31-August-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 475 / Bhagavad-Gita - 475🌹
2) 🌹 Sripada Srivallabha Charithamrutham - 263🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 143🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 165🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 79 / Sri Lalita Sahasranamavali - Meaning - 79🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 82 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 52🌹
8) 🌹. శివగీత - 48 / The Shiva-Gita - 48🌹
9) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 30🌹
10) 🌹. సౌందర్య లహరి - 90 / Soundarya Lahari - 90🌹

11) 🌹. శ్రీమద్భగవద్గీత - 390 / Bhagavad-Gita - 390🌹

12) 🌹. శివ మహా పురాణము - 211🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 87 🌹
14) 🌹.శ్రీ మదగ్ని మహాపురాణము - 82 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 98 🌹
16) 🌹 Twelve Stanzas From The Book Of Dzyan - 29🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 47 🌹
18) 🌹. అద్భుత సృష్టి - 19 🌹
19) 🌹 Seeds Of Consciousness - 162🌹 
20) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 41🌹
21) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 18 📚
22)


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 475 / Bhagavad-Gita - 475 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 20 🌴*

20. ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి |
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసమ్భవాన్ ||

🌷. తాత్పర్యం : 
జీవులు మరియు భౌతికప్రకృతి రెండును అనాది యని తెలిసికొనవలెను. వాని యందలి పరివర్తనములు మరియు భౌతికగుణము లనునవి భౌతికప్రకృతి నుండి ఉద్భవించినవి.

🌷. భాష్యము :
ఈ అధ్యాయమునందు తెలుపబడిన జ్ఞానము ద్వారా మనుజుడు కర్మక్షేత్రము (దేహము) మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞులను (జీవాత్మ, పరమాత్మ) గూర్చి తెలిసికొనవచ్చును.

 కర్మక్షేత్రమైన దేహము భౌతికప్రకృతినియమమై నట్టిది. దాని యందు బద్ధుడై దేహకర్మల ననుభవించు ఆత్మయే పురుషుడు(జీవుడు). అతడే జ్ఞాత. అతనితోపాటు గల వేరొక జ్ఞాతయే పరమాత్ముడు. 

కాని ఈ ఆత్మా, పరమాత్మ రూపములు దేవదేవుడైన శ్రీకృష్ణుని భిన్న వ్యక్తీకరణములే యని మనము అవగాహనము చేసికొనవలెను. ఆత్మా ఆ భగవానుని శక్తికి సంబంధించినది కాగా, పరమాత్మ రూపము అతని స్వీయ విస్తృతరూపమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 475 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 20 🌴*

20. prakṛtiṁ puruṣaṁ caiva
viddhy anādī ubhāv api
vikārāṁś ca guṇāṁś caiva
viddhi prakṛti-sambhavān

🌷 Translation : 
Material nature and the living entities should be understood to be beginningless. Their transformations and the modes of matter are products of material nature.

🌹 Purport :
By the knowledge given in this chapter, one can understand the body (the field of activities) and the knowers of the body (both the individual soul and the Supersoul). 

The body is the field of activity and is composed of material nature. The individual soul that is embodied and enjoying the activities of the body is the puruṣa, or the living entity. He is one knower, and the other is the Supersoul. 

Of course, it is to be understood that both the Supersoul and the individual entity are different manifestations of the Supreme Personality of Godhead. The living entity is in the category of His energy, and the Supersoul is in the category of His personal expansion.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 263 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 31
*🌴 Dasa Maha Vidyas of Devi - 2 🌴*

*🌻 The sixth form is Tripura Bhairavi : 🌻*

The power which can pacify the situations arising out of kaala’s presence, is called Tripura Bhairavi. This Tripura Bhairavi is said to be the power not different from Nrusimha Bhagawan.  

In this creation, transformation always keeps happening. The root causes of this are attraction and repulsion. They keep happening every moment. This Tripura Bhairavi’s name in the night is ‘Kaala rathri’. Bhairava’s name is Kaala Bhairava.  

My coming avathar ‘Nrusimha Saraswathi’ will be the combined form of these two. For Maha Yogis that is the combined Tripura Bhairavi – Kala Bhairava avathar. 

*🌻 The seventh form is Dhoomavathi : 🌻*

This Dhoomavathi is indeed ‘Ugra Thara’. By surrendering to Her, one’s calamities will get destroyed and one gets wealth.  

In Vedas, she is described as the one who removes famine distress. But she is the one responsible for all the pitiable states of hunger, poverty and quarrels of jeevas. With Her grace, all troubles will be driven away. 

*🌻 The eight form is Bhagala Mukhi : 🌻*

This Mother is worshipped for removing the misfortunes causing grief in the country and community and also the worldly and unworldly calamities, and to subdue enemies. Firstly Brahmadeva did ‘upasana’ of Bhagala Maha Vidya.  

Vishnu Bhagawan and Parasuram also are worshippers of Bhagala Mukhi. For a long time the Venkateswara idol in Tirumala was worshipped as Bhagala Mukhi. 

*🌻 The nineth form is Mathangi : 🌻*

Mathangi has got the power to make the life of a householder happy and to give the four ‘purushardhas’ (dharma, ardha, kama and moksha). She is also called the daughter of ‘Mathanga’ Mahamuni. 

*🌻 The tenth form is Kamalalaya : 🌻*

She is the representative of ‘plenty’. As She is worshipped by Bhargavas, She has got the name Bhargavi. By Her grace, one gets the landlordship and high fame. She represents material wealth. She is also called Padmavathi Devi.  

She is the cohort of Sri Venkateswara Maha Prabhu in Tirumala. ‘My Dear! I will teach you the nature of ‘Dasa Maha Vidyas’ deciding how much to be taught and through whom.  

For people who worship Anagha Devi, the combined form of Dasa Maha Vidyas and Anagha, Her Prabhu, their children ‘Astha Siddhis’ with grant them their grace.  

If you do ‘Anagha Asthami’ on the eight day (Asthami) in the second half of every month, all your desires will be fulfilled.  

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 142 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు  
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 *🌻. ఆరోగ్యము 🌻*

మనస్సు నందు ఏర్పడే సంకల్పాలు, వికల్పాలు ప్రాణశక్తిని సంచాలనం చేస్తే ఆ‌ ప్రాణశక్తి యొక్క వైఖరిని అనుసరించి మన శరీరంలోని భాగాలు నిర్మాణమై పని చేస్తాయి. 

కనుక మన ఆరోగ్యము అను స్థితి మన మనస్సు, ప్రాణశక్తి, భౌతిక శరీరమునకు మధ్యనున్న సమన్వయముపై ఆధారపడి ఉంటుంది. అందువలన మానసిక ఆరోగ్యము చాలా ముఖ్యము. 

ఆరోగ్యమనే స్థితే అసలు మనకి సహజ స్థితి. దానిని చెదరకుండా చూచుకొనుటయే మనము ప్రధానముగా అవలంబించవలసినది అని ఆయుర్వేద శాస్ర్తము తెలియజేస్తుంది. ప్రకృతి ధర్మాలను అనుసరించే ఏ శాస్ర్తమైనా దీనినే ప్రతిపాదించింది. నిత్యజీవితంలో ఏ విధానాన్ని అవలంబిస్తే ఈ ఆరోగ్యస్థితి చెదరకుండా ఉంటుందో ఆ విధానాన్ని 'స్వస్థవృత్తము' అను పేరుతో ఆయుర్వేద శాస్ర్తము మనకు అందించింది. 

కాని ప్రస్తుతము మానవజాతి ఈ విధానాన్ని అంగీకరించలేని హీన స్థితిలో ఉన్నదని చెప్పాలి. ఎందుకంటే అనారోగ్యంతో పోరాటం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడింది. ఇప్పటి వైద్యరంగంలో దీని వలన పరష్కారం లేదనేది సుష్పష్టము...
....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 163 🌹*
*🌴 The Buddhic Plane - 5 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 Colors 🌻*

Orange is the color of light in the material, the spirit in matter. Golden-yellow is the color of the light of the pure Buddhic plane, the most subtle material, also called Devachan. Blue is the color of the spiritual plane, beyond matter. 

When we elevate ourselves to the Buddhic plane, we can perceive colors clearly and even hear their sounds. One symbol for contemplation is a blue center surrounded by golden-yellow which is framed by orange. 

If we see ourselves as spirit at the center of a circle, then the first circle around the center is the light, the soul itself; its enlightenment is called Buddhi. We don’t have to do anything to purify this light. Then there is the personality. 

Depending on how advanced we are, it is controlled by either higher or lower thinking. The mind needs to be cleared of impurities to a point where thinking becomes transparent. 

The light of the soul can shine through the body when thoughts are no longer drenched with personal motives and desires.

🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K.P. Kumar: Mithila / seminar notes – Master E. Krishnamacharya: Occult Anatomy / Full Moon Meditations.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 79 / Sri Lalita Sahasranamavali - Meaning - 79 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 151

 సత్యఙ్ఞానానందరూపా సామరస్యాపరాయణా 
కపర్ధినీ కళామాలా కామధుక్ కామరూపిణీ 

791. సత్యఙ్ఞానానందరూపా :
 సచ్చిదానందరూపిణీ 

792. సామరస్యాపరాయణా : 
జీవుల యెడల సమరస భావముతో ఉండునది 

793. కపర్ధినీ : 
జటాజూటము కలిగినది (జటాజూటధారీఇన శివునకు కపర్ధి అను పేరు కలదు) 

794. కళామాలా : 
కళల యొక్క సమూహము 

795. కామధుక్ : 
కోరికలను ఇచ్చు కామధేనువు వంటిది
 
796. కామరూపిణీ : కోరిన రూపము ధరించునది  

🌻. శ్లోకం 152

కళానిధి: కావ్యకళా రసఙ్ఞా రసశేవధి: 
పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా 

797. కళానిధి: : 
కళలకు నిధి వంటిది 

798. కావ్యకళా : 
కవితారూపిణి 

799. రసఙ్ఞా : 
సృష్టి యందలి సారము తెలిసినది 

800. రసశేవధి: : 
రసమునకు పరాకాష్ట 

801. పుష్టా : 
పుష్ఠి కలిగించునది 

802. పురాతనా ; 
అనాదిగా ఉన్నది 

803. పూజ్యా ; 
పూజింపదగినది 

804. పుష్కరా : 
పుష్కరరూపిణి 

805. పుష్కరేక్షణా ; 
విశాలమైన కన్నులు కలది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 79 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 79 🌻*

791 ) Satya gnananda roopa -   
She who is personification of truth, knowledge and happiness

792 ) Samarasya parayana -   
She who stands in peace

793 ) Kapardhini -   
She who is the wife of Kapardhi (Siva with hair)

794 ) Kalamala -  
 She who wears arts as garlands

795 ) Kamadhukh -   
She who fulfills desires

796 ) Kama roopini -   
She who can take any form

797 ) Kala nidhi -   
She who is the treasure of arts

798 ) Kavya kala -  
 She who is the art of writing

799 ) Rasagna -   
She who appreciates  arts

800 ) Rasa sevadhi -  
 She who is the treasure of arts

801 ) Pushta -   
She who is healthy

802 ) Purathana -   
She who is ancient

803 ) Poojya -   
She who is fit to be worshipped

804 ) Pushkara -   
She who gives exuberance

805 ) Pushkarekshana -   
She who has lotus like eyes

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 82 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
 తృతీయాధ్యాయము - సూత్రము - 50

*🌻 50. స తరతి స తరతి స లోకాంస్తారయతి ॥ - 1 🌻*

అటువంటి పరాభక్తుడు తాను గమ్యం చేరడమే గాక, లోకంలో చాలామంది తరించడానికి ఉపకరణమవుతాడు. ఇట్టివాడు భాగవతోత్తముదై, భగవంతుని చేతిలో పరికరమవుతాడు. 

యోగ్యతగల భక్తులకు ఇతని ద్వారా భగవంతుడు అనుగ్రహాన్ని ప్రనాదిస్తాడు. ఈ రకమైన పరాభక్తులు భగవంతునికి, భక్తునికి మధ్య అనుసంధాన కర్తలుగా ఉంటారు. వీరు భగవంతునితో సమానులు.

బ్రహ్మ భూతః ప్రసన్నాత్మా నశోచతి న కాంక్షతి
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్‌ ॥
- (18:54) భగవద్దిత

తా॥ సచ్చిదానందఘన పరబ్రహ్మయందు ఏకీభావ స్థితుడై, ప్రసన్న మనస్మ్కుడైన యోగి దేనికీ శోకించడు. దేనినీ కాంక్షించడు. సమస్త ప్రాణులందు సమభావం ఉన్న యోగి పరాభక్తిని పొందుతాడు. పరే భాగవతోత్తములు.

భక్తుడు యోగ్యుడైతేనె భగవదనుగ్రహం పొందుతాడు. గనుక సాధకుడు సాధించె సాధనా స్థితిగతులను భగవద్గిత తెలియచెస్తున్నది. ఒక్కొక్క స్థితిని ఈ క్రింది విధంగా అధిగమించి, యోగ్యత సంపాదించాలి. చివరకు స్థిరమైన, శాశ్వతమైన పరమప్రేమ స్థితిని పొందుతాడు భక్తుడు.

1) _ ఆత్మ వశ్యైర్విధయాత్మా ప్రసాద మధిగచ్చతి ॥ - (2:64) భగవద్గిత

ఆత్మకు వశమైన బుద్ధితో జీవించడం వల్ల “ప్రసాదం” అనగా ఇచ్చెవాడు, పుచ్చుకునేవాడు అనె విభజన ఉన్న జీవేశ్వర భిన్నత్వం అనె స్థితిని అధిగమిసాడు. ఎ రకంగానూ దుఃఖాన్ని దగ్గరకు చేరకుండా ఉంచే మోదాన్ని ప్రసాదమంటారు. క్రసాద స్థితిలో ఈశ్వరునకు మనసు, బుద్ధి, చిత్తం లొంగి ఉంటాయి. 

ఆ బుద్ధి భెద భావాన్ని పాటించదు. మనసు విషయాసక్తం కాదు. ఈ శుద్ధ బుద్ధి ఆత్మ స్థితిని గ్రహించి, దానికి వశమై వర్తిస్తూ జీవేశ్వర భిన్నత్వాన్ని వోగొట్టుకొంటుంది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 51 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj

*🌻 Even though Sri Rama and Sri Krishna were incarnations of the Divine, they approached a Guru. They taught the world the importance of having a Guru in one’s life. 🌻* 

Sage Sandeepani was the Guru to Sri Krishna and his friend Sudhama. Since Sri Krishna and Sudhama were great souls, they knew the importance of a Guru. 

 They served the Guru like he was Lord Shiva. Let’s see how Sri Krishna and Sudhama served Sage Sandeepani and how he blessed them. 

Sloka: Yo gurussa sivah prokto ya ssiva ssa guru ssmrtaha Vikalpam yastu kurvita sa bhavet pataki gurau 

Sri Krishna and Sudhama came under Sage Sandeepani’s tutelage at a very tender age. As children, they played together a lot. We will observe from this story that even though they quarreled and fought a lot, they never separated. 

However, if the Guru gave them any tasks, they would always carry out those tasks with great love and devotion. They never postponed the task given by the Guru. Any task given by the Guru was immediately attended to and completed. 

They would always make Sage Sandeepani happy. They would also take on all the tasks given by the wife of Sage Sandeepani. Once, she called for Sri Krishna and Sudhama. They immediately went up to her and asked if they were called.  

She said “Yes, my dear sons, we are out of sacrificial wood. Please bring some from the forest”. The forest she was referring to was not an ordinary forest. It was a dense forest that was covered in darkness even during day time.  

It would be impossible to see anything. It was filled with poisonous trees and predatory animals. Sri Krishna and Sudhama were tender little children. They were excited to go to the forest. They were not afraid. They happily agreed to carry out her command. 

Saying,”Mother, don’t worry. We will bring lots of sacrificial wood”, they set out for the forest. It was completely dark in that dense forest. Sri Krishna and Sudhama gathered up the wood they could find in the darkness. 

They couldn’t just pick up the wood, they had to search and gather. Soon, there were gusts and pouring rain. As sunset approached, the little traces of sunlight disappeared. 

Sri Krishna and Sudhama got scared. The held hands and walked in the rain. Soon, the forest was flooded. Without letting go of each other, they began swimming. 

 It was no more a forest to walk in; it was a forest to swim in. They couldn’t tell where the ups and downs in the forest were. They had no idea where they were going. 

Slowly, they found a tree that they took shelter under. They spent the night under the tree shivering in the cold. It was so dark and cold that it felt like the night of doomsday. 

They were very scared. Somehow, the night passed. In the morning, Sage Sandeepani set out in search of the little children, calling out their names. 

He found them both under the tree shivering from cold. He trembled with compassion. Let’s see what happens ahead.   

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 48 / The Siva-Gita - 48 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ఏడవ అధ్యాయము
*🌻. విశ్వరూప సందర్శన యోగము - 2 🌻*

శ్రీభగవానువాచ:-
మయి పర్వం యథా రామ! - జగచ్చైత చ్చరా చరమ్,
వర్తతే తద్దర్శయామి - నద్రుష్టం క్షమతే భవాన్ 10
దివ్యం చక్షు: ప్రదాస్యామి - తుభ్యం దాశరథాత్మజః !
తేన పశ్య భయం త్యక్త్వా - మత్తేజో మడలం ధ్రువమ్ 11
న చర్మ చక్షుషా ద్రష్టుం - శక్యతే మామకం మహః,
నరేణ వా సురేణాపి - తన్మ మాను గ్రహం వినా 12

ఓ రామా! ఈ చరాచరాత్మక మైన ప్రపంచ మంతయు నా యుదరంబున లీనంబైయున్నది. దానిని నీవు చూచుటకై నీకు శక్తి చాలదు. ఈ చర్మ చక్షువులతో మానవుడైనను దేవుడైనను నా కరుణాకటాక్షము లేక నా తేజో మండలమును కనుగొనలేడు. కావున, ఓయీ! దాశరథీ ! నీకు దివ్యదృష్టిని ఇచ్చుచున్నాను. నిర్భయుండవై నా తేజస్సును చక్కగా చూడుము.    

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 48 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 07 :
*🌻 Vishwaroopa Sandarshana Yoga - 2 🌻*

Sri Bhagavan said: 

O Rama! This entire mobile and immobile creation dwells inside my belly. You do not have enough strength and capability to witness that scene. With these eyes of flesh neither human nor god can ever be able to see my brilliant cosmic form without my grace. 

Therefore, O son of Dashratha! I'm giving you divine eyes (divya drishti) do not fear and properly see my divine cosmic form.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 39 / Sri Gajanan Maharaj Life History - 39 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 8వ అధ్యాయము - 4 🌻*

శ్రీమహారాజు దగ్గర నుండి వీళ్ళు కొంత ధనం పొందే ఆశతో వచ్చారు. వీళ్ళు వచ్చినప్పటికి శ్రీమహారాజు నిద్రపోతున్నారు. శ్రీమహారాజును లేపేందుకు ఈ బ్రాహ్మణులు, గట్టిగా వేదపఠనం చెయ్యడం మొదలు పెడతారు. వారి ఆపఠనంలో ఒకచోట కొద్దిగా తప్పు అవుతుంది, కాని దానిని వాళ్ళు సరిదిద్దలేదు. 

అందుకని శ్రీమహారాజు లేచి, మీరు వైదికులు ఎందుకు అయ్యారు ? వేదంయొక్క ప్రాముఖ్యతను మీరు అనవసరంగా దిగజార్చు తున్నారు. ఈవిద్య వ్యాపారం చేసేందుకు కాదు, మనుష్యులను ఉద్ధరించడానికి. మిమ్మల్ని వైదికులుగా సూచించే మీతలకున్న అలంకరణ కయినా కనీసం కొంత గౌరవం ఇవ్వండి. 

ఇప్పుడు నేను చదువుతాను మీరు మరల దానిని నేను ఎలాచదివేనో అలా అనండి. అమాయకులను మోసగించకండి, అని వాళ్ళతో అన్నారు. అలా అంటూ, ఈ బ్రాహ్మణులు తప్పుగా చదివిన వేద అధ్యాయాన్ని శ్రీమహారాజు పఠించారు. ఈయన ఉఛ్ఛారణ స్వఛ్ఛంగా, గట్టిగా ఉంది. మరియు ఈయన పఠనంలో ఒక్కతప్పు కూడాలేదు. 

వశిష్ఠుడు స్వయంగా ఈపవిత్ర వేదపఠనం చేస్తున్నట్టు అనిపించింది. బ్రాహ్మణులు దిగ్ర్భాంతిచెంది తలలు ఎత్తడానికి కూడా సిగ్గుపడ్డారు. సూర్యుని ముందు క్రొవొత్తిలా అనిపించింది. శ్రీమహారాజును, బ్రాహ్మణులు ముందు ఒక పిచ్చివానిగా భావించారు, ఇప్పుడు తెలిసింది. ఆయన ఒక గొప్ప పండితుడని. 

శ్రీమహారాజు భగవంతుని అవతారమని, బ్రాహ్మణ కులస్తుడని, అన్నిటికి అతీతుడయిన ఒక గొప్ప యోగి అని, తమయొక్క పూర్వజన్మ కృతులవల్ల ఇటువంటి భగవంతుడి లాటి యోగి దర్శన భాగ్యంకలిగిందని వారికి అనిపించింది.

 ఖాండుపాటిల్ను వీళ్ళకు ఒక్కొక్క రూపాయి ఇవ్వవలసిందిగా శ్రీమహారాజు కోరారు. బ్రాహ్మణులు దానిని స్వీకరించి సంతోషంగా వెళ్ళిపోయారు. శ్రీమహారాజు నిజమయిన యోగుల వలె, షేగాం వాసులతో ఎక్కువ సంబంధం ఇష్టపడేవారు కాదు.

షేగాంకు ఉత్తరంగా ఒకతోట ఉంది. అక్కడ పుష్కళంగా కాయగూరలు పండించబడుతూ ఉండేవి. ఆతోటలో ఒక వేపచెట్టు యొక్క చల్లని నీడలో ఒక శివమందిరం ఉండేది. కృష్ణాజిపాటిల్ దాని యజమాని. శ్రీమహారాజు అక్కడకు వెళ్ళి ఆ శివమందిరం దగ్గర ఒక చెట్టుచుట్టూ ఉన్న బండమీద కూర్చుని - నేను కొద్దిరోజులు శివుని దగ్గర ఉండేందుకు నీఈతోటకి వచ్చాను. 

దేవాది దేవుడయిన శివభగవానుడు ఈతోటలో ఉండడానికి ఇష్టపడ్డారు కనుక నేను కూడా ఆయన దగ్గర ఉండేందుకు కోరుకున్నాను. కనుక నాకొక చిన్నపందిరి నిలబెట్టమని కృష్ణాజితో అన్నారు. వెంటనే కృష్ణాజి ఒక చక్కని పందిరి నిలబెట్టించాడు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 39 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 8 - part 4 🌻*

They came to Shri Gajanan Maharaj with the hope of getting some money from Him. When they came, Shri Gajanan Maharaj was sleeping. The Brahmins started reciting Vedic hymns loudly to awaken Shri Gajanan Maharaj .

There was some mistake in their recitation, but they did not correct it, so Shri Gajanan Maharaj got up and said to them, Why have you become Vedic? You are lowering the greatness of Vedas unnecessarily. 

This knowledge is not for the purpose of running a business but for the salvation 0f human beings. At least show some respect to the saffron head dress, which indicates that you are a Vedic. I will now recite the hymns and you repeat the same as I pronounce. Do not misguide innocent poor believers. 

Saying so Shri Gajanan Maharaj recited the same chapter of Vedas that was recited incorrectly by these Brahmins; his pronunciation was clear, loud and his recitation, errorless. It appeared as if Vashistha himself was reciting the holy Vedas. 

The Brahmins were astonished and felt embarrassed to even lift their faces. The analogy can be compared to a lit candle fantasizing that it has better capacity to spread light around itself than the mighty sun. 

The Brahmins first thought that Shri Gajanan Maharaj was a mad person, but now found Him to be a learned saint. They were convinced that all the four Vedas were on the tip of His tongue. 

They took Shri Gajanan Maharaj a to be a God incarnate and a Brahmin by caste - a yogi free of any bondage or attachment, and because of their good deeds of previous life, they believed they were fortunate enough to get the Darshan of such a Godly saint.

Shri Gajanan Maharaj a asked Khandu Patil to give them a rupee each as dakshina. The Brahmins accepted this dakshina and happily went away. Shri Gajanan Maharaj , like a true saint, disliked the attachment of Shegaon’s locals. In the northern region of Shegaon there was a garden where vegetables were grown in abundance. 

Under the cool dark shade of a neem tree, there was a temple of Lord Shiva in the Garden. Krishnaji Patil owned the temple. Shri Gajanan Maharaj went there and sat on a platform under a tree near the Shiva temple and said to Krishnaji, I have come to your garden to stay here for a few days near Lord Shiva.

 Lord Shiva is the God of all Gods and since He liked to stay in your garden, I too wish to be near Him. So erect a small shade for me here. Krishnaji thereupon got erected a tin shade on the platform.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 30 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని శరీరి : నాల్గవ పాత్ర (రూపధారణము) - 2 🌻*

114. ఒకేసారి సంస్కారములు లేని ఆత్మకు, ప్రథమముగా సంస్కారమును, చైతన్యమే లేని ఆత్మకు ప్రథమముగా చైతన్యమును కలిగినవి. ఇట్లు కలిగిన ప్రథమ సంస్కారము పరమాణు ప్రమాణమైన స్థూల సంస్కారము.

115. అనంత శాశ్వత (A) పరమాత్మ పొందిన చైతన్యము అత్యంత పరిమితమైన స్థూల సంస్కారము మూలముగా పొందిన అత్యంత పరిమిత స్థూల చైతన్యమేగాని అది ... ... తన అనంత స్థితియొక్క చైతన్యమునుగాదు, లేక (B) స్థితిలోని అనంతపరమాత్మయైన తన స్వీయ చైతన్యమును గాదు.

116. అవిభాజ్యమైన ఆత్మయొక్క తొలి చైతన్యము, తొలి రూపము ద్వారా తొలి సంస్కార అనుభవమును పొందుచూ, ఆత్మలో ఒక మనోప్రవృత్తిని సృష్టించుచున్నది. అదియేమనగా - పరమాణు ప్రమాణములో పరిమితము, స్థూలము అయిన తొలిరూపముతోడనే తన శాశ్వత అనంత పరమాత్మతో సాహచర్యము చేసి, తాదాత్మ్యము చెందునట్టి ప్రవృత్తిని సృష్టించుచున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 90 / Soundarya Lahari - 90 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

90 వ శ్లోకము

*🌴. దుష్ట మంత్ర ప్రభావం, దరిద్రము తొలగుటకు, 🌴*

శ్లో: 90. దదానే దీనేభ్యః శ్రియమ నిశమాశాను సదృశీమమన్దం సౌందర్య ప్రకరమకరన్దం వికిరతి తవాస్మిన్ మన్దార స్తబకసుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః కరణచరణై ష్షట్చరణతామ్ ll
 
🌷. తాత్పర్యం : 
అమ్మా! భగవతీ! దీనులకు వారి వారి కోర్కెలకు అనుగుణముగా సంపదలు ఇచ్చు అధికమయిన లావణ్యము అను పూదేనెను వెదజల్లుచున్నదియూ, కల్ప కుసుమ పుష్ప గుచ్చము వలే సొగసైనదియు అగు నీ పాద కమలమునందు మనస్సుతో కూడిన జ్ఞానేంద్రియ పంచకము అను ఆరు పాదములు కలవాడనయి తుమ్మెద వలె మునుగుదును గాక !

🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 30 రోజులు జపం చేస్తూ, తేనె, పాయసం నివేదించినచో దుష్ట మంత్ర ప్రభావాలు, దరిద్రము తొలగుతాయి అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹Soundarya Lahari - 90 🌹*
📚. Prasad Bharadwaj 

SLOKA - 90

*🌴 Cutting of Bad Spells cast, dispel poverty 🌴*

90. Dhadhane dinebhyah sriyam anisam asaanusadhrusim Amandham saundharya-prakara-makarandham vikirathi; Tav'asmin mandhara-sthabhaka-subhage yatu charane Nimajjan majjivah karana-charanah sat-charanathaam.
 
🌻 Translation : 
My soul with six organs,is similar to the six legged honey bees,which dip at your holy feet,which are as pretty, as the flower bunch, of the celestial tree,which always grant wealth to the poor, whenever they wish, and which without break showers floral honey.

Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :  
If one chants this verse 1000 times a day for 30 days, offering payasam and honey as prasadam, one can overcome the effect of bad spells and to dispel poverty
 
🌻 BENEFICIAL RESULTS: 
Removal of charms and enchantments by enemies, dispel poverty. 
 
🌻 Literal Results: 
Patronage of high society, gains influence, control of senses. 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 390 / Bhagavad-Gita - 390 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 39 🌴

39. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున | 
న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్ || 

🌷. తాత్పర్యం : 
ఇంకను ఓ అర్జునా! సర్వజీవులకు జన్మకారక బీజమును నేనే. స్థావరజంగములలో నేను లేకుండ ఏదియును స్థితిని కలిగియుండలేదు. 

🌷. భాష్యము : 
ప్రతిదానికి ఒక కారణముండును. అట్టి కారణము లేదా బీజము శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు శక్తి లేకుండా ఏదియును స్థితిని కలిగియుండలేదు కనుక అతడు సర్వశక్తిమంతుడని పిలువబడినాడు. అతని శక్తి లేకుండా స్థావరము గాని, జంగమము గాని ఏదియును మనుగడను కలిగియుండలేదు. కనుకనే కృష్ణుని శక్తిపై ఆధారపడనిదిగా గోచరించునది మాయగా (లేనటువంటిది) పిలువబడును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 390 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 39 🌴

39. yac cāpi sarva-bhūtānāṁ
bījaṁ tad aham arjuna
na tad asti vinā yat syān
mayā bhūtaṁ carācaram

🌷 Translation : 
Furthermore, O Arjuna, I am the generating seed of all existences. There is no being – moving or nonmoving – that can exist without Me.

🌹 Purport :
Everything has a cause, and that cause or seed of manifestation is Kṛṣṇa. Without Kṛṣṇa’s energy, nothing can exist; therefore He is called omnipotent. Without His potency, neither the movable nor the immovable can exist. Whatever existence is not founded on the energy of Kṛṣṇa is called māyā, “that which is not.”
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 211 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
46. అధ్యాయము - 1

*🌻. సంక్షేప సతీచరిత్రము - 4 🌻*

జీవతస్తేన దక్షో హి తత్ర సర్వే హి సత్కృతాః | పునస్స కారితో యజ్ఞ శ్శంకరేణ కృపాలునా || 39

రుద్రశ్చ పూజితస్తత్ర సర్వై ర్దేవైర్వి శేషతః | యజ్ఞే విష్ణ్వాదిభిర్భక్త్యా సుప్రసన్నాత్మభిర్మునే || 40

సతీదేహ సముత్పన్నా జ్వాలా లోక సుఖావహా | పతితా పర్వతే తత్ర పూజితా సుఖదాయినీ || 41

జ్వాలా ముఖీతి విఖ్యాతి సర్వకామ ఫలప్రదా | బభూవ పరమా దేవీ దర్శనా త్పాపహారిణీ || 42

ఆయన దక్షుని జీవింపజేసి, అందరినీ సత్కరించెను. కృపానిధి యగు శంకరుడు మరల ఆ యజ్ఞమును చేయించెను (39). 

ఆ యజ్ఞములో దేవతలందరు విష్ణువును ముందిడుకొని ప్రసన్నమగు మనస్సు గలవారై భక్తితో రుద్రుని ప్రత్యేకముగా పూజించిరి (40). 

ఓ మహర్షీ! సతియొక్క దేహము నుండి పుట్టినట్టియు, లోకములకు సుఖమనిచ్చు జ్వాల పర్వతమునందు పడెను. అచట ఆమెను పూజించినచో సుఖములనిచ్చును (41). 

ఆ పర్వతమునందు సర్వకామనలనీడేర్చునట్టియు, దర్శనముచే పాపములను పోగొట్టు ఆ దేవదేవి జ్వాలాముఖియను పేర ప్రసిద్ధిని గాంచెను (42).

ఇదానీం పూజ్యతే లోకే సర్వకామఫలాప్తయే | సంవిధాభి రనేకాభిః మహోత్సవ పురస్సరమ్‌ || 43

తతశ్చ సా సతీ దేవీ హిమాలయ సుతాsభవత్‌ | తస్యాశ్చ పార్వతీ నామ ప్రసిద్ధమభవత్తదా || 44

సా పునశ్చ సమారాధ్య తపసా కఠినేన వై | తమేవ పరమేశానం భర్తారం సముపాశ్రితా || 45

ఏ తత్సర్వం సమాఖ్యాతం యత్పృష్టోహం మునీశ్వర | యచ్ఛ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః || 46

ఇతి శ్రీ శివ మహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సతీసంక్షేప చరిత్ర వర్ణనం నామ ప్రథమః అధ్యాయః (1).

ఇప్పటికీ ఆమె లోకమునందు, కోర్కెలన్నియు ఈడేరి ఫలములు లభించుటకై మహోత్సవ పూర్వకముగా అనేక తెరంగులలో పుజింపబడుచున్నది (43). 

ఆ తరువాత ఆ సతీదేవి హిమాలయుని కుమార్తె అయెను. అపుడామెకు పార్వతియను పేరు ప్రఖ్యాతమాయెను (44). 

ఆమె మరల కఠోరమగు తపస్సును చేసి ఆ పరమేశ్వరుని భర్తగా పొందెను (45). 

ఓమునిశ్రేష్ఠా! నీవు నన్ను ప్రశ్నించిన విషయములనన్నిటినీ చెప్పతిని. దీనిని విన్నవారి పాపములన్నియు తొలగిపోవుననటలో సందేహము లేదు (46).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితములో రెండవ ఖండలో సతీసంక్షేప చరిత్ర వర్ణనము అనే మొదటి అధ్యాయము ముగిసినది (1).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 87 🌹*
Chapter 26
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 The Burning of Sanskaras 🌻*

The Avatar suffers like no other human being. The Avatar has a universal body and a universal mind. 

The forms of all beings are contained in his universal body, as the minds of all beings are contained in his universal mind. The Avatar suffers physically through all the individual bodies, and he suffers mentally through all individual minds. 
 
The Avatar is responsible for every being in creation until that individual attains realization of its true divine nature. 

The Avatar suffers physically while he is working on earth, because the universal work in the gross universe requires tremendous physical  
exertion. Through the exertion of his physical body while alive, he is directly at work for  
all physical beings in the universe. 

Even now that the Avatar has dropped his body, he remains responsible for every being in the creation. Therefore, even when he is not physically present, he is still working to bring about the results of the work he did while physically on earth. 

He continues to exert, but not physically; he exerts mentally, thus he suffers mentally, even while he is not in a human body, until the final results of his work manifest. 
 
Why must the Avatar, who is God, suffer even after he has dropped his body? 

He suffers mentally to bring about the results of his work, which is to burn the sanskaras of our minds through the fire of his love, and this happens during the period of his manifestation. That consuming fire of love exists in His universal mind. 

All individual minds are contained in his universal mind, but also contained in that universal mind is his work and love for each being, because his universal mind feels the pressure of responsibility for every being from the beginning to the end. 

This pressure of responsibility for all beings, combined with the resistance of their individual egos, is the factor that causes the Avatar to suffer mentally. 

The Avatar's responsibility is to maintain an inner connection with each individual ego-mind, and to work for that individual mind through all of its evolution and involution in creation, until that limited mind becomes ready, as a result of  
the Avatar's efforts, for ego-annihilation.  

The annihilation of the ego-mind is planned within the Avatar's universal mind. It is that fire of love in the universal mind that consumes the sanskaras of the limited mind.  

The preparation for this annihilation is seen to while the Avatar is physically present on  
earth, but the result of that work is accomplished whether he is in a physical form or not. 
 
This burning up of each being's sanskaras is now taking place in the Avatar's universal  
mind. 

This burning and the results of this fire—mental annihilation—are both aspects of Meher Baba's manifestation.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 82🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 33
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. అథ పవిత్రారోపణ విధానమ్‌‌‌ - 2 🌻*

ఆచార్యాణాం చ సూత్రాణి పితృమాత్రాదిపుస్తకే. 12

నాభ్యన్తం ద్వాదశగ్రన్థిం తథా గన్ధపవిత్రకే | అఙ్గలాత్కల్పనాదౌద్విర్మాలా చాష్టోత్తరం శతమ్‌. 13

అథవార్కచతుర్వింశషట్త్రింశన్మాలికా ద్విజ | అనామామధ్యమాఙ్గుష్ఠైర్మన్దాద్యైర్మాలికార్థిభిః. 14

కనిష్ఠాదౌ ద్వాదశ వా గ్రన్థయః స్యుః పవిత్రకే | రవేః కుమ్భహుతాశాదేః సమ్భవీ విష్ణువన్మతమ్‌. 15

పీఠస్య పీఠమానం స్యాన్మేఖలాన్తే చ కుణ్డకే | యథాశక్త సూత్రగ్రన్థిః పరిచారే7థ వైష్ణవే. 16

సూత్రాణి వా సప్తదశ సూత్రేణ త్రివిభక్త కౌ |

ఆచార్యునికొరకును, తలిదండ్రులకొరకును, పుస్తకముపై ఉంచుటకొరకును నిర్మింపబుడు పవిత్రకమునాభిప్రదేశమువరకును వ్రేలాడవలెను. దీనికి పండ్రెండు ముడులు ఉండవలెను. దానిపై మంచి గంధము పూయవలెను.

 వనమాలయందు రెండేసి అంగుళములదూరమున క్రమముగా నూటఎనిమిది ముడులు వేయవలెను. లేదా కనిష్ఠ-మధ్యదు-ఉత్తమపత్రకములపై క్రమముగా పండ్రెండు, ఇరువదినాలుగు, ముప్పదియారుముడులు వేయవలెను. 

మంద-మధ్యమ-ఉత్తమమాలార్థు లగ పురుషులు అనామికా-మధ్యమా-అంగుష్ఠములచేతనే పవిత్రకములను గ్రహింపవలెను. లేదా కనిష్ఠకాది నామధేయములు గల పవిత్రకములందు అన్నింటియందును పండ్రెండేసి ముడులే ఉండవలెను.

 (తంతువుల సంఖ్యను పట్టియు, పొడవును పట్టియు ఈ కనిష్ఠికాదినామదేయము లేర్పడినవి). సూర్యునకు, కలశమునకు, అగ్ని మొదలగు వాటికిని గూడ యథాసంభవముగ భగవంతు డగు విష్ణువునకు వలెనే పవిత్రకములను అర్పించుట ఉత్తమ మని చెప్పబడినది. పీఠముకొరకు దాని పొడవును పట్టియు, కుండమునకు దాని మేఖలపర్యంతమును పొడవు గల పవిత్రకముండవలెను. 

విష్ణుపార్షదులకు యథాశక్తిగ సూత్రగ్రంథులను సమర్పింపవలెను. లేదా గ్రంథులు లేకుండ పదునేడు సూత్రములు సమర్పింపవలెను. భద్రుడను పార్షదునకు త్రిసూత్రము సమర్పింపవలెను.

ఏకాదశ్యాం యాగగృహే భగవన్తం హరిం యజేత్‌. 18

సమస్తపరివారాయ బలిం పీఠే సమర్చయేత్‌ | క్షౌం క్షేత్రపాలాయ ద్వారాన్తే ద్వారోపరి శ్రియమ్‌. 19

ధాత్రే దక్షే విధాత్రే చ గఙ్గాం చ యమునాం తథా | శఙ్ఖపర్మనిధీ పూజ్య మధ్యే వాస్త్వపసారణమ్‌. 20

సారఙ్గాయేతి భూతానాం భూతశుద్ధిం స్థితశ్చరేత్‌ |

ఓం హూం హః ఫట్‌ హ్రూం గన్ధతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రరూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

పఞ్చోద్ఘాతైర్గన్థతన్మాత్రస్వరూపం భూమిమణ్డలమ్‌ |

చతురస్రం చ పీతం చ కఠినం వజ్రలాఙ్ఛితమ్‌.

ఇన్ద్రాధిదైవతం పాదయుగ్మమధ్యగతం స్మరేత్‌ |

శుద్ధం చ రసతన్మాత్రం ప్రవిలాప్యాథ సంహరేత్‌ 7

రసమాత్రం రూపమాత్రే క్మరమేణానేన పూజకః. 22

పవిత్రమును గోరోచనముతోను, అగురుకర్పూరములు కలిపిన పసుపుతోను, కుంకుమరంగుతోను పూయవలెను. భక్తుడు ఏకాదశీదివసమున స్నానసంధ్యాదులు చేసి, పూజగృహము వ్రవేవించి, భగవంతుడగు శ్రీహరిని పూజింపవలెను.

 విష్ణువుయొక్క సమస్తపరివారమునకును బలి సమర్పించి విష్ణువును పూజింపవలెను. ద్వారముయొక్క అంతమునందు ''క్షం క్షేత్రపాలాయ నమః'' అని చెప్పి క్షేత్రపాలపూజ చేయవలెను.

 ద్వారము పై భాగమున ''శ్రియై నమః'' అని చెప్పుచు శ్రీదేవిని పూజించవలెను. ద్వారదక్షిణ (కుడి) దేశమున ''ధాత్రే నమః'' ''గంగాయై నమః'' అను మంత్రము లుచ్చరించుచు, ధాతను, గంగను పూజింపవలెను. ఎడమ వైపున ''విధాత్రే నమః'' ''యమునాయై నమః'' అని చెప్పుచు విధాతను, యమునను, పూజింపవలెను. 

ఇదే విధముగ ద్వారముయొక్క కుడి-ఎడమ ప్రదేశములందు క్రమముగ ''శఙ్ఖనిధయే నమః'' పద్మనిధయే నమః''అని చెప్పుచు శంఖపద్మనిధులను పూజింపవలెను.

 [పిదప మండపములోపల కుడి హిదము మణవను మూడు మార్లు కొట్టి విఘ్నములను పారద్రోలవలెను].

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 98 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శంఖలిఖిత మహర్షులు - 4 🌻*

19..ప్రతి ఋషివాక్యానికి ఎంతో లోతైన, విశాలమైన, సమస్త జగత్తుకూ హితంచేకూర్చే భావం కలిగిన అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకు వారు చెప్పినవాటిలో, పితృదేవతలను అర్చించటం ఒక విధి. అంటే చచ్చిపోయిన వాళ్ళను అర్చించటం. ‘బ్రతికిఉన్నవాళ్ళకు అన్నంపెట్టమని చెప్పవచ్చుకదా!’ అని తద్దినాలపై ఒక విమర్శ. బ్రతికేవాడికే అన్నంపెట్టమని వారు చెప్పారు. 

20. అయితే చనిపోయినవారి పేరుమీద పెట్టమని, వారిని జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పారు. అంటే చచ్చిపోయిన వాడు తింటాడా? వాడికి తద్దినం ఎందుకు పెట్టాలి? అనే ప్రశ్నలకు; పోయినవాడికి శ్రాద్ధం పెట్టి, ఉన్నవాడికే భోజనం పెట్టమన్నారు. అయితే వారు ఈ ఉద్దేశ్యం మరచిపోయి, ఇటువంటి కుతర్కంతో కూడిన వాదనలు మనవారు కొందరు చేస్తూ ఉంటారు.

21. రోజూ ఒక్కమారైనా దేశం కోసం ప్రార్థనచేయాలి. ‘గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు’ అని రోజూ నమస్కరించాలి. 

22. అంటే, “గోవు నుంచి సమస్త పశువులు, బ్రాహ్మణులనుంచి సమస్త మానవులు” అని దాని అర్థం. అంతేకాని, గోవులు, బ్రాహ్మణులుమాత్రమే బాగుండాలి, మిగతావారు అక్కరలేదు అని కాదు. అలా ఉండనేఉండదు వైదికమార్గం. ‘గోవులతో మొదలుపెట్టి క్రిమికీటకాదులవరకు, ఒకరికొకరు హానిచేయకుండా ఎవరిబ్రతుకు వాళ్ళు బ్రతుకుతూ శాంతితో ఉందురుగాక! విద్యావంతులు, అవిద్యావంతులు, ధనవంతులు, దరిద్రులు, అంతా సుఖంగా ఉందురుగాక!’

23. రోజూ సంధ్యావందనంలో అనవలసిన మాటలివి. వాళ్ళందరూ సుఖపడాలి అని బ్రహ్మణుడు మూడుసార్లు అనాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 28 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴* 

STANZA VI
🌻 The Final Battle - 5 🌻

57. Humanity had become obsessed with the idea of gain, the accumulation of material goods. Small and big wars were started with only one aim — to rob one’s neighbours... Sorcerers of black magic rejoiced, devouring lavish food received in the form of bloody vapours. 

They did not need to sully themselves through contact with those paltry people, who were prone to slay each other in hand-to-hand combat and were even prepared to blow up the planet simply to clear everything out of her bowels. 

People refused to understand that they themselves would perish with all the rest. But greed was simply blinding. And that was playing into the hands of the darkness. The world went mad. The Gorgon reigned supreme in people’s minds.
 
58. The Great Beacons of the World then arrived on the scene. Sometimes they would appear at one end of the Earth, sometimes at the other. 

These were the Sons of God, descended again to the Earth in order to bring the half-crazed world to its senses. People gradually began to wake up to the perception of Truths. 

But with the departure of these Great Bearers of Fire, human beings once again attacked each other with weapons, hiding behind the name or banner of the Son of God...

Sorrow filled the Hearts of the Sons of Light, who watched from above as the blood of those whom they had instructed in Love and Forgiveness was shed... Claiming the authority of the Sacred Names and Images, human beings schemed and plotted terrible intrigues. 

The darkness was deceptive, claiming to act on behalf of Heaven... The bloody harvest was on, as those who blindly trusted in the darkness were plunged into the gloom of ignorance. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 47 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*చివరి భాగము*

*🌻. సమాధికి ముందు కాలజ్ఞానము - 2 🌻*

ఫాల్గుణ మాసంలో నేను వీరభోగ వసంతరాయులనై శ్రీశైలం వెళ్ళి అక్కడి ధనాన్ని బీదలకు పంచిపెడతాను. తరువాత ఉగ్రమైన తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి నుండి మూడు వరాలు పొందుతాను. 

విక్రమ నామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి రోజున బెజవాడ ఇంద్రకీలాద్రికి వస్తాను. అక్కడ ఋషులను దర్శించి, తరువాత కార్తవీర్యార్జున దత్తాత్రేయులవారి వద్ద పలు విద్యలు అభ్యసించి, ఆది దత్తాత్రేయులవారిని దర్శించి, అక్కడి నుండి మహానందికి వెళ్ళి రెండు నెలలు గడుపుతాను. అనంతరం శ్రావణ నక్షత్ర యుక్త కుంభ లగ్నాన వీరనారాయణపురం చేరతాను. అక్కడ 15 దినములు గడుపుతాను.

కలియుగాన 3040 సంవత్సరాలు గడిచిపోయేటప్పటికి పుణ్యతీర్థాలు క్రమ క్రమంగా తమ పవిత్రతను కోల్పోవటం జరుగుతుంది. గంగానది పూర్తిగా అంతర్థానమయిపోతుంది.

ప్రపంచాన ధనమే అన్నింటికీ మూలమౌతుంది. పాతాళ గంగలో నీరు ఇంకిపోతుంది. నూట యిరవై తిరుపతులు నీటిపాలయిపోతాయి. నాలుగు సముద్రాల మధ్య నున్న ధనమంతా శ్రీశైలం చేరుకుంటుంది. సముద్రాలు కలుషితమయిపోతాయి. జల చరములు – ఎక్కడివక్కడే నశించిపోతాయి. 

బంగారు గనుల కోసం కొండల్లో బతికేందుకు ప్రజలు మక్కువ చూపుతారు. కాశీనగరంలో కొట్లాటలు జరుగుతాయి. వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఎక్కువ అయిపోతాయి. కలహాలు, కల్లోలాలు మితిమీరిపోయాయి. కుటుంబంలో సామరస్యత వుండదు. వావీ వరసలు వల్లకాట్లో కలుస్తాయి.

సృష్టి మొత్తం తెలిసిన యోగులు పుడతారు. రెంటాల చెరువు క్రింద ఆపదలు పుడతాయి. వినాయకుడు వలవల ఏడుస్తాడు. గోలుకొండ క్రింద బాలలు పట్నాలు ఏలుతారు. శృంగేరి, పుష్పగిరి పీఠాలు పంచాననం వారి వశమవుతాయి. హరిద్వార్ లో మర్రిచెట్టు మీద మహిమలు పుడతాయి. హరిద్వారానికి వెళ్ళే దారి మూసుకుపోతుంది. అహోబిలంలోని ఉక్కుస్థంభం కొమ్మలు రెమ్మలతో, జాజిపూలు పూస్తుంది. నా రాకకు ముందుగా స్త్రీలు అధికారాన్ని అందుకుంటారు. కులాధిక్యత నశించి వృత్తిలో ఎక్కువ తక్కువలు అంటూ లేక అందరూ సమానమయిపోతారు’’

*🌻. సమాధి తర్వాత తిరిగి దర్శనం 🌻*

నవమి నాటి రాత్రికి సిద్దయ్యను బనగానపల్లెకు పంపి పువ్వులు తెప్పించమని గోవిందమాంబకి ఆదేశించారు స్వామి. వెంటనే సిద్దయ్య బనగానపల్లెకు ప్రయాణం అయ్యాడు.

సిద్దయ్య తిరిగి వచ్చేసరికి స్వామి సమాధిలో ప్రవేశించటం పూర్తయిపోయింది. అది తెలుసుకున్న సిద్దయ్య తీవ్రంగా దుఃఖించి ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. సమాధి నుంచి అది తెలుసుకున్న బ్రహ్మంగారు సిద్దయ్యను పిలిచి, సమాధిపై వున్న బండను తొలగించమని తిరిగి పైకి వచ్చారు.

అప్పుడు సిద్దయ్య కోరిక ప్రకారం ‘పరిపూర్ణ స్థితిని’ బోధించారు.

****

బ్రహ్మంగారు వైదిక ధర్మమును అవలంభించారు. అయితే, ఎప్పుడూ కుల మతాతీతులుగా ప్రవర్తించారు తప్ప ఏనాడూ సంకుచిత కులాభిమానమును గానీ, మాట ద్వేషమును గానీ ప్రదర్శించలేదు. దూదేకుల కులస్థుడైన సైదులును తన శిష్యునిగా స్వీకరించి, అనేక విషయాలను, శాస్త్ర రహస్యాలను అతనికి వివరించారు.

సమాధి అయిన తరువాత కూడా అతనికే దర్శనమిచ్చి దండ కమండల పాదుకలు, ముద్రికను కూడా ప్రసాదించారు. తమ కొడుకులకు కూడా యివ్వని ప్రాముఖ్యత దూదేకుల సైదులుకు ఇచ్చారు. అతనిని సిద్దునిగా మార్చి, ‘సిద్దా’ అనే మకుటంతో పద్యాలు చెప్పారు. అలాగే కడప, బనగానపల్లె, హైదరాబాదు, కర్నూలు నవాబులకు జ్ఞానబోధ చేసి శిష్యులుగా స్వీకరించారు.

*🌻. కందిమల్లాయపాలెం – చింతచెట్టు 🌻*

కందిమల్లాయపాలెంలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి యింటి ఆవరణలో, 14,000 కాలజ్ఞాన పత్రాలను పాత్రలో దాచారు. పైన ఒక చింతచెట్టు నాటినట్లు తెలుస్తోంది. అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి వుంటుంది. ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు, మరేవైనా ప్రమాదాలు కలిగే ముందు, సూచనగా ఆ చెట్టుకు వున్న మొత్తం పూత ఒక రాత్రికే రాలిపోయి, జరగబోయే అశుభాన్ని సూచిస్తుంది.

అలాగే ఈ చెట్టుక్కాసిన చింతకాయలు లోపల నల్లగా వుండి, తినడానికి పనికి రాకుండా వుంటాయి. చెట్ల పంగ నుండి ఎర్రని రక్తము వంటి ద్రవము కారి, గడ్డ కట్టి కుంకుమలా వుంటుందట. దాన్ని అక్కడి ప్రజలు వ్యాధులు, ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు. బనగానపల్లెలో వున్న వృద్దులందరూ ఆ చెట్టు గూర్చి చెప్పగలుగుతారు.

ఆ చింతచెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే వుంటుంది.

ఓం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామియే నమః 🙏

*🌻. సమాప్తం... 🌻*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. అద్భుత సృష్టి - 19 🌹*
 ✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
          
🌟. *ప్రొటీన్ల తయారీకి DNA ఎలా ఉపయోగపడుతుంది?* 🌟

ఇది రెండు దశలలో జరుగుతుంది.

*1. మొదటి దశలో*-ఎంజైమ్స్ DNA లోని సమాచారాన్ని చదివి మెస్సెంజర్ రైబో న్యూక్లియిక్ ఆమ్లం (mRNA)కు అందజేస్తాయి. DNAకు రైబోసోమ్స్ కి మధ్య mRNA అనేది సమాచార వ్యవస్థను నడిపించి ప్రొటీన్ తయారీలో తన వంతు పాత్రను నిర్వహిస్తుంది.

*2. రెండవ దశ*:-mRNA లోని సమాచారం ద్వారా అమినో ఆమ్లాల(Amino acids) భాషలోకి అనువదించి శరీరానికి అవసరమైన ప్రొటీన్స్ (బిల్డింగ్ బ్లాక్స్) తయారీ యంత్రాంగానికి సహాయకుడిగా ప్రోటీన్స్ ని తయారు చేసుకుంటుంది. ఇది చాలా పెద్ద పని ఎందుకంటే 20 రకాల అమినోయాసిడ్స్ ఉంటాయి. వీటి ద్వారా రకరకాల ప్రోటీన్స్ ని తయారు చేయవలసి ఉంటుంది.

🌟. *DNA ని ఎవరు కనుగొన్నారు?- ( సైన్స్ పరంగా)*
1869 సంవత్సరం చివరలో బయోకెమిస్ట్ *"ఫ్రైడరిచ్ మీషెర్"* మొదటిసారిగా DNA ని కనుగొనడం జరిగింది తరువాత ఇందులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవటానికి సైంటిస్టులకు ఒక శతాబ్ద కాలం పట్టింది.

*"DNA లో ఉన్న సమాచారం ఒక తరం నుండి మరొక తరానికి తీసుకుని వెళ్తుంది."* అని 1953లో *"జేమ్స్ వాట్సన్"*, *"ప్రాన్సీస్ క్రిక్"* మారిన్ విల్కిన్స్ మరి రోసలిండ్ ఫ్రాంక్లిన్ కృషివల్ల తేలింది.

🌟. *సైన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం DNA గురించి సంక్షిప్తంగా* 🌟

🔹. శరీరం అనేది ఎన్నో కణాల సముదాయం అనీ, కణ కేంద్రకంలో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి అనీ తేలింది.

🔹 క్రోమోజోమ్స్ లోపల DNA స్ట్రాండ్స్ ఉంటాయి.

🔹 DNA అంటే డీ - ఆక్సీ రైబో న్యూక్లియిక్ ఆమ్లం అంటారు.

🔹 DNA జన్యువులలో ఉన్న వంశపారంపర్యంగా వచ్చిన జ్ఞాన సమాచారం అంతా నిక్షిప్తం చేయబడి ఉంటుంది. ఇది సకల జీవరాశులలోనూ ఈ విధంగానే ఉంటుంది.

🔹 DNA లో 30,000 చురుకుగా పనిచేసే జన్యువులు ఉంటాయి. ప్రతి జన్యువుకు నిర్దిష్ట చర్య ఉంటుంది.

🔹. ఈ DNA..తల్లి యొక్క మరి తండ్రియొక్క కణాలు అయిన అండం మరి శుక్రకణం నుండి బిడ్డకు సంక్రమిస్తాయి. ఇవి ఎనిమిది కణాల కలయిక. దీనిని *"ప్రైమోర్డియల్ సెల్"* అంటారు. కాబట్టి ఇది అనువంశిక అణువు.

🔹. క్రోమోజోమ్స్ *"X"* ఆకారంలో, *"Y"* ఆకారంలో ఉంటాయి. DNA అనేది క్రోమోజోమ్స్ లోపల ఫోల్డ్ చేయబడి ఉంటుంది. ఈ క్రోమోజోమ్స్ చివర్ల DNA బయటకు విడిపోకుండా క్యాపింగ్ చేయబడతాయి. దీనినే *"టెలిమియర్ క్యాపింగ్"* అంటారు.

🔹 క్రోమోజోమ్స్ చివర్ల ఈ టెలిమియర్ క్యాపింగ్ అనేది లేకపోతే DNA విడివడి పొడవుగా అంతం అనేది లేకుండా పెరుగుతూ ఉంటుంది.
*ఉదాహరణకు*:- షూ- లేస్ చివర్ల నొక్కబడి ఉన్న ప్లాస్టిక్ క్యాప్స్ లాంటివి ఉంటాయి. అవి ఊడిపోతే లేస్ ఎలా ఊడిపోతుందో అదేవిధంగా.

🔹 DNA ఇలా అన్నేచురల్ గా పెరుగుతూ ఉంటే అక్కడ ఉన్న ఆర్గాన్స్ కూడా అన్ నాచురల్ గా పెరుగుతాయి‌ వీటినే క్యాన్సర్ కణుతులు అంటారు. అందుకే ఈ టెలిమియర్ క్యాపింగ్ చాలా ప్రధానమైనది.

🔹 DNAలో అధికశాతం 98 నుండి 99% జ్ఞానం నాన్ కోడింగ్ లో ఉంది. దీనిని *"జంక్ DNA "* అన్నారు.

🔹 1 నుండి 2% కోడింగ్ DNA ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ తయారు చేయబడతాయి.

🔹. 98 నుండి 99% నాన్ కోడింగ్ DNA. దీనిని *"జంక్ DNA"* అన్నారు. ఇది ఎందుకూ పనికి రాదు అంటూ డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీ మరి జ్యామితీయ కొలతల సమాంతర జ్ఞానం ఉండవచ్చు అని సైన్స్ చెప్పింది.

 సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 163 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 10. Immortality is freedom from the feeling ‘I am’, to have that freedom remain in the sense ‘I am’, its simple, its crude, yet it works! 🌻*

The feeling ‘I am’ is dormant at birth, it appears spontaneously say around the age of three. It is the essence of the five elements that make up the body or the food body. 

The body is a limitation and as long as the ‘I am’ identifies itself with the body there is no chance of freedom and death is certain.  

Eternity or immortality is possible only when you are free from the ‘I am’. For this freedom to accrue you have to be after the ‘I am’, understand it, abide in it and transcend it. 

Judging from the enormous amount of spiritual literature available the understanding, abidance and transcendence of the ‘I am’ appears to be a too simple and crude ‘Sadhana’ or practice, yet it works!
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 41 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 5 🌻*

మీరందరూ తప్పక ఈ విమర్శ చేసేటటువంటి విధానములన్నింటిలో పూర్ణజ్ఞానమును పొందాలి. ఏమిటవి? పంచకోశ విచారణ, దేహత్రయ విచారణ, శరీరత్రయ విచారణ, అవస్థాత్రయ విచారణ, జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ విచారణ, ధ్యాన ధ్యాతృ ధ్యేయ విచారణ, జడచేతన విచారణ, ఆధార ఆధేయ విచారణ, నిత్యానిత్య విచారణ, అత్మానాత్మ విచారణ, కార్యకారణ విచారణ, సదసద్ విచారణ, దృగ్ దృశ్య విచారణ - ఇలాంటివాటన్నింటినీ పూర్తిచేయాలి. 

ఇవన్నింటినీ ఎప్పుడైతే నీవు పూర్తి చేస్తావో, వీటన్నింటిలో నుండి వచ్చేటటువంటి అనుభవం ఏదైతే వుందో, ఆ అనుభవం నిన్ను ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి దగ్గర చేస్తుంది. అది పొందేటటువంటి స్థితికి నిన్ను చేరుస్తుంది. అందుకని వీటన్నింటినీ బాగా నీకు అధ్యయనం చేయిస్తారనమాట. ఈ అధ్యయనం చేయించడం వల్ల - సాంఖ్య విచారణలో వున్నటువంటి విశేషణం ఇదే - 

ఈ సాంఖ్య విచారణలో ఇవన్నీ చేయడం ద్వారా నీలో ఏవేవి దూరం అవ్వాలో, నీలో ఏవేవి నిరసింపబడాలో, ఏయే వాటి నుంచి నీవు అధిగమించాలో, వాటన్నింటినీ నీవు అధిగమించిన స్థితిలో నిలబడతావనమాట. తత్ ప్రభావం చేత నీకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. ఈ రకంగా నడిపేటప్పుడు అనుభవజ్ఞానం చాలా ముఖ్యము. అందుకని - ఎందుకని అంటే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మము.
         
ఎందుకని ఆ మాట అంటున్నారంటే ఆత్మ సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. ఇక ఆత్మ కంటే సూక్ష్మమైనది లేదనమాట. అది సర్వ వ్యాపకము. అన్నింటికంటే సూక్ష్మము. మరి చిహ్నముల ద్వారా దానిని ప్రత్యక్షమయ్యేటట్లు చెయ్యగలుగుతామా? అంటే అర్ధం ఏమిటీ? సరే. 

ఇక్కడి నుంచి ఇప్పుడున్న వ్యవస్థలో అనేక దేశాలలో అనేక రకాలైనటువంటి చిహ్నాల ద్వారా ఈ జ్ఞానాన్ని దివ్యత్వాన్ని వ్యక్తీకరించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కాని అవేవీ సత్యానికి ఆత్మానుభూతిని నిర్ణయించలేవు. అంటే అర్ధం ఏమిటీ? 

ఒకాయన ఒక చేతిలో కొబ్బరికాయ పట్టుకుని వుంటాడు. ఒకాయన దానిని తీక్షణంగా చూస్తూ వుంటాడు. చూడగా చూడగా చూడగా చూడగా చూపు ద్వారా దానిని ప్రేరేపించడం ద్వారా చేతిలో వున్న కొబ్బరికాయ క్రిందపడిపోతుంది. 

ఇప్పుడు ఆయనకి ఆత్మానుభూతి వున్నట్లేనా? ఒకాయన కళ్ళకు గంతలు కట్టుకుని తన ఎదురుగుండా వున్నటువంటి పుస్తకంలో వున్న వేదాన్ని అంతా చదివేస్తాడు. దీన్ని బ్లైండ్ రీడింగ్ [blind reading] అంటారు. మరి ఆయనకి ఆత్మానుభూతి వున్నట్లేనా?

 ఒకాయనకి దూరశ్రవణ విద్య. అంటే మనం ఫోన్ లో ఎట్లా మాట్లాడుకుంటున్నామో, ఆయన ఫోన్ సహాయం లేకుండా తెలుసుకో గలుగుతాడు. అలాంటి దూరశ్రవణ విద్య వున్నటువంటివాళ్ళు వుంటారు. 

అలాగే కొంతమందికి ఏదైనా ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకి సమాధానం ఇన్వొకింగ్ – ఇంట్యూషన్ [invoking – intuition] అంటారు దీన్ని. ఈ ఇంట్యూషన్ [intuition] ద్వారా చెప్పేటటువంటి విధానం ఒకటి వుంటుంది. అలాగే కొంతమందికి ట్రాన్సెన్-డెన్టల్ [Transcendental Meditation] అంటారు. 

అంటే ఒకరి చేతిలో వాహకంగా పనిచేసేటటువంటి నిబద్ధత కొంతమంది మానసిక వ్యవస్థలలో వుంటుంది. అట్టి మానసిక వ్యవస్థ కలిగినటువంటి వాళ్ళు - తప్పక ఏం జరుగుతుందంటే - ఆ మానసిక వ్యవస్థల నుంచి వాళ్ళు ప్రేరణని పొంది, ఆ ప్రేరణ ద్వారా వాళ్ళు సమాధానాన్ని చెప్తూ వుంటారు.
    
ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మ ప్రజ్ఞా పరిధిలో. ఈ ప్రజ్ఞ కి చైతన్యానికి వున్నటువంటి వలయాలలో చిట్టచివరి వలయాలలో [outer periphery] ఉంటారనమాట. అంటే సూక్ష్మం అనగానే ఇలాంటివన్నీ మొదలైపోతాయనమాట. 

సూక్ష్మం అనగానే అనేకరకాలైన శక్తులు, అనేకరకాలైనటువంటి స్థూలానికి అతీతమైనటువంటి - అతీత శక్తులు అతీత శక్తులు అంటారు - దేనికి అతీతం అంటే స్థూలానికి అతీతం. 

అంటే మన కళ్ళు, మన చెవులు, మన ముక్కులు, మన స్పర్శ, మన నోరు ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు తెలుసుకోగలిగినదానికంటే అతీతమైనటువంటిది. అవతలిది. అలాంటిదేదైనా వచ్చినపుడు వాళ్ళు అవి చేయగలుగుతారనుకోండి. 

మరి వీటి ద్వారా ఆత్మ వున్నదని నిరూపించదగునా అంటే అట్లాంటివాటి వల్ల ఆత్మ యొక్క సాక్షాత్కార జ్ఞానాన్ని పొందలేము. అత్మానుభూతిని పొందలేము. 

మరి ఎలాగండీ నిరూపణ అంటే ఇదంతా గ్రుడ్డివాడు ఏనుగును పట్టుకున్న రీతి. వాళ్ళు పట్టుకున్నది ఏనుగును కాదా? ఏనుగు లక్షణాలు కావా అంటే ఒకానొక అంశీభూతములే. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 18. గీతోపనిషత్ - అనర్హుడు - మనస్సుచే మోసగింపబడిన వారు దైవ ధ్యానమును చేయలేరు. రసానుభూతిని పొందలేరు. 🌹*

*భోగైశ్వర్యప్రసక్తానం తయాపహృతచేతసామ్ |*
*వ్యవసాయాత్మికా బుద్ధి: సమాధౌ న విధీయతే || 44*

భగవంతుడు రస స్వరూపుడు. రసాస్వాదనము చేయుటకే
జీవనము. అదియే వైభవము. అట్టి వైభవమును పొందుటకు ఈ
క్రిందివారనర్హులని భగవానుడు బోధించుచున్నాడు.

1) కర్మఫలములం దాసక్తి గలవాడు,

2) పుణ్యము కొరకు మంచిపని చేయువాడు,

3) కోరికలతో నిండిన మనస్సు కలవాడు,

4) భోగములయం దాసక్తి కలవాడు,

5) జ్ఞాన సముపార్జన చేయనివాడు,

6) ఐశ్వర్యములను సంపాదించుటకు ప్రయాస పువాడు,

7) తెలిసినదానిని ఆచరించనివాడు. 

పైవారందరూ వారి మనస్సుచే మోసగింపబడినవారు. వారు దైవ ధ్యానమును చేయలేరు. రసానుభూతిని పొందలేరు.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 29


🌹.  భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 29  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని శరీరి : నాల్గవ పాత్ర (రూపధారణము) - 1 🌻

109. అనంత ఆదిప్రేరణముయొక్క సంచలనముచే అనంత సాగరమందలి ప్రతి బిందువు తనను తాను తెలిసికొనుటకు ప్రేరేపింపబడెను.

110. పరాత్పర స్థితియందున్న భగవంతుడు, తొలిగా తన సత్య స్థితియొక్క జ్ఞానమును సంపాదించుట కంటె, సంస్కార భూయిష్ఠుడై అజ్ఞానమునే సంపాదించుచున్నాడు.

111. ప్రారంభములో పరమాత్మ యొక్క A స్థితిలో ఆత్మకు చైతన్యము, సంస్కారములు లేవు.

112. ప్రారంభములో, ఆత్మకు దేహత్రయమందు గాని తనయందు గాని స్పృహ లేదు. అందుచేత ఆయా దేహములకు సంబంధించిన లోకానుభవమును లేదు. పరమాత్మానుభవము అంతకన్నలేదు.

113. ఆత్మ, శాశ్వతముగా పరమాత్మలో నుండి, పరమాత్మతో నుండి స్పృహ లేని స్థితి యందున్నను, పరమాత్మ యొక్క అనంత శక్తులగు జ్ఞాన-శక్తి ఆనందములను పొందెడి హక్కు గలదై యున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

30.Aug.2020

శ్రీ శివ మహా పురాణము - 210



🌹 .  శ్రీ శివ మహా పురాణము - 210  🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

46. అధ్యాయము - 1

🌻. సంక్షేప సతీచరిత్రము - 3 🌻

అథగతా సతీ తత్ర శివాజ్ఞామధిగమ్య సా | అనాహూతాపి దక్షేణ గర్విణా స్వపితుర్గృహమ్‌ || 27

విలోక్య రుద్ర భాగం నో ప్రాప్యావజ్ఞాం చ తాతతః | వినింద్య తత్ర తాన్‌ సర్వాన్‌ దేహ త్యాగమథాకరోత్‌ || 28

తచ్ఛ్రుత్వా దేవ దేవేశః క్రోధం కృత్వా తు దుస్సహమ్‌ | జటాముత్కృత్య మహతీం వీరభద్రమజీజనత్‌ || 29

సగణం తం సముత్పాద్య కిం కుర్యామితి వాదినమ్‌ | సర్వాపమాన పూర్వం హి యజ్ఞధ్వంసం దిదేశ హ || 30

అపుడు సతీదేవి శివుని ఆజ్ఞను పొంది, గర్విష్ఠియగు దక్షుడు ఆహ్వానించకపోయినా, పుట్టింటికి విచ్చేసెను (27).

ఆమెకు ఆ యజ్ఞములో రుద్రుని భాగము కానరాలేదు. దానిని ఆమె తండ్రి చేసిన అవమానముగా గ్రహించి, అచట ఉన్న వారందరినీ నిందించి, తరువాత దేహమును విడిచి పెట్టెను (28).

దేవదేవుడగు శివుడు ఈ వృత్తాంతమును విని, సహింపరాని కోపమును పొంది, పెద్దజటనొకదానిని పీకి వీరభద్రుని సృష్టించెను (29).

వీరభద్రుని గణములతో సహా సృష్టించెను. 'నేను ఏమి చేయవలెను?' అని ప్రశ్నించిన వీరభద్రునకు అందరినీ అవమానించి, యజ్ఞమును ధ్వంసము చేయుమని ఆదేశించెను (30).

తదాజ్ఞాం ప్రాప్య స గణాధీశో బహుబలాన్వితః | గతోsరం తత్ర సహసా మహాబల పరాక్రమః || 31

మహోపద్రవమాచేరుర్గణాస్తత్ర తదాజ్ఞయా | సర్వాన్‌ స దండయామాస న కశ్చిదవ శేషితః || 32

విష్ణుం సంజిత్య యత్నేన సామరం గణసత్తమః | చక్రే దక్ష శిరశ్ఛేదం తచ్ఛిరోsగ్నౌ జుహావ చ || 33

యజ్ఞధ్వంసం చకారాశు మహోపద్రవమాచరన్‌ | తతో జగామ స్వగిరిం ప్రణనామ ప్రభుం శివమ్‌ || 34

గణాధీశుడగు ఆ వీరభద్రుడు శివుని యాజ్ఞను పొంది గొప్ప సైన్యముతో కూడిన వాడై శీఘ్రముగా అచటకు వెళ్లెను. గొప్ప బలము, పరాక్రమముగల (31),

ఆ వీరభద్రుని ఆజ్ఞచే గణములచట గొప్ప ఉపద్రవమును కలుగజేసిరి. ఆతడు ఎవ్వరినీ మిగల్చకుండగా, అందరినీ దండించెను (32).

గణశ్రేష్ఠుడగు నాతడు ప్రయత్న పూర్వకముగా, దేవతలతో కూడియున్న విష్ణువును జయించి, దక్షుని తలను నరికి, దానిని అగ్నియందు వ్రేల్చెను (33).

గొప్ప ఉపద్రవమును కలిగించి, ఆతడు శీఘ్రముగా యజ్ఞమును ధ్వంసము చేసి, తరువాత కైలాస పర్వతమును చేరి, శివప్రభువకు నమస్కరించెను (34).

యజ్ఞధ్వంసోsభవచ్చేత్థం దేవలోకే హి పశ్యతి | రుద్రస్యానుచరైస్తత్ర వీరభద్రాదిభిః కృతః || 35

మునే నీతిరియం జ్ఞేయా శ్రుతిస్మృతిషు సంమతా | రుద్రే రుష్టే కథం లోకే సుఖం భవతి సుప్రభౌ || 36

తతో రుద్రః ప్రసన్నోభూత్‌ స్తుతిమాకర్ణ్య తాం పరామ్‌ | విజ్ఞప్తిం సఫలాం చక్రే సర్వేషాం దీనవత్సలః || 37

పూర్వ వచ్చ కృతం తేన కృపాలుత్వం మహాత్మనా | శంకరేణ మహేశేన నానాలీలావిహారిణా || 38

వీరభద్రుడు మొదలగు రుద్రాను చరులు, దేవతలు చూచుచుండగా, ఈ తీరున యజ్ఞమును ధ్వంసమొనర్చిరి (35).

ఓ మహర్షీ! మహా ప్రభువగు రుద్రుడు కోపించినచో, లోకములో సుఖమెట్లుండును? ఈ నీతిని వేదములు, స్మృతులు చెప్పుచున్నవి. మనమీ నీతిని తెలియవలెను (36).

అపుడు ఆ దేవతలందరు చేసిన గొప్ప స్తోత్రమును విని, దీనవత్సలుడగు రుద్రుడు ప్రసన్నుడై, వారి విజ్ఞప్తిని సఫలము చేసెను (37).

శుభకరుడు, మహేశ్వరుడు,అనేక లీలలను ప్రదర్శించి విహరించువాడు, మహాత్ముడు నగు రుద్రుడు ఎప్పటివలెనే కరుణను చూపెను (38).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

30.Aug.2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 97


🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 97  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శంఖలిఖిత మహర్షులు - 3 🌻

14. అంతఃకరణలో ధర్మంమీద శ్రద్ధకలిగినవాడు భారతదేశం మళ్ళీ ఒక భూలోకస్వర్గం అవుతుంది. ఋషులకు మనయందు అనుగ్రహం ఉందికాని, మాటవినని కొడుకును తండ్రి ఎలా చూస్తాడు?

15. అలాగే, వారి మార్గాన్ని అనుసరించకపోవడంచేత మనకు ఒక దోషం సంక్రమించింది. ఈ రాజకీయ స్వాతంత్రము, ఈ ఇండస్ట్రీస్, కమ్మునికేషన్స్ వీటివల్ల మనకు వచ్చేటటువంటి గొప్ప ఏమీలేదు.

16. దీనివల్ల మనకు ఆత్మగౌరవం పెరగదు. జ్ఞానం పెరగదు. శాంతి సుఖములుకూడా దీనివల్ల అసలే పెరగవు. అశాంతి, అసౌఖ్యము, దుఃఖము, భయము, ఎప్పుడూ ఆపద, మృత్యుభయము ఇవన్నీ మనను వెంటాడుతూనే ఉంటాయి, ఇన్నీ ఉండికూడా ఈ సంపదలన్నీ ఎప్పుడూ మనిషి విషయంలో శాశ్వతంకాదు. దేశానికి సంపద శాశ్వతం కావచ్చుకానీ మనిషికి కాదు.

17. “ఈ పశువధ మానండి. ఇది చాలా భయంకరంగా ఉంది” అని చాలా మంది పదేపదే వాస్తున్నారు, అనేకమంది అంటున్నారు. అంటే, ఇన్ని పశువులను వధించటము క్రూరమని నేడు అంటున్నాదు. ఇంత భారీస్థాయిలో ప్రతీ ఊళ్ళోను అనేకవందల పశువులను చంపడం నాడు లేదు. ఇప్పుడు లక్షలాది పశువులను ఒక్కొక్కరోజున క్షణంలో చంపేటటువంటి ఈ యాంత్రిక విధానం ఎప్పుడాఇతే వచ్చిండో, అది ఆలోచించదగిన విషయం.

18. మన మహర్షులు చెప్పినటువంటి బోధలు, వారు మనకిచ్చిన ప్రాపంచికమైన కర్తవ్యాలు మరచిపోయామని గుర్తుచేసుకోవాలి. వారు లోకహితం కోరి మనకు ఎన్నో ధర్మాలు చెప్పారు. తమ సంతానం మాత్రమే బాగుండాలనికాదు. మహర్షుల యొక్క ఉద్దేశ్యం తమ సంతానంవలన లోకానికి హితం జరగాలి. తద్వారా సంతానం పుణ్యశ్లోకులుకావాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

30.Aug.2020

⚔️ 𝚃𝚠𝚎𝚕𝚟𝚎 𝚂𝚝𝚊𝚗𝚣𝚊𝚜 𝚏𝚛𝚘𝚖 𝚝𝚑𝚎 𝙱𝚘𝚘𝚔 𝚘𝚏 𝙳𝚣𝚢𝚊𝚗 - 𝟸𝟽 ⚔️


🌹 𝚃𝚠𝚎𝚕𝚟𝚎 𝚂𝚝𝚊𝚗𝚣𝚊𝚜 𝚏𝚛𝚘𝚖 𝚝𝚑𝚎 𝙱𝚘𝚘𝚔 𝚘𝚏 𝙳𝚣𝚢𝚊𝚗 - 𝟸𝟽 🌹

🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴

STANZA VI
🌻 The Final Battle - 4
🌻

55. The beast had now lost one of her three lives, making her number 66. The next Gorgon sister could be defeated only by the Heart, full of the Fires of Immortality implanted by the Hand of the Creator. And this was His Son.

The Only Begotten Son of God had descended to the Earth to take upon His Loving Heart all the venomous arrows of gloom. His triumphs were due to Love alone. He softened petrified Hearts with the tenderest currents of the Light. Many followed Him, proclaiming the Gospel of Love — which had defeated the beast in man.

56. Love had dissolved the second Gorgon of gloom, leaving the eldest sister alone with a single number — 6.

But 6 was the number of the Earth, and also the number of Life. It was immortal, as was the last Gorgon, who was woven of earthly Matter and reared on the currents of spiteful human miasmas.

She could be defeated only by the united will of the all Loving Hearts knit together. Her name — the name of the monstrous mistress of darkness — was Basest Matter. And her glare had already touched every earthling, leaving in people’s minds the impress of gloom.

The Gorgon had simply dissolved in human minds, bequeathing to each one a cell of her ill-fated flesh. Now she was completely confident in her own immortality.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #BookofDzyan #Theosophy

30.Aug.2020

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 46


🌹.   శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 46  🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కాలజ్ఞాన సౌజన్య పత్రికలో ఈ విధంగా వుంది... 3 🌻

“బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మహాలక్షమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది. కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కు పోగు తాకుతుంది. కంచికామాక్షి నేత్రాల కన్నీరు ఒలుకుతుంది. కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది.

బనగాపల్లెలో నా ప్రథమ భక్తురాలు అచ్చమ్మవంశము సర్వనాశనమై, వారి వంశం అంతరించిపోతుంది. నారాయణమ్మ వంశస్తులే మఠాధిపతులవుతారు. నువ్వు ఇకనైనా ఈ భ్రాంతిని విడిచిపెట్టు’’ అని చెప్పి గోవిందమ్మ దుఃఖాన్ని పోగొట్టారు.

🌻. సమాధికి ముందు కాలజ్ఞానము 🌻

“నేను పుట్టబోయే సమయంలో అనేక నక్షత్రాలు భూమిపైకి రాలతాయి. ఏడు గ్రామాలకు ఒక గ్రామమవుతుంది. అంటే ప్రాణనష్టం జరుగుతుంది. ఆ సమయంలో లక్షలాది పశువులు మరణిస్తాయి. ధూమకేతువు అనే నక్షత్రం పుడుతుంది. చిన్న చిన్న పాలెగాళ్ళ సామ్రాజ్యాలు అంతమైపోతాయి. ఎర్రబోయీల జీవన విధానాలను వీరు అనుసరిస్తారు.

విరోధి నామ సంవత్సరంలో లింగాలపాటిలో ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తి ‘అంకమ్మ’ అనే పేరుతో లోకమంతా సంచరించి, దగ్ధం చేసి తిరిగి నందికొండ వస్తుంది.

పింగళనామ సంవత్సరంలో ధూమకేతు పుట్టి అదృశ్యమవుతుంది.

గొప్ప దేశములు, దేవాలయములు నశిస్తాయి. సిద్దాత్రి నామ సంవత్సరాన అద్దంకి సీమలో భూమి వణుకుతుంది.

రౌద్రినామ సంవత్సరాన ఆషాఢమాసంలో, మహా ధ్వని చేస్తూ నక్షత్రాలు రాలుతాయి. అప్పుడు పర్వత గుహల్లో ఉదక పానీయములు తయారు చేస్తారు. బంగాళ దేశంలో కాళి ప్రత్యక్షమై శక్తి రూపియై రక్తం గటగటా తాగుతుంది. బెజవాడ గోలకొండ అంత పట్నమవుతుంది.

మేఘం, అగ్నిసర్పాకారంగా వచ్చి ధ్వనులు చేస్తాయి. పిడుగులు, శ్రీశైలాన నంది చెరువులో ఆరెదొండచెట్టు పుడుతుంది. భ్రమరాంబ గుడిలో మొసళ్ళు చొరబడటంతో గుడి పాడయి పోయెను. ఈశాన్యంలో పాతాళగంగ కృంగి మల్లిఖార్జునుడు అదృశ్యమైపోతాడు.

పాతాళ గంగలో శాపవశాత్తూ వున్న చంద్రగుప్తునికి కలికి అవతార పురుషుని పాదం సోకి, శాప విముక్తుడవుతాడు. ఆకాశాన విషగాలి పుట్టి, ఆ గాలి వల్ల, రోగాల వల్ల జనులు నశిస్తారు.

తిరుపతి వేంకటేశ్వరుని గుళ్ళో మొసళ్ళు ప్రవేశించి, మూడు రోజులు పూజలు లేక తలుపులు మూసి వుంచుతారు. గరుడధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయి. తిరువళ్ళువరు వీరరాఘవ స్వామికి చెమటలు పడతాయి.

ఆకాశాన మూడు నక్షత్రములు ఉదయించి, కన్పించకుండానే అదృశ్యమవుతాయి. ఆనంద నామ సంవత్సరంలో శ్రీశైల మల్లిఖార్జునుడు ఉత్తరాన వింధ్య పర్వతాలకు పోయి, నిజ రూపం చూపుతాడు. అప్పుడు ఆ రాజ్యం తల్లడిల్లిపోతోంది. దేశాన కొత్త కొత్త జాతులు పుట్టుకొస్తాయి. అన్ని కులాలవారు మద్యపాన ప్రియులవుతారు.

రాజులకు రాజ్యాలు ఉండవు. వ్యవసాయ వృత్తినే అవలంభిస్తారు. అన్ని జాతుల వారు వింత వింత వస్త్రాలు ధరిస్తారు. బ్రాహ్మణులకు పీటలు, యితరులకు మంచాలు వస్తాయి. బ్రాహ్మణులు విదేశీ విద్యలు, విజ్ఞానానికి భూములను అమ్ముకుంటారు. ప్రభుత్వ బంట్లుగా ఉద్యోగాలు చేస్తూ బతుకుతారు. వానిలో కూడా బ్రాహ్మణులకు ఆధిక్యత లేకపోగా అన్య కులాల వారే ఆధిక్యత పొంది వారి కింద పని చేస్తారు.

జీవనోపాధి కోసం ఏ వృత్తినయినా చేసే స్థితికి వస్తారు. పౌరోహిత్యం కూడా కొనసాగక బ్రాహ్మణులు బాధలు పడతారు. విదేశీ విజ్ఞానం విద్యలు నేర్చుకుంటారు. ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఉన్నత స్థితికి చేరుకుంటారు’’

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కాలజ్ఞానం

30.Aug.2020

అద్భుత సృష్టి - 18


🌹.  అద్భుత సృష్టి - 18  🌹

✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟. DNA శరీరంలో ఎక్కడ ఉంటుంది? 🌟

జీవులను (ఆర్గానిజం) "యుకారియోట్స్"(Eukaryotic) అంటారు. యుకారియోట్స్ అంటే నిజకేంద్రిక జీవులు.

ఈ DNA అనేది కణం లోపల న్యూక్లియస్ లో ఉంటుంది. శరీరంలో 100 ట్రిలియన్ పైన కణాలు ఉంటాయి. ప్రతి కణంలో DNA Strands ఉంటాయి. కణంలో ఉన్న క్రోమోజోమ్స్ అతి చిన్నగా ఉండటం వలన.. ఈ DNA నొక్కి ప్యాక్ చేసి ఉంచడం జరిగింది. ఒక్కకణంలో నొక్క బడిన DNA పొడవు 125 మిలియన్ మీటర్లు ఉంటుంది. శరీరంలోని అన్ని DNA లను ఊడదీసి కలిపితే ఇక్కడ నుండి కేంద్రసూర్యుని వరకు దీనిని కనెక్ట్ చేయవచ్చు.

💫. DNA ప్రతిరూపణ (డూప్లికేషన్) కోసం కొంత నిర్మాణం ఉంటుంది. DNA పెరగకుండా ఆపడం కోసం(స్టాపింగ్) కొంత నిర్మాణం చేయడం జరిగింది. DNA కణ విభజన సమయంలో సమాచారం డూప్లికేట్ అవుతూ ఉంటుంది లేదా కాపీ చేయబడుతుంది.

💫. DNAలో ఉన్న జ్ఞానాన్ని "జీన్స్" అనడం జరిగింది. కొంత DNA మైటోకాండ్రియాలో కూడా ఉంటుంది. ఇది కణానికి శక్తినిస్తుంది.

💫. లైంగికపునరుత్పత్తిలో జీవులు సగం తల్లి నుండి, సగం తండ్రి నుండి DNA ని పొందుతారు. వంశ చరిత్ర ఉన్న DNAని ఇద్దరి నుండి పొందుతారు. మైటోకాండ్రియల్ DNA అనేది కేవలం అండం (తల్లి)నుండి మాత్రమే రిలీజ్ అవుతుంది. తండ్రి స్పెర్మ్ (శుక్ర కణం) నుండి కాదు.

🌟. DNA దేనితో తయారు అవుతుంది..? 🌟

"న్యూక్లియోటైడ్స్" అనే బిల్డింగ్ బ్లాక్స్ తో DNA తయారు చేయబడుతుంది. ఫాస్పేట్ మరి చక్కెర సమూహాలు మరి నాలుగు రకాల నత్రజని స్థావరాలతో DNA తయారు చేయబడింది.

ఈ న్యూక్లియోటైడ్స్ ని 4 రకాల నైట్రోజన్ బేస్ లు (నత్రజని షరాలు) అంటారు.

1. అడినైన్ (Adenine)
2.థైమైన్ (Thymine)
3.గ్వానైన్ (Guanine)
4.సైటోసిన్(Cytosine)

ఈ నాలుగు న్యూక్లియోటైడ్స్ లోనే DNA యొక్క జీవ సంబంధిత సమాచారం మొత్తం దాగి ఉంది. వ్యక్తి తన శరీరాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే.. ఆ విధంగా ఈ న్యూక్లియోటైడ్స్ శరీరాకృతిని తయారు చేస్తాయి.

ఉదాహరణ :-ATCGTT క్రమంఅనేది మన కళ్ళను నీలికళ్ళుగా తయారు చేస్తుంది. ATCGT అనేది కళ్ళను గోధుమ రంగు కళ్ళుగా తయారు చేస్తుంది. ఒక్క న్యూక్లియోటైడ్ మార్పుతో కళ్ళలో ఇంత తేడా జరిగింది.

💫. మానవుడు కణంలో.. 23 జతల క్రోమోజోమ్స్.. అందులో 3 బిలియన్ల బేస్ టోన్స్ (ACGT)లు.‌ అందులో 30,000 చురుకుగా పని చేసే జన్యువులను కలిగి ఉన్నాడు.

🌟. DNA ఏం చేస్తుంది? 🌟

జీవ అభివృద్ధి పనితీరు, జీవించడానికి మరి పునరుత్పత్తికి సంబంధించిన సమస్త సమాచార జ్ఞానాన్ని DNA రూపంలో పొందుపరచడం జరిగింది.

💫. మానవ శరీరం తనలోని సంక్లిష్ట అణువుల (complex molecules లేదా అణువుల సముదాయం) ద్వారా అవసరమైన ప్రోటీన్స్ ని మరి అమైనో యాసిడ్స్ నీ ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటూ ఉంటుంది. మన యొక్కDNA ప్రోటీన్స్ తయారు చేయటానికి పనికి వచ్చే క్రమాన్ని " జీన్స్" అన్నారు. మానవులలో ఉన్న జీన్స్ యొక్క పరిణామం 1000 బేస్ టోన్స్ నుండి ఒక బిలియన్ బెస్ టోన్స్ వరకు ఉంటుంది. వీటి యొక్క క్రమంలో చాలా తేడాలు ఉంటాయి. ఇందులో 1% జీన్స్ మాత్రమే శరీరానికి అవసరమైన ప్రొటీన్స్ ని అమైనోయాసిడ్స్ ని తయారుచేసి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

30.Aug.2020

శ్రీ మదగ్ని మహాపురాణము - 81


🌹.   శ్రీ మదగ్ని మహాపురాణము - 81  🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 33
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అథ పవిత్రారోపణ విధానమ్‌‌‌ - 1 🌻

అగ్ని రువాచ

పవిత్రారోపణం వక్ష్యే వర్షపూజాఫలం హరేః | ఆషాఢాదౌ కార్తికాన్తే ప్రతిప త్త్యజ్యతే తిథిః. 1

శ్రియా గౌర్యా గణశస్య సరస్వత్యా గుహస్య చ | మార్తణ్డమాతృదుర్గాణాం నాగర్షిహరిమన్మథైః. 2

శివస్య బ్రహ్మణస్తద్వద్ద్వితీయాదితిథేః క్రమాత్‌ | యస్య దేవస్య యో భక్తః పవిత్రా తస్య సా తిథిః. 3

అగ్నిదేవుడు పలికెను : మునీ! ఇపుడు నేను పవిత్రారోపణమను గూర్చి చెప్పెదను. సంత్సరమునందు ఒక మారు పవిత్రారోపణము చేసినచో, సంవత్సర మంతయు శ్రీహరి పూజ చేసిన ఫలము నిచ్చును. ఆషాఢశుక్ల ఏకాదశి మొదలు కార్తిక శుక్లైకాదశి వరకు నున్న కాలమున పవిత్రారోపణము చేయవలెను.

ప్రతిపత్తు విడువవలెను. ద్వితీయాదితిథులు క్రమముగ లక్ష్మాదిదేవతల తిథులు. ద్వితీయ లక్ష్మికి, తృతీయ గౌరికి, చతుర్థి గణశునికి, పంచమి సరస్వతికి, షష్ఠి కుమారస్వమికి, సప్తమి సూర్యునకు, అష్టమి మాతృదేతలకు, నవమి దుర్గకు, దశమి నాగులకు, ఏకాదశి ఋషులకు, ద్వాదశి విష్ణువునకు, త్రయోదశి మన్మథునకు, చతుర్దశి శివునకు, పౌర్ణమాస్యవాస్యలు బ్రహ్మకు సంబంధించినవి. ఏ ఉపాసకుడు ఏ దేవతను ఉపాసించునో ఆతనికి ఆ దేవతయొక్క తిథి పవిత్ర మైనది.

ఆరోహణే తుల్యవిధిః పృథఙ్‌ మన్త్రాదికం యది | సౌవర్ణం రాజతం తామ్రం నేత్రకార్పాసకాదికమ్‌. 4

పవిత్రారోపణవిధి అందరు దేవతలకును సమానమే. మంత్రాదులు మాత్రమే ఆయా దేవతలకు వేరు వేరుగా నుండును. పవిత్రకమును నిర్మించుటకై బంగారము, వెండి రాగి తీగలను నూలు దారముగాని ఉపమోగింపవలెను.

బ్రాహ్మణ్యా కర్తితం సూత్రం తదలాభే తు సంస్కృతమ్‌ |

ద్విగుణం త్రిగుణీకృత్య తేన కుర్యాత్‌ పవిత్రకమ్‌. 5

అష్టోత్తరశతాదూర్ధ్వం తదర్ధం చోత్తమాదికమ్‌ | క్రియాలోపవిఘాతార్థం యత్త్వయాభిహితం ప్రభో. 6

మయా తత్ర్కియతే దేవ యథా యత్ర పవిత్రకమ్‌ | అవిఘ్నం తు భవేదత్ర కురు నాథ జయావ్యయ. 7

బ్రాహ్మణస్త్రీచేతితో వడికిన నూలు చాల శ్రేష్ఠమైనది. అది లభించనిచో ఏ దారము నైనను గ్రహించి, దానిని సంస్కరించి, ఉపమోగింపవలెను.

దారమును మూడుపేటలు చేసి, మరల దానిని మూడు పేటలు చేసి, దానితో పవిత్రకమును నిర్మింపవలెను. నూట ఎనిమిది మొదలు అధికము లగు తంతువులతో నిర్మించిన పవిత్రకము ఉత్తమాదిశ్రేణికి చెందినదిగ పరిగణింపబడుచున్నది.

పవిత్రరోపణమునకు ముందు ఇష్టదేవతను గూర్చి ఈ విధముగ ప్రార్థింపవలెను. ''ప్రభూ! క్రియాలోపమువలన కలిగిన దోషమును తొలగించుటకై నీవు ఏ సాధమును చెప్పినావో దానినే నేను చేయుచున్నాను.

ఎక్కడ ఏ పవిత్రకము ఆవశ్యకమో అక్కడ అట్టి పవిత్రకమునే అర్పించగలను. నీ కృపచే ఈ కార్యమునందు విఘ్నబాధ లేవియు కలుగకుండుగాక. అవినాశి యైన పరమేశ్వరా! నీకు జయ మగుగాక.

ప్రార్థ్యతన్మణ్డలాయాదౌ గాయత్ర్యా బన్ధయేన్నరః | ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. 8

తన్నో విష్ణుః ప్రచోదయాద్దేవదేవానురూపతః | జానూరునాభినాసాన్తం ప్రతిమాసు పవిత్రకమ్‌. ప9

పాదాన్తా వనమాలా స్యాదష్టోత్తర సహస్రతః | మాలాం తు కల్పసాధ్యాం వా ద్విగుణాం షోడశాఙ్గులామ్‌. 10

కర్ణికా కేసరం పత్రం మన్త్రాద్యం మణ్డలాన్తకమ్‌ | మణ్డలాఙ్గులమాత్రైక చక్రాబ్జాదౌ పవిత్రకమ్‌. 11

స్థణ్డిలే7ఙ్గులమానేన ఆత్మనః సప్తవింశతిః |

ఈ విధముగ ప్రార్థించు పవిత్రకమును ఇష్టదేవతామండలమునకు గాయత్రీమంత్రముతో కట్టవలెను. ''ఓం నమో నారాయణాయ విద్మహే, వాసుదేవాయ దీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్‌'' అనునది ఇష్టదేవత యగు నారాయణుని గాయత్రీమంత్రము. ఈ గాయత్రీ ఇష్టదేవతానామానుసారముగ ఉండును. దేవప్రతిమలపై అర్పించుటకు అనేకవిధములగు పవిత్రకము లుండును.

విగ్రహముయొక్క నాభివరకు వచ్చునది ఒకటి; తొడలవరకు వచ్చునది మరి యొకటి మోకాళ్ళవరకు వచ్చునది మరియొకటి. పాదములవరకు వ్రేలాడునది ఒకటి. చివరిదానికి వనమాల అని పేరు. దానిని ఒక వెయ్యి ఎనిమిది దారములతో నిర్మింపవలెను.

సాధారణమాలను శక్త్యనుసారము నిర్మింపవలెను. లేదా అది పదునారు అంగుళములకంటె రెట్టింపు పెద్దదిగా ఉండవలెను. కర్ణికా-కేసర-దళాదులుగల యంత్ర-చక్రదిమండలములపై వేయు పవిత్రకము పైనుండి క్రిందివరకును కప్పునదిగా ఉండవలెను.

ఒక చక్రము, ఒక కమలము ఉన్న మంక్షలముపై ఆ మండలము ఎన్ని అంగుళము లున్నదో అన్ని అంగుళముల పవిత్రకము అర్పింపవలెను. వేదిపై అర్పించు పవిత్రకము తన చేతి అంగుళములతో ముప్పదియేడు అంగుళముల పొడ వుండవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం

30.Aug.2020

17. గీతోపనిషత్తు - వ్యవసాయము - బుద్ధిని పరిపరి విధములుగ పోనీయక తెలిసిన విషయములందు నిర్దిష్టముగ నియమించి ఆచరించడమే ఆధ్యాత్మిక వ్యవసాయము


🌹. 17. గీతోపనిషత్తు - వ్యవసాయము - బుద్ధిని పరిపరి విధములుగ పోనీయక తెలిసిన విషయములందు నిర్దిష్టముగ నియమించి ఆచరించడమే ఆధ్యాత్మిక వ్యవసాయము 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 41 📚

భారతదేశమున పండితులెందరో కలరు. చాలామందికి చాలా విషయములు తెలియును. వేదాంతము మొదలుకొని నీతికథల వరకును అందరూ అన్నియూ చెప్పగలరు.

బోధకులకు, గురువులకు, మహాత్ములకు లోటులేని పుణ్యభూమి. సనాతనమైన దేవాలయములు, ఆధ్యాత్మికతను పెంపొందించు ఆశ్రమములు లెక్కకు మిక్కుటములు. అన్ని సమస్యలకూ పరిష్కారములు తెలుపగలిగిన మేధాసంపత్తి తగు మాత్రము గలదు.

41. వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్ద |
బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్దయో వ్యవసాయినామ్ ||

ఈ మార్గమున ఉన్నవారు స్థిరప్రయోజనముతో ఒకే లక్ష్యమును కలిగియుందురు. ఓ కురునందనా! స్థిర ప్రయోజనము లేనివారి బుద్ధి అనేక విధములుగా నుండును.

ఇంత జ్ఞానము కలిగియున్ననూ భరతజాతి యింతటి దుస్థితి యందు వుండుటకు కారణమేమి? పేదరికము, అనాగరికత, దురాచారము యింత విజృంభణము చేయుటకు కారణమేమి? భారతదేశమున రాణించలేని భారతీయులు, విదేశములలో రాణించుటకు కారణమేమి?

ఇన్నింటికీ కారణ మొక్కటియే. మనకు చాలా విషయములు తెలియును. కాని, వాటిని ఆచరించు స్పూర్తి లేదు. అన్నమెట్లు వండుకొని తినవలెనో బాగుగ తెలిసి, వండుకొనుటకు బద్ధకించు జాడ్యము జాతిని పీడించుచున్నది. ఆచరణ శూన్యతయే కారణముగ సమస్త జ్ఞానము అక్కరకు రాకుండ యున్నది.

వ్యవసాయము తెలిసియూ చేయని రైతునకు ధాన్యమెట్లు లభింపదో, తెలిసిన విషయము లాచరించని వానికి నిష్కృతి లేదు.

బుద్ధిని పరిపరి విధములుగ పోనీయక తెలిసిన విషయములందు నిర్దిష్టముగ నియమించి ఆచరించమని గీతోపనిషత్తు నిర్దేశించుచున్నది. ఈ సూత్ర మంగీకరింపని వానికి జీవితము ఒక ఎడారి!
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

30.Aug.2020

శ్రీ లలితా సహస్ర నామములు - 78 / ŚŔĨ ĹĂĹĨŤĂ ŚĂĤĂŚŔĂŃĂМĂVĂĹĨ - МĔĂŃĨŃĞ - 78


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 78 / Sri Lalita Sahasranamavali - Meaning - 78 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 149

వీరారాధ్యా విరాద్రూపా విరజా విశ్వతోముఖీ

ప్రత్యగ్రూపా పరాకాశా ప్రణదా ప్రాణరూపిణీ

776. వీరారాధ్యా :
వీరులచే ఆరాధింపబదునది

777. విరాద్రూపా : అన్నింటికీ మూలమైనది

778. విరజా :
రజోగుణము లేనిది

779. విశ్వతోముఖీ :
విశ్వం అంతటినీ ఒకేసారి చూడగల్గిన ముఖము కలిగినది

780. ప్రత్యగ్రూపా :
నిరుపమానమైన రూపము కలిగినది

781. పరాకాశా :
భావనామాత్రమైన ఆకాశ స్వరూపిణి

782. ప్రణదా :
సర్వజగత్తుకూ ప్రాణము ను ఇచ్చునది

783. ప్రాణరూపిణీ :
జీవులలో గల ప్రాణమే రూపముగా కలిగినది

🌻. శ్లోకం 150

మార్తాండభైరవారాధ్యా మంత్రిణీన్య స్తరాజ్యధూ:

త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా

784. మార్తాండభైరవారాధ్యా :
మార్తాండభైరవునిచే ఆరాధింపబడునది (శివుని యొక్క ఒకరూపం మార్తాండభైరవుడు)

785. మంత్రిణీ :
శ్యామలాదేవి

786. న్య స్తరాజ్యధూ: రాజ్యాధికారము ఇచ్చునది

787. త్రిపురేశీ ;
త్రిపురములకు అధికారిణి

788. జయత్సేనా : అందరినీ జయించగల సైన్యము కలది
789. నిస్త్రైగుణ్యా :

త్రిగుణాతీతురాలు
790. పరాపరా :

ఇహము, పరము రెండునూ తానై యున్నది

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 78 🌹
📚. Prasad Bharadwaj

🌻 Sahasra Namavali - 78 🌻

776) Mandhara kusuma priya -
She who likes the buds of Mandhara tree

777) Veeraradhya -
She who is worshipped by heroes

778) Virad Roopa -
She who a universal look

779) Viraja -
She who does not have any blemish

780) Viswathomukhi -
She who sees through every ones eyes

781) Prathyg roopa -
She who can be seen by looking inside

782) Parakasa -
She who is the great sky

783) Pranadha -
She who gives the soul

784) Prana roopini -
She who is the soul

785) Marthanda Bhairavaradhya -
She who is being worshipped by Marthanda Bhairava

786) Manthrini nyashtha rajyadhoo -
She who gave the power to rule to her form of Manthrini

787) Tripuresi -
She who is the head of three cities

788) Jayatsena -
She who has an army which wins

789) Nistrai gunya -
She who is above the three qualities

790) Parapara -
She who is outside and inside

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi

30.Aug.2020

శివగీత - 47 / ŤĤĔ ŚĨVĂ-ĞĨŤĂ - 47


🌹.  శివగీత - 47 / The Siva-Gita - 47  🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ
ఏడవ అధ్యాయము

🌻. విశ్వరూప సందర్శన యోగము - 1 🌻

శ్రీరామ ఉవాచ:

భగవ! న్యన్మయా స్పష్టం - తత్త థైవ స్థితం విభో !
అత్రోత్తరం మయా లబ్దం - త్వత్తో నైన మహేశ్వర ! 1

పరిచ్చిన్న పరీమాణే - దేహే భగవత స్తవ,
ఉత్పత్తి స్సర్వ భూతానాం - స్థితిర్వా విలయః కథమ్ ? 2

స్వస్వాది కార సంబద్దా కథం - నామ స్థితా స్సురా :,

తే సర్వేత్వం కథం దేవ! - భువనాని చతుర్ధశ 3
త్వత్త స్శ్రుత్వాపి దేవాత్ర - సందేహొ మే మహాన భూత్,

అప్రత్యాయిత చిత్త స్య - సంశయం చేత్తు మర్హసి 4
ఓ స్వామీ!

ఇంతవరకు నేనడిగిన ప్రశ్నకు సమాధానము అనుగ్రహించక పోయితిరి. ప్రాణులు పరిమిత పరిమాణంబగు నిజ శరీరంబున ఎటులద్భ వించుచున్నది. ఏ విధముగా పరిమిత పరిమాణంబగు నిజ శరీరంబున ఎటుల ఉద్భవించుచున్నది? ఏ విధముగా వర్ధిల్లుచున్నది? మళ్ళీ ఏవిధముగా లయ మగుచున్నది?

తమ తమ అధికారములో నుండి సృష్ట్యాదుల గావింపుచున్న బ్రహ్మాది దేవతలును చతుర్దశ భువనంబులను నీ వెట్లైతివి? నాకు తెలియచేయుము.

ఈ విషయమునంతయు నీ వలన పలుమార్లు ఆలకించినప్పటికిన్ని నా చిత్తము నిశ్చలముగా నుండనందులకు సంశయించితిని, కనుక ఇట్టి సంశయమును నివారించుటకు మీరే సమర్ధులు.

శ్రీభగవానువాచ:-

వటబీజే సు సూక్ష్మే పి - మహావటరుర్యథా,
సర్వదా స్తే న్యథా వృక్షః - కుత అయాతి త ద్వద 5

తద్వన్మ తనౌ రామ! - భూతానా మాగ తిర్లయ:,
మహా సైంధవ పిండోపి - జలే క్షి ప్తో విలీయతే 6

న దృశ్యతే పునః పాకా - తత్త ఆయాతి పూర్వవత్,
ప్రాతః ప్రాత ర్యథా లోకో - జాయతే సూర్య మండలాత్ 7

ఏవం మత్తో జగత్సర్వం - జాయతేస్తి విలీయతే,
మయ్యేవ సకలం రామ! - తద్వ జ్ఞానీహి సువ్రత! 8

ఓ రామా!

జగత్తులో మిక్కిలి చిన్నదగు మర్రి విత్తనములో గొప్పవట (మర్రి) వృక్షము నిండి యుండి సమయము ననుసరించి మరల వెలువడునట్లుగా నిఖిల ప్రాణికోటి నా శరీరమునుండే బయలుదేరు చున్నవి. మళ్ళీ నాయందే లీనమగుచున్నవి.

సైంధవ పిండము (ఉప్పు ముద్దను) జలములో బడవైచిన యది కరిగిపోయి మరల పాకము చేయగా మొదటి స్వరూపమునే బొందునట్లుగా ప్రాతఃకాలమున వెలుగుతో నిండి జగత్తును ప్రకాశింపచేయు విధమున సమస్త లోకములు నానుండే బుట్టి నాలోనే లయంబగుచున్నవి.

శ్రీరామ ఉవాచ:-

కథి తేపి మహాభాగ !- దిగ్జడ స్య య థా దిశి
నివర్తతే భ్రమో నైవ - తద్వ న్మమ కరోమికి మ్ 9

శ్రీరాముడు పలుకుచున్నాడు:-

ఓ మహానుభావా! నే వెన్ని రకాలుగా నాకు బోధించినప్పటికిన్ని దిగ్భ్రాంతి చెందిన మానవుడికి దిక్కుతోచనట్లుగా, నాకేమియు తెలియుటలేదు. నేనేమి చేయుదును?

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹  The Siva-Gita - 47  🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 07 :
🌻 Vishwaroopa Sandarshana Yoga - 1
🌻

Sri Rama said:

O Swami! Till now I didn't get clarification on my root doubt.

How are all the creatures originating from your body of perceivable and limited dimensions? How are they getting survived? And again how are they getting dissolved in you?

How are you present in the form of Brahma and other gods doing their respective duties and how are you in the form of these vast fourteen worlds? Kindly clarify this to me.

This has already been told by you but I am not able to get clarity over this subject. Hence I have this doubt, and you alone are capable of clarifying my doubt.

Sri Bhagavan said:

O Rama! In this world as like as inside the small banyan seed a giant banyan tree resides and when right time comes from that small seed's core a huge banyan tree comes outside; in the same way, the entire creation and creatures emerge from my body.

And at the end of time they again enter inside me only. The way Saindhava (salt) melts in water and becomes one with it and when water gets evaporated it regains its previous form viz. salt;

similarly all these worlds take birth from me and enter back into me only.

Sri Rama said: O Mahanubhava! In whatever number of ways through whatever examples you tried to explain me that concept; like a confused person who fails to discern, I am not able to understand that properly. What should i do now?

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

30.Aug.2020

నారద భక్తి సూత్రాలు - 81


🌹. నారద భక్తి సూత్రాలు - 81 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము - సూత్రము - 49

🌻. 49. (యో) వెదనపి సంన్యస్యతి కేవల మవిచ్చిన్నానురాగం లభతే ॥ 🌻

ఎవడు వేదాలలో కర్మకాండ నిర్దేశించిన విధంగా ధర్మాలను కూడా భగవదర్చణగా చెసుకొని నిష్కామ కర్మయోగి అవుతాడో, చివరికి సన్యసిస్తాడో అతడు నిర్మలమైనట్టి, ఎదడతెగనట్టి అనురాగాన్ని భగవంతుడిపట్ల పొందుతాడు.

ధర్మార్ధ కామ మోక్షాలతో, అర్ధ కామాలను ధర్మయుతంగా నెరవేర్చుకుంటూ పోతే మోక్షానికి దారి సుగమం అవుతుంది. మోక్ష ద్వారం దగ్గరవుతున్న కొద్ది భక్తుడు అర్ధ కామాలతో కూడిన ప్రాపంచిక విషయాలను వదలివెస్తూ, సదా ఈశ్వర చింతనచేత సర్వ కర్మలను సన్యసిస్తూవోయి, చరమాంకంలో ధర్మాన్నుండి కూడా విడుదలవుతాడు. అనగా ధర్మాన్ని కూడా సన్యసిస్తాడు.

వెద విహిత సన్యాసం మూడు విధాలు. ది స్వధర్మ్శ్మమో, యుక్తమో, దానిని స్వీకరించి ప్రతికూలాలను వదలడం మొదట్‌ది. స్వధర్మాచరణను ఈశ్వరారాధనగా చెయడం, ఫలాన్ని భగవదర్పణ చెయడం రెండవది. మూదడవదైన సిద్ధావస్థలో కర్మ ధర్మాలు అవె వదలి పోతాయి. ఈ విధమైన మూడు దశలలో ప్రాథమిక ధర్మాలనుంది, చివరగా వేద విహిత ధర్మాల నుంది కూడా విడదుదలవుతాదు.

ఇది జరగాలంటే భక్తుడు ఎడతెగని అనురాగాన్ని భగవంతునిపై కురిపించగలగాలి. అవిచ్చిన్నానురాగం భగవంతునిపై కలిగి, అది సహజమైతే, అదె ముఖ్యభక్తి అవుతుంది. క్రమంగా పరాభక్తికి దారి తీస్తుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

30.Aug.2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 40


🌹.   కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 40  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి - 4 🌻

ఈ రకంగా ఆత్మ వస్తువు గురించి శాస్త్ర జ్ఞాన పద్ధతిగా, తర్క పద్ధతిగా - రెండు పద్ధతులున్నాయట.

శాస్త్రం ఎప్పుడూ నిన్ను తర్కానికి సంబంధించిన జ్ఞానాన్ని ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరణ వల్ల నీలో బుద్ధి వికాసం పూర్తవుతుంది. ఇది శాస్త్ర ప్రయోజనం. ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేసినా కూడా ఆ అధ్యయనము నీ బుద్ధి వికాసాన్ని పూర్తిచేస్తుంది - తార్కికమైనటువంటి పద్ధతిలో.

అసలు ఈ తర్కానికి సంబంధించినటువంటిది ఒక సూత్రం వుంది. ఏమిటంటే తర్కానికి నిలబడనిది జ్ఞానం కాదు. లాజికల్ ఈక్వేషన్ [Logical Equation] కి నిలబడకపోయినట్లయితే - తర్కానికి నిలబడనటువంటిది జ్ఞానం కాదు.

ప్రక్కనే దానికి కంటిన్యుఏషన్ ఇంకొక పాదం కూడా వుంటుంది. తర్కించేవాడు జ్ఞాని కాదు. నువ్వు తర్కిస్తూ వున్నంతకాలం నువ్వు ఆత్మజ్ఞానివి ఎప్పటికీ కాలేవు అని అసలు తర్కమే చెయ్యనంటావా అప్పుడు నీకు జ్ఞానం కలిగే అవకాశమే లేదు.

కాబట్టి “శాస్త్ర దృష్టం గురుర్వాక్యం తృతీయం ఆత్మ నిశ్చయమ్”. ఇది క్రమ ముక్తికి మార్గం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అంటే తప్పక శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి.

అధ్యయనం చేసి బాగా తర్కించాలి. తర్కించగలిగిన విధానములు ఎన్ని వున్నాయో ఆ షట్ ప్రమాణ సహిత పద్దతిగా వాటిని బాగా తర్కించాలి. ఆ తర్కించడం వల్ల ఏమవుతుంది? నీ బుద్ధివికాసం పూర్తవుతుంది. గిన్నెకి నెయ్యి ఆధారమా , నేతికి గిన్నె ఆధారమా.

ఒక నెయ్యి గిన్నె పట్టుకున్నాడట ఒకాయన. నెయ్యి గిన్నె పట్టుకుని ఈ ప్రశ్న వచ్చిందట. ఏమిటదీ? గిన్నె - గిన్నె కాదిది - నేతి గిన్నె. నేతికి గిన్నె ఆధారమా, గిన్నె కి నేయి ఆధారమా అని బోర్లించాడు. ఇప్పుడు గిన్నెలో వున్నా నెయ్యంతా ఏమైంది? నేలపాలయింది. అర్ధమైందా? మన తర్కం అంతా ఇలానే వుంటుంది.

నెయ్యి ప్రధానమా గిన్నె ప్రధా నమా మనకిప్పుడు. నెయ్యి ప్రధానం. కాని గిన్నె ప్రధానం అనుకుని, గిన్నెని పట్టుకుని నెయ్యి పారబోశాం. ఇట్లా ఏది ప్రధానమో ఏది అప్రధానమో తెలియాలి అంటే తప్పక తర్కాన్ని ఆశ్రయించాలి.

అంటే ఈ విచారణలో కొన్ని విమర్శలున్నాయి. ఈ విమర్శ ఎలా చేయాలి అంటే జడచేతన విమర్శ, ఆధార ఆధేయ విమర్శ, కార్యకారణ విమర్శ, చేతనా అచేతన విమర్శ, నిత్య అనిత్య విమర్శ, ఆత్మ అనాత్మ విమర్శ, సదసత్ విమర్శ, దృగ్ దృశ్య విమర్శ, ధ్యాత-ధ్యేయము-ధ్యానము అనేటటువంటి త్రిపుటి యొక్క విమర్శ, పంచకోశ విచారణ, అవస్థాత్రయ విచారణ, శరీరత్రయ విచారణ , దేహత్రయ విచారణ - ఈ రకంగా అనేక పద్దతులుగా ఈ తర్కాన్ని అనేటటువంటి అవధిని నిన్ను దాటించేటటువంటి ప్రయత్నం చేస్తారనమాట ఆత్మా విచారణలో. ఇన్ని రకాలైనటువంటి విమర్శలని నీకు సాధికారత కలిగేటట్లుగా చేస్తారనమాట.

ఇది ఆత్మజ్ఞానాన్ని బోధించే విధానం. నీకు ఎట్లా చెప్పాడయ్యా? నువ్వు ఏది చెప్పినా దానిని ఒక విమర్శ రీత్యా దానిని నిరూపించడమో, ఖండించడమో, నిరసించడమో చేస్తాడనమాట.

తద్వారా ఏమౌతావు నువ్వు? ఆ విమర్శలో బాగా బలవత్తరమైనటువంటి సమర్ధతని, బుద్ధిబలాన్ని నువ్వు సాధిస్తావనమాట. - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

30 Aug 2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 141


🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 141  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ధ్రువము, ధ్రువుడు 🌻

ఉత్తర , దక్షిణ ధ్రువముల నుండి దూసికొని నిలబడు రేఖగా ధ్రువుడు నిలబడును. అతనికి దిగువగా సప్తర్షి మండలముండును.

ధ్రువుడు ఒక ఆత్మప్రదక్షిణము చేయు బిందువును అధిష్ఠించినట్లూహింపగా ఆ ప్రదక్షిణ కాలము భూమిపై నున్న జీవులకు ఇరువదియారు వేల (26,000) సంవత్సరములుగా భాసించును. ఒక్కొక్క నక్షత్రమున వేయి సంవత్సరములు చొప్పున సంచారము చేసినట్లు భాసించును.

భూమి చుట్టును భూమధ్యరేఖ కెదురు ఆకాశమున గ్రహములు చరించు చక్రమున్నది. దానినే రాశిచక్రమందురు. దానిని ఇరువది యేడు సమభాగములు చేయగా నక్షత్ర చక్ర మేర్పడును. ఒక పరిభ్రమణము పూర్తి చేయుటకు అనగా ఇరువది ఏడవ నక్షత్రమున ప్రవేశించుటకు ఇరువది ఆరువేల సంవత్సరములు పట్టును.

ఈ మానములు భూమి తన ధ్రువము చుట్టును తిరుగుచుండుట వలన ఏర్పడుచున్నవి. ఈ పరిభ్రమణముకు నడుమ నిలబడు రేఖగా ధ్రువుడు స్థానము గొనును. అన్నియు పరిభ్రమించుచున్నను కేంద్రమగు ఈ రేఖ పరిభ్రమింపదు గనుక ధ్రువము లేక ధ్రువుడు అనబడును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

30.Aug.2020

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 38 / Sɾι Gαʝαɳαɳ Mαԋαɾαʝ Lιϝҽ Hιʂƚσɾყ - 38


🌹.  శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 38 /  Sri Gajanan Maharaj Life History - 38   🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 8వ అధ్యాయము - 3 🌻

అర్జునుడు, జయద్రధుడి విషయంలో తన ప్రతిష్ఠ కాపాడోకోడానికి స్వయంగా అగ్నికి ఆహుతి అయ్యేందుకు సిద్ధం అవుతాడు. భగవంతుడు అతనిని రక్షించి, అతని గౌరవం కాపాడారు. భగవంతుడు ఒకచీర తరువాత ఒకచీర ఇస్తూ ద్రౌపది పరువు ప్రతిష్టలు కాపాడారు.

ఇదేవిధంగా ఆత్మగౌరవం అనే ఆద్రౌపదిని ఈ దేష్ముఖ్ అనే కౌరవులు వివస్త్రను చేస్తున్నారు. ఇలా అంటూ పాటిల్ ఘోరున విలపిస్తాడు. అతని సోదరులంతా కూడా రాబోయే అవమానానికి చాలాచింతిస్తున్నారు.

శ్రీమహారాజు ఖాండుపాటిల్ ను తన చేతులతో దగ్గరకు తీసుకుని ఓదార్చుతూ.... భాద్యతలుగల అధికారి ఈవిధమయిన పరిస్థితులు పదేపదే ఎదుదర్కోవలసి వస్తుంది కనుక పెద్దగా పట్టించుకోరాదు. ఇది స్వార్ధం వల్ల వచ్చిన ఫలితం.

మరియు మంచి ఆలోచన లేకపోవడం. మీరిరువురు పాటిల్ దేష్ ముఖ్లు ఒకేజాతికి చెందినవారు అయినా స్వార్ధంతో ఒకరినొకరు నాశనం చేసుకునే ప్రయత్నంచేస్తున్నారు. పూర్వంలో కౌరవుల, పాండవుల మధ్య వైరంకూడా స్వార్ధం ఫలితం వల్లనే. పాండవులు న్యాయరీత్యా సరిఅయినవారు కనుక వారికి భగవంతుని సహాయందొరికింది.

నిజాయితీని నిలపడానికి చివరికి కౌరవులు చంపబడ్డారు. కనుక భయపడకు, నిన్ను నిర్భందించడానికి దేష్ ముఖ్ చేస్తున్న అన్ని ప్రయత్నాలు వ్యర్ధం అవుతాయిఅని శ్రీమహారాజు అన్నారు. అదేనిజం అయింది. పాటిల్ ను నిర్దోషిగా ఘోషించారు. యోగుల మాటలు ఎప్పటికి తప్పుకావు. ఈసంఘటన తరువాత పాటిల్ సోదరులు శ్రీమహారాజు ప్రతి అధిక భక్తి గలవారయ్యారు.

అమృతం త్రాగడం ఎవరికి ఇష్టం ఉండదు ? ఖాండపాటిల్ కొద్దిరోజుల తరువాత శ్రీమహారాజును అర్ధించి ఆప్యాయతతో తన ఇంటి దగ్గర ఉండేందుకు తీసుకు వెళ్ళాడు. కొంతమంది తెలంగి బ్రాహ్మణులు, ఖాండుపాటిల్ ఇంటిదగ్గర శ్రీమహారాజు ఉండగా వచ్చారు. ఈబ్రాహ్మణులు చాలా ఆచార వ్యవహారాలతో, పాండిత్యంలో మరియు వేదాలమీద మంచి అధికారంకలవారు. కానీ వీరికి ధనంమీద లోభత్వం ఉంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sɾι Gαʝαɳαɳ Mαԋαɾαʝ Lιϝҽ Hιʂƚσɾყ - 38 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj

🌻 Chapter 8 - part 3 🌻
Arjun had prepared to burn himself to save his dignity in the episode of Jaydratha. God saved him and protected his honour. God also saved the honour and respect of Draupadi by covering her by sari after sari. Similarly my self respect, like Draupadi's, is being stripped off by these Deshmukh Kaurawas. Saying so Patil wept bitterly.

All his brothers too were very much worried over the impending humiliation to the family. Shri Gajanan Maharaj took Khandu Patil in his embrace to pacify him and said A man with responsibilities has got to face such situations frequently, and so should not mind it.

Such things are the outcome of selfishness, and a lack of pious thinking. Both of you, Patil and Deshmukh, belong to the same caste, but due to selfishness, are trying to destroy each other. In the past the enmity between the Kaurawas and the Pandawas was also the result of selfishness only.

But since the Pandawas were legally right, they had received God’s blessings for the upkeep of truth. Consequently the Kaurawas were all killed. So don't be afraid. All of Deshmukh’s efforts to arrest you will fail.

This prediction, made by Shree Gajanan Maharaj, came true. Patil was declared innocent by the court of law. The words uttered by true saints can never be futile. After this incident, the Patil brothers became more devoted to Shri Gajanan Maharaj .

Who will not like to drink nectar? After some days, Khandu Patil requested and affectionately took Maharaj to stay at his house. While Maharaj lived at the house of Khandu Patil, some Telangi Brahmins also visited there.

These Telangi Brahmins were known to be quite orthodox, learned and in charge of the authority of Vedic knowledge, but their biggest drawback was that they were somewhat greedy for money.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

30.Aug.2020