities believes they will receive the compassionate blessings of the Lord and attain peace, prosperity, and spiritual upliftment in life.


🌻 May the divine chant of "Govinda... Govinda..." fill the hearts of devotees with eternal peace, and may the compassionate blessings of Sri Govinda Raja Swamy shower upon all. 🌻

✍️ Prasad Bharadwaj


🌹 🌹 🌹 🌹 🌹

తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు 2026 (Tirupati Sri Govinda Raja Swamy Brahmotsavams)



Facebook:
https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2150781655708304


🌹 తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు – దివ్య వైభవం, చారిత్రక విశిష్టత మరియు ఆధ్యాత్మిక మహోత్సవం 🌹

✍️ ప్రసాద్ భరద్వాజ



సనాతన ధర్మంలో దేవాలయ ఉత్సవాలు కేవలం సంప్రదాయ ఆచారాలకే పరిమితం కావు; అవి భక్తి, సంస్కృతి, వేద సంప్రదాయం మరియు దైవ చైతన్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అలాంటి దివ్య మహోత్సవాలలో తిరుపతి నడిబొడ్డున వెలసి, శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. ప్రతి సంవత్సరం వేలాదిమంది భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తే ఈ మహోత్సవాలు ఈ ఏడాది అత్యంత వైభవంగా మే 23 నుండి మే 31 వరకు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి. తిరుపతి నగరం మొత్తం ఇప్పటికే ఆధ్యాత్మిక శోభతో, పుష్పాలంకరణలతో, విద్యుద్దీపాల కాంతులతో జగజ్జేగీయమానంగా మారింది.

ఈ మహోత్సవాలకు ముందు రోజు సాయంత్రం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించిన అంకురార్పణ (బీజావాపనం) కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణ అనేది దైవకార్యానికి ప్రారంభ సూచికగా భావించబడే పవిత్ర కర్మ. ఇందులో ధాన్యాలను నాటి శుభసూచకంగా ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఈ కార్యక్రమంతో దేవతల ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం.

శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం తిరుపతిలోని అత్యంత ప్రాచీన వైష్ణవ ఆలయాలలో ఒకటి. చారిత్రక ఆధారాల ప్రకారం క్రీ.శ. 1130లో శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రవర్తకులైన శ్రీ రామానుజాచార్యులవారు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు. పురాణాల ప్రకారం శ్రీ గోవిందరాజ స్వామిని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి అన్నగా భావిస్తారు. శ్రీనివాసుని లక్ష్మీ కళ్యాణం సందర్భంగా కుబేరుని వద్ద నుండి తీసుకున్న అపారమైన ధనరాసులను కొలిచి సంరక్షించే బాధ్యతను గోవిందరాజ స్వామి నిర్వహించారని భక్తుల విశ్వాసం. ఆ ధనాన్ని కొలిచి అలసిపోయిన స్వామివారు, తల కింద కొలిచే కుంచాన్ని దిండుగా పెట్టుకుని శేషతల్పంపై విశ్రాంతి తీసుకుంటున్న భంగిమలో దర్శనమిస్తారని చెబుతారు. అందువల్ల తిరుమల యాత్రకు వెళ్లే భక్తులు గోవిందరాజ స్వామిని దర్శించుకోవడం ఒక పవిత్ర సంప్రదాయంగా భావిస్తారు.

బ్రహ్మోత్సవం అనే పదానికి అత్యంత గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా దేవుని మహిమను లోకానికి తెలియజేయడానికి నిర్వహించిన ఉత్సవాలే బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెందాయి. అందువల్ల ఈ ఉత్సవాలకు ముక్కోటి దేవతలు కూడా హాజరవుతారని విశ్వాసం ఉంది.

బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన మే 23న ఉదయం మిథున లగ్నంలో ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగురవేసి 'ధ్వజారోహణం' కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇది దేవతలను ఉత్సవాలకు ఆహ్వానించడాన్ని సూచిస్తుంది. ధ్వజారోహణం అనంతరం రాత్రి స్వామివారు తన తొలి వాహనసేవగా పెద్దశేష వాహనం పై తిరువీధుల్లో ఊరేగి భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.

బ్రహ్మోత్సవాలలో అత్యంత విశిష్టమైన అంశం వాహన సేవలు. ప్రతి రోజు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు వివిధ దివ్య వాహనాలపై భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి వాహన సేవకు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది.

మే 24న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం సేవలు జరుగుతాయి. హంస జ్ఞానం మరియు వివేకానికి ప్రతీకగా భావించబడుతుంది. మే 25న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం సేవలు నిర్వహిస్తారు. సింహం ధైర్యం, శక్తి మరియు దైవ పరాక్రమానికి సూచికగా భావించబడుతుంది.

మే 26న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం పై లక్ష్మీ సమేతుడైన గోవిందరాజ స్వామి దర్శనమిస్తారు. కల్పవృక్షం భక్తుల కోరికలను తీర్చే దైవకరుణకు ప్రతీకగా భావించబడుతుంది.

ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలలో అత్యంత ప్రధానమైన ఘట్టం మే 27న జరిగే గరుడ సేవ. అదే రోజు ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో పల్లకిపై దర్శనమివ్వగా, రాత్రి బ్రహ్మోత్సవాలకే ప్రత్యేక ఆకర్షణ అయిన గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ సేవను దర్శించడానికి దేశం నలుమూలల నుండి వేలాదిమంది భక్తులు తరలివస్తారు. గరుడుడు శ్రీ మహావిష్ణువు వాహనం కావడంతో ఈ సేవకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. ఈ దర్శనం చేసిన వారికి దైవానుగ్రహం, పాపక్షయం కలుగుతాయని విశ్వాసం.

మే 28న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం సేవలు జరుగుతాయి. మే 29న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం నిర్వహిస్తారు. ఇవి జీవనంలో కాంతి, శాంతి, జ్ఞానం మరియు ఆధ్యాత్మిక వికాసాన్ని సూచిస్తాయి.

ఉత్సవాల చివరి దశలో మే 30న ఉదయం రథోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబడుతుంది. వేలాది మంది భక్తులు భక్తి పారవశ్యంతో పెద్ద రథాన్ని లాగుతూ గోవింద నామస్మరణతో తిరువీధులను మార్మోగిస్తారు. అదే రోజు రాత్రి అశ్వ వాహన సేవ జరుగుతుంది.

చివరి రోజైన మే 31న ఉదయం ఆలయ పుష్కరిణిలో చక్రస్నానం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఒక మహాయజ్ఞం ముగిసిన తర్వాత చేసే అవభృథ స్నానంతో సమానమైన ఈ చక్రస్నానం సమయంలో పవిత్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అనంతరం రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు మంగళప్రదంగా ముగుస్తాయి.

ఈ మహోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం, అన్నప్రసాద వితరణ నిరంతరాయంగా కొనసాగించే ఏర్పాట్లు చేపట్టింది. అదేవిధంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీతం, హరికథలు, కోలాటాలు మరియు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు కేవలం ఒక ఆలయ ఉత్సవం మాత్రమే కాదు; అది భక్తి, సంస్కృతి, సంప్రదాయం మరియు దైవానుభూతి యొక్క మహాసంగమం. ఈ దివ్యోత్సవాలలో పాల్గొనే ప్రతి భక్తుడూ స్వామివారి కృపాకటాక్షాలను పొంది జీవితంలో శాంతి, ఐశ్వర్యం మరియు ఆధ్యాత్మిక వికాసాన్ని పొందాలని విశ్వసిస్తారు.

🌻 "గోవిందా... గోవిందా..." అనే దివ్యనామ స్మరణతో భక్తుల హృదయాలు పరమశాంతిని పొంది, శ్రీ గోవిందరాజ స్వామివారి కృపాకటాక్షాలు అందరిపై కురియుగాక. 🌻

✍️ ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹


"నిద్దుర లేవమ్మా తల్లి పసుపు కుంకుమతో భక్తులు శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే" Mahalakshmi Suprabhatam (YT Short)



https://youtube.com/shorts/HYtJNq-HYRI


🌹 నిద్దుర లేవమ్మా తల్లి పసుపు కుంకుమతో భక్తులు శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
Mahalakshmi Suprabhatam 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

Gayatri Sadhana – Living Miracles



Facebook:
https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2149948415791628


🌹 Gayatri Sadhana – Living Miracles 🌹
✍️ Yugrishi Shri Ram Sharma Acharya
📚 Prasad Bharadwaj


🍀 Gayatri worship (Gayatri Upasana) possesses immeasurable spiritual glory. Through it, both householders and great saints can attain elevated states of consciousness and inner transformation. 🍀


'Om Bhur Bhuvah Swaha Tat Savitur Varenyam Bhargo Devasya Dheemahi Dhiyo Yo Nah Prachodayat.'


Swami Magananand Ji (Kunwar Virendra Singh Ji, Kota)

Shri Swami Magananand Ji Maharaj renounced worldly life at a very young age and embraced a life of renunciation and spiritual discipline. He lived for nearly 12–14 years in the regions extending from Kota to Khatoli and from Gwalior to Sheopur, where he eventually left his physical body. About seven miles from Khatoli lies a sacred place dedicated to Lord Shiva. Since the area was filled with Dhaukada trees, it came to be known as Dhaukadeshwar Mahadev. This place was completely isolated, and tigers and other wild animals commonly roamed the surrounding forests.

Swamiji often said, “This is a Siddha Peeth (a spiritually perfected place), and that is why I left Nashik and came here.” Even today, anyone over forty years of age in that region, upon hearing Swamiji’s name, becomes filled with devotion and reverence. It was widely known that he had attained spiritual perfection through Gayatri worship. Devotees and spiritually inclined people of the area continue to share many remarkable stories of his divine accomplishments.

A landlord from the Khatoli region was once involved in a land dispute that had ruined his financial condition. When the landlord approached the officer regarding his case, he was humiliated and thrown out of the office.

Filled with despair, the landlord wandered through Bharatpur until he happened to meet Swami Magananand Ji. Seeing his troubled condition, Swamiji asked him, “Are you hungry?” The man replied that he was. Swamiji then took a walnut from his sacred yogic fire (Dhuni) and gave it to him. Astonishingly, after eating that single walnut, his hunger was completely satisfied.

The landlord then shared his sorrows and difficulties with Swamiji. After listening calmly, Swamiji spoke with detachment and authority: “Tomorrow that agent himself will call you and give a judgment in your favor.” Exactly as predicted, the next day the officer personally summoned the landlord and ordered that his confiscated land be returned to him.

About a year later, Swamiji returned to the area. The grateful landlord welcomed him into his home with great devotion and served him for the rest of his life. Even today, the eternal sacred fire brought from Swamiji’s Dhuni continues to burn in their home, and they never allow it to be extinguished.

Another incident concerns my grandfather, who was a man of pure heart and deeply devoted to serving saints. He regularly remained in Swamiji’s service. One day, while he was going to visit Swamiji, my uncle—then a five-year-old child—unknowingly followed behind him. My grandfather was unaware that the child had come along.

On the way, they came across a river. My grandfather crossed it safely, but while trying to cross, my young uncle was swept away and began drowning in the middle of the river.

Even today, my uncle says, “While I was drowning, I felt as though a saintly figure held my hand and brought me safely out.” In this way, he survived. When my grandfather reached Swamiji, Swamiji immediately asked him in anger, “Why do you bring children with you?” Surprised, my grandfather replied, “I did not bring any child.”

A short while later, my uncle arrived and narrated what had happened. It became evident that Swamiji, through his subtle spiritual body, had protected the child from drowning.

There are many more such incidents associated with Swamiji, far too many to be fully described in a short article like this.

The greatness of Gayatri worship is beyond measure. Through it, both householders a nd saints can attain higher states of spiritual realization and inner awakening.


📚 Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹

గాయత్రీ సాధన ప్రత్యక్ష చమత్కారాలు (Gayatri Sadhana – Living Miracles)


Facebook:

🌹 గాయత్రీ సాధన ప్రత్యక్ష చమత్కారాలు 🌹
✍️ యుగఋషి శ్రీరామ్ శర్మ ఆచార్య
📚 ప్రసాద్‌ భరధ్వాజ


🍀 గాయత్రీ ఉపాసన మహిమ అపారం. దాని ద్వారా గృహస్థులు మరియు మహాత్ములు ఇద్దరూ ఉన్నత స్థితిని పొందగలరు. 🍀

ఓం భూర్భువః స్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ।


🌻 స్వామి మగనానంద్ జీ 🌻

(కుంవర్ వీరేంద్ర సింగ్ జీ, కోటా)

శ్రీ స్వామి మగనానంద్ జీ మహారాజ్ చిన్న వయస్సులోనే గృహత్యాగం చేసి వైరాగ్య జీవితం స్వీకరించారు. కోటా నుండి ఖతోలి, గ్వాలియర్ నుండి శ్యోపూర్ ప్రాంతంలో సుమారు 12–14 సంవత్సరాలు నివసించారు. అక్కడే ఆయన తన దేహాన్ని విడిచారు. ఖతోలి నుండి ఏడు మైళ్ల దూరంలో శంకరుని స్థలం ఉంది. అక్కడ ధౌకడే (ధౌకడా) చెట్లు విస్తారంగా ఉండటం వలన ఆ ప్రాంతం ధౌకడేశ్వర మహాదేవ్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం పూర్తిగా నిర్జనమైనది. సాధారణంగా పులులు మరియు ఇతర అడవి జంతువులు ఆ ప్రాంతంలో, దాని పరిసరాలలో సంచరిస్తూ ఉండేవి.

స్వామీజీ తరచుగా చెప్పేవారు — “ఇది ఒక సిద్ధపీఠం. అందువల్లనే నేను నాసిక్‌ను విడిచి ఇక్కడికి వచ్చాను.” ఈరోజు కూడా ఆ ప్రాంతంలో 40 సంవత్సరాల పైబడిన ఎవరితోనైనా స్వామీజీ గురించి మాట్లాడితే, ఆయన పేరు విన్న వెంటనే వారి హృదయం భక్తి భావంతో నిండిపోతుంది. ఆయన గాయత్రీ ఉపాసన ద్వారా సిద్ధస్థితిని పొందారని అందరికీ తెలిసిన విషయమే. ఆయన సిద్ధుల గురించి అక్కడి సత్సంగ ప్రియుల నోట ఎన్నో విశేష గాథలు వినవచ్చు.

ఖతోలి ప్రాంతంలోని ఒక జమీందారునికి తన స్థలానికి సంబంధించిన భూవివాదం నడుస్తోంది. ఆ కేసు కారణంగా అతని ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. ఆ కాలంలో కోటాకు చెందిన పొలిటికల్ ఏజెంట్ కార్యాలయం భరత్పూర్‌లో ఉండేది. ఆ ఏజెంట్ అతనిని అవమానపరచి కార్యాలయం నుండి బయటకు పంపించాడు.

ఆ జమీందారు భరత్పూర్‌లో నిరాశతో తిరుగుతుండగా స్వామి మగనానంద్ జీ దర్శనం లభించింది. అతను బాధతో ఉండటం చూసి స్వామీజీ అడిగారు — “నీవు ఆకలిగా ఉన్నావా?” అతను అవునని చెప్పగా, స్వామీజీ తన ధూని (యోగాగ్ని) నుండి ఒక అక్రోటు (వాల్‌నట్) తీసి ఇచ్చారు. ఆశ్చర్యకరంగా ఆ ఒక్క అక్రోటుతోనే అతని ఆకలి పూర్తిగా తీరిపోయింది.

ఆ తర్వాత తన బాధల కథను స్వామీజీకి చెప్పాడు. అది విన్న స్వామీజీ గంభీరంగా, నిర్లిప్తంగా ఇలా అన్నారు — “రేపు ఆ ఏజెంట్ నిన్ను స్వయంగా పిలిచి నీకు అనుకూలంగా తీర్పు ఇస్తాడు.” అదే విధంగా జరిగింది. మరుసటి రోజు ఆ ఏజెంట్ ఆ జమీందారుని స్వయంగా పిలిపించి, అతని స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగి ఇవ్వమని ఆదేశించాడు.

సుమారు ఒక సంవత్సరం తరువాత స్వామీజీ మళ్లీ ఆ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు ఆ జమీందారు ఎంతో భక్తితో ఆయనను తన ఇంటిలో ఉంచుకొని జీవితాంతం సేవ చేశాడు. నేటికీ వారి ఇంట్లో స్వామీజీ ధూని నుండి తీసుకొచ్చిన అఖండాగ్ని నిరంతరం వెలుగుతూ ఉంది. దానిని ఎప్పుడూ ఆరిపోనివ్వరు.

మరొక సంఘటన — నా నానాజీ ఎంతో నిర్మల హృదయం కలవారు, సాధుసేవలో నిమగ్నులై ఉండేవారు. ఆయన తరచుగా స్వామీజీ సేవలో ఉండేవారు. ఒక రోజు నానాజీ స్వామీజీ వద్దకు వెళ్తుండగా, తెలియకుండా నా మామయ్య (అప్పుడు ఐదేళ్ల బాలుడు) ఆయన వెనుక వచ్చాడు. నానాజీకి అది తెలియలేదు. మధ్యలో ఒక నది వచ్చింది. నానాజీ నదిని దాటారు. కానీ మామయ్య దాటే ప్రయత్నంలో మధ్యలో మునిగిపోయాడు.

మామయ్య ఇప్పటికీ చెబుతుంటారు — “నేను మునిగిపోయినప్పుడు, ఒక మహాత్ముడు నా చేయి పట్టుకుని నన్ను బయటకు తీసుకువస్తున్నట్లు అనిపించింది.” ఆ విధంగా ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. నానాజీ స్వామీజీ వద్దకు చేరుకున్నప్పుడు, స్వామీజీ కోపంగా అడిగారు — "పిల్లలను వెంట ఎందుకు తీసుకొస్తావు?" నానాజీ ఆశ్చర్యపడి — “నేను తీసుకురాలేదు” అన్నారు.

కొద్దిసేపటికి మామయ్య అక్కడికి వచ్చి, తాను మునిగిన సంఘటన వివరించారు. వాస్తవానికి స్వామీజీ సూక్ష్మశరీరమే ఆయనను మునిగిపోకుండా రక్షించింది. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. వాటిని ఈ చిన్న వ్యాసంలో వివరించడం సాధ్యం కాదు.

గాయత్రీ ఉపాసన మహిమ అపారం. దాని ద్వారా గృహస్థులు మరియు మహాత్ములు ఇద్దరూ ఉన్నత స్థితిని పొందగలరు.

📚 ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹

విష్ణు మనోహరి చంద్ర సహోదరి / Vishnu Manohari Chandra Sahodari (YT Short)


https://youtube.com/shorts/7elbnYncv1s


🌹 విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీమహాలక్ష్మి హరితేదేవి క్షీరాబ్ది కన్య
Vishnu Manohari Chandra Sahodari 🌹

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe And Share

🌹 🌹 🌹 🌹 🌹


ఓం నమో భగవతే వాసుదేవాయ / Om Nmao Bhagavathe Vasudevaya (YT Short)



https://youtube.com/shorts/BErIdF6u6BQ


🌹 ఓం నమో భగవతే వాసుదేవాయ శాంతాకారం భుజగశయనం సురేశం పద్మనాభం
Om Nmao Bhagavathe Vasudevaya 🌹

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹